తెలుగు ప్రేక్షకులు నిజాయతీగా ఉంటారు | ashwamedam movie song release | Sakshi

తెలుగు ప్రేక్షకులు నిజాయతీగా ఉంటారు

Sep 7 2018 4:29 AM | Updated on Oct 22 2018 9:16 PM

ashwamedam movie song release - Sakshi

చరణ్‌ అర్జున్, ఐశ్వర్య యాదవ్, ధ్రువ కరుణాకర్, శివంగి, ప్రియా నాయర్, నితిన్‌.జి

ధ్రువ కరుణాకర్, శివంగి, సోనియా ముఖ్యతారలుగా తెరకెక్కిన చిత్రం ‘అశ్వమేథం’. నితిన్‌ .జి దర్శకత్వంలో ఐశ్వర్యా యాదవ్, ప్రియా నాయర్‌ నిర్మించారు. చరణ్‌ అర్జున్‌ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ‘గజానన’ అనే పాటను నిర్మాత ఐశ్వర్య యాదవ్‌  రిలీజ్‌ చేశారు. నితిన్‌ మాట్లాడుతూ– ‘‘గజానన’ పాటను తెరపై చూస్తున్నప్పుడు మేజికల్‌ మూమెంట్‌లాగా అనిపించింది. తెలుగు ప్రజలు టెక్నికల్‌గా ముందంజలో ఉన్నారు. నిజాయతీగా ఉంటారు.

సినిమా బావుంటే ఆదరిస్తారు. మా సినిమాని కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాం’’ అన్నారు. చరణ్‌ అర్జున్‌ మాట్లాడుతూ– ‘‘చిన్ని చరణ్‌ పేరుతో చాలా సినిమాలకు సంగీతం అందించా. ఇప్పుడు చరణ్‌ అర్జున్‌ అని పేరు మార్చుకున్నా. ఈ చిత్రంలోని ‘గజానన’ పాటతో రీ లాంచ్‌ కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘తెలుగులో హీరోగా లాంచ్‌ కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు ధ్రువ కరుణాకర్‌. ఐశ్వర్య యాదవ్, ప్రియా నాయర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: నగేష్‌ పూజారి, లైన్‌ ప్రొడ్యూసర్‌: సైపు మురళి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement