Sarfaraz Ahmad
-
BCCI Awards 2024: రవిశాస్త్రికి బీసీసీఐ ప్రతిష్టాత్మక అవార్డు
రేపు జరుగబోయే బీసీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కనుంది. భారత క్రికెట్కు శాస్త్రి చేసిన సేవలకు గుర్తుగా ఈ అవార్డును అందించనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ఆటగాడిగా, హెడ్ కోచ్గా భారత క్రికెట్ జట్టుకు సేవలందించిన శాస్త్రి ప్రస్తుతం టీవీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. శాస్త్రి హయాంలో (2017-2021) అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ జట్టుగా విరాజిల్లింది. భారత జట్టుకు దూకుడు నేర్పిన కోచ్గా శాస్త్రికి పేరుంది. 61 ఏళ్ల రవిశాస్త్రి 1981-92 మధ్యలో 80 టెస్ట్లు, 150 వన్డేలు ఆడి దాదాపు 7000 పరుగులు చేసి 280 వికెట్లు పడగొట్టాడు. రవిశాస్త్రి తన కెరీర్లో 15సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు చేశాడు. రేపు జరుగబోయే బీసీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముంబైకు చెందిన యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, షమ్స్ ములానీలకు అవార్డులు దక్కనున్నాయి. -
తెలంగాణ: సమీపిస్తున్న ఎన్నికలు.. కీలక పోస్టులకు సీఈసీ నియామకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషన్లో ఖాళీగా ఉన్న రెండు ప్రధాన పోస్టుల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. దీర్ఘకాలిక సెలవులో ఉన్న టీ రవికిరణ్ స్థానంలో డీఎస్ లోకేష్ కుమార్ను అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా, మరో సీనియర్ IAS అధికారి సర్ఫరాజ్ అహ్మద్ను జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా నియమిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ సీఎస్కు బుధవారం లేఖ రాసింది. కాగా, లోకేష్ కుమార్ ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అదే విధంగా తెలంగాణ ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్ బాధ్యతల్లో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారిగా ఐఏఎస్ వికాస్ రాజ్ కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో రాజకీయ కలాహలం కనిపిస్తోంది. దీంతో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు, నోటిఫికేషన్ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల సన్నద్దతపై వారం రోజుల క్రితం కేంద్ర ఎన్నికల ఉన్నతాధికారులు రాష్ట్రంలో పర్యటించి సీఎస్, డీజీపీ, కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ ఏడాది అక్టోబర్లో తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. -
రఫ్ఫాడించిన రొస్సో.. ఐదేసి ఇరగదీసిన ఇహసానుల్లా
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 15) క్వెట్టా గ్లాడియేటర్స్తో జరిగిన మ్యాచ్లో ముల్తాన్ సుల్తాన్స్ రెచ్చిపోయారు. తొలుత గ్లాడియేటర్స్ను 110 పరుగులకే ఆలౌట్ చేసిన సుల్తాన్స్.. ఆ తర్వాత బ్యాటింగ్లోనూ అదే రేంజ్లో రెచ్చిపోయి కేవలం 13.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. సుల్తాన్స్ ఫాస్ట్ బౌలర్ ఇహసానుల్లా ఫైఫర్తో (4-1-12-5) గ్లాడియేటర్స్ను గడగడలాడించగా.. బ్యాటింగ్లో రిలీ రొస్సో మెరుపు హాఫ్సెంచరీతో (42 బంతుల్లో 78 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. A special performance from our young quick Ihsanullah as he takes 5 wickets for 12 runs!#SultanAaGayya #LetsPlaySaeen pic.twitter.com/8HVKfheWsu — Multan Sultans (@MultanSultans) February 15, 2023 ఫలితంగా సుల్తాన్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సీజన్ తొలి మ్యాచ్లో లాహోర్ ఖలందర్స్ చేతిలో భంగపడ్డ సుల్తాన్స్.. ఈ మ్యాచ్లో అన్ని విభాగాల్లో రాణించి బోణీ విజయం దక్కించుకుంది. మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళితే.. .@Rileerr gets to his 5️⃣0️⃣ Nothing can go wrong for @MultanSultans today 👏#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvQG pic.twitter.com/a3lcm44BjR — PakistanSuperLeague (@thePSLt20) February 15, 2023 ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన సుల్తాన్స్.. ఇహసానుల్లా (5/12), అబ్బాస్ అఫ్రిది (2/27), సమీన్ గుల్ (2/20), ఉసామా మిర్ (1/19) చెలరేగడంతో ప్రత్యర్ధిని 18.5 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌట్ చేసింది. గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్లో జేసన్ రాయ్ (27), ఉమర్ అక్మల్ (11), మహ్మద్ నవాజ్ (14), హఫీజ్ (18), మహ్మద్ హస్నైన్ (22) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. Cracking shot! @Rileerr making Multan roar 🎉#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvQG pic.twitter.com/zazLskMwYm — PakistanSuperLeague (@thePSLt20) February 15, 2023 అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి సుల్తాన్స్.. షాన్ మసూద్ (3) వికెట్ కోల్పోయి సునాయాసంగా విజయతీరాలకు చేరింది. వైవిధ్యమైన షాట్లతో రిలీ రొస్సో రెచ్చిపోగా.. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (28 నాటౌట్) నిలకడగా బ్యాటింగ్ చేసి సుల్తాన్స్ను గెలిపించారు. షాన్ మసూద్ వికెట్ నువాన్ తుషారకు దక్కింది. లీగ్లో ఇవాళ (ఫిబ్రవరి 16) కరాచీ కింగ్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ జట్లు తలపడనున్నాయి. Pace like fire! 🔥#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvQG pic.twitter.com/7UFeFx04kz — PakistanSuperLeague (@thePSLt20) February 15, 2023 -
కలెక్టర్ సర్ఫరాజ్పై వేటు
సాక్షి, కరీంనగర్: ఊహించిందే జరిగింది. ‘సాక్షి’ కథనం నిజమైంది. మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్కు ముందే కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను రాష్ట్ర ఎక్సైజ్æ శాఖ డైరెక్టర్గా నియమిస్తూ కరీంనగర్ జిల్లా కలెక్టర్గా ప్రస్తుతం జోగులాంబ–గద్వాల జిల్లాలో బాధ్యతలు నిర్వహిస్తున్న 2013 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన కొండూరు శశాంకకు పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఉత్తర్వులు(జీవో నెంబర్ 3320) జారీ చేశారు. కాగా ఐఏఎస్గా జగిత్యాల సబ్ కలెక్టర్గా తొలుత బాధ్యతలు నిర్వర్తించిన శశాంక ఆ తరువాత సుమారు రెండేళ్లపాటు కరీంనగర్ మునిసిపల్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించి సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. మంత్రి గంగుల తన పంతం నెగ్గించుకోవడంలో సఫలమయ్యారు. వివాదాల మధ్య సర్ఫరాజ్ అహ్మద్ బదిలీ జిల్లాల పునర్విభజన అనంతరం కరీంనగర్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన 2009 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ మూడేళ్లకు పైగా ఒకే చోట కొనసాగారు. మునిసిపల్ ఎన్నికలు ముగిసేంత వరకు ఇతర అధికారుల తరహాలోనే కలెక్టర్ కూడా కొనసాగుతారని భావించారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచే కరీంనగర్కు చెందిన మంత్రి గంగుల కమలాకర్తో కలెక్టర్కు సత్సంబంధాలు కొరవడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన కలెక్టర్ ప్రత్యర్థి పార్టీలకు అనుకూలంగా వ్యవహరించారని గంగుల ఆరోపణ. దీనికి సంబంధించి ప్రభుత్వ పెద్దలకు పలుమార్లు ఫిర్యాదులు కూడా చేశారు. అయినా వరుస ఎన్నికల నేపథ్యంలో బదిలీల ప్రక్రియ ఆగుతూ వచ్చింది. కాగా ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ మొబైల్ ఆడియో టేప్ రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదమైంది. 2018 ఎన్నికల ఫలితాల అనంతరం అప్పటి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్తో జరిపిన సంభాషణపై మంత్రి గంగుల సీరియస్ గా తీసుకున్నారు. తనను ఓడించేందుకు చేసిన కుట్రలు ఫలించకపోవడంతో గెలిచిన ఎమ్మెల్యేను అనర్హుడిగా చేసేందుకు గల అవకాశాలపై బీజేపీ అభ్యర్థితో కలెక్టర్ చర్చించడం ఏంటని మంత్రి సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేశారు. దీంతో సర్ఫరాజ్ అహ్మద్ బదిలీ అనివార్యమైంది. ప్రొటోకాల్ ఉల్లంఘనలపై సైతం ఫిర్యాదు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రైస్తవ కుటుంబాలకు దుస్తుల పంపిణీ, వేడులకు నగదు సహాయం అందించే కార్యక్రమంపై సంఘం పెద్దలతో ఇటీవల కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం జరిగింది. దీనికి మంత్రి గంగుల కమలాకర్ హాజరు కాగా, అధికారులు ఎవరూ సమావేశానికి రాలేదు. అదే సమయంలో గవర్నర్ కార్యక్రమంపై కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. తన చాంబర్ పక్కనే కాన్ఫరెన్స్ హాల్లో తాను పాల్గొన్న సమావేశానికి కలెక్టర్, ఇతర అధికారులు రాకుండా తహసీల్దార్లను పంపించడాన్ని మంత్రి గంగుల తీవ్రంగా పరిగణించారు. దీనిపై ప్రభుత్వానికి సమాచారం అందించడమే గాకుండా, మునిసిపల్ ఎన్నికలకు ముందే కలెక్టర్ను మార్చాలని కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న తరుణంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ను బదిలీ చేసి, కరీంనగర్కు సుపరిచితుడైన శశాంకకు తీసుకురావడం గమనార్హం. -
సర్ఫరాజ్కే నాయకత్వ పగ్గాలు
కరాచీ: పాకిస్తాన్ జట్టుకు తొలిసారి చాంపియన్స్ ట్రోఫీని అందించిన సర్ఫరాజ్ అహ్మద్ నాయకత్వంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నమ్మకముంచింది. ఈ ఏడాది ఇంగ్లండ్లో జరిగే వన్డే వరల్డ్ కప్లో పాల్గొనే పాక్ జట్టుకు సర్ఫరాజ్ కెప్టెన్గా వ్యవహరిస్తాడని పీసీబీ చైర్మన్ ఎహ్సాన్ మణి మంగళవారం ప్రకటించారు. 2017లో ఇంగ్లండ్ గడ్డపైనే పాక్ చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఇటీవల దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసి నాలుగు మ్యాచ్ల సస్పెన్షన్కు గురైన సర్ఫరాజ్ స్వదేశం తిరిగొచ్చాడు. అతని స్థానంలో షోయబ్ మాలిక్ కెప్టెన్గా వ్యవహరించాడు. వరల్డ్ కప్కు కూడా మాలిక్కే అవకాశం దక్కుతుందని వార్తలొచ్చాయి. అయితే తాజా ప్రకటనతో దానికి ముగింపు లభించింది. సర్ఫరాజ్ కెప్టెన్సీలో 35 వన్డేలు ఆడిన పాకిస్తాన్ జట్టు 21 మ్యాచ్లు గెలిచి, 13 మ్యాచ్ల్లో ఓడింది. -
నిన్న ఆమ్రపాలి...నేడు సర్ఫరాజ్