shoots himself
-
నగరంలో ఏకైక న్యూరో సర్జన్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య
సోలాపూర్: పట్టణంలోని సుప్రసిద్ధ న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ శిరీష్ వలసంగకర్ (65) శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాత్రి 8:30 గంటల సమయంలో తన నివాసంలో రెండు సార్లు రివాల్వర్తో తల వద్ద కాల్చుకుని మృతి చెందారు. ఆ సమయంలో కూతురు ఉమ ఇంట్లోనే ఉన్నారు. తుపాకీ శబ్దం విన్న కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వెంటనే అక్కడకు వచ్చి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న డాక్టర్ శిరీష్ను రామ్వాడి ప్రాంతంలోని ఆయన సొంత ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన కుమారుడు డా.అశ్విన్, కోడలు డా. సోనాలి, ఇతర డాక్టర్లు ఆయనను కాపాడేందుకు రెండు గంటలపాటు తీవరంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు రాత్రి 10:45 నిమిషాలకు ఆయన మరణించినట్లు వారు ధృవీకరించారు. డా. శిరీష్ మరణంపై పలువురు ప్రముఖులు, వైద్య నిపుణులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తీవ్ర సంతాపం వ్యక్తమైంది.శనివారం సాయంత్రం మోదీ స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. డాక్టర్ శిరీష్ అంతిమ సంస్కారాలకు సామాజిక, రాజకీయ, వైద్య రంగ ప్రముఖులు , ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. గత 35 సంవత్సరాలుగా పట్టణంలో ఏకైక న్యూరో సర్జన్ గా, బ్రెయిన్ డిజాస్టర్ డాక్టర్ గా ప్రసిద్ధి చెందిన శిరీష్ వలసంగకర్ కుటుంబం మొత్తం వైద్య నిపుణులే. డాక్టర్ శిరీష్ నాలుగు భాషల్లో( మరాఠీ, కన్నడ, హిందీ, ఇంగ్లీషు) ప్రావీణ్యుడు. ఆయన ఇటీవలే వరల్డ్ మెడికల్ టూర్ కోసం డబల్ ఇంజన్ డైమండ్ ప్లేన్ కూడా కొనుగోలు చేశారు. కానీ ఆ కోరిక నెరవేరకుండానే జీవితాన్ని చేతులారా అంతం చేసుకున్నారు. ఖచ్చితమైన కారణంపై స్పష్టత లేనప్పటికీ, గత కొన్ని రోజులుగా ఆయన ఒత్తిడిలో ఉన్నారని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. సదర్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పలువురు సంతాపండాక్టర్ శిరీష్ పద్మాకర్ వల్సంగ్కర్ అత్యంత గౌరవనీయమైన న్యూరాలజిస్ట్ మరియు మహారాష్ట్రలోని సోలాపూర్లోని SP ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్ (వల్సంగ్కర్ హాస్పిటల్) వ్యవస్థాపకుడు. ఈ ప్రాంతంలో న్యూరాలజీ రంగంలో మార్గదర్శకుడిగా పేరుగాంచారు. మెదడుకు వివిధ , అధునాతన మార్గాల్లో చికిత్స చేయడానికి ఒక అత్యాధునిక ఆసుపత్రిని ప్రారంభించిన ఘనత ఆయన సొంతం. ఆందుకే సోలాపూర్లో న్యూరాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు చేసిన డాక్టర్ శిరీష్ వల్సంగ్కర్ అని పిలుస్తారు. ఈ సంఘటనతో యావత్ వైద్యలోకం షాక్కు గురైంది. ఇది చాలా దిగ్భ్రాంతికరమైన పరిణామంమని సోలాపూర్కు చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ సచిన్ బల్దావా డా. శిరీష్ మరణంపై సంతాపం వెలిబుచ్చారు. చదవండి: అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి -
రివాల్వర్తో కాల్చుకుని ఎస్సై బలవన్మరణం
సాక్షి, న్యూఢిల్లీ: సర్వీస్ రివాల్వర్తో సబ్ ఇన్స్పెక్టర్ తనను తాను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తుపాకీ తూటా తగిలి ఆయన అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. మృతుడు పాండవ్నగర్ పోలీస్స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్. స్టేషన్ ఆవరణలోనే ఆయన అఘాయిత్యానికి పాల్పడడంతో ఢిల్లీ ఉలిక్కిపడింది. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. పాండవ్నగర్ పోలీస్స్టేషన్కు 2017లో ఎస్సైగా రాహూల్ సింగ్ (31) బాధ్యతలు చేపడుతున్నారు. నాలుగేళ్లుగా ఒకే స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా శుక్రవారం స్టేషన్ ఆవరణలోనే తన సర్వీస్ రివాల్వర్ను తీసుకుని రాహుల్ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్టేషన్లో రక్తపు మడుగుల్లో ఆయన పడి ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న అతడి భార్య స్టేషన్కు వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించింది. అయితే తన భర్త ఆత్మహత్యకు కారణం పని ఒత్తిడి అని ఆరోపించింది. స్టేషన్ అధికారి (సీఐ) ఒత్తిడితో తన భర్త ఆందోళనకు గురవుతున్నాడని ఆమె తెలిపింది. చదవండి: కారులోనే ముగ్గురు సజీవదహనం చదవండి: ముగ్గురి ఊపిరి తీసిన మ్యాన్హోల్ -
పోలీస్ స్టేషన్ లోనే ప్రాణాలు తీసుకున్న సీఐ
బెంగళూరు: కర్ణాటకలో మరో పోలీసు అధికారి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెంగళూరుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలార్ పోలీస్ స్టేషన్ లో రాఘవేంద్ర(44) అనే సర్కిల్ ఇన్స్ పెక్టర్ తన సర్వీసు రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్నానేది వెల్లడి కాలేదు. ఆయనకు కూతురు ఉంది. అవినీతి ఆరోపణలతో 2012లో ఆయనపై లోకాయుక్త నిఘా పెట్టింది. కర్ణాటకలో పోలీసు అధికారుల ఆత్మహత్యలు చర్చనీయాంశంగా మారాయి. మంత్రి కేజే జార్జ్తో పాటు ఆయన కుమారుడు రాణా జార్జ్ వేధింపులు తట్టుకోలేక గత జూలైలో మంగళూరు డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ ఎంకే గణపతి (51) ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. దీనికి మూడు రోజుల ముందే డీఎస్పీ కాలాప్ప హందీబాగ్ ఆత్మహత్య చేసుకున్నారు. -
ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా
న్యూయార్క్: ఫేస్బుక్, సెల్ఫీ.. జీవితంలో ఓ భాగమయ్యాయి. ఇవి ఎంత అవసరమో అంతే వరకే ఉపయోగించాలి. వెర్రి వ్యామోహంతో మితిమీరి ప్రవర్తిస్తే అనర్థాలకు దారితీస్తుంది. ఫేస్బుక్లో స్నేహితులను ఆకట్టుకోవడం కోసం ఓ వ్యక్తి దుస్సాహసానికి ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మెక్సికోకు చెందిన ఆస్కార్ ఒటిరో అనే యువ వెటర్నరీ డాక్డర్ బుల్లెట్లు నింపిన తుపాకీ దగ్గరగా పెట్టుకుని ఫొటో దిగాలని సరదాపడ్డాడు. తుపాకీని తలకు దగ్గర పెట్టుకుని స్మార్ట్ఫోన్తో సెల్ఫీ (తమను తామే ఫోటొ) తీసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో తలలోకి బుల్లెట్ తీసుకెళ్లింది. అతణ్ని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మరణించాడు. ఆస్కార్కు అందమైన అమ్మాయిలను కొగిలించుకోవడం, మోటార్ బైక్లపై విన్యాసాలు చేయడం, వేగంగా వెళ్తున్ కార్ల ముందు ఫొటోలు దిగడం సరదా. ఆ ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేసేవాడు. ఈ సరదానే అతని ప్రాణం తీసింది. -
కానిస్టేబుల్ సూసైడ్ అటెంప్ట్