Pool
-
డెవిల్స్ పూల్! ఆ నీళ్లల్లో అడుగుపెడితే ప్రాణాలకు గ్యారెంటీ లేదట!!
క్వీన్స్లండ్, ఆస్ట్రేలియన్ బుష్లో ‘బబిందా బౌల్డర్స్ పూల్’ అనే విస్తారమైన ఈత కొలను.. సహజ అందాలకు కొలువు. కానీ ఆ నీళ్లల్లో అడుగుపెడితే ప్రాణాలకు గ్యారెంటీ లేదట. 1959 నుంచి ఇప్పటి వరకు ఆ కొలనులో పడి సుమారు 21 మందికి పైగా చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కొన్ని మృతదేహాలు ఇంకా దొరకను కూడా లేదు. ఆ కొలను రాళ్ల మధ్య ఉంటుంది. అక్కడ నీరు ఉన్నట్టుండి పెరుగుతుంది, అకస్మాత్తుగా తగ్గుతుంది.కాలాన్ని బట్టి.. సమయాన్ని బట్టి మారుతుంది. పైగా ఆ రాతికొండలకు లోతైన గోతులు, గుంతలు ఉంటాయి. వాటిల్లో నీళ్లు నిండి.. కొన్ని చోట్ల ఆ గుంతలు కనిపించను కూడా కనిపించవు. ఆ క్రమంలోనే అక్కడ చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు ఆ గోతుల్లో ఇరుక్కుని.. బయటికి రాలేక చనిపోతున్నారు. ఆ కొలనులో నీరు నిండుగా ఉన్నా.. నేల మట్టానికి చేరుకున్నా.. కళ్లు చెదిరే అందం అక్కడి ప్రకృతి సొంతం. అందుకే ఆ అందాలను చూడటానికి, ఈత కొట్టడానికి జనాలు ఎగబడుతుంటారు. కొన్ని డేంజర్ జోన్స్ని సూచిస్తూ హెచ్చరికలు, గమనికలు ఉన్న బోర్డ్స్ కనిపిస్తూనే ఉంటాయి. అయినా ప్రమాదాలు ఆగడంలేదు.అక్కడికి వచ్చే వారిలో ఒకరిని ఆ కొలను దగ్గరుండే దయ్యం ఎన్నుకుంటుందని.. వారిని చావుకు ఆహ్వానిస్తుందని.. బాధితులంతా అలా చనిపోయినవారేనని కొందరు స్థానికుల నమ్మకం. ఆ తరహాలోనే.. సమీపంలో నివసించే ఆదివాసులు.. హడలెత్తించే విషాద గాథనూ వినిపిస్తుంటారు. కొన్నేళ్ల క్రితం యిండింజి తెగకు చెందిన ఊలానా అనే అందమైన యువతి.. వరూనూ అనే ఆ జాతి పెద్దను వివాహం చేసుకుని.. కొత్త జీవితాన్ని ప్రారంభించిందట.అయితే వివాహమైన కొన్నాళ్లకి ఊలానా జీవితంలోకి మరొక తెగకు చెందిన డైగా అనే యువకుడు రావడంతో.. అది వారి మధ్య ప్రేమకు దారితీసింది. కొంతకాలం గుట్టుగా సాగిన ఆ బంధం.. ఉన్నట్టుండి బంధువుల మధ్య పంచాయతీకి రావడంతో అవమానాన్ని తట్టుకోలేక ఊలానా.. బబిందా బౌల్డర్స్ పూల్లో దూకి ఆత్మహత్య చేసుకుందట. అయితే ఆమె ఆ కొలనులోకి దూకే క్రమంలోనే ‘డైగా డైగా’ అని అరిచిందట. ఆ అరుపులకు డైగా కూడా అదే కొలనులో దూకి చనిపోయాడు.అయితే డైగా దూకడం, చనిపోవడం అంతా.. ఊలానా చనిపోతూనే కళ్లరా చూసిందట. తాను చనిపోతున్న సమయంలోనే.. తన ప్రియుడి చావుని చూస్తూ.. భీకరంగా ఏడ్చిందట. ఆ కన్నీరే ఆ కొలను నీటిమట్టాన్ని పెంచిందని.. కొలనులో ప్రమాదకరమైన గుంతలను ఏర్పరచిందని వారంతా చెబుతారు. అందుకే ఆ ప్రాంతాన్ని వారు హాంటెడ్ ప్రదేశంగా నమ్మి.. అటువైపు పోవద్దని హెచ్చరిస్తుంటారు.