Dhruva
-
సినిమాలు మన సంస్కృతిలో భాగమే – ఎంపీ రఘునందన్ రావు
‘‘ఎవరు ఎంత బిజీగా ఉన్నా సినిమాలు చూడటం అనేది మన సంస్కృతిలో ఓ భాగమే. కరోనా తర్వాత అందరూ ఓటీటీకి అలవాటు పడ్డారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్నాయి. చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. ‘కళింగ’ టీజర్, ట్రైలర్ బాగున్నాయి. ఈ సినిమా భారీ విజయం సాధించి, నిర్మాతలకు మంచి లాభాలు తీసుకురావాలి’’ అని మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు అన్నారు. ధృవ వాయు హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కళింగ’. ప్రగ్యా నయన్ కథానాయిక. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమా రేపు(శుక్రవారం) రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎం.రఘునందన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ధృవ వాయు మాట్లాడుతూ–‘‘కళింగ’ టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది ‘కాంతార, విరూ΄ాక్ష, మంగళవారం’ సినిమాల్లా ఉంటుందా? అని అడుగుతున్నారు. కానీ సరికొత్త కాన్సెప్ట్తో మా సినిమా రూ΄÷ందింది’’ అన్నారు. ‘‘కళింగ’ అద్భుతంగా వచ్చింది’’ అని దీప్తి కొండవీటి పేర్కొన్నారు. ‘‘మా చిత్రాన్ని అందరూ చూసి, ఆదరించాలి’’ అని పృథ్వీ యాదవ్ కోరారు. నటీనటులు ప్రగ్యా నయన్, ప్రీతి సుందర్, తిరువీర్, సంజయ్ మాట్లాడారు. -
KGF రికార్డును బద్దలు కొడతా అంటున్నధృవ సర్జా..
-
ఇండో–పసిఫిక్ ప్రపంచ మథనం
ఈ నెల మనం వరుసగా కొన్ని ప్రపంచస్థాయి సదస్సులను చూడబోతున్నాం. జీ7; దక్షిణ పసిఫిక్ దేశాలతో భారత్, అమెరికా సమావేశాలు వంటివి వీటిలో ముఖ్యమైనవి. ఈ క్రమంలో కొత్త పొత్తులు, భౌగోళిక రాజకీయ పోటీ, ప్రపంచ సమస్యలను పరిష్కరించడం కోసం పథకాల వంటివి చోటు చేసుకోనున్నాయి. జీ7 సభ్యదేశాలన్నింటితో సహకారం పెరుగుతున్న సమయంలో, 2019 నుంచి అతిథిగా హాజరవుతున్న భారత్... తాజాగా జీ7 దేశాల సదస్సులో పాల్గొననుంది. క్వాడ్లో అమెరికా, జపాన్ లతో; ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ (టీటీసీ) ద్వారా యూరోపియన్ యూనియన్ తో; బ్రిటన్, కెనడాలతో భారత్ ముందస్తు వాణిజ్య చర్చలు జరుపుతోంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భారత్ అంత ర్జాతీయ కార్యకలాపాలు, విస్తృతార్థంలో అంత ర్జాతీయ వ్యవస్థ మారుతున్న స్వభావాన్ని పట్టి చూపే పలు నాయకుల సదస్సులకు ఈ నెల సాక్షీభూతం కానుంది. మొత్తంగా అవి కొంత కాలంగా వ్యక్తమవుతున్న కొన్ని ధోరణుల కలయికను సూచిస్తాయి. వాణిజ్య, ఆర్థిక పరస్పర ఆధారిత విధానాలు, చైనా అంతర్జాతీయ పాత్ర, భారత్ అంతర్జాతీయ భాగస్వామ్యాల సాపేక్ష ప్రాధాన్యత, ప్రపంచ ప్రధాన రాజకీయ లోపాలు వంటివన్నీ నిర్మాణాత్మక మార్పులకు లోనయ్యాయి. అయితే, ఈ పరిణామాలు నిర్దిష్ట వ్యాఖ్యాతలతో పొసగడం లేదు. అవేమిటంటే, తప్పుడు సమానత్వా లకు అతుక్కు పోతున్న భారతీయులు. న్యూఢిల్లీతో సంబంధాలను క్రమం తప్పకుండా చిన్నచూపు చూస్తున్న అమెరికన్లు, బ్రస్సెల్స్,సింగపూర్, న్యూయార్క్ వంటి ప్రాంతాల్లోని వ్యక్తులు లేదా సంస్థలు గత ఆర్థిక, రాజకీయ క్రమాన్ని తిరిగి పొందాలని కోరుకోవడం వంటివి. ఈ వారం హిరోషిమాలో జరగనున్న జి7 దేశాల సమావేశంలో, ప్రపంచంలోనే అతిపెద్ద అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలకు చెందిన నాయకులు సమావేశం కానున్నారు. 1970ల నుంచి వీరు వార్షిక ప్రాతిపదికన సమావేశమవుతూ వస్తున్నారు. జి7 అజెండాలో, నేటికీ కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం ప్రధానాంశంగా ఉంటుంది, ఈ గ్రూప్ దేశాలు రష్యాపై ఆంక్షలతోపాటు ఉక్రెయిన్ ప్రభుత్వం వెనుక నిలబడటం తెలిసిందే. అయితే అమెరికా, కెనడాలను మినహాయిస్తే తక్కిన దేశాలు సాపేక్ష ఆర్థిక పతనం దశలో ఉంటున్నాయి. అమెరికా యేతర జి–7 సభ్యదేశాల సామూహిక స్థూల దేశీయోత్పత్తి 1992లో ఉన్న 52 శాతం నుంచి నేటికి 23 శాతానికి పడిపోయింది. ఒక ఉమ్మడి శక్తిగా, జీ7 ఐక్యత ఈరోజు మరింత విలువైనదైనా, వాటి బలం తక్కువగా ఉంటోంది. జీ7 సభ్యదేశాలన్నింటితో సహకారం పెరుగుతున్న సమయంలో, 2019 నుంచి అతిథిగా హాజరవుతున్న భారత్... తాజాగా జీ7 దేశాల సదస్సులో పాల్గొననుంది. క్వాడ్లో అమెరికా, జపాన్ తో, ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ (టీటీసీ) ద్వారా యూరోపియన్ యూనియన్ తో, బ్రిటన్, కెనడాలతో భారత్ ముందస్తు వాణిజ్య చర్చలు జరుపుతోంది. సంక్లిష్టభరితమైన జనాభా, స్థూల ఆర్థికపరమైన సంధికాలంలో భారత అభివృద్ధిని, ఆర్థిక భద్రతా లక్ష్యాలను వేగవంతం చేయడం కోసం ఈ యంత్రాంగాలను ప్రభావితం చేయడం ప్రధానమైన అంశంగానే ఉంటుంది. అదే సమయంలో ఉక్రెయిన్ యుద్ధం, భారత్ జీ20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలోనూ, అభివృద్ధి చెందిన ప్రపంచం నుంచి స్పల్ప మార్పులనే గమనిస్తున్న భారత్కు జాతీయ, అంతర్జాతీయ సమస్య లను లేవనెత్తే అవకాశాన్ని జీ7 సదస్సు కల్పిస్తోంది. ఈ సమస్యలు ఏమిటంటే, ఇంధన, ఆహార భద్రత; సరఫరా మార్గాల స్థితిస్థాపకత, వాతావరణం; ఆర్థిక, స్వావలంబన అభివృద్ధి, అంతర్జాతీయ సంస్థల సంస్కరణ, రుణ స్థిరత్వం వంటివి. కాగా, అమెరికా వడ్డీరేట్లు అధికంగా ఉడటం, డిజిటల్ కరెన్సీలు, చెల్లింపుల్లో ఆవిష్కరణలు, నిలకడ లేని వాణిజ్య అసమతుల్యతలు, అంతర్జాతీయ ఆంక్షలు వంటివి రానున్న సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చుట్టుముట్ట నున్నాయి. హిరోషిమా సదస్సును దాటి చూస్తే, భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లు దక్షిణ పసిఫిక్ దేశాల నాయకులతో సమావేశాల కోసం పాపువా న్యూ గినియాను సంద ర్శిస్తారని భావిస్తున్నారు. వాటి చిన్న సైజు, చిన్నచిన్న దీవుల్లోని జనాభా కారణంగా దక్షిణ పసిఫిక్ ప్రాంతాన్ని తరచుగా చిన్నచూపు చూస్తూ వచ్చారు. కానీ ప్రపంచ భూ ఉపరితలంలో ఈ ప్రాంతం ఆరింట ఒక వంతును కలిగి ఉంది. తైవాన్ , అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలపై ప్రభావం చూపే విషయంలో చైనా పోటీ పడటాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ ప్రాంతం కూడా భౌగోళిక రాజకీయ హాట్ స్పాట్గా మారుతోంది. పైగా వాతావరణ సంక్షోభం, నిలకడైన రుణ విధానాలు, మత్స్య, ఖనిజ వనరులు వంటివాటికి ఈ ప్రాంతం కీలకమైనది. భారత్ విషయానికి వస్తే, ఫోరమ్ ఆన్ ఇండియా పసిఫిక్ ఐలాండ్ కో–ఆపరేషన్ (ఎఫ్ఐపీఐసీ) ద్వారా 2014–2017లో ప్రారంభమైన మహమ్మారి సంబంధిత విరామం – వ్యాప్తి తర్వాత పోర్ట్ మోర్స్బీలో జరుగనున్న సదస్సు ఒక సహజమైన కొనసాగింపు. ఈ సంవత్సరాల్లో భారత ప్రధాని ఫిజీలో 14 దక్షిణ పసిఫిక్ ప్రాంత నాయకులను కలిశారు. వారందరికీ జైపూర్లో ఆతిథ్యమిచ్చారు. భారతీయ అభివృద్ధి, సహాయ పథకాలను ప్రదర్శించడానికి అది ఒక అవకాశం అవుతుంది. ఫిజీ, పాపువా న్యూ గినియాలలో రుజువైనట్లే, గ్లోబల్ సౌత్ని ప్రభావితం చేస్తున్న కొన్ని ఉమ్మడి సవాళ్లకు ప్రస్తుత భారతీయ ప్రతిపాదనలు పరిష్కారాలు కావచ్చు. అదే సమయంలో, అమెరికా భూభాగం కాని ఒక దక్షిణ పసిఫిక్ దేశానికి బైడెన్ ప్రయాణం ఆశ్చర్యకరంగా అమెరికా అధ్యక్షుడి ప్రథమ సందర్శన కానుంది. పైగా, ఒక ముఖ్యమైన ప్రాంతంపై వాషింగ్టన్ చాలాకాలం తర్వాత దృష్టి పెట్టినట్లవుతుంది. చివరగా, ఆస్ట్రేలియాలో క్వాడ్ సదస్సుకు ఈ నెల సాక్షీభూతం కానుంది. గ్రూప్ లీడర్లు మూడోసారి వ్యక్తిగతంగా కలవనున్నారు. అమెరికా అధ్యక్షుడు వార్షిక ప్రాతిపదికన హాజరయ్యే కొన్ని అంత ర్జాతీయ గ్రూప్ సమావేశాలు ఏవంటే, జీ7, జీ20, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) ఆసియా పసిఫిక్ ఎకనమిక్ కో ఆపరేషన్, ఈస్ట్ ఆసియా సదస్సు, ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు. ఈ చిన్న జాబితాలో క్వాడ్ కొత్త చేరిక అన్నమాట. 2021లో అధ్యక్ష స్థాయి సమావేశంగా మొదటిసారి ఉనికిలోకి వచ్చిన క్వాడ్, మూడు కార్యాచరణ బృందాలను ఏర్పర్చింది. కానీ ఇప్పుడు దీని కార్యకలాపాలు 25 కార్యాచరణ బృందాలకు విస్తరించాయి. వీటిలో కొన్ని, క్వాడ్ ఫెలోషిప్స్ వంటి కొన్ని ఫలితాలను ఇప్పటికే ప్రదర్శించాయి. మరి కొన్ని సముద్రజలాల సమస్యలు, సైబర్ సెక్యూరిటీ, అంతర్జాతీయ రుణం వంటి అంశాల్లో సన్నిహిత సహకారానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. కొన్ని కార్యాచరణ బృందాలు ఇప్పటికీ చాలా అస్థిరంగా ఉంటున్నాయి. ఇకపోతే సరఫరా చైన్లు, సంక్లిష్ట టెక్నాలజీలు వంటి ఇతర అంశాల్లో సభ్యదేశాల మధ్య ద్వైపాక్షిక ప్రయత్నాలను ముందుకు తీసుకుపోవడానికి క్వాడ్ ఒక యంత్రాంగాన్ని ఏర్పర్చింది. వీటిలో అమెరికా, భారత్లతో ముడి పడి ఉన్న జాతీయ భద్రతా సలహాదారు నేతృత్వంలోని టెక్నాలజీ సంభాషణ, ఐసీఈటీ వంటివి ఉన్నాయి లేదా, ఇండో–పసిఫిక్ ఎకన మిక్ ఫ్రేమ్వర్క్ (ఐపీఈపీ), మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ (టిపి– ఎమ్డిఎ) వంటి అంశాలపై దేశాల విస్తృత సమితిని తీసు కొచ్చాయి. ఇవి, మరికొన్ని ప్రయత్నాలు సిడ్నీలో జరగనున్న సదస్సు నాటికి కొంత ప్రగతిని చవి చూస్తాయి కూడా. (అయితే అమెరికా అంతర్గత వ్యవహారాల వల్ల జో బైడెన్ ఆస్ట్రేలియా పర్యటనను రద్దు చేసుకోవ డంతో క్వాడ్ సమావేశం ఆఖరు నిమిషంలో వాయిదా పడింది). ఇక ఈ నెలలో జరగనున్న ఇండో–పసిఫిక్ అత్యున్నత సమావేశం సారాంశాన్ని చూస్తే, అంతర్జాతీయ వ్యవస్థలో కొన్ని కీలకమైన ప్రకంపనలను అవి ఎత్తిచూపనున్నాయి. ఈ ధోరణులను అభినందించే విషయంలో అనేక ప్రముఖ అంతర్జాతీయ వ్యాఖ్యాతలు ఘర్షించ వచ్చు. కానీ ఆర్థిక సంబంధాల నూతన పోకడలు, కొత్త రంగాలు, భౌగోళిక–రాజకీయ పోటీ రూపాలు, ఈ సమస్యలను ఎదుర్కోవడా నికి కొత్త యంత్రాంగాలు సీదాసాదాగా రూపుదిద్దుకుంటున్నాయి. ధ్రువ జైశంకర్ వ్యాసకర్త కార్యనిర్వాహక డైరెక్టర్, ఓఆర్ఎఫ్, అమెరికా (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో...) -
ధృవ-2లో ఏజెంట్ !
-
నెల రోజుల్లో 18కేజీల బరువు తగ్గిన హీరో.. ఫోటో వైరల్
పొగరు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ హీరో ద్రువ సర్జా. ప్రస్తుతం ఈయన కేడీ-ది డెవిల్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు 18 కేజీల బరువు తగ్గారాయన. ఈ విషయాన్ని స్వయంగా ద్రువ సర్జా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కేవలం నెల రోజుల వ్యవధిలో 18కేజీలు తగ్గాను. కేడీ-ది డెవిల్ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలి అంటూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ద్రువ సర్జా పాత ఫోటోలకు, ఇప్పడు చాలా వేరియేషన్ కనిపిస్తుందంటూ నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సినిమా కోసం ఎంతలా కష్టపడ్డాడో ఒక్క లుక్తో అర్థమవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా షోమ్యాన్ ప్రేమ్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కన్నడతో పాటు వివిధ భాషల్లో విడుదల కానుంది. -
నిధుల వేటలో ధృవ స్పేస్
హైదరాబాద్: స్పేస్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కంపెనీ ధృవ స్పేస్ ఒకట్రెండేళ్లలో రూ.204 కోట్ల వరకు నిధులను సమీకరించాలని భావిస్తోంది. 100 కిలోల వరకు బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను సమకూర్చుకునేందుకు ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీటీవో అభయ్ ఏగూర్ వెల్లడించారు. ఇందుకోసం హైదరాబాద్లో ప్లాంటు ఏర్పాటు చేసేందుకు అన్వేషిస్తున్నామని, ఔత్సాహికులతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ‘ధృవ స్పేస్ ఇప్పటికే ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాజెక్టులకు ఎటువంటి నిధులు అవసరం లేదు. అయితే కంపెనీకి చెందిన ఇతర విభాగాలకు ఇది అవసరం కావచ్చు. పెద్ద శాటిలైట్ ప్లాట్ఫామ్స్ అభివృద్ధి వైపునకు కంపెనీ వెళుతోంది. ఇప్పటికే ప్రయోగించిన వాటి కంటే కొంచెం పెద్ద ఉపగ్రహాలను వచ్చే ఏడాది మధ్యలో లే దా చివరిలో కక్ష్యలో ప్రవేశపెట్టగలమని ఆశాభావంతో ఉన్నాం. ఇందుకు తగ్గ అభివృద్ధి పనులు సవ్యంగా జరుగుతున్నాయి. ధృవ స్పేస్ రూపొందించిన నానో ఉపగ్రహాలు తైబోల్ట్–1, తైబోల్ట్–2 శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ–సీ54 ఉపగ్రహ ప్రయోగనౌక ద్వారా ఇస్రో నవంబర్ 26న విజయవంతంగా ప్రయోగించింది. వీటి విజయం తర్వాత సంస్థ ప్రస్తుతం పీ30 ప్లాట్ఫామ్లో కమ్యూనికేషన్స్, సైంటిఫిక్ అప్లికేషన్స్ను విస్తృతంగా అందజేసే 30 కిలోల బరువున్న ఉపగ్రహంపై పని చేస్తోంది’ అని అభయ్ పేర్కొన్నారు. శాటిలైట్ నుంచి సిగ్నల్స్ అందుకోవడం మొదలైందని, ప్రస్తుతం కంపెనీ బృందం ఈ మిషన్ను కొనసాగించడంలో, ఉపగ్రహాలను నిర్వహించడంలో బిజీగా ఉందన్నారు. దశాబ్దకాలం పూర్తి చేసుకున్న ధృవ స్పేస్ ఇప్పటి వరకు రూ.65 కోట్ల నిధులను అందుకుంది. -
ధృవ సర్జా హీరోగా తొలి పాన్ ఇండియా చిత్రం..
తమిళసినిమా: ఒకప్పుడు కర్ణాటక రాష్ట్రానికే పరిమితం అయిన కన్నడ త్ర పరిశ్రమ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపుతోంది. కేజీఎఫ్, కేజీఎఫ్–2, విక్రాంత్ రోణా, చార్లీ 777, కాంతార తదితర చిత్రాలు ఇతర పరిశ్రమలను కన్నడం వైపు తిరిగి చూసేలా చేశాయి. 2022లో ఈ 5 చిత్రాలు కలిపి రూ.1,851 కోట్ల వసూళ్లు చేసి సినీ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేశాయి. కాగా తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి మరో పాన్ ఇండియా చిత్రం రాబోతుంది. దీని పేరు కేడీ ది డెవిల్. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ కేడీఎం ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న నాలుగవ చిత్రం ఇది. అదేవిధంగా కర్ణాటక నేపథ్యంలో తెరకెక్కిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ఇదే అవుతుందని నిర్మాతలు పేర్కొన్నారు. ధృవ సర్జా కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు వెల్లడిస్తూ.. మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుందన్నారు. ఉదాహరణకు రాముడు ఉన్న కాలంలోనే రావణుడు ఉన్నాడని పేర్కొన్నారు. యాక్షన్, సెంటిమెంట్, వినోదం వంటి జనరంజకమైన అంశాలతో రపొందిస్తున్న చిత్రం కేడీ ది డెవిల్ అని తెలిపారు. కాగా కన్నడం, తెలుగు, తమిళం, మలయాళం హిందీ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇటీవల బెంగుళూరులో భారీఎత్తున నిర్వహించినట్లు నిర్మాత తెలిపారు. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్దత్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కాగా ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్కు చెందిన రెడ్జెయింట్ మూవీస్ సంస్థ పొందినట్లు తెలిపారు. -
ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ 'కిరోసిన్'.. విపరీతమైన క్రేజ్..!
సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన చిత్రం 'కిరోసిన్'. ధృవ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాను బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించారు. ఇటీవల థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ 'ఆహా'లో విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బిగ్ స్క్రీన్పై హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. (చదవండి: ‘కిరోసిన్’ మూవీ రివ్యూ) కథ, కథనాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు వహించి ఈ సినిమా చేయగా అవి ప్రేక్షకుల్లో ఎంతో ఉత్కంఠను రేకెత్తించాయి . అంతే కాదు స్క్రీన్ ప్లే బాగుందన్న ప్రశంసలు కూడా అందుకుంది ఈ చిత్రం. ఫ్యామిలీ ఆడియెన్స్ను సైతం ఈ మూవీ ఆకట్టుకోవడం విశేషం. ఇటీవల కాలంలో ఓటీటీలో కొన్ని చిన్న సినిమాలైనా ప్రేక్షకులను ఎంతో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రేక్షకుల అభిరుచి మారిన నేపథ్యంలో చిన్న సినిమాల కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 17 థియేటర్లలో విడుదలైంది. -
ఆకట్టుకుంటున్న అర్జున్ సర్జా మేనల్లుడు ధ్రువ సర్జా ‘పుష్పరాజ్’ ట్రైలర్
కన్నడ హీరో ధ్రువ సర్జా, రచిత రామ్, హరిప్రియ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘పుష్పరాజ్ ది సోల్జర్’. ఆర్.యస్ ప్రొడక్షన్స్ ఆర్. శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో గ్రీన్ మెట్రో మూవీస్, వి సినిమాస్ పతాకాలపై తెలుగులోకి అనువదిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 27న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ను వేగవంతం చేసిన చిత్రం బృందం నేడు ఈ మూవీ ఆడియో, ట్రైలర్ను లాంచ్ చేశారు. సోమవారం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత రామ సత్యనారాయణ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్లో చేతులు మీదుగా చిత్ర ట్రైలర్ విడుదల చేయించింది. చదవండి: క్రేజీ ఆఫర్.. మహేశ్-త్రివిక్రమ్లో చిత్రంలో వేణు? ఇక ట్రైలర్ లాంచ్ చేసిన అనంతరం ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘‘పుష్పరాజ్’ టైటిల్ చూస్తుంటే చార్లెస్ శోభరాజ్, అల్లు అర్జున్ సినిమాలు గుర్తుకు వస్తాయి. కమర్సియల్ గా చూసుకుంటే ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి.ఇదే హీరో తెలుగులో చేసిన పొగరు సినిమా కూడా బాగా ఆడింది.హీరో ధ్రువ సర్జా ను చూస్తుంటే అర్జున్ గారు వయసులో ఉన్నప్పుడు మా పల్లెలో గోపాలుడు టైమ్ లో ఎలా ఉండేవాడో ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆలాగే ఉన్నాడు’ అని అన్నారు. ఇక టైలర్ చాలా చూశానని, చాలా బాగుందన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర యూనిట్కు ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. -
‘కిరోసిన్’ మూవీ రివ్యూ
టైటిల్ : కిరోసిన్ నటీనటులు :ధృవ, ప్రీతిసింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, సమ్మెట గాంధీ, మధుసూదన్ రావు, కాంచెరపాలెం రాజు తదితరులు నిర్మాణ సంస్థ :బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మాతలు: దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్ దర్శకత్వం : ధృవ విడుదల తేది: జూన్ 17,2022 టాలీవుడ్లో పెద్ద తరహా చిత్రాలే కాదు.. కాన్సెప్ట్ బాగుంటే చిన్న చిత్రాలు కూడా మంచి వసూళ్లను రాబడుతాయి. అందుకే ఇటీవల కాలంలో టాలీవుడ్లో చిన్న సినిమా ధైర్యంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. వాటిలో చాలా వరకు సక్సెస్ సాధించాయి కూడా. తాజాగా మరో చిన్న చిత్రం ‘కిరోసిన్’ థియేటర్ల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం (జూన్ 17) థియేటర్లలో విడుదలైంది. ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘కిరోసిన్’కథేంటంటే.. జనగూడెం తండాకి చెందిన రామప్ప(సమ్మెట గాంధీ)కూతురు గౌరీ(లావణ్య చెవుల) హత్యకు గురవుతుంది. లోకల్ ఎమ్మెల్యే దొరబాబు(బ్రహ్మాజీ) ఒత్తిడితో నిందితులను పట్టుకోకుండానే.. తప్పుడు ఆధారాలు చూపించి ఈ కేసును క్లోజ్ చేస్తాడు ఎస్సై(జీవిన్). కొన్ని రోజుల తర్వాత పైఅధికారులు ఈ కేసు దర్యాప్తుని ఏసీపీ వైభవ్(ధృవ)కి అప్పజెప్పుతారు. వైభవ్ ఈ కేసు దర్యాప్తులో భాగంగా తండా సర్పంచ్ రావుల నాయక్(మధుసూదన్ రావు)తో పాటు పలువురి అనుమానితులను విచారిస్తాడు. ఈ హత్య కేసుకు గతంలో జరిగిన మరో ఇద్దరి యువతల హత్యలకు సంబంధం ఉందని ఏసీపీ ధృవ భావిస్తాడు. ఆ దిశగా విచారణ చేపట్టడంతో అసలు నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏంటి? గౌరీని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? వేరు వేరు ప్రాంతాల్లో జరిగిన హత్యలకు గౌరీ హత్య కేసుతో ఎలాంటి సంబంధం ఉంది? చివరకు ఏసీపీ వైభవ్ హంతకుడిని ఎలా పట్టుకున్నాడు? ఈ చిత్రానికి అసలు కిరోసిన్ అనే టైటిల్ పెట్టడం వెనుక ఉన్న కారణం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. కానీ, సరైన రీతిలో తీస్తేనే. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వినూత్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దర్శకుడు ధృవ. ఈ చిత్రంలో ఆయనే హీరోగా నటించడం విశేషం. ధృవ ఎంచుకున్న పాయింట్స్, రాసుకున్న స్క్రీన్ప్లే, డిజైన్ చేసుకున్న క్యారెక్టర్లు బాగున్నాయి. అయితే కథ కాస్త నెమ్మదిగా సాగడం మైనస్. ఫస్టాఫ్ అంతా గౌరీ కేసు విచారణ చుట్టే తిరుగుతుంది. ఆమెని ఎవరు హత్య చేశారనేది క్లైమాక్స్ వరకు తెలియజేయకుండా సస్పెన్స్ని మెయింట్ చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ధృవ ఎంట్రీతో ఫస్టాప్లో వేగం పుంజుకుంటుంది. గౌరీ కేసు కంటే ముందు మరో హత్య కేసుని ఏసీపీ వైభవ్ నిమిషాల్లో చేధించే సీన్ ఆకట్టుకుంటుంది. బిడ్డ చనిపోయిన విషయం తెలిశాక తండ్రి రామప్ప ఏడుస్తూ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే.. ఎస్సై పట్టించుకోకపోవడం, ఓ అమాయకుడిని ఇరికించి, ఈ కేసుని క్లోజ్ చేయడం పోలీసు వ్యవస్థలో జరిగే అన్యాయాలకు ఎత్తిచూపెడుతోంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. వేరు వేరు ప్రాంతాల్లో జరిగే హత్యలకు గౌరీ కేసుతో ముడిపెడుతూ.. ఏసీపీ చేసిన విచారణ ఆకట్టుకుంటుంది. ఈ వరుస హత్యల వెనుక ఏదో పెద్ద కారణం ఉంటుందని భావించిన ప్రేక్షకుడికి కాస్త నిరాశ కలిగించేలా క్లైమాక్స్ ఉంటుంది.అయితే ఇలాంటి సైకోలు కూడా సాధారన వ్యక్తులుగా మన చుట్టూ ఉంటారా? అనేలా క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారికి ‘కిరోసిన్’ నచ్చుతుంది. ఇక నటీనటుల ఫెర్పార్మెన్స్ విషయానికొస్తే..ఏసీపీ వైభవ్గా ధృవ చక్కటి నటనను కనబరిచాడు. తండావాసి రామప్ప పాత్రలో సమ్మెట గాంధీ ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్ని బాగా పండించాడు. ఎమ్మెల్యే దొరబాబుగా బ్రహ్మాజీ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే ఆయన పాత్ర నిడివి తక్కువే. సినియర్ నటుడైన బ్రహ్మాజీని ఇంకాస్త వాడుకుంటే సినిమాకు కలిసొచ్చేది. అగర్ బత్తీలు అమ్ముకునే శివయ్య పాత్ర ఈ సినిమాకు హైలైట్. ఈ పాత్రలో రామారావు జాదవ్ ఒదిగిపోయాడు. సైకోగా తనదైన నటనతో మూడు నిమిషాలు హడలెత్తించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువల సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
కిరోసిన్ మూవీ పబ్లిక్ టాక్
-
సస్పెన్స్ థ్రిల్లర్గా ‘కిరోసిన్’.. సెన్సార్ పూర్తి
డిఫరెంట్ కాన్సెప్ట్లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. ఆడియన్స్ కూడా వైవిధ్యమైన సినిమాలనే ఆదరిస్తున్నారు. ముఖ్యంగా మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. అలాంటి ఓ మిస్టరీ కథను తీసుకొని ‘కిరోసిన్’చిత్రాన్ని తెరకెక్కించారు ధృవ. ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడమే కాకుండా, హీరోగానూ నటించాడు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ తాజాగా పూర్తయింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ లభించింది. ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా కిరోసిన్ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంది.ఈ చిత్రంలో ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, కంచెరపాలెం రాజు, సమ్మెట గాంధీ, జీవన్ కుమార్, రామారావు జాదవ్, లక్ష్మణ్ మీసాల, లక్ష్మీకాంత్ దేవ్, లావణ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూన్ 17న థియేటర్లలో విడుదల కాబోతుంది. -
సినిమా ఇండస్ట్రీకి మంచి దర్శకుడు దొరికాడు: నిర్మాత
Dhruva Kerosene Movie Pre Release Event In Hyderabad: బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మాతలుగా ధృవ హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా 'కిరోసిన్'. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా రిలీజైన ఈ మూవీ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఓ మిస్టరీ కథగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 17న గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరో, దర్శకుడు ధృవ మాట్లాడుతూ.. 'నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు. కథ మీద ఎంతో నమ్మకం, నాపై అపారమైన నమ్మకంతోనే ఈ అవకాశం ఇచ్చారు. నేను హీరోగా నటిస్తాను అన్నప్పుడు వారు చేసిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేనిది. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. మిస్టరీ సినిమానే అయినా అన్ని రకాల అంశాలు చిత్రంలో ఉంటాయి.' అని తెలిపాడు. చదవండి: ఆ పాత్ర కోసం 15 రోజులు ఇంట్లో వాళ్లతో మాట్లాడలేదు: నటుడు హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిన దీపికా పదుకొణె.. 'నాకు సపోర్ట్ చేసిన కుటుంబ సభ్యులందరికి థాంక్స్. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ధృవ ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఈ సినిమా తప్పకుండా చేయాలని భావించాను. దానికి తగిన అవుట్ ఫుట్ వచ్చింది. సినిమా కోసం ఆయన చాలా బాగా కష్టపడ్డాడు. సినిమా ఇండస్ట్రీకి ధృవ రూపంలో ఒక మంచి దర్శకుడు దొరికాడని చెప్పవచ్చు.' అని నిర్మాత దీప్తి కొండవీటి పేర్కొన్నారు. -
కన్నడ హీరోతో పూరి జగన్నాథ్ కొత్త సినిమా!
తెలుగులో దర్శకుడిగా కెరీర్ ఆరంభించిన కొత్తలో పూరి జగన్నాథ్ రెండు కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఒకటి ‘యువరాజా’ (2001), మరొకటి ‘అప్పు’ (2002). ‘యువరాజా’లో శివరాజ్కుమార్ నటించారు. ‘అప్పు’లో ఆయన తమ్ముడు పునీత్ రాజ్కుమార్ హీరో. ఆ తర్వాత పదిహేడేళ్లకు ఇషాన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ‘రోగ్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు ఓ కన్నడ సినిమాకు ప్లాన్ జరుగుతోందని సమాచారం. ధ్రువ సర్జా హీరోగా ఈ సినిమా రూపొందనుందట. ‘పొగరు’లో ‘ఖరాబు మాసు ఖరాబు..’ అంటూ తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు ధ్రువ. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ ‘లైగర్’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ధ్రువ సర్జా కన్నడంలో ‘దుబారీ’ అనే సినిమా చేస్తున్నారు. మరి... అతని తదుపరి సినిమా పూరీతోనే ఉంటుందా? వేచి చూడాలి. చదవండి: కొత్త డైరెక్టర్తో మూవీ.. షరతు విధించిన మహేశ్బాబు! ఆ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న కాజల్ -
ప్రొడక్షన్ టు డైరక్షన్
సస్పెన్స్ థ్రిల్లర్ ‘యమ్ 6’ చిత్రాన్ని నిర్మించిన విశ్వనాథ్ తన్నీరు దర్శకుడిగా మారారు. విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్పై ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్నారు కూడా. ‘‘సినిమా మీద ప్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చాను.‘యమ్ 6’తో నిర్మాతగా మారాను. దర్శకుడిని కావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. మంచి కథ కుదిరింది. ఈ సినిమా ద్వారా ఓ సందేశం కూడా ఇస్తున్నాం. ‘యమ్ 6’లో హీరోగా «నటించిన ధృవ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం’’ అన్నారు విశ్వనాథ్ తన్నీరు. ‘‘రెండోసారి కూడా అవకాశం ఇచ్చిన విశ్వనాథ్గారికి ధన్యవాదాలు’’ అన్నారు ధృవ. -
అర్జున్ మేనల్లుడి పొగరు
యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ సర్జా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పొగరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. నందకిశోర్ దర్శకత్వంలో బి.కె. గంగాధర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. హీరోకు, అంతర్జాతీయ బాడీ బిల్డర్స్కు మధ్య వచ్చే క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఫ్రెంచ్ బాడీ బిల్డర్ మోర్గాన్ అస్తే, అమెరికన్ బాడీ బిల్డర్ కై గ్రీనే, జాక్ లుకాస్, జో లిన్డర్ వంటి అంతర్జాతీయ స్థాయి బాడీ బిల్డర్స్ నటిస్తున్నారు. ‘భైరవగీత’ ఫేమ్ ధనుంజయ్ విలన్గా నటిస్తున్నారు. సంపత్ రాజ్, రవి శంకర్, పవిత్రా లోకేష్ కీలక పాత్రధారులు. ‘‘ప్యాన్ ఇండియా సినిమాగా పొగరు చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
కథే హీరో
‘‘చిన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలి. అప్పుడే మాలాంటి కొత్త నిర్మాతలు మరిన్ని సినిమాలు నిర్మించడానికి అవకాశం ఉంటుంది’’ అని నిర్మాత తన్నీరు విశ్వనాథ్ అన్నారు. ధ్రువ, అశ్విని జంటగా జైరాం వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యమ్ 6’. తన్నీరు విశ్వనాథ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘నటుడు అవ్వాలనే ఇండస్ట్రీకి వచ్చాను. మొదట్లో కొన్ని సీరియల్స్లో నటించాను. ఆ తర్వాత కొన్ని సీరియల్స్ నిర్మించాను. కొంతకాలం దర్శకత్వ శాఖలో కూడా పని చేశాను. ఇప్పుడు ‘యమ్ 6’ చిత్రం నిర్మించా. ఈ చిత్రానికి కథే హీరో. విజయ్ బాలాజీ మంచి సంగీతం అందించారు. నా స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. త్వరలో వివరాలు చెబుతా’’ అన్నారు. -
సస్పెన్స్ థ్రిల్లర్
ధ్రువ, అశ్విని, శ్రావణి, తిలక్, సాధన, అప్పలరాజు, హరిత, వంశీ, ఇంద్రతేజ ముఖ్య తారలుగా జైరామ్వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం‘యమ్ 6’. విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్ పతాకాలపై విశ్వనాథ్ తన్నీరు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. విశ్వనాథ్ తన్నీరు మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రమిది. ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే అద్భుతమైన కథని జైరాం అంతే అద్భుతంగా తెరకెక్కించారు. ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ‘‘ఇలాంటి సినిమాలు తమిళ, మలయాళ, కన్నడలో వచ్చేవి. తెలుగు ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఈ రకమైన సినిమాల్ని ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు జై రామ్వర్మ. ‘‘మంచి చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతుండటం హ్యాపీగా ఉంది’’ అని ధ్రువ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బాలాజీ, కెమెరా: మహ్మద్ రియాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సురేష్, సమర్పణ: పార్వతి. -
ఈ క్షణం.. ఓ హైలైట్
ధ్రువ, అశ్విని జంటగా జైరామ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యమ్ 6’. విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మీ వెంకటాద్రి క్రియేషన్స్ బ్యానర్స్పై విశ్వనాథ్ తన్నీరు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ను దర్శకుడు వీవీ వినాయక్ ఆవిష్కరించి, చిత్రబృందాన్ని అభినందించారు. విశ్వనాథ్ తన్నీరు మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రమిది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఎక్కడా బోర్ ఫీల్ అవకుండా ఉత్కంఠ కలిగించేలా ఈ చిత్రం రూపొందించాం. ‘యమ్ 6’ అనే డిఫరెంట్ టైటిల్ని ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్థమవుతుంది. మా చిత్రానికే హైలైట్గా నిలిచే ‘ఈ క్షణం...’ అనే మెలోడి సాంగ్ను మంగళూరు, అరకులోని అందమైన లొకేషన్స్లో చిత్రీకరించాం. ధ్రువ సర సన మిస్ బెంగళూరు అశ్విని హీరోయిన్గా నటించింది. త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘హీరోగా ఇది నా తొలి చిత్రం. అందర్నీ అలరించే విభిన్నమైన పాత్రలు పోషించి, ఇండస్ట్రీలో నటుడిగా నాకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలన్నది నా చిరకాల కోరిక’’ అని ధ్రువ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బాలాజీ, కెమెరా: మహ్మద్, రియాజ్, సహ నిర్మాత: సురేశ్. -
సస్పెన్స్ థ్రిల్లర్
ధ్రువ హీరోగా, శ్రావణి, అశ్విని హీరోయిన్లుగా జైరామ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యమ్6’. విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మీ వెంకటాద్రి క్రియేషన్స్ పతాకాలపై విశ్వనాథ్ తన్నీరు నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. చిత్రనిర్మాత విశ్వనాథ్ తన్నీరు మాట్లాడుతూ– ‘‘సినిమాపై ప్యాషన్తోనే ఇండస్ట్రీకి వచ్చాను. మొదట్లో కొన్ని సీరియల్స్లో నటించడంతో పాటు నిర్మించాను. కొన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. నా తమ్ముడు ధ్రువని హీరోగా పరిచయం చేస్తూ ‘యమ్6’ చిత్రాన్ని నిర్మించాను. ఇక ఈ సినిమా విషయానికి వస్తే... జైరాం వర్మ చెప్పిన కథ నచ్చి ఈ సినిమా నిర్మించా. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందింది. కామెడీ, యాక్షన్ సన్నివేశాలతో పాటు ఓ సందేశం కూడా ఉంటుంది. త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. మా బేనర్లో సంవత్సరానికి ఒక సినిమా నిర్మిస్తాం. త్వరలోనే నా డైరెక్షన్లో ఓ సినిమా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బాలాజీ, కెమెరా: మహ్మద్ రియాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సురేశ్, సమర్పణ: స్టార్ యాక్టింగ్ స్టూడియో. -
సస్పెన్స్ థ్రిల్లర్గా ‘యం6’
విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్ పతాకాలపై జైరామ్ వర్మ దర్శకత్వంలో విశ్వనాథ్ తన్నీరు నిర్మిస్తున్న చిత్రం ‘యం6’. ధ్రువ, శ్రావణి, అశ్విని హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత విశ్వనాథ్ తన్నీరు మాట్లాడుతూ - ‘సినిమా మీద ఉన్న ప్యాషన్తోనే ఈ రంగానికి వచ్చాను. విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీని స్థాపించి నా తమ్ముడు ధ్రువను హీరోగా పరిచయం చేస్తూ ‘యం6’ చిత్రాన్ని నిర్మించాను. మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఎంతో క్వాలిటీగా ఈ సినిమాను నిర్మించాం. ‘యం6’ సినిమా విషయానికి వస్తే దర్శకుడు జైరాం వర్మ చెప్పిన కాన్సెప్ట్ నచ్చి ఈ సినిమాను ప్రారంభించాం. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ హైలైట్స్గా నిలుస్తాయి. ఈ సినిమాకి ‘యం6’ అనే టైటిల్ ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్థమవుతుంది. ప్రేక్షకుల్ని హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్ చేస్తుందన్న నమ్మకం నాకు ఉంది. -
తెలుగు ప్రేక్షకులు నిజాయతీగా ఉంటారు
ధ్రువ కరుణాకర్, శివంగి, సోనియా ముఖ్యతారలుగా తెరకెక్కిన చిత్రం ‘అశ్వమేథం’. నితిన్ .జి దర్శకత్వంలో ఐశ్వర్యా యాదవ్, ప్రియా నాయర్ నిర్మించారు. చరణ్ అర్జున్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ‘గజానన’ అనే పాటను నిర్మాత ఐశ్వర్య యాదవ్ రిలీజ్ చేశారు. నితిన్ మాట్లాడుతూ– ‘‘గజానన’ పాటను తెరపై చూస్తున్నప్పుడు మేజికల్ మూమెంట్లాగా అనిపించింది. తెలుగు ప్రజలు టెక్నికల్గా ముందంజలో ఉన్నారు. నిజాయతీగా ఉంటారు. సినిమా బావుంటే ఆదరిస్తారు. మా సినిమాని కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాం’’ అన్నారు. చరణ్ అర్జున్ మాట్లాడుతూ– ‘‘చిన్ని చరణ్ పేరుతో చాలా సినిమాలకు సంగీతం అందించా. ఇప్పుడు చరణ్ అర్జున్ అని పేరు మార్చుకున్నా. ఈ చిత్రంలోని ‘గజానన’ పాటతో రీ లాంచ్ కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘తెలుగులో హీరోగా లాంచ్ కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు ధ్రువ కరుణాకర్. ఐశ్వర్య యాదవ్, ప్రియా నాయర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: నగేష్ పూజారి, లైన్ ