salaried
-
ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 192 ప్రకారం..
ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు గడిచిపోయాయి. మరో రెండు రోజుల్లో దసరా .. ఆ తర్వాత దీపావళి .. అలా అలా కాలం గడిపేయకండి. నెమ్మదిగా, నిశ్చింతగా, చింత లేకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిగిన, జరగబోయే ఆర్థిక వ్యవహారాల మీద ఒక కన్నేయండి. నిశితంగా పరిశీలించుకోండి. ప్రశ్నించుకోండి. పరీక్షించండి. పదండి ముందుకు.. ఈ విషయంలో ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ఎన్నో సేవలు అందిస్తున్నారు. మీ ముందుకు వస్తున్నారు. www.incometaxindia.gov.inని వెంటనే దర్శించండి. తరచుగా మీకు వచ్చే సందేహాలు, సమస్యలు, మిమ్మల్ని వేధించే ప్రశ్నలు.. మొత్తం ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయ పన్ను చట్టం, నియమాలు, వాడాల్సిన ఫారంలు, దాఖలు చేయాల్సిన రిటర్నులు.. ఇలా ఎన్నెన్నో.. సవరణలు, వివరణలు, ఉదాహరణలు.. కొన్ని వందల ప్రశ్నలకు చక్కటి జవాబులు ఇందులో ఉన్నాయి. మీకు అర్థమయ్యే విధంగా, సులభంగా వివరించే Frequently Asked Questions.... సామాన్యమైన సందేహాలు, ప్రాథమిక అంశాలు మొదలు ప్రాముఖ్యమైన అంశాల వరకు.. చిన్న చిన్న సందేహాలు మొదలు పెద్ద సమస్యల వరకు.. అస్సెస్సీ తరఫు నుండి అసెస్మెంట్ పద్ధతి వరకు.. ఒక్క మాటలో చెప్పాలంటే అ నుండి అః వరకూ అన్నీ .. చట్టంలోని అన్ని అంశాలకు సంబంధించి కొన్ని వందల ప్రశ్నలకు జవాబులున్నాయి. వెబ్సైట్ దర్శించి ప్రతి చాప్టర్ చదవండి. కొన్ని మీకు వర్తించవచ్చు కొన్ని వర్తించకపోవచ్చు. ఏది ఏమిటనేది మీకు అర్థమవుతుంది. సులువుగా ఉంటుంది. నాన్–రెసిడెంట్లు, సీనియర్ సిటిజన్లు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు, అన్ని వర్గాల వారికీ జీతం, ఇంటద్దె, వ్యాపారం/వృత్తి, మూలధన లాభాలు, ఇతర ఆదాయాలు.. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్, టీడీఎస్, టీసీఎస్, పాన్, టాన్ .. ఇలా .. గిఫ్టులు, బహుమతులు, వ్యవసాయ ఆదాయం అన్నింటికీ జవాబులు ఉన్నాయి. నవంబర్ / డిసెంబర్లో సెక్షన్ 192 ప్రకారం కేవలం జీతం మీద ఆదాయం .. అంటే వేతన జీవులకు ప్రత్యేకంగా సర్క్యులర్ విడుదల చేస్తారు. అన్ని గవర్నమెంటు శాఖలకు చేరుతుంది. ఇతరులకు కూడా లభ్యమవుతుంది. మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. వెబ్సైట్లో దొరుకుతుంది. ఇందులో అన్ని అంశాలు ఉంటాయి. ఏది మంచిది.. ఏది మీకు పనికొచ్చేది తెలుసుకునేందుకు ఉదాహరణలు ఉంటాయి. ఎక్కువ మందిని దృష్టిలో పెట్టుకుని తయారుచేస్తారు. మీ నిజమైన పరిస్థితికి.. అంటే వాస్తవానికి దగ్గర్లో ఉంటాయి. అది చదవండి. అడ్వాన్స్ ట్యాక్స్ లెక్కలు తేల్చి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించండి. కొన్ని డాక్యుమెంట్లు వ్యవహారం జరిగిన / జరిపిన వెంటనే దొరుకుతాయి. వాటి కాపీలు తీసుకుని భద్రపర్చుకోండి. ఒక ఫైలు తెరవండి. అందులో అన్నీ దాచండి. బ్యాంకు ఎంట్రీలకు వివరణ రాసుకోండి. జ్ఞాపక శక్తి కన్నా ‘డాక్యుమెంట్’ చేయడమే మంచిది. -
TDS: మీరు ఉద్యోగస్తులా.. ఫాం16, ఫాం16ఏ గురించి మీకు తెలుసా?
టీడీఎస్ అంటే మూలం వద్ద చెల్లింపులోనే కోత అని అర్థం. చెల్లింపులు జరిపే వ్యక్తి చట్టప్రకారం కొంత మొత్తం పన్నుగా మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. ఇలా రికవరీ చేసిన మొత్తాన్ని సకాలంలో గవర్నమెంటుకు చెల్లించి, సకాలంలో రిటర్నులు దాఖలు చేసి, ఒక స్టేట్మెంటును తయారు చేస్తారు. వీటినే టీడీఎస్ స్టేట్మెంట్లు అంటారు. ఇందులో ఆదాయం వివరాలు, వాటి స్వభావం, కొంత కోసిన మొత్తం, చలానా వివరాలు, అస్సెస్సీ పేరు, పాన్, అసెస్మెంటు సంవత్సరం మొదలైన వివరాలు ఉంటాయి. జీతాలు చెల్లించేటప్పుడు ఇచ్చిన ఫారంని 16 అని, ఇతర చెల్లింపులకు ఇచ్చిన ఫారం 16ఏ అని అంటారు. డిపార్ట్మెంటు వారు అన్నింటినుండి సేకరించిన సమాచారంతో ప్రతి అస్సెస్సీకి ఒక సమగ్రమైన పట్టికను తయారు చేస్తారు. దీనినే 26సీ అని అంటారు. ఇందులో అస్సెస్సీకి సంబంధించిన ఆదాయ వివరాలు, టీడీఎస్, టీసీఎస్, అస్సెస్సీ చెల్లించిన పన్ను వివరాలు.. ఇలా ఎన్నో ఉంటాయి. ఇదొక చిట్టా అని చెప్పవచ్చు. అయితే ఫారం 16/16ఏ లోని వివరాలు, ఫారం 26ఏ లోని వివరాలు ఒకదానితో మరొకటి సరిపోవాలి. తేడాలు రాకూడదు. అయితే, ఎన్నో సందర్భాల్లో తేడాలు ఉంటున్నాయి. వివిధ కారణాలు ఏమిటంటే.. ♦డిడక్ట్ చేసిన వ్యక్తి చెల్లించకపోవడం ♦రిటర్నులు నింపినప్పుడు తప్పులు దొర్లడం ♦పాన్ నంబరు రాయడంలో తప్పులు ♦టాన్ నంబర్ రాయడంలో తప్పులు ♦ చలాన్ల వివరాల్లో తప్పులు దొర్లటం ♦అసెస్మెంటు సంవత్సరాన్ని తప్పుగా రాయటం ♦ అడ్రస్లు తప్పుగా రాయడం ♦అస్సెస్సీ పేర్లు తప్పుగా రాయడం ♦పూర్తి వివరాలు ఇవ్వకపోవడం ♦ పన్నుల మొత్తం రాయడంలో తప్పులు, హెచ్చుతగ్గులు దొర్లడం.. ♦ఇలా ఎన్నో తప్పులు దొర్లవచ్చు. అందుకే తేడాలు రావచ్చు. ఇప్పుడు ఏం చేయాలి? ఇలా తేడాలు గమనించినప్పుడు ఫారం 16, ఫారం 16ఏ జారీ చేసిన వారిని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. వారిని సంప్రదించి ఆ తప్పులు సరిదిద్దించుకోవాలి. డిపార్ట్మెంటు వారికి తగిన కారణాలు వివరిస్తూ జవాబు ఇవ్వండి. వ్యత్యాసాలని సమన్వయం చేయండి. అంటే ‘‘రీకన్సిలేషన్’’ చేయండి. వివరణ సరిగ్గా ఉంటే ఏ సమస్యా ఉండదు. తీసుకోవలసిన జాగ్రత్తలు ఇప్పుడు ప్రీఫిల్డ్ ఫారాలు ఉన్నాయి. ఈ సదుపాయం వల్ల ఫారం 26ఏ లోని అంశాలు యథాతథంగా ప్రీఫిల్డ్ ఫారంలో ఉంటాయి. ఇటువంటప్పుడు తేడాలు కనబడితే వాటిని వెంటనే సరిదిద్దండి. డిడక్టర్ ఇవ్వాల్సిన వివరాలు ఇవ్వకపోయినా ఇబ్బందే. డిమాండు ఏర్పడే అవకాశం ఉంటుంది. సరిదిద్దండి. వీటివల్ల ఆలస్యం కావచ్చు. అయినా తప్పదు. ఇలాంటి తప్పులు దొర్లినప్పుడు సరిదిద్దుకునేందుకు అస్సెస్సీలకు డిపార్ట్మెంటు అధికారులు సరైన అవకాశం, సమయం ఇవ్వాలి. 26ఏ లో తప్పుడు సమాచారాన్ని బట్టి అసెస్మెంట్ జరిగితే ఆ చర్య మీద అప్పీలుకు వెళ్లవచ్చు. ఈ మధ్య ఒక కంపెనీ అసెస్మెంటులో కోట్ల రూపాయల తప్పు దొర్లితే ఆ తప్పుని సరిదిద్దారు. కాబట్టి జాగ్రత్త వహించండి. అన్నింటికీ కీలకం.. మీ దగ్గరున్న సరైన, నిజమైన సమగ్రమైన సమాచారం. అదే శ్రీరామరక్ష. చదవండి: Investment Ideas: నెలవారీ ఆదాయం కోసం ఏ పథకం బెటర్? -
వేతన జీవులకు నిరాశ..
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది వేతన జీవులకు నిరాశే ఎదురవనుందని తాజా అథ్యయనం బాంబు పేల్చింది. వేతనాల్లో రెండంకెల వృద్ధి ఇక గత వైభవంగా మిగిలిపోనుందని ఆ సర్వే వెల్లడించింది. 2019లో సగటు వేతన పెంపు భిన్న రంగాల్లో 9.7 శాతంగా ఉంటుందని హెచ్ఆర్ కన్సల్టెన్సీ సంస్థ ఏఆన్ అంచనా వేసింది. 2017లో సగటు వేతన వృద్ధి 9.3 శాతం, 2018లో 9.5 శాతం కాగా ఈ ఏడాది స్వల్పంగా వేతన వృద్ధి పెరిగినా రెండంకెల వృద్ధికి దూరంగా నిలవడంతో వేతన జీవులకు నిరాశ మిగలనుంది. 2007లో సగటు వార్షిక వేతన వృద్ధి అత్యధికంగా 15.1 శాతం నుంచి ఆ తర్వాత గణనీయంగా తగ్గుతూ వచ్చిందని ఏఆన్ హెవిట్ వెల్లడించిన డేటా తెలిపింది. ఎన్నికల ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యయాలు పెరిగినా 2020లో మెరుగైన వేతన వృద్ధిని అంచనా వేయవచ్చని, అయినా 12-13 శాతం వేతన వృద్ధి మాత్రం గత వైభవంగానే మిగులుతుందని తాము అంచనా వేస్తున్నామని ఏఆన్ ఎమర్జింగ్ మార్కెట్స్ హెడ్, భాగస్వామి అనందర్ప్ ఘోష్ స్పష్టం చేశారు. కీలక నైపుణ్యాలు కలిగిన వారికే మెరుగైన వేతన వృద్ధి పరిమితమవుతందని, సగటు వేతన పెంపు మాత్రం వృద్ధి చెందదని అంచనా వేశారు. ఈ ఏడాది కేవలం ఇంటర్నెట్ కంపెనీలు, ప్రొఫెషనల్ సేవలు, లైఫ్ సైన్సెస్, ఆటోమోటివ్, కన్జూమర్ ఉత్పత్తుల రంగాల్లోనే రెండంకెల వేతన వృద్ధి పరిమితమవుతుందని ఈ సర్వే అంచనా వేసింది. -
చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితిదీ!
-
చిత్తూరు షుగర్స్లో నో క్రషింగ్
355 మంది కార్మికుల తొలగింపు ఈ ఏడాది క్రషింగ్ నిలిపివేస్తున్నట్లు ప్రకటన ఆందోళనకు దిగిన కార్మికులు సాక్షి, చిత్తూరు: అదిగో క్రషింగ్.. ఇదిగో క్రషింగ్ అంటూ నెలరోజు లుగా దోబూచులాడిన చిత్తూరు షుగర్స్ పాలకవర్గం, అధికార వర్గం ఎట్టకేలకు చిత్తూరు సహకార చక్కెర కర్మాగారంలో ఈ ఏడాది క్రషింగ్ నిలిపివేస్తున్నట్లు శనివారం ప్రకటించాయి. అంతేకాదు కర్మాగారంలో 30 ఏళ్లకు పైగా పనిచేస్తున్న 355 మంది సీజనల్ పర్మినెంట్, కన్సాలిడేట్ కార్మికులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు రెఫరెన్స్ సీసీఎస్ ఈఎస్టీటీ ఓఎం 2015 ఉత్తర్వులు జారీచేసింది. రాత్రికి రాత్రే ఈ ఉత్తర్వులు వెలువడ్డా యి. బకాయిలు ఇవ్వలేనందునే ఈ ఏడాది కర్మాగారంలో క్రషింగ్ నిలిపివేయడంతోపాటు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో 355 మంది కార్మికులను సైతం విధులనుంచి రిలీవ్ చేస్తున్నట్లు పా లకవర్గం తీర్మానించగా ఇన్చార్జ్ ఎండీ అధికారికంగా దానికి ఆమోదముద్ర వేశారు. 12వతేదీనే పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో చూపారు. అధికారులు, చైర్మన్తో గొడవ నేపథ్యంలో ఈనెల 10వ తేదీ ఇన్చార్జ్ ఎండీ పదవికి రాజీ నామా చేసిన మల్లికార్జున రెడ్డి పేరు మీదనే క్రషింగ్ నిలిపివేత, కార్మికుల తొలగింపు ఉత్తర్వులు వెలువడడం విశేషం. అయితే ఇన్చార్జి ఎండీ తన పదవికి రాజీనామా చేయకమునుపే ఈ ఉత్వర్వులపై సంత కం చేశారా ? అనే అనుమానం తలెత్తుతోంది. లేకపోతే ఆయన రాజీనామానే ఓ డ్రామానా అనే సంశ యం కూడా కలుగుతోంది. కర్మాగారం కార్యాలయం, ఇం జినీరింగ్ విభాగం, మ్యాన్యుఫ్యాక్చరింగ్ విభాగాలకు చెందిన కార్మికు లు తొలగించిన వారిలో ఉన్నారు. 13 నెల లుగా వారు జీతాలు లేకుండానే పనిచేస్తున్నారు. కార్మికులకు సంబంధించి 12 కోట్ల జీతాలకు చెందిన బకాయిలతోపాటు మరో మూడు కోట్ల పీఎఫ్ బకాయిలు చెల్లించాలి. వాటి సంగతి పట్టించుకోని ప్రభుత్వం కార్మికులకు, యూనియన్ నేతలకు మాట మాత్రమైనా చెప్పకుండా తొలగింపు చర్యలకు దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఎండీ పాలక వర్గం తీర్మానానికి ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న కార్మికులు శనివారం ఉదయం నుంచి కర్మాగారం వద్ద ఆందోళన చేపట్టారు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒక్కసారిగా వందలాది మం ది ఉద్యోగులను ఎలా తొలగిస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. రైతులు, కార్మికులకు చెందిన బకాయిలను చెల్లించలేని పరిస్థితిలోనే కన్సాలిడేట్ కార్మికులను రిలీవ్ చేసినట్లు చైర్మన్ ఎన్పీ రామకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. ఆది నుంచి డ్రామానే రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించి సహకార చక్కెర కర్మాగారాన్ని ముందుకు నడిపిస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత హామీలు తుంగలో తొక్కారు. విలువైన ఆస్తులున్న కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టేందుకు బాబు ప్రభుత్వం ఆది నుంచే మొగ్గు చూపింది. ఇందుకోసం అధ్యయనం అంటూ కమిటీ వేసి చిత్తూరు షుగర్స్ అమ్మకానికి మార్గం సుగమం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా రైతాంగంతో పాటు అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో కర్మాగారం అమ్మకానికి చంద్రబాబు తాత్కాలిక విరామం మాత్రమే ఇచ్చినట్లు కనబడుతోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించడంతో పాటు చిత్తూరు షుగర్స్లో క్రషింగ్ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. బాబు ప్రకటనతో పాలకవర్గం డిసెంబర్ 4న కర్మాగారంలో స్లోఫైరింగ్ కార్యక్రమం నిర్వహించింది. ఆ తరువాత చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో డిసెంబర్ 11న కర్మాగారంలో పూజా కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఇదే సమయంలో ప్రభుత్వం పైసా నిధులు ఇవ్వక పోయినా పాలకవర్గం, అధికారవర్గం కర్మాగారం విలువైన స్టోర్స్ను తాకట్టు పెట్టి ఆప్కా బ్ వద్ద రెండు కోట్ల రుణం తెచ్చింది. రుణం కోసం డెరైక్టర్ ఆఫ్ షుగర్స్ సైతం ఆప్కాబ్కు సిఫారసు చేసింది. క్రషింగ్ నిర్వహించనపుడు ఆప్కాబ్ నుంచి రుణం ఎందుకు తేవాల్సి వచ్చిందో పాలకవర్గానికే తెలియాలి.