మొదట బాధితుడు లేదా బాధితురాలి శరీరంలోకి డైగా ఆత్మ చేరుతుందని.. నీటిలో ఉన్న ఊలానా ఆత్మ.. ప్రేమగా ‘డెగా డైగా’ అని పిలవగానే.. బాధితులు తమపై తాము నియంత్రణ కోల్పోయి.. నీటిలో ఇరుక్కునేలా డైగా ఆత్మ చేస్తుందని.. అలా ఆత్మల ప్రేమకు అమాయకులు బలవుతున్నారనేది స్థానికుల మాట.మరోవైపు 1940లో జాన్ డొమినిక్ అనే ఎనిమిదేళ్ల బాలుడు ఆ నీటిలో మునిగి చనిపోయాడు. అతడి కుటుంబం అక్కడే అతడి పేరున స్మారక ఫలకాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆ ఫలకాన్ని తన్నిన ఓ యువకుడు.. ఆ తర్వాత నుంచి అదృశ్యమయ్యాడని, డొమినిక్ ఆత్మే అతడ్ని మాయం చేసిందనే మరో హారర్ స్టోరీ వినిపిస్తూ ఉంటుంది.ఒకానొక సాయంత్ర వేళ ఒక జంట ఆ కొలను అందాలు చూడటానికి వెళ్తే.. ఉన్నట్టుండి నీళ్లు అనకొండలా పైకి లేచి.. రాళ్ల మీదున్న వారిని కొలనులోకి లాక్కెళ్లడం ఓ వ్యక్తి కళ్లారా చూశాడట. అప్పటి నుంచి ఆ కొలనుపై పుకార్లు మరింతగా పెరిగిపోయాయి. ఏదిఏమైనా ఆ ప్రదేశంలో ఏ శక్తి ఉంది? ఎందుకు అంతమంది చనిపోతున్నారు? అనేది మాత్రం నేటికీ మిస్టరీనే. – సంహిత నిమ్మన -
కర్మ సిద్ధాంతం అంటే ఇదేనేమో!
-
అబ్బా! ఏం చేశాడ్రా... మూన్ వాకింగ్ స్టైల్కి ఫిదా అవుతున్న నెటిజన్లు
అందరికి వివిధ రకాల టాలెంట్లు ఉంటాయి. ఐతే ఆ టాలెంట్కి పదును పెట్టి విభిన్నంగా చేసి ఔరా! అనిపించుకునేవారు కొంతమందే. ఆ కోవకు చెందిన వ్యక్తే జయదీప్ గోహిల్. మూన్వాక్ గురించి అందరికీ తెలిసిందే. కానీ, జయదీప్ చేసిన మూన్వాక్ మరింత స్పెషల్. ఎందుకంటే అతను చేసింది నీటిలో తలకిందులుగా! వివరాల్లోకెళ్తే.. మూన్ వాక్తో జనాలను ఆకర్శిస్తున్న జయదీప్ గోహిల్.. ఈసారి విభిన్నంగా ట్రై చేశాడు. నీటి అడుగు భాగంలో మూక్వాక్తో ఆకట్టుకున్న ఈ యువకుడు.. తలకిందులుగా ఆ స్టెప్ వేసి అందర్నీ ఆశ్చర్య చకితులను చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతుంది. అతను ఆ వీడియోలో తొలుత స్విమ్మింగ్ పూల్లోని అడుగున ఉన్న టేబుల్ పై మేఖేల్ జాక్సన్కి సంబంధించిన ప్రసిద్ధ పాట స్మూత్ క్రిమినల్లో ఆయన ఎలా వాకింగ్ స్టైల్ డ్యాన్స్ తరహాలో నడిచాడో అలా నడుస్తాడు. ఆ తర్వాత సడన్గా తలకిందులుగా నడుస్తాడు. చూస్తే ఏం చేశాడ్రా అని అనకుండా ఉండలేరు. ఈ వీడియోకి తొమ్మిది మిలియన్లకు పైగా వ్యూస్, లైక్లు వచ్చాయి. అంతేగాదు నెటిజన్లు కూడా అతని టాలెంట్ చూసి తెగ ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Hydroman (@hydroman_333) (చదవండి: కింగ్ చార్లెస్ కారుని ఢీ కొట్టబోయాడు: వీడియో వైరల్) -
పువ్వులతోనే వేడినీళ్లు
మనం వేడి నీళ్లు కావాలంటే హీటర్ పెట్టుకోవడం లేదా గేజర్ ఆన్ చేసుకుంటాం కదా. కానీ ఇక నుంచి ఆ అవసరం లేదు దాని స్థానంలో మనం పువ్వులతో నీళ్లని వేడి చేసుకోవచ్చు ఎలా అని ఆశ్చర్యంగా ఉంది కదూ!. ఏం లేదండి సోలార్ ప్యానెల్తో తయారు చేసిన పూలు మరి. ఇవి నీటిలో వేసినప్పుడు అవి సూర్యకాంతిని గ్రహించి చాలా తక్కువ సమయంలోనే నీళ్లను వేడిగా మార్చేస్తాయట. అందుకే చాలా మంది వీటిని కోనేసుకుని వాళ్ల స్విమ్మింగ్ పూల్లో వేసేసుకుంటున్నారట. (చదవండి: ఓల్డ్ కార్ సీట్ బెల్ట్తో బ్యాగ్లు) మరికొంత మంది అయితే బకెట్లలో ఆ పువ్వులు వేసుకుని బాల్కనీలో ఆరుబయట సూర్యునికి ఎదురుగా కాసేపు పెట్టి ఆ తరువాత వాడేసుకుంటున్నరట. ఈ పూలు చూడటానికి అందంగా ఆకర్షణియంగా ఉండటంతో పాటు పూల్ నీటి కొలనులో ఉండే తామర పూలు మాదిరి అందంగా ఉంటుంది. అంతేకాదండోయ్ ఇవి ప్యాక్కి 12 ఉంటాయట. ఇవి ఎక్కువగా నీలం,నలుపు, రెయిన్బో హ్యూడ్ రంగులలో లభిస్తాయట. ఇక మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి (చదవండి: స్వచ్ఛ కార్యక్రమాలతో అలరించిన నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్) -
‘మహమ్మారి నిధి’ ఏర్పాటు చేయాలి
న్యూఢిల్లీ: కోవిడ్–19 తరహా పరిస్థితులు భవిష్యత్తులో మళ్లీ ఎదురైనా దీటుగా ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక రిస్కు నిర్వహణ కోసం ’మహమ్మారి నిధి (పూల్)’ వంటిది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ తెలిపింది. తొలినాళ్లలో ప్రభుత్వమే దీనికి ఆర్థికపరమైన తోడ్పాటు అందించాలని కోరింది. ప్రస్తుతం వ్యాపార సంస్థలు, వ్యక్తులు అందరి ఆలోచన.. మహమ్మారి రిస్కులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపైనే ఉందని, పూల్కి అవసరమైన నిధులను వారి నుంచి కూడా సేకరించడానికి అవకాశం ఉంటుందని సీఐఐ తెలిపింది. ‘తొలినాళ్లలో పూల్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటు అవసరమైనప్పటికీ.. 12–15 ఏళ్లలో మిగులు నిధులు సమకూరే కొద్దీ క్రమంగా ప్రభుత్వ మద్దతును సున్నా స్థాయికి తగ్గవచ్చు‘ అని వివరించింది. మహమ్మారిపరమైన నష్టాలను బీమా కంపెనీలు ఇప్పటిదాకానైతే ఎదుర్కొనగలిగినప్పటికీ.. భవిష్యత్తులో ఇలాంటి వాటిని ఎదుర్కొనాలంటే మరింత భారీ స్థాయిలో మూలనిధి అవసరమవుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో మహమ్మారి నిధి ఏర్పాటు తోడ్పడగలదని సీఐఐ తెలిపింది. పూల్లో కనీసం 5 శాతం నిధిని సమకూర్చుకునేందుకు పాండెమిక్ బాండ్ల జారీ అంశాన్ని పరిశీలించవచ్చని, అలాగే దీనికి కేటాయించే నిధులను కంపెనీల సీఎస్ఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత) వ్యయాలుగా పరిగణించాలని కోరింది. నిధి కోసం వసూలు చేసిన ప్రీమియంపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మినహాయింపునిచ్చే అంశాన్నీ పరిశీలించవచ్చని సీఐఐ పేర్కొంది. -
తీవ్ర విషాదం : స్నానం చేస్తుండగా..
సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్లో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. స్నానం కోసం బావిలోకి దిగిన నలుగురు బాలురు ప్రాణాలు కోల్పోయారు. కరెంట్ తీగ బావిలో పడి షాక్ తగలడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. సంబల్ జిల్లాలోని పెటియాన్ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా పోలీసు బలగాలను మోహరించారు. స్నానం చేసేందుకు నలుగురు మైనర్ బాలురు స్థానిక వ్యవసాయ బావిలోకి దిగారు. సరిగ్గా అదే సమయంలో అక్కడే ఉన్న ట్రాన్స్ఫార్మర్కు చెందిన కరెంట్ వైర్ తెగి ఆ నీటిలో పడి విద్యుత్ షాక్ తగిలింది. కొంతసేపటికి అటుగా వెళుతున్న రైతు పిల్లలు స్పృహ కోల్పోయిన ఉన్నట్లు గుర్తించి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్తు సరఫరాను నిలిపివేసారు. అనంతరం పిల్లలను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే నలుగురు మరణించారని వైద్యులు ధృవీకరించారు. చనిపోయిన వారిలో విష్ణు (11), శివం(7) ఇద్దరూ అన్నదమ్ములు. కాగా మిగిలిన ఇద్దర్నీ ధర్మవీర్(11), గణేష్ (11) గా గుర్తించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు మొదలు పెట్టారు. మరోవైపు దీనిపై మూడు రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా ఉన్నతాధికారులకు జిల్లా మేజిస్ట్రేట్ అవినాష్ క్రిషన్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై అనుమానాలు వెల్లువెత్తిన నేపథ్యంలో దీనిపై రిపోర్టు ఇవ్వాల్సిందిగా విద్యుత్తుశాఖను కోరినట్టు తెలిపారు. -
గుళు గుగ్గుళు
ఒకనాడు భోజరాజు వేటకు అడవికి వెళ్లాడు. చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు. బాగా దాహంగా అనిపించడంతో సమీపంలోని కొలను వద్దకు వెళ్లి నీళ్లు తాగాడు. కొలను గట్టునే ఉన్న నేరేడు చెట్టు కింద నీడలో విశ్రమించాడు. ఆ చెట్టు కొమ్మలు కొన్ని కోనేటి మీదకు వంగి ఉన్నాయి. కొమ్మల నిండా పండిన నేరేడు పండ్లున్నాయి. కొన్ని కోతులు ఆ కొమ్మల పైకెక్కి వాటిని వినోదంగా ఊపుతుంటే పండిన నేరేడు పండ్లు ఉన్నాయి. కొన్ని కోతులు ఆ కొమ్మల మీదకు చేరి ఆటలు ప్రారంభించాయి. కొమ్మలను ఊపి వినోదించసాగాయి. అవి కొమ్మలను ఊపినప్పుడు కొమ్మలకు వేలాడుతూ ఉన్న పండ్లు రాలి నీట్లో పడుతుంటే ‘గుళు గుగ్గుళు’ అంటూ శబ్దం వస్తుండటాన్ని చెట్టు నీడనే విశ్రమించిన భోజరాజు విన్నాడు. కాసేపు చెట్టు నీడనే విశ్రమించిన తర్వాత తిరిగి రాజధానికి చేరుకున్నాడు.మరునాడు సభ కొలువుదీరినప్పుడు భోజరాజుకు ఒక చిలిపి ఆలోచన వచ్చింది. ముందురోజు తాను అడవిలో చెట్టునీడన విశ్రమిస్తున్నప్పుడు కోతుల అల్లరి కారణంగా నేరేడు పండ్లు నీళ్లలో పడగా వినిపించిన శబ్దాన్ని సమస్యగా ఇస్తే తన ఆస్థానంలోని కాళిదాసాది కవుల్లో ఎవరు ఎలా పూరిస్తారో చూడాలనుకున్నాడు. వెంటనే ఆస్థాన కవులను ఉద్దేశించి ‘గుళు గుగ్గుళు గుగ్గుళు’ అని పలికి, ‘ఈ సమస్యను పూరించండి’ అని అడిగాడు. ఆస్థాన కవుల్లో చాలామంది ఇదేదో అర్థంలేని సమస్య ఇచ్చి రాజుగారు తమను ఆటపట్టించాలని అనుకుంటున్నట్లు తలచారు. సమస్య పూరణకు వారు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. కొందరికి విషయం అర్థంకాకపోయినా, ఏదో ప్రయత్నించి తమకు తోచిన విధంగా పూరించారు. వారి పూరణలేవీ భోజరాజుకు నచ్చలేదు. అప్పుడాయన కాళిదాసును చూసి ‘మహాకవీ! ఈ సమస్యను మీరు పూరిస్తే వినాలని ఉంది’ అని అడిగాడు. వెంటనే కాళిదాసు.. ‘జంబూ ఫలాని పక్వాని/ పతంతి సరసీజలే/కపి కంపిత శాఖాభ్యో/గుళు గుగ్గుళు గుగ్గుళు/’ అని పూరించాడు. నేరేడు కొమ్మలను కోతులు కదిలిస్తే, కొమ్మల నుంచి పండ్లు రాలి కొలనులో పడ్డప్పుడు వచ్చే శబ్దమే ‘గుళు గుగ్గుళు’ అని అర్థం. అడవిలో తాను చూసిన దృశ్యాన్ని అంత కచ్చితంగా కళ్లకు కట్టినట్టు వర్ణించిన కాళిదాసు ప్రతిభకు భోజరాజు ఆనందభరితుడై, మహాకవిని కానుకలతో సత్కరించాడు. - ఈదుపల్లి వెంకటేశ్వరరావు -
జీవన పోరాటం
తెప్పలు కుప్పలుగా ఉన్నాయని అందులో ఎంతోకొంత దొరుకుతుందనే ఆశతో కొందరు ఇలా ప్రమాదకర ఫీట్లు చేశారు. అరసవల్లి ఇంద్ర పుష్కరిణిలో చిల్లర వెతుకుతూ కెమెరా కంట పడ్డారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం -
ఒకే పూల్ లో భారత్, పాక్
హాకీ వరల్డ్ లీగ్ లండన్: వచ్చే ఏడాది జరిగే హాకీ వరల్డ్ లీగ్ (హెచ్డబ్ల్యూఎల్) సెమీఫైనల్ ఈవెంట్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే పూల్లో తలపడనున్నారుు. లండన్లో పురుషుల విభాగంలో జరిగే ఈ టోర్నీలో దాయాది జట్లతోపాటు నెదర్లాండ్స పూల్ ‘బి’లో చోటు దక్కించుకుంది. జూన్ 15 నుంచి 25 వరకు జరిగే ఈ టోర్నీలో భారత్, పాక్ మ్యాచ్ జూన్ 18న జరుగుతుంది. హెచ్డబ్ల్యూఎల్ టోర్నీని భారత్ ఆతిథ్యమివ్వనున్న 2018 ప్రపంచకప్కు క్వాలిఫరుుంగ్ ఈవెంట్గా పరిగణిస్తున్నారు. ఆతిథ్య ఇంగ్లండ్, ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనా సహా నెదర్లాండ్స, కొరియా, భారత్, పాక్ జట్లు నేరుగా ప్రధాన ఈవెంట్లో తలపడతారుు. మరో నాలుగు జట్లు మాత్రం హెచ్డబ్ల్యూఎల్ రెండో రౌండ్ క్వాలిఫరుుంగ్ పోటీల ద్వారా అర్హత సాధిస్తారుు. ఈ ఏడాది పాక్ను ఓడించి ఆసియా చాంపియన్సగా నిలిచిన భారత్ ఇదే జోరును నిలకడగా కొనసాగిస్తే హెచ్డబ్ల్యూఎల్లోనూ చిరకాల ప్రత్యర్థిని కంగుతినిపించేదుకు అవకాశముంటుంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఈ మ్యాచ్పై అంచనాలు పెరుగుతారుు. -
టైర్తో కొలను సోయగం
చాలామందికి తమ ఇళ్లల్లోనూ ఓ చిన్న కొలనులాంటిది ఉంటే బాగుంటుందనే ఆశ ఉంటుంది. కానీ స్థలం లేకో, కొలను కోసం నేలను తవ్వించే తీరిక లేకో.. ఆ ఆశను నిరాశగా మార్చుకుంటారు. ఇకపై అలాంటి చింతలేమీ పెట్టుకోకండి. ఒక లారీ లేక ట్రాక్టర్ టైర్ను సంపాదిస్తే చాలు. మీ ఇంట్లో అందమైన బుల్లి కొలను ఉన్నట్టే. ఎలా అంటారా? ఇలాగే.. ముందుగా ఓ టైరును మీ ఇంటి పెరట్లో పెట్టండి. ఆపైన ఫొటోలో కనిపిస్తున్న విధంగా టైర్ పైన భాగాన్ని ఎలక్ట్రిక్ సా (విద్యుత్ రంపం) సాయంతో కట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని పూర్తిగా ఓ దళసరి కవర్తో చుట్టాలి. ఆపైన టైర్ చుట్టూ ఫొటోలో కనిపిస్తున్న విధంగా మట్టితో కప్పేయాలి. ఆ మట్టిపై చిన్న చిన్న రాళ్లతో అలంకరించి, అందులో ఇప్పుడు నీళ్లు పోయాలి. అందులో ప్లాస్టిక్ పూలు వేసి, చుట్టూ పూల మొక్కలు, పక్షుల బొమ్మలు పెట్టి అలంకరించొచ్చు. అలాగే దాని పక్కన మరో రెండుమూడు చిన్న కొలనులూ తయారు చేసుకోవచ్చు. -
స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ విద్యార్థి మృతి