shoots down
-
అమెరికా గగనతలంలో మరో బెలూన్ కలకలం
వాషింగ్టన్: చైనా భారీ నిఘా బెలూన్ను అమెరికా కూల్చేసిన ఘటన మరువకముందే అగ్రరాజ్యంలో మరో గగనతల ఉల్లంఘన ఉదంతం చోటుచేసు కుంది. అలాస్కాలో కారు పరిమాణంలో అత్యంత ఎత్తులో ఎగురుతున్న ఒక వస్తువును కూల్చేశామని వైట్హౌస్ తెలిపింది. ‘పౌర విమానాల రాకపోకలకు కాస్తంత విఘాతం కల్గించేదిగా ఉన్న వస్తువును కూల్చేశాం. శిథిలాలను వెతికే పనిలో ఉన్నాం’ అని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ బ్రిగేడియర్ జనరల్ ప్యాట్ రైడర్ చెప్పారు. ‘ 40వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న వస్తువును 24 గంటలపాటు నిశితంగా పరిశీలించాక అధ్యక్షుడు బైడెన్ ఆదేశాలమేరకు యుద్ధవిమానం కూల్చేసింది. అది గడ్డ కట్టిన అమెరికా సముద్రజలాల్లో పడింది’ అని అమెరికా జాతీయ భద్రతా మండలి కోఆర్డినేటర్ (వ్యూహాత్మక కమ్యూనికేషన్స్) జాన్ కిర్బీ మీడియాతో చెప్పారు. ‘‘ఇటీవల కూల్చేసిన చైనా నిఘా బెలూన్కు స్వయం నియంత్రణ, గమన వ్యవస్థ ఉన్నాయి. సున్నిత సైనిక స్థావరాలపై నిఘా పెట్టింది. కానీ ఈ వస్తువు ఏం చేసిందనేది ఇంకా తెలియదు’’ అని ఆయన అన్నారు. -
పాకిస్తాన్ డ్రోన్ కలకలం : కూల్చివేత
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లోని దేశ సరిహద్దు వెంట పాకిస్తాన్ రహస్య డ్రోన్ను భారత భదత్ర బలగాలు కూల్చి వేసాయి. కథువా జిల్లాలోని హిరానగర్ సెక్టార్లో రాతువా ప్రాంతం ఫార్వర్డ్ పోస్టులో పాకిస్తాన్ గూఢచార డ్రోన్ కదలికలతో సరిహద్దు భద్రతా దళం అప్రమత్తమైంది. 19వ బెటాలియన్కు చెందిన బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ పార్టీ శనివారం తెల్లవారుజామున దీన్ని కూల్చి వేసింది. రాతువా సమీపంలో పాకిస్తాన్ డ్రోన్ ఎగురుతుండగా గుర్తించి, ట్రాక్ చేసిన భద్రతా అధికారులు ఎనిమిది రౌండ్లు కాల్పుల అనంతరం ఆ డ్రోన్ ను విజయవంతంగా నేలమట్టం చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది. -
ఆఖరి క్షణంలో ఆగిన యుద్ధం
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీస్తాయని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న వేళ ఒకడుగు ముందుకు వేసి సమరానికి సై అన్న అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఖరి క్షణంలో వెనక్కి తగ్గారు. ఇరాన్లోని ఎంపిక చేసిన మూడు లక్ష్యాలపై గురువారం రాత్రే దాడి చేయాలని అంతా సిద్ధం చేసినప్పటికీ, దాడి చేస్తే 150 మంది చనిపోతారని తెలియడంతో ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో శుక్రవారం ప్రకటించారు. ఇరాన్ భూభాగంలోకి ప్రవేశించిన అమెరికా నిఘా డ్రోన్ని ఇరాన్కు చెందిన రివల్యూషనరీ గార్డులు కూల్చివేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకోవడం తెలిసిందే. యుద్ధానికి తాము ఎప్పుడూ సిద్ధమేనంటూ ఇరాన్ రివల్యూషనరీ గార్డు కవ్వింపు చర్యలకి దిగేసరికి డ్రోన్ కూల్చేసి ఇరాన్ అతి పెద్ద తప్పు చేసిందంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. భద్రతా అధికారులతో ట్రంప్ భేటీ డ్రోన్ని కూల్చిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే జాతీయ భద్రతా అధికారులతో ట్రంప్ గురువారం రాత్రి సమావేశమయ్యారు. ఇరాన్పై దాడులకు మార్గాలు అన్వేషించారు. ఇరాన్ డ్రోన్ని కూల్చేయడం అంత చెత్త పని మరొకటి లేదని మండిపడ్డారు. యుద్ధం ప్రకటించడానికే సిద్ధమయ్యారు. అయితే కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం ట్రంప్ని వారించారు. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇరాన్పై ఎలాంటి కఠిన చర్యలకు దిగవద్దని ఆయనకు నచ్చ చెప్పారు. విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో, జాతీయ భద్రతా సలహాదారు జాన్ బాల్డన్ ఇరాన్పై కఠినాత్మకంగా వ్యవహరించాలని సూచిస్తే, హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ చైర్మన్ ఆడమ్ స్కిఫ్ మాత్రం ఈ దశలో యుద్ధం మంచిది కాదని వారించారు. చివరకు ఆ దాడి చేస్తే 150 మంది చనిపోతారని చెప్పడంతో, డ్రోన్ను కూల్చేసినందుకు అంత మందిని చంపడం భావ్యం కాదని తాను దాడి ఆలోచనను విరమించుకున్నట్లు ట్రంప్ చెప్పారు. స్పష్టమైన ఆధారాలున్నాయి: ఇరాన్ అమెరికా డ్రోన్ అంతర్జాతీయ గగనతల నిబంధనల్ని అతిక్రమించి మరీ తమ దేశంలోకి ప్రవేశించిందనడానికి కచ్చితమైన సాక్ష్యాధారాలున్నాయని ఇరాన్ పేర్కొంది. ఇరాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. డ్రోన్ శకలాలు ఇరాన్ ప్రాంతంలోని జలాల్లో కనిపించాయని తెలిపింది. ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రి మహమ్మద్ జావేద్ జరీఫ్ మాత్రం తాము యుద్ధం కోరుకోవడం లేదని, తమ గగనతలంలోకి, జలాల్లోకి ఎవరు ప్రవేశించినా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు. -
అమెరికా డ్రోన్ను కూల్చిన ఇరాన్
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తమ భూభాగంలోకి చొచ్చుకువచ్చిన అమెరికాకు చెందిన ఒక నిఘా డ్రోన్ను కూల్చివేసినట్టు ఇరాన్ వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏడాది క్రితం ఇరాన్తో అణు ఒప్పందం వెనక్కి తీసుకున్నప్పట్నుంచి ఇరు దేశాల మ«ధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఏ క్షణమైనా రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ తమ దేశ గగనతలంలోకి ప్రవేశించిన మానవరహిత, ఆయుధరహిత ఆర్క్యూ 4ఏ నిఘా డ్రోన్ను కూల్చేసినట్టు అక్కడ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ దానికి సంబంధించిన ఫొటోలను ఇరాన్ ప్రభుత్వం వెల్లడించలేదు. అమెరికా డ్రోన్ను కూల్చేసిన విషయాన్ని ధ్రువీకరిస్తూనే తాము నిబంధనలు ఉల్లంఘించి ఇరాన్ భూభాగంలోకి చొరబడలేదని హార్మోజ్గాన్ ప్రావిన్స్ వరకు ఆ డ్రోన్ వెళ్లిందని అది అంతర్జాతీయ గగనతలమని అమెరికా సెంట్రల్ కమాండ్ చెబుతోంది. వారం కిందటే అమెరికా డ్రోన్పై ఇరాన్ క్షిపణి దాడులకు దిగిందని అమెరికా మిలటరీ ఆరోపించింది. ఇప్పుడు ఈ డ్రోన్ను కూల్చివేసి ఇరాన్ అగ్రరాజ్యానికి ఘాటైన హెచ్చరికలే చేసింది. ‘‘ఏ దేశమైనా మా ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలి. ఇరాన్ జాతీయ ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా చూసుకోవాలి. అమెరికా మా గగనతలంలోకి ప్రవేశిస్తే ఎందుకు ఊరుకుంటాం. అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయాన్నే తీసుకొని డ్రోన్ని కూల్చివేశాం‘‘ అని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్పొరేషన్ జనరల్ హొస్సెని సలామి వెల్లడించారు. ఇరాన్కి ఎవరితోనూ యుద్ధం చేయాలన్న కోరిక లేదు కానీ, ఏ క్షణంలోనైనా యుద్ధం చెయ్యడానికి తామే సిద్ధమేనని సలామి ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ అణు ఒప్పందాన్ని వెనక్కి తీసుకోడమే కాక ఇరాన్తో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు వద్దంటూ అగ్రరాజ్యం ఇతర దేశాలపై ఒత్తిడి పెంచినప్పట్నుంచి ఇరాన్ కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. డ్రోన్ను కూల్చివేయడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఒక డ్రోన్ను కూల్చివేసి దానిని అందరికీ ప్రదర్శించడంతో అమెరికా అగ్గిమీద గుగ్గిలమైంది. మున్ముందు పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయోనని ప్రపంచ దేశాలు ఆందోళనతో ఉన్నాయి. పెద్ద తప్పిదమే చేశారు: ట్రంప్ డ్రోన్ను కూల్చివేయడం ద్వారా ఇరాన్ పెద్ద తప్పే చేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురువారం అన్నారు. శ్వేతసౌధం ప్రెస్ కార్యదర్శి సారా శాండర్స్ మాట్లాడుతూ ఈ ఘటన గురించి బుధవారం రాత్రి, గురువారం ఉదయం ట్రంప్కు తాము వివరాలు వెల్లడించామని చెప్పారు. అనంతరం ట్రంప్ ట్వీట్ చేస్తూ ‘ఇరాన్ చాలా పెద్ద తప్పే చేసింది’ అని పేర్కొన్నారు. కాగా, ట్రంప్ చేసిన ఈ ట్వీట్ కారణంగా ముడిచమురు ధరలు దాదాపు 6 శాతం వరకు పెరిగాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్లో బ్యారెల్ చమురు ధర 6.3 శాతం పెరిగి 57.13 డాలర్లకు చేరగా, లండన్లోని బ్రెంట్ ఫ్యూచర్స్లో బ్యారెల్ ధర 64.69 డాలర్లకు చేరింది. -
రష్యన్ విమానం కూల్చివేత
-
రష్యన్ విమానం కూల్చివేత
అంకారా: టర్కీ సేనలు మంగళవారం సిరియా సరిహద్దులో ఓ సైనిక విమానాన్ని కూల్చివేశాయి. అది తమ దేశానికి చెందిన ఎస్యు-24 రకం యుద్ధ విమానమని రష్యా ఆ తర్వాత ప్రకటించింది. తొలుత అది ఏ దేశానికి చెందిన విమానమో తెలియరాలేదు. తర్వాత కొద్ది సేపటికి రష్యా.. ఆ విమానం తమదేనని తెలిపింది. యుద్ధ విమానం పైలట్ల పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియలేదని రష్యన్ అధికారిక వార్తాసంస్థ తొలుత తెలిపింది. అయితే, ఇద్దరు పైలట్లూ విమానం కూలిపోవడానికి ముందే పారాచూట్ల సాయంతో దూకేశారని, వాళ్లలో ఒకరిని సిరియన్ తిరుగుబాటుదారులు పట్టుకున్నారని తెలుస్తోంది. విమానం కూల్చివేత విషయాన్ని టర్కీ మీడియా వర్గాలు వెల్లడించాయి. అనుమతి లేకుండా సిరియా సరిహద్దు మీదుగా తుర్కామెన్ పర్వతం సమీపానికి రాగానే ఈ విమానాన్ని కూల్చి వేసినట్లు, ఆ సమయంలో దాని నుంచి ఓ ఫైర్ బాల్ కూడా పర్వతంపై పడినట్లు టర్కీ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ సంఘటనపై రష్యా గుర్రుగా ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే పరిణామాలు తీవ్రస్థాయిలో ఉంటాయని రష్యా హెచ్చరించింది.