Rs. 3 lakh
-
భారత్లోని బెస్ట్ అడ్వెంచర్ బైకులు ఇవే!.. ధరలు ఎలా ఉన్నాయంటే?
ఇండియన్ మార్కెట్లో రోజువారీ వినియోగానికి ఉపయోగపడే బైకులకు మాత్రమే కాకుండా.. అడ్వెంచర్ బైకులకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు సంస్థలు దేశీయ విఫణిలో సరికొత్త అలాంటి బైకులను లాంచ్ చేస్తున్నాయి. ఈ కథనంలో రూ. 3 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే ఐదు బెస్ట్ అడ్వెంచర్ మోటార్ సైకిళ్ళ గురించి తెలుసుకుందాం.సుజుకి వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ (Suzuki V-Strom SX)సుజుకి వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ దేశీయ విఫణిలో ఎక్కువ మందిని ఆకర్శించిన బైక్. దీని ధర రూ. 2.16 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ కొనుగోలుపై కంపెనీ ఇప్పుడు (ఫిబ్రవరి) రూ. 15,000 తగ్గింపును అందిస్తోంది. ఈ బైక్ 249 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 9300 rpm వద్ద, 26.1 Bhp పవర్, 7300 rpm వద్ద 22.2 Nm టార్క్ అందిస్తుంది. ఈ బైక్ పొడవైన విండ్స్క్రీన్, బీక్ స్టైల్ ఫ్రంట్ ఫెండర్, మస్క్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్తో మంచి డిజైన్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్లైట్, బ్లూటూత్ ఎనేబుల్డ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ స్లాట్ వంటివన్నీ ఉన్నాయి.హీరో ఎక్స్పల్స్ 210 (Hero XPulse 210)ఈఐసీఎంఏ 2024లో కనిపించిన హీరో ఎక్స్పల్స్ 210 అనేది.. అడ్వెంచర్ లైనప్లో తాజా వెర్షన్. ఇది ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్పోలో లాంచ్ అయింది. దీని ధర రూ. 1.75 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులోని 210 సీసీ ఇంజిన్ 9250 rpm వద్ద, 24.2 Bhp పవర్, 7250 rpm వద్ద 20.7 Nm టార్క్ అందిస్తుంది. కొత్త డిజైన్ కలిగిన ఈ బైక్.. మంచి ఆఫ్ రోడ్ అనుభూతిని కూడా అందిస్తుంది.కేటీఎమ్ 250 అడ్వెంచర్ (KTM 250 Adventure)అడ్వెంచర్ బైక్ అంటే.. అందరికీ ముందుగా గుర్తొచ్చేది కేటీఎమ్ బైకులే. కాబట్టి రూ. 3 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకుల జాబితాలో 'కేటీఎమ్ 250 అడ్వెంచర్' ఉంది. దీని ధర రూ. 2.59 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఇందులోని 249 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్.. 9250 rpm వద్ద 30.5 Bhp పవర్, 7250 rpm వద్ద 24 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.యెజ్డీ అడ్వెంచర్ (Yezdi Adventure)రూ. 2.09 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే.. యెజ్డీ అడ్వెంచర్ కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ బైక్. ఇది 334 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 8000 rpm వద్ద 29.1 Bhp పవర్, 6500 rpm వద్ద 29.8 Nm టార్క్ అందిస్తుంది. ఇది రౌండ్ ఎల్ఈడీ హెడ్లైట్, పొడవైన విండ్స్క్రీన్, స్ప్లిట్ సీట్లు, వైర్-స్పోక్ వీల్స్ వంటివి పొందుతుంది. కాబట్టి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.ఇదీ చదవండి: ఫాస్ట్ట్యాగ్ కొత్త రూల్స్: ఆ టోల్ ప్లాజాలకు వర్తించదురాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ (Royal Enfield Himalayan)అడ్వెంచర్ చేసేవారికి ఇష్టమైన బైకులలో చెప్పుకోదగ్గ మోడల్ ''రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్''. ఇది 452 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా.. 8000 rpm వద్ద 39.4 Bhp పవర్, 5500 rpm వద్ద 40 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైకులో రౌండ్ TFT డిస్ప్లే, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్, రైడ్-బై-వైర్, మల్టిపుల్ రైడింగ్ మోడ్లు, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీని ధర రూ. 2.85 లక్షలు (ఎక్స్ షోరూమ్). -
రూ. 3 లక్షల విలువైన కలప స్వాధీనం
రెడ్డిగూడెం: కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రుద్రవరం వద్ద సుమారు రూ.3 లక్షల విలువైన కలపను అటవీశాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ అధికారులు రావడం గమనించి కలప దొంగలు ట్రాక్టర్లో నుంచి దుంగలను పడేసి ట్రాక్టర్తో పరారయ్యారు. అధికారులు దుంగలను స్వాధీనం చేసుకుని అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. -
రెక్కల కష్టం బూడిదపాలు
మొక్కజొన్న పంటను దహనం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు రూ. 3 లక్షల ఆస్తినష్టం పరిగి: ఆరుగాలం రెక్కలుముక్కలు చేసుకొని సాగుచేసిన పంట బూడిద పాలైంది. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో రూ. 3 లక్షల విలువైన మొక్కజొన్న పంట కాలిపోయింది. ఈ సంఘటన పరిగి మండల పరిధిలోని నారాయణ్పూర్లో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణ్రెడ్డి తనకున్న మూడెకరాల పొలంలో పత్తిసాగుచేశాడు. స్థానికంగా మరో ఎనిమిది ఎకరాల పొలం కౌలుకు తీసుకొని మొక్కజొన్న పంట వేశాడు. రూ.2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టి సాగుచేయగా పంట బాగా వచ్చింది. పంట కోతకు రావటంతో వారం రోజులుగా కూలీలతో మొక్కజొన్న కంకులు సేకరించి కల్లంలో వేసి నూర్పిడికి సిద్ధంగా ఉంచాడు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మొక్కజొన్న కంకులకు నిప్పు పెట్టారు. బుధవారం తెల్లవారు జామున నారాయణ్రెడ్డి పొలానికి వెళ్లి చూడగా పంట కాలిపోతూ కనిపించింది. తోటి రైతుల సాయంతో మంటలు ఆర్పే యత్నం చేసినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున ్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను పూర్తిగా అదుపు చేశారు. అప్పటికే రూ. 3 లక్షలకు పైగా నష్టం జరిగిందని బాధిత రైతు తెలిపాడు. నారాయణ్రెడ్డి కొందరిపై అనుమానం వ్యక్తం చేస్తూ పరిగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. 80 క్వింటాళ్ల పత్తి దగ్ధం రూ. 4.2 లక్షల ఆస్తినష్టం ధారూరు: పొలంలో నిల్వ ఉంచిన దాదాపు 80 క్వింటాళ్ల పత్తి ప్రమాదవశాత్తు కాలిపోయింది. దీంతో రూ. 4.2 లక్షల నష్టం జరిగింది. ఈ సంఘటన మండల పరిధిలోని నాగసమందర్లో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. నాగసమందర్ గ్రామానికి చెందిన వరద మల్లికార్జున్కు చె ందిన 42 ఎకరాల పొలాన్ని ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన సుబ్బారావు కౌలుకు తీసుకుని ఖరీఫ్ సీజన్లో పత్తి పంటను సాగుచేశాడు. 20 రోజుల నుంచి పత్తిని సేకరించారు. 175 క్వింటాళ్లు ఓ దగ్గర, 250 క్వింటాళ్లు మరో దగ్గర పత్తిని రెండు కుప్పలుగా నిల్వ చేశాడు. బుధవారం సాయంత్రం 175 క్వింటాళ్ల పత్తికుప్పకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో రైతు సుబ్బారావు స్థానికులతో కలిసి ట్యాంకర్ల ద్వారా మంటలను ఆర్పే యత్నం చేశారు. అనంతరం వికారాబాద్ నుంచి వచ్చిన ఫైర్ ఇంజిన్ మంటలను ఆర్పేసింది. అప్పటిలోగా 80 క్వింటాళ్ల పత్తి పూర్తిగా కాలిపోయింది. మిగిలిన 95 క్వింటాళ్ల పత్తి ఫైర్ ఇంజిన్నీటితో పాడైంది. దీనిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపరని బాధితుడు కన్నీటిపర్యంతమయ్యాడు. ఆరుగాలం రెక్కలుముక్కలు చేసుకొని కుటుంబీకులమంతా కష్టపడ్డామని, ప్రమావశాత్తు పంట కాలిపోవడంతో రూ. 4.2 లక్షల ఆస్తినష్టం జరిగిందని సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు.