Pidakalu cow dung
-
అంగరంగ వైభవంగా పిడకల సమరం
కర్నూలు జిల్లా, సాక్షి: ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో పిడకల సమరం అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం వీరభద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులు రెండువర్గాలుగా ఏర్పడి పిడకలతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ పిడకల సమరంలో పాల్గొనేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. యుద్ధ వాతావరణాన్ని తలపించే ఈ పిడకల సమరంలో గాయాలవుతున్నా భక్తులు పిడకల్ని విసిరారు. -
పిడకలపై రివ్యూలు.. నవ్వులే నవ్వులు
ఈ-కామర్స్ వెబ్సైట్ల రాకతో మనకు కావాల్సిన వస్తువులను కాలు కదపకుండా ఇంటికి తెప్పించుకునే సౌలభ్యం దొరికింది. ఆన్లైన్ ఆర్డరిస్తే చాలు కోరుకున్న వస్తువు చెంతకు వచ్చి చేరుతోంది. అయితే మనం కొనాల్సిన వస్తువు పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు రివ్యూల మీద ఆధారపడుతుంటాం. ఇలాంటి రివ్యూలే ఇప్పుడు మనకు హాస్యం పండిస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లలో పిడకల మీద పెట్టిన రివ్యూలు చూస్తే కడుపు చెక్కలవాల్సిందే. హిందువులు వివిధ క్రతువుల్లో ఆవు పేడ పిడకలను వినియోగిస్తుంటారు. స్వచ్ఛమైన ఆవు పేడతో చేసిన పిడకలను ‘కౌ డంగ్ కేక్’ పేరుతో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లు అమ్మకానికి ఉంచాయి. వీటి గురించి తెలియని కొంత మంది రాసిన రివ్యూలు నవ్వు తెప్పిస్తున్నాయి. ‘ఇవి చాలా బాగున్నాయి. వీటి వాసన గులాబి పూల మాదిగా ఉందని’ పేర్కొంటూ ఐదు స్టార్ల రేటింగ్ ఇచ్చారు. ‘వీటి సైజు చాలా పెద్దగా ఉంది. నోటితో కొరకడానికి వీలు కాదంటూ’ మరొకరు పేర్కొన్నారు. దీని రుచి అమోఘం అంటూ మరొకరు పొడిగారు. ‘దీన్ని కొనకండి. క్వాలిటీ, క్వాంటిటీ రెండూ బాలేదంటూ’ ఇంకొరు ఒక స్టార్ మాత్రమే రేటింగ్ ఇచ్చారు. ఈ రివ్యూలు చూసిన తర్వాత మనోళ్లంతా పగలబడి నవ్వుతున్నారు. ఇంట్లో డెకరేషన్ కోసం పిడకలు వాడతారని సదరు వెబ్సైట్లు పేర్కొనడం కొసమెరుపు. -
ఆరు ఆవుపేడ పిడకలు రూ.10
► విక్రయించనున్న అన్నవరం దేవస్థానం ► సాంప్రదాయ పునరుద్ధరణకే.. : ఈఓ అన్నవరం : ఆర్డరిస్తే పిడకలు కూడా డోర్ డెలివరీ చేస్తామని ఆన్లైన్లో వస్తువులు విక్రయించే ఓ ప్రముఖ సంస్థ ప్రకటన ఇంటర్నెట్లో అందరినీ ఆకర్షిస్తున్న విషయం విదితమే. అయితే భోగిమంటలో వేయడానికి ఆవు పేడతో చేసిన పిడకలను విక్రయించడానికి అన్నవరం దేవస్థానం కూడా సన్నాహాలు చేస్తోంది. దేవస్థానం గోశాలలోని సుమారు రెండువందల ఆవుల పేడతో చేసిన పిడకలను జనవరి ఒకటి నుంచి భోగి పండుగ వరకూ రూ.పదికి ఆరు పెద్ద పిడకల చొప్పున విక్రయించనున్నట్టు ఈఓ నాగేశ్వరరావు సోమవారం విలేకరులకు తెలిపారు.ఆ మొత్తాన్ని దేవస్థానం గో సంరక్షణట్రస్ట్కు జమ చేస్తామన్నారు. భోగిమంటల్లో ఆవుపేడతో చేసిన పిడకలు మాత్రమే వేసే పాత సంప్రదాయం పునరుద్ధరణకే దేవస్థానం పిడకల తయూరీ, విక్రయం చేపట్టిందన్నారు. పిడకలను ఉచితంగా పంపిణీ చేద్దామనుకున్నా రూ.పది పెద్దగా భారం కాదన్న అభిప్రాయంతో ఆ ధర నిర్ణరుుంచామన్నారు. ఈఓ ఆదేశాల మేరకు గోశాల సిబ్బంది సోమవారం నుంచి పిడకల తయారీ ప్రారంభించారు.