Ramjas College
-
నిలదీయడమే నేరం!
వేదిక ఏదని కాదు, సందర్భం ఏమిటని కాదు... చుట్టూ జరుగుతున్న అన్యాయా లపై అసమ్మతిని వ్యక్తం చేయడం, నిరసన గళాన్ని వినిపించడం తమ కర్తవ్యంగా భావించేవారు ఎప్పుడూ ఉంటారు. లాస్ ఏంజెలస్లో సోమవారం అత్యంత వైభ వంగా జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ విదేశీ చిత్రానికి బహు మతి గెల్చుకున్న ఇరాన్ దర్శకుడు అస్ఘర్ ఫర్హాదీ చేసింది ఇదే. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఆ కార్యక్రమాన్ని బహిష్కరి స్తున్నానన్న సందేశాన్ని పంపి అస్ఘర్ అందరినీ దిగ్భ్రమపరిచారు. జీవితంలో ఒక్క సారైనా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకోవాలని... దాన్ని ఆ వేదికపై నుంచే వేలాదిమంది హర్షధ్వానాలమధ్య అందుకోవాలని సినీ ప్రపంచంలోని సృజ నాత్మక దిగ్గజాలు ప్రగాఢంగా ఆశిస్తారు. కానీ తన నిరసనను బలంగా విని పించడానికి ఆ ఉత్సవం బహిష్కరణే ఏకైక మార్గమని అస్ఘర్ భావించారు. ఆయన వ్యక్తం చేసిన నిరసన కొన్నేళ్లక్రితం జాతీయ చలనచిత్ర బహుమతుల ప్రదా నోత్సవ వేదికపై ప్రముఖ నటీమణి షబనా అజ్మీ వినిపించిన నిరసన గళాన్ని స్ఫురణకు తెచ్చింది. ఇందిరాగాంధీ హత్య అనంతరం దేశ రాజధాని వీధుల్లో హంతక ముఠాలు చెలరేగి సిక్కులను ఊచకోత కోసిన అమానుషంపై ఆమె నిప్పులు చెరిగారు. వేదికపై ఉన్న కేంద్రమంత్రులను నిలదీశారు. ప్రజల పక్షాన అలా నిలదీయగలిగిన సినీ దిగ్గజా లను ఇప్పుడైతే ఊహించగలమా? ఎక్కడివరకో అవసరం లేదు.. అదే ఆస్కార్ వేది కపై మెరిసిన బాలీవుడ్ నటీమణి ప్రియాంక చోప్రా అంతకు రెండు రోజుల ముందే శ్రీనివాస్ కూచిభొట్లను పొట్టనబెట్టుకున్న జాత్యహంకార ఉన్మాదం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. భిన్న రంగాల్లో సెలబ్రిటీలుగా ఉన్నవారు దేశాన్ని వేధిస్తున్న సమస్యలపై, సాధారణ పౌరుల వెతలపై మాట్లాడాలని కోరుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యాశ. పైగా ఒక రంగంలో నిష్ణాతులైనంత మాత్రాన అన్ని విషయాల్లో వారికి అవగాహన ఉంటుందని, ఉండాలని భావించనవసరం లేదు. కానీ ఢిల్లీ రాంజాస్ కళాశాల కేంద్రంగా చెలరేగిన వివాదంలో మాత్రం కొందరు సెలబ్రిటీలు తలదూ ర్చారు. సామాజిక మాధ్యమం వేదికగా విపరీత వ్యాఖ్యలకు దిగారు. కార్గిల్ అమర వీరుడి కుమార్తె, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని గుర్మెహర్ కౌర్ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు సాగాయి. చివరకు తమ ఉద్దేశం అది కాదంటూ వారంతా పలాయనం చిత్తగించారు. వివిధ సామాజిక సమస్యలపైనా, వాటి పరిష్కారాల పైనా భిన్నాభిప్రాయాలుండటం నేరం కాదు. ఈ విషయంలోనే గుర్మెహర్ కౌర్ ధ్వజమెత్తారు. రాంజాస్ కళాశాలలో వారం క్రితం జరగాల్సిన సెమినార్ను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) భగ్నం చేయడంతో పాటు విద్యార్థులపై, అధ్యాపకులపై దాడులకు దిగడాన్ని నిరసిస్తూ సామాజిక మాధ్యమంలో ప్లకార్డుతో ఉన్న తన ఫోటోను పెట్టారు. ఆ ప్లకార్డుపై ఏబీవీపీకి అభ్యంతరాలుంటే ఉండ వచ్చు. ఆమె వాదన తప్పని నిరూపించడానికి ప్రయ త్నిస్తే కాదనేవారెవరూ ఉండరు. కానీ ఇందులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రిజిజు ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందో అర్ధంకాదు. పైగా ఆమె గతంలో భారత్–పాక్ ఉద్రిక్తతలపై పెట్టిన వీడియోను రీపోస్ట్ చేస్తూ ‘ఈ అమ్మాయి బుర్రను పాడుచేస్తున్నది ఎవరు?’ అంటూ వ్యాఖ్యానించాల్సిన అవసరమేమిటో తెలియదు. ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో రేగిన వివాదమంతటికీ ఆ వ్యాఖ్యే మూలం. ఇదే అదునుగా దుండగులు కొందరు గుర్మెహర్ను అసభ్య పద జాలంతో దూషించడం, అత్యాచారం చేస్తామని, చంపేస్తామని హెచ్చరించడం ప్రారంభించారు. ఢిల్లీలో మూడేళ్లక్రితం నిర్భయకు పట్టిన గతే పడుతుందని బెదిరించారు. హోంశాఖను చూస్తున్న మంత్రిగా రిజిజు ఇలాంటి విపత్తును ఊహించాలి. సామాజిక మాధ్యమాల్లో మహిళలను కించపరుస్తూ, బెదిరిస్తూ దుండగులు ఎలా చెలరేగుతుంటారో ఆయనకు తెలియనిదేమీ కాదు. ప్రస్తుత అంశంతో సంబంధంలేని ఒక అంశాన్ని రీపోస్ట్ చేయడంలో ద్వారా ఆయన సాధించిందేమిటి? రాంజాస్ కళాశాల వ్యవహారంలో ఆమె తీసుకున్న వైఖరి బల హీనపడుతుందనుకున్నారా? గుర్తు తెలియని దుండగుల బెదిరింపులు, హెచ్చరికల మాట అలా ఉంచి, క్రికె టర్ వీరేంద్ర సెహ్వాగ్, రెజ్లర్ యోగేశ్వర్దత్, బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ్లాంటి వారు గుర్మెహర్ వీడియోపై చేసిన వ్యాఖ్యలు వారి అజ్ఞానానికీ, అవగాహన లేమికీ అద్దంపట్టాయి. ‘మా నాన్నను చంపింది పాకిస్తాన్ కాదు... యుద్ధం’ అంటూ ఆమె చూపించిన ప్లకార్డును హేళన చేస్తూ ‘నేను ట్రిపుల్ సెంచరీలు చేయలేదు. వాటిని నా బ్యాట్ చేసింది’ అంటూ ఉన్న ప్లకార్డుతో ఉన్న ఫోటోను వీరూ ట్వీట్ చేస్తే... దాన్ని అనుకరిస్తూ కొందరు, సమర్థిస్తూ కొందరు ట్వీట్లు చేశారు. కొందరు ప్రబుద్ధులు దావూద్ ఇబ్రహీంతో, హిట్లర్తో, లాడెన్తో కూడా పోలిక తెచ్చారు. తాను చదువుకుంటున్న యూనివర్సిటీలో భావ ప్రకటనా స్వేచ్ఛకు అడ్డంకులు కల్పించ డాన్ని నిరసిస్తూ ధైర్యంగా తన వైఖరిని ప్రకటించిన ఇరవైయ్యేళ్ల యువతికి చేతనైతే దీటైన సమాధానం ఇవ్వగలగాలి. ఆమె అవగాహన తప్పని రుజువు చేయాలి. అందుకు భిన్నంగా కించపరచడం, అవమానిం చాలని చూడటం వారి స్థాయికి తగనిది. శేఖర్ గుప్తాలాంటి పాత్రికేయులు, జావేద్ అఖ్తర్వంటి కవులు చీవాట్లు పెట్టాక వీరంతా వెనక్కి తగ్గారు. కానీ అప్పటికే గుర్మెహర్ను వారు మానసికంగా గాయపరిచారు. ‘20 ఏళ్లకే చాలా చవిచూశాను. నన్ను ఒంటరిగా విడిచిపెట్టండ’ ంటూ సామాజిక మాధ్యమంలో ఆమె పెట్టిన సందేశం ఇక్కడ నెలకొన్న వర్తమాన స్థితికి అద్దం పట్టింది. ఒక యువతి నోరు మూయించడానికి సాగిన ఇలాంటి చేష్టలు ఏవగింపు కలిగిస్తాయి. ఈ తరహా పోకడలను గట్టిగా ప్రతిఘటించకపోతే ఇవి మున్ముందు మరింత వెర్రితలలు వేస్తాయి. ఈ దేశంలో భావప్రకటనాస్వేచ్ఛను పరిరక్షించుకోవడానికి అందరూ కలిసికట్టుగా కదలాల్సిన అవసరం ఉన్నదని ఈ పరిణామాలు తెలియ జెబుతున్నాయి. -
’రాంజాస్’ ఘర్షణలపై కమిటీ ఏర్పాటు
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రాంజాస్ కళాశాలలో జరిగిన ఘర్షణలపై విచారణకు కమిటీ ఏర్పాటు అయింది. ఈ కమిటీ విద్యార్థుల పాత్రపై విచారణ చేపట్టనుంది. ఈ సందర్భంగా రాంజాస్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులందరూ సంయమనం పాటించాలని సూచించారు. సమస్యలు ఏమైనా ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థుల భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదని రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన విద్యార్థులకు లేఖ రాశారు. కాగా రాంజాస్ కాలేజీ బుధవారం విద్యార్థుల ఆందోళనలతో అట్టుడిన విషయం తెలిసిందే. విద్యార్థులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో 20మందికిపైగా విద్యార్థులు గాయపడ్డారు. పలువురు జర్నలిస్టులకు కూడా గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే....దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖలిద్ను రాజాంస్ కాలేజీలో ఓ సాహిత్య కార్యక్రమంలో ఉపన్యసించేందుకు ఆహ్వానించడంతో వివాదం రాజుకుంది. ఉమర్ ఖలీద్ రాకను వ్యతిరేకిస్తూ మంగళవారం ఏబీవీపీ విద్యార్థులు కాలేజీ ఎదుట ఆందోళన దిగారు. దేశద్రోహులకు ఆహ్వానాలు అందిస్తున్నారని ఆరోపిస్తూ కాలేజీపై దాడి చేశారు. దీంతో ఉమర్ ఖలీద్, షెహ్లా రషీద్ ఆహ్వానాలను కాలేజీ రద్దు చేసుకుంది. అయితే, ఏబీవీపీ ఉద్దేశపూరితంగా ఈ కార్యక్రమాలను రద్దు చేయించిందని, కాలేజీపై దాడి చేసిన ఏబీవీపీపై చర్యలు తీసుకోవాలని రాంజాస్, డీయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఏఐఎస్ఏ నేతృత్వంలో మౌలిస్నగర్ పోలీసు స్టేషన్ వరకు ర్యాలీగా బయలుదేరారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అప్పటి నుంచి రాంజాస్ కళాశాలలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కళాశాలలో జరిగిన ఘర్షణలపై కమిటీ ఏర్పాటు అయింది. -
నన్ను రేప్ చేస్తామని బెదిరించారు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)కి వ్యతిరేకంగా మాట్లాడినప్పటి నుంచి ఆమెకు విపరీతంగా బెదిరింపులు వస్తున్నాయి. అందులో భాగంగానే.. ఏకంగా ఆమెను రేప్ చేస్తామని కూడా కొంతమంది బెదిరించారు. ఈ విషయాన్ని స్వయంగా గుర్మెహర్ కౌర్ తెలిపారు. ఢిల్లీలోని రాంజాస్ కాలేజిలో బుధవారం జరిగిన గొడవ తర్వాత.. తాను ఏబీవీపీకి భయపడనంటూ ఆమె ఒక లేఖ రాసి, ప్లకార్డుతో కూడిన ఫొటోను ఫేస్బుక్లో ఆమె అప్లోడ్ చేయడంతో, అది బాగా వైరల్ అయ్యింది. 1999 కార్గిల్ యుద్ధంలో మరణించిన కెప్టెన్ మన్దీప్ సింగ్ కుమార్తె ఆమె. తనకు రెండేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి చనిపోయినా, ఆయన ధైర్యాన్ని పుణికి పుచ్చుకుంది. సోషల్ మీడియాలో తనకు విపరీతంగా బెదిరింపులు వస్తున్నాయని, తనను జాతి వ్యతిరేకిగా అందులో పలువురు తిడుతున్నారని ఆమె చెప్పారు. ఎవరైనా దాడి చేస్తామని, రేప్ చేస్తామని బెదిరిస్తే అది చాలా భయంకరంగా ఉంటుందని అన్నారు. రాహుల్ అనే వ్యక్తి తాను రాసిన కామెంటులో చాలా సుదీర్ఘమైన వివరణ ఇచ్చాడని, తనను ఎలా రేప్ చేయాలనుకుంటున్నాడో కూడా అందులో వివరించాడని, అది చూసి చాలా భయమేసిందని గుర్మెహర్ కౌర్ తెలిపారు. గత సంవత్సరం జేఎన్యూలో జరిగిన ఒక ర్యాలీలో జాతి వ్యతిరేక నినాదాలు చేసి, ప్రస్తుతం రాజద్రోహ నేరం ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్ను రాంజాస్ కాలేజిలో జరిగిన ఒక సెమినార్కు ఆహ్వానించడంతో.. దాన్ని ఏబీవీపీ వ్యతిరేకించింది. ఈ సందర్భంగా మిగిలిన విద్యార్థులకు, ఏబీవీపీ వాళ్లకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై స్పందించిన గుర్మెహర్, తన ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్చర్ను కూడా మార్చారు. తాను ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినినని, తాను ఏబీవీపీకి భయపడనని ఆమె అందులో చెప్పారు. తాను ఒంటరిని కానని, దేశంలో ప్రతి విద్యార్థి తన వెంట ఉన్నారని అన్నారు. దాంతో ఆమెను సమర్థించేవాళ్లు, వ్యతిరేకించేవాళ్లు కూడా భారీ స్థాయిలో ఫేస్బుక్లో కామెంట్లు పెట్టారు. ఏబీవీపీకి భయపడను: జవాన్ కూతురు 'నా తండ్రిని పాకిస్థాన్ చంపలేదు' రాంజాస్ కాలేజీలో రణరంగం! -
హాకీ స్టిక్స్తో కొట్టుకున్న విద్యార్థులు
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రఖ్యాత రాంజాస్ కాలేజ్ బుధవారం రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలతో రణరంగంగా మారింది. కాలేజీలో నిర్వహిస్తున్న ‘కల్చర్ ఆఫ్ ప్రొటెస్టెస్’ సెమినార్లో పాల్గొనేందుకు జేఎన్యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్(దేశద్రోహం కేసును ఎదుర్కొంటున్న విద్యార్థి), షెహ్లా రషీద్లను అహ్వానించడానికి సంబంధించి వామపక్ష అనుబంధ విద్యార్థి విభాగం ఐఏఎస్ఏ, ఆరెస్సెస్ మద్ధతున్న ఏబీవీపీ విద్యార్థుల మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకుంది. విద్యార్థులు హాకీ స్టిక్స్తో కొట్టుకోవడంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే, కొందరు ఉపాధ్యాయులు, పోలీసులు, జర్నలిస్టులు కూడా గాయాలపాలయ్యారు. అనంతరం కాలేజీలోకి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. -
రాంజాస్ కాలేజీలో రణరంగం!
పోలీసులతో విద్యార్థుల ఘర్షణ ఉమర్ ఖలీద్కు ఆహ్వానంపై రగడ న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రాంజాస్ కాలేజీ బుధవారం విద్యార్థుల ఆందోళనలతో అట్టుడికింది. విద్యార్థులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో 20మందికిపైగా విద్యార్థులు గాయపడ్డారు. పలువరు జర్నలిస్టులకు కూడా గాయాలయ్యాయి. దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖలిద్ను రాజాంస్ కాలేజీలో ఓ సాహిత్య కార్యక్రమంలో ఉపన్యసించేందుకు ఆహ్వానించడంతో గొడవ ప్రారంభమైంది. ఉమర్ ఖలీద్ రాకను వ్యతిరేకిస్తూ మంగళవారం ఏబీవీపీ విద్యార్థులు కాలేజీ ఎదుట ఆందోళన దిగారు. దేశద్రోహులకు ఆహ్వానాలు అందిస్తున్నారని ఆరోపిస్తూ కాలేజీపై దాడి చేశారు. దీంతో ఉమర్ ఖలీద్, షెహ్లా రషీద్ ఆహ్వానాలను కాలేజీ రద్దు చేసుకుంది. అయితే, ఏబీవీపీ ఉద్దేశపూరితంగా ఈ కార్యక్రమాలను రద్దు చేయించిందని, కాలేజీపై దాడి చేసిన ఏబీవీపీపై చర్యలు తీసుకోవాలని రాంజాస్, డీయూ విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. ఏఐఎస్ఏ నేతృత్వంలో మౌలిస్నగర్ పోలీసు స్టేషన్ వరకు ర్యాలీగా బయలుదేరారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. -
రాంజాస్ కాలేజీలో రణరంగం!