Sanders
-
హిల్లరీ అభ్యర్థిత్వం ఖరారు!
అమెరికా అధ్యక్ష రేసులో దిగనున్న తొలి మహిళగా క్లింటన్ రికార్డు - 2,383 మంది డెలిగేట్ల మద్దతు.. డెమోక్రాట్ల అభ్యర్థిగా బరిలోకి.. శాన్ ఫ్రాన్సిస్కో: అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల బరిలో హిల్లరీ క్లింటన్ సరికొత్త రికార్డుకు చేరువలో ఉన్నారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున ఆమె అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లేనని అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండేందుకు 2,383 మంది డెలిగేట్లు, సూపర్ డెలిగేట్ల మద్దతుండాలి. అయితే.. ఇప్పటివరకు జరిగిన ప్రైమరీల్లో హిల్లరీకి 1,812 మంది డెలిగేట్లు, రెండో స్థానంలో ఉన్న శాండర్స్కు 1,521 మంది మద్దతు తెలిపారు. మరో రెండు కీలక ప్రాంతాలైన కాలిఫోర్నియా (475), న్యూజెర్సీ (126)తోపాటు ఐదు చిన్న రాష్ట్రాల్లో ప్రైమరీ ఎన్నికలు మిగిలుండగానే క్లింటన్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు ఏపీ వెల్లడించింది. అధ్యక్ష బరిలో నిలిచేవారి అభ్యర్థిత్వం ఖరారు చేయటంలో కీలకంగా మారిన మొత్తం 714 సూపర్ డెలిగేట్లలో 571 మంది హిల్లరీవైపు ఉన్నారని తమ సర్వేలో తేలిందని దీని ఆధారంగా ఇప్పుడున్న డెలిగేట్లు, సూపర్ డెలిగేట్లు కలుపుకుని మొత్తం 2,383 మంది మద్దతుందని ఏపీ వెల్లడించింది. భర్తను గాయపర్చిన హిల్లరీ వాషింగ్టన్:హిల్లరీ క్లింటన్పై తాజా పుస్తకం సంచలనం రేపుతోంది. జూన్ 28న విడుదల కానున్న ‘క్రైసిస్ ఆఫ్ క్యారెక్టర్’ అనే ఈ పుస్తకంలో వైట్హౌస్ మాజీ సీక్రెట్ సర్వీస్ అధికారి గ్యారీ జే బయర్న్ కొన్ని ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు. 1995 వేసవిలో బిల్ క్లింటన్తో హిల్లరీ తీవ్ర ఆగ్రహంతో పెద్దగా గొడవ పడ్డారని, ఫ్లవర్ వాజ్ భారీ శబ్దంతో పగలడం వినిపించిందని పుస్తకంలో పేర్కొన్నారు. తర్వాతి రోజు కంటి చుట్టూ నల్లని వలయంతో కూడిన గాయంతో బిల్ కనిపించారని, అయితే క్లింటన్కు కాఫీ అంటే అలర్జీ ఉండ టంతో కంటికి సమస్య వచ్చిదంటూ వ్యక్తిగత పర్యవేక్షకురాలు చెప్పారన్నారు. -
చరిత్ర సృష్టించిన హిల్లరీ క్లింటన్
వాషింగ్టన్ : మాజీ ప్రథమ మహిళ హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్తో ఢీ అంటే ఢీ అంటూ సిద్ధం అయ్యారు. దేశాధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రటిక్ అభ్యర్థిగా ఆమె నామినేషన్ ఖరారైంది. ఈ విషయాన్ని ఏజెన్సీ ప్రెస్, యూఎస్ నెట్ వర్క్స్ వెల్లడించాయి. డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీలో ఉన్న శాండర్స్ను అధిగమించి అధ్యక్ష నామినేషన్ కోసం కావాల్సిన 2383 డెలిగేట్లను హిల్లరీ గెలుచుకున్నారు. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ రేసులో ఓ మహిళ నిలవడం ఇదే ప్రథమం. ప్యూర్టో రికోలో జరిగిన ప్రైమరీలో హిల్లరీ భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. చివరి నిమిషంలో ఆమెకు సూపర్డెలిగేట్ ఓట్లు లభించడంతో ఆమె విజయం సాధించినట్లు ఏజెన్సీ ప్రెస్ ప్రకటించింది. హిల్లరీకి 2,383 శాండర్స్ కు 1,5691 డెలిగేట్లు వచ్చాయి. ఫలితాల అనంతరం ఈ విషయాన్ని హిల్లరీ తన ట్విట్టర్ ద్వారా 'గాట్ ప్రైమరీస్ టూ విన్' అంటూ షేర్ చేసుకున్నారు. కాగా, జూలై నెల వరకు ఎవరు డెమొక్రటిక్ అభ్యర్థిగా వెళతారు ఎదురు చూడాల్సిందే తప్ప ఇప్పుడే ఆఖరు అనుకోవద్దని శాండర్స్ వ్యాఖ్యానించాడు. We’re flattered, @AP, but we've got primaries to win. CA, MT, NM, ND, NJ, SD, vote tomorrow! https://t.co/8t3GpZqc1U — Hillary Clinton (@HillaryClinton) 7 June 2016 -
ఒక్క డిబేట్కు 67 కోట్లు కోరిన ట్రంప్!
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాంచి బిజినెస్ మెన్ అనిపించుకున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసిడెంట్ పోటీలో నిలిచేందుకు సరిపడా డెలిగేట్ల మద్దతు లభించిన సందర్భంగా నార్త్ డకోటాలోని బిస్మార్క్లో విలేకరుల సమావేశంలో ట్రంప్ చెప్పిన మాటలు విన్నవారు.. ఎక్కడ డబ్బు రాబట్టగలమో బహుశా ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియకపోవచ్చు అనుకుంటున్నారు. డెమోక్రటిక్ పార్టీ తరపున ప్రెసిడెంట్ అభ్యర్థిత్వం కోసం హిల్లరీ క్లింటన్తో పోటీ పడుతున్న బెర్నీ సాండర్స్తో డిబేట్లో పాల్గొంటారా అని ట్రంప్ను పాత్రికేయులు అడగ్గా.. పాల్గొంటాను గానీ నాకు 10 మిలియన్ డాలర్లు ఇస్తారా అని ఆయన ప్రశ్నించడంతో వారు బిత్తరపోయారు. డిబేట్ నిర్వహించే మీడియా సంస్థ ఇచ్చే ఆ డబ్బుతో చారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తానని ట్రంప్ వెల్లడించారు. మీడియా సంస్థల బిజినెస్ గురించి తనకు బాగా తెలుసునని చెప్పిన ట్రంప్.. సాండర్స్తో డిబేట్కు మంచి రేటింగ్ లభిస్తుందని అభిప్రాయపడ్డారు. సాండర్స్ తనకు లవబుల్ పర్సన్ అని, ఆయనతో డిబేట్ తనకు ఇష్టమన్నారు. మరోవైపు సాండర్స్ కూడా ఈ డిబేట్కు ఓకే అంటూ సంకేతాలిచ్చారు. చూడాలి మరి ట్రంప్ చారిటీ బిజినెస్ డీల్కు ఏ మీడియా సంస్థ ముందుకొస్తుందో. -
మోదీని అధిగమించిన ప్రియాంకా చోప్రా
న్యూయార్క్ః బాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరైన ప్రియాంకా చోప్రా ఆన్ లైన్ పోల్ లో ప్రధాని మోదీని దాటేశారు. టైమ్ మ్యాగజిన్ నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో ఒక శాతం అధిక ఓట్లను సాధించి భారత్ ప్రధానినే మించిపోయారు. ప్రపంచంలోని వందమంది మోస్ట్ ఎఫెక్టివ్ పర్సన్స్ ను ప్రచురించే టైమ్స్ పత్రిక నిర్వహించిన పోల్ లో ప్రధాని మోదీకంటే ముందంజలో ఉన్నారు. టైమ్స్ మ్యాగజిన్ ప్రతి సంవత్సరం ఆన్ లైన్ పోల్ నిర్వహిస్తుంటుంది. ఇదే నేపథ్యంలో ఈసారి నిర్వహించిన పోల్ లో ప్రభావవంతమైన ప్రముఖులు వందమందిలో ప్రియాంకా చోప్రా భారత ప్రధాని మోదీని మించిపోయారు. దీంతోపాటు డెమొక్రెటిక్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థి బెర్నీ శాండర్స్ కూడ ఈసారి ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ తో పాటు అధ్యక్షుడు బారాక్ ఒబామా, మయన్మార్ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీతో పాటు పాకిస్తాన్ కార్యకర్త మలాలాను కూడ మూడు రెట్ల ఓట్లతో అధిగమించినట్లు టైమ్స్ తెలిపింది. అత్యంత ప్రభావవంతమైన వందమంది వ్యక్తుల జాబితాకోసం మ్యాగజిన్ ఏప్రిల్ 13 బుధవారం రాత్రి ఆన్ లైన్ పోల్ నిర్వహించింది. ఏప్రిల్ 21న దీనికి సంబంధించిన జాబితా వెలువడనుంది. అయితే అమెరికాలో ప్రసిద్ధి చెందిన టీవీ సీరియల్ 'క్యాంటికోగా' లో నటించి తన పాత్రతో మెప్పించిన ప్రియాంకా చోప్రా మోదీకి వచ్చిన 0.7 ఓట్ల కంటే ఒక శాతం అధికంగా 0.8 ఓట్లను పొంది ముందు వరుసలో నిలిచింది. అలాగే 1 శాతం ఓట్లను పొందిన క్లింటన్ కన్నా శాండర్స్ 3.3 శాతం అధిక ఓట్లను సాధించారు. ఇకపోతే శాండర్స్ తర్వాత సౌత్ కొరియన్ బాయ్ బ్యాండ్ బిగ్ బ్యాంగ్ రెండో స్థానంలో నిలవగా అత్యధిక వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి ప్రజల దృష్టిలో ముందు కనిపిస్తున్న ట్రంప్ మాత్రం 0.6 శాతం ఓట్ల ను సాధించి ఆన్ లైన్ పోల్లో పూర్తిగా వెనుకబడ్డారు. -
భారీ ఎర్రచందనం స్వాధీనం