sivangi
-
మహిళలకు సందేశమిచ్చిన ‘శివంగి ’
ఆనంది ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయిగా... చాలా పద్ధతిగా కనిపించే సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అలాంటి అమ్మాయి ఒక్కసారిగా ‘శివంగి’ సినిమాలో బోల్డ్ డైలాగ్తో రెచ్చిపోయింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘వంగే వాళ్లు ఉంటే... మింగే వాళ్లు ఉంటారు... నేను వంగే రకం కాదు... మింగే రకం...’ అనే డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ చిత్రానికి దర్శకత్వం దేవరాజ్ భరణి ధరన్ వహించారు. ఫస్ట్ కాపీ మూవీస్ పతాకంపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మించారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించారు. నేడు(మార్చి 7) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..సత్యభామ(ఆనంది)ఓ సాధారణ గృహిణి.ఓ వైపు భర్త అనారోగ్య పరిస్థితులు... మరో వైపు ఆర్థిక సమస్యలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దానికి తోడు తన అత్త నుంచి ఎదురయ్యే వేధింపులు తనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తాయి. మరోవైపు తల్లిదండ్రులు అనుకోకుండా వరదల్లో చిక్కుకు పోవడంతో మరింత సతమతమవుతుంది. చివరకు పోలీసులను ఆశ్రయిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఎవరైనా హత్యకు గానీ, ఆత్మహత్యకు గానీ గురయ్యారా? సత్యభామ తనకు ఎదురైన హార్డిల్స్ ను ఎలా అధిగమించిందనేది తెలియాలంటే మూవీని ఓసారి చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఓ సాధారణ మహిళ తనకున్న సమస్యలను ఛేదించే క్రమంలో ఎదురైన ఆటంకాలను ఎలా ఎదుర్కొంది అనేదే ఈ సినిమా కథ. దేవరాజ్ భరణి ధరన్ రచన ఇంకా దర్శకత్వంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నాడు అనేది మీ చిత్రం చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. స్క్రీన్ మీద ఎక్కువగా ఒకటే వ్యక్తి కనిపిస్తున్నప్పుడు ఆడియన్స్ సాధారణంగా బోర్ ఫీల్ అవుతారు. కానీ ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఎక్కడా కూడా బోర్ ఫీల్ అయ్యే అవసరం రాదు. ఎంతో ఇంటెన్సిఫైడ్ గా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. అసలు జరిగేది నిజమా కాదా అనే ఒక డౌట్ తో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తిగా చూసే విధంగా స్క్రీన్ ప్లే వచ్చేలా రాసుకున్నాడు దర్శకుడు.సింగిల్ లోకేషన్ లో... క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. సినిమా మొత్తం సింగిల్ లొకేషన్ లో చిత్రీకరణ చేసినప్పుడు ఆర్ట్ వర్క్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే బ్యాగ్రౌండ్ యాంబియన్స్ ను సెట్ చేసుకున్నాడు కళాదర్శకుడు రఘు కులకర్ణి. అలాగే ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు సంగీత దర్శకుడు. చిత్రంలో ఎక్కడ కూడా వల్గారిటీ లేదా డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా, చాలా డీసెంట్ గా కుటుంబ సమేతంగా వెళ్లి చూసే విధంగా సినిమాను తెరకెక్కించారు. ఒక మహిళకు అనేక సమస్యలు ఒకే సమయంలో వచ్చినప్పటికీ ఆమె ఆ సమస్యలను మొక్కవోని ధైర్యంతో... ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఎలా నిలబడ్డారు అనేది నేటి మహిళలకు మెసేజ్ ఇచ్చేలా సినిమా వుంది. ప్రపంచ మహిళాదినోత్సవం సందర్భంగా మహిళా ప్రేక్షకులకు మంచి ఇన్స్ పిరేషన్ ఇచ్చే సినిమా ‘శివంగి’. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కోనే అనేక సమస్యలును ఇందులో చూపించి... వాటికి పరిష్కార మార్గాలు చూపించారు.ఎవరెలా చేశారంటే..సత్యభామగా చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆనంది నటన మనం గతంలోనే ఎన్నో చిత్రాలలో చూశాం. అదేవిధంగా ఈ చిత్రంలో కూడా తనదైన మార్క్ సృష్టిస్తూ ఆనంది తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. చిత్రం అంతా తానే కనిపిస్తూ ప్రేక్షకులు ఎక్కడా బోర్ కొట్టకుండా తనదైన శైలిలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఎక్కడా గ్లామర్ షో లేకుండా... కేవలం రెండు చీరలలో మాత్రమే సినిమా అంతా కనిపిస్తూ... తన పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పోలీస్ రోల్ లో గతంలో ఎన్నో చిత్రాలలో నటించినప్పటికీ, ఈ చిత్రంలో తెలంగాణ యాసతో వరలక్ష్మి శరత్ కుమార్ తనలో మరో యాంగిల్ యాక్టింగ్ స్టైల్ ఉందని నిరూపించుకున్నారు. అదేవిధంగా చిత్రంలో నటించిన జాన్ విజయ్, కోయా కిషోర్ స్క్రీన్ టైమ్ తక్కువగా ఉన్నప్పటికీ తమ మార్క్ కనిపించేలా నటించి మెప్పించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. -
సవాల్ చేయకు...
‘అందరి జీవితంలో గుడ్ డే, బ్యాడ్ డే అని ఒక రోజు ఉంటుంది. కానీ నా జీవితంలో రెండూ ఒకే రోజు జరిగాయి’ అన్న డైలాగ్స్తో మొదలవుతుంది ‘శివంగి’ సినిమా ట్రైలర్. ఆనంది, వరలక్ష్మీ శరత్కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇది. దేవరాజ్ భరణీధరన్ దర్శకత్వంలో నరేశ్బాబు. పి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. శనివారం ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు. ‘నువ్వు ఒకడ్ని ప్రేమించి ఇంకొకడిని పెళ్లి చేసుకున్నావ్.., ప్రేమించినవాడి కోసం లైఫ్ అంతా వెయిట్ చేయడానికి నేను రెడీ, ఇసుమంటి అత్తల–కోడళ్లప్రాబ్లమ్ ప్రతి ఇంట్లో ఆల్ ఓవర్ వరల్డ్కి ప్రాబ్లమ్.., ఇది నాకు, మా అత్తమ్మకి, మేనేజర్ కిరణ్గాడికి జరుగుతున్న వార్... దీంట్లో మేం గెలుస్తాం, సత్యభామ రా... సవాల్ చేయకు... చంపేస్తా’ అన్న డైలాగ్స్ ‘శివంగి’ సినిమా ట్రైలర్లో ఉన్నాయి. -
దర్శకుడిగా మారిన ప్రముఖ ఫోటోగ్రాఫర్
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ భరణి కే ధరన్ దర్శకుడిగా మారాడు. 40పైగా సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా పని చేసిన ఆయన ‘సివంగి’కోసం మెగా ఫోన్ పట్టాడు. ఈ చిత్రంలో ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్, జాన్ విజయ్ కీలక పాత్రలు పోషించారు. ఫిమేల్ సెంట్రిక్ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ హంగులతో పాటు కుటుంబం విలువలకు ప్రాధాన్యతనిచ్చే అంశాలు ఉంటాయని మేకర్స్ తెలిపారు. ఓ మహిళా తన జీవితం లో ఎదురైన అనూహ్యమైన పరిస్థితులకు ఎలా ఎదురు నిలిచింది అన్నది కథాంశం. డొమెస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు భరణి తెలియజేశారు. -
తెలుగు ప్రేక్షకులు నిజాయతీగా ఉంటారు
ధ్రువ కరుణాకర్, శివంగి, సోనియా ముఖ్యతారలుగా తెరకెక్కిన చిత్రం ‘అశ్వమేథం’. నితిన్ .జి దర్శకత్వంలో ఐశ్వర్యా యాదవ్, ప్రియా నాయర్ నిర్మించారు. చరణ్ అర్జున్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ‘గజానన’ అనే పాటను నిర్మాత ఐశ్వర్య యాదవ్ రిలీజ్ చేశారు. నితిన్ మాట్లాడుతూ– ‘‘గజానన’ పాటను తెరపై చూస్తున్నప్పుడు మేజికల్ మూమెంట్లాగా అనిపించింది. తెలుగు ప్రజలు టెక్నికల్గా ముందంజలో ఉన్నారు. నిజాయతీగా ఉంటారు. సినిమా బావుంటే ఆదరిస్తారు. మా సినిమాని కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాం’’ అన్నారు. చరణ్ అర్జున్ మాట్లాడుతూ– ‘‘చిన్ని చరణ్ పేరుతో చాలా సినిమాలకు సంగీతం అందించా. ఇప్పుడు చరణ్ అర్జున్ అని పేరు మార్చుకున్నా. ఈ చిత్రంలోని ‘గజానన’ పాటతో రీ లాంచ్ కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘తెలుగులో హీరోగా లాంచ్ కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు ధ్రువ కరుణాకర్. ఐశ్వర్య యాదవ్, ప్రియా నాయర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: నగేష్ పూజారి, లైన్ ప్రొడ్యూసర్: సైపు మురళి. -
సివంగి వేటకు బలైంది!
మాటు వేసిన మృత్యువు.. తమ మానాన తాము చెట్ల ఆకులను తింటున్న పిల్ల జిరాఫీలు.. వాటికి రక్షణగా తల్లి జిరాఫీ.. మృత్యువు తమ ముంగిట్లోనే ఉందన్న విషయాన్ని అవి గమనించలేదు.. అంతే.. మాటు వేసిన మృత్యువు ఒక్కసారిగా విరుచుకుపడింది. పిల్ల జిరాఫీని బలిగొంది. ఓ సివంగి జిరాఫీని వేటాడిన ఈ దృశ్యాన్ని దక్షిణాఫ్రికాకు చెందిన ఫొటోగ్రాఫర్ అంజా క్రూగర్ క్లిక్మనిపించారు. అనుకోకుండా తన కెమెరాకు ఈ చిత్రం చిక్కిందని.. చాలా అరుదుగా ఇలాంటి ఫొటోలు తీయగలుగుతామని అంజా తెలిపారు. ‘అప్పటివరకూ ఎలాంటి అలజడి లేదు. జంతువులంతా ప్రశాంతంగా ఉన్నాయి. అక్కడ ఓ సివంగి పొదల చాటున మాటువేసి ఉందన్న విషయాన్ని మేము కూడా గమనించలేదు. ఆ జిరాఫీలు ఆహారం కోసం అక్కడికి వెళ్లాయి. సివంగికి ఆహారమైపోయాయి. అరుదైన చిత్రమైనా.. చాలా బాధాకరమైనది’ అని అంజా అన్నారు. దక్షిణాఫ్రికాలోని క్రూగర్ జాతీయ పార్కులో ఈ సన్నివేశం చోటుచేసుకుంది.