shuttle court
-
అందుబాటులోకి ఆట.! ఇండోర్ షటిల్ కోర్టు రెడీ!
జీడిమెట్ల: సుభాష్నగర్ డివిజన్ ఎస్.ఆర్.నాయక్నగర్లో ఇండోర్ షటిల్ కోర్టును జీహెచ్ఎంసీ నిర్మించడంపై ఎస్.ఆర్.నాయక్నగర్, అపురూపాకాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో షటిల్ క్రీడాకారులు ఇక్కడకు వచ్చి షటిల్ ఆడుకుంటున్నారు. గతంలో కాలనీవాసులు షటిల్ ఆడాలంటే బాచుపల్లి, చింతల్, సుచిత్ర వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు కాలనీలో సదుపాయం కలగడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్రీడాకారులకు మంచినీటితో పాటు టాయిలెట్స్ సదుపాయం కలుగజేస్తే ఇంకా సంతోషంగా ఉంటుందని కాలనీవాసులు అంటున్నారు. కాలనీ స్థలంలో రూ.3 కోట్లతో నిర్మాణం నవంబర్ 2022లో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద, కార్పొరేటర్ హేమలతా సురే‹Ùరెడ్డి పనులకు శంకుస్థాపన చేశారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్ సూరిబాబు కాలనీ అసోషియేషన్, కాలనీ ప్రజల ప్రోత్సాహంతో 23 నెలల్లో ఇండోర్ కోర్టు పనులను పూర్తి చేశారు. ఎకరం స్థలంలో ఇండోర్ స్టేడియం ఇండోర్ కోర్టు లోపల ఒకేసారి 12మంది క్రీడాకారలు ఆడుకునేల మ్యాటింగ్తో మూడు సింథటిక్ కోర్టులను ఏర్పాటు చేశారు. క్రీడాకారుల కోసం కోర్టు లోపల ఎల్ఈడీ లైటింగ్లో పాటు టేబుల్ ఫ్యాన్లను అమర్చారు. కోర్టుల చుట్టూ క్రీడాకారులు కురీ్చల్లో కూర్చునేలా కొంత మేరకు స్థలాన్ని వదిలారు. 7వేల చదరపు ఆడుగుల్లో మూడు సింథటిక్ షటిల్ కోర్టులు నిర్మించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే బుకింగ్స్, క్రీడాకారులు ప్రతి నెల కొంత చెల్లించేలా జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి ఒక సిస్టం తీసుకువస్తామని కాంట్రాక్టర్ అన్నారు. టోర్నమెంట్లు నిర్వహించేందుకు సిద్ధం కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి కేటాయించిన షటిల్ ఇండోర్ కోర్టు మా కాలనీలో నిర్మించడం అనందంగా ఉంది. మా కాలనీ, అపురూపాకాలనీలో షటిల్ ఆడే క్రీడాకారులు చాలా మంది ఉన్నారు. యువ క్రీడాకారులు ఇక్కడ సాధన చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడాలనేది మా అకాంక్ష. మా ఇరు కాలనీల తరపున మేము సంవత్సరంలో రెండుసార్లు ఇక్కడ టోర్నమెంట్లు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. – టీటీకే శ్రీనివాస్ (ఎస్ఆర్.నాయక్నగర్ అధ్యక్షుడు) సంతోషంగా ఉంది ఫిట్గా ఉండాలంటే ఏదో ఒక క్రీడలో మనం పట్టు సాధించాలి. అలా అని రోడ్లపైన ఆడలేం. మాకు దగ్గరలో మా కాలనీలో ఇండోర్ షటిల్ కోర్టులు రావడం చాలా సంతోషంగా ఉంది. మేము తప్పకుండా ప్రతిరోజు ఇక్కడ షటిల్ ఆడాలని నిర్ణయించుకున్నాం. -సుస్మిత, అపురూపాకాలనీ మేము ఊహించలేదు మాకు షటిల్ ఆటపై మక్కువతో ఇంతకు ముందు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఆడేవాళ్లం. ఇప్పుడు మా ఇళ్ల మధ్యలోనే షటిల్కోర్టును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఇది మేము ఊహించలేనిది. – రాఘవయ్య, కాలనీవాసిజీహెచ్ఎంసీకి కృతజ్ఞతలు నాకు షటిల్ ఆడాలనే కోరిక ఉండేది కాని మాకు దగ్గలో ఎక్కడ ఇండోర్ స్టేడియం లేదు. మా కాలనీలో ఇండోర్ కోర్టు ఏర్పాటు కావడం మాకు వరం. మూడ్రోజులుగా ఇక్కడకు వచ్చి షటిల్ ఆడుతున్నాం. మా కాలనీలో షటిల్ కోర్టు నిర్మించిన జీహెచ్ఎంసీ వారికి కృతజ్ఞతలు. – దివ్య, అపురూపాకాలనీ -
షెటిల్ ఆడుతూ.. గుండెపోటుతో చనిపోయిన వ్యక్తి
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని జగిత్యాల క్లబ్లో శుక్రవారం ఉదయం షటిల్ ఆడుతూ బూస వెంకటరాజగంగారాం(53) గుండెపోటుతో మృతి చెందాడు. స్థానిక శ్రీరాంనగర్ ప్రాంతానికి చెందిన వెంకటరాజగంగారాం తన స్నేహితులతో కలిసి క్లబ్లో షటిల్ ఆడుతున్నాడు. అకస్మాత్తుగా కిందపడిపోవడంతో స్నేహితులు వెంటనే సీపీఆర్ చేశారు. ఆ తర్వాత స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఆయన మృతికి క్లబ్ కార్యదర్శి ముస్కు నారాయణరెడ్డి, సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
షటిల్ ఆడుతూ జారిపడ్డ హోంమంత్రి
-
అయ్యో.. మంత్రి అలా పడిపోయారేంటి?
సాక్షి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కుళాయి చెరువు వద్ద వివేకానంద పార్కును శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం కాకినాడ నగర ఎమ్మెల్యే కొండబాబుతో కలిసి సరదా కలిసి షటిల్ ఆడటానికి సిద్ధమయ్యారు. కొండబాబు కొట్టిన కాక్ను అందుకునే క్రమంలో కాలు జారి షటిల్ కోర్టులో పడిపోయారు. సెక్యురిటీ సిబ్బంది, అక్కడున్నవారంతా కలిసి ఆయనను వెంటనే పైకి లేవదీశారు. మంత్రికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత ఆయన అందరితో సరదాగా మాట్లాడారు. -
వీక్షణం
శాన్ఫ్రాన్సిస్కో (అమెరికా)లోని ఓ దీవిలో అల్కట్రాజ్ అనే జైలు ఉంది. దీనిలో ఖైదీలు ఒక్కొక్కరికీ ఒక్కో ఏసీ గది, మంచి మంచం, మెత్తటి పరుపు, టీవీ ఉంటాయి. స్నానానికి వేణ్నీళ్లు ఇస్తారు. ఖరీదైన భోజనం పెడతారు. లైబ్రరీ, షటిల్ కోర్టు, చిన్న థియేటర్ కూడా ఉంటాయి. మంచి వాతావరణంలో ఉంచితే నేరస్థులు మంచిగా మారతారని ఈ ఏర్పాట్లు చేశారట! రాజ్పుట్లు యుద్ధానికి వెళ్లేటప్పుడు తమ గుర్రాల మూతులకు నకిలీ ఏనుగు తొండాలను తగిలించేవారట. అప్పుడవి పిల్ల ఏనుగుల్లా కనిపిస్తాయి కాబట్టి శత్రువుల ఏనుగులు తమపై దాడి చేయకుండా ఉంటాయని అలా చేసేవారట! కనిపెట్టిన 38 సంవత్సరాలకు గానీ రేడియో 50 మిలియన్ల మందికి చేరువ కాలేకపోయింది. ఫోన్ అయితే 20 ఏళ్లకు, టీవీ 13 ఏళ్లకు, ఫేస్బుక్ 3.6 ఏళ్లకు చేరవయ్యింది. అయితే గూగుల్ ప్లస్ మాత్రం కేవలం 88 రోజులకే యాభై మిలియన్ల మందికి చేరువైపోయింది! 1993లో ఓ వ్యక్తి మిసిసిపీ నదికి, తమ ఊరికి మధ్యన ఉన్న కట్టను పడగొట్టేశాడు. అది కూడా తన భార్య ఆఫీసు నుంచి త్వరగా వచ్చేస్తుందన్న స్వార్థంతో! దానివల్ల ఆ నదికి వరదలు వచ్చినప్పుడు పద్నాలుగు వేల ఎకరాలు నీట మునిగి పోయాయి. ఆగ్రహించిన న్యాయస్థానం అతగాడికి జీవిత ఖైదును విధించింది! సెల్ఫోన్లు వచ్చాక పబ్లిక్ ఫోన్లను వాడటం మానేశారంతా. ఫలితంగా ఫోన్ బూతులు వెలవెలబోతుండటంతో పలు దేశాలు వాటిని తొలగించేశాయి. అయితే ప్రతి విషయాన్నీ క్రియేటివ్గా ఆలోచించే జపాన్వారు మాత్రం... వాటిని ఇలా అక్వేరియమ్లుగా మార్చేస్తున్నారు. వాళ్ల ఈ ఐడియా అక్కడివారికే కాదు, అన్ని దేశాల వారికీ భలేగా నచ్చింది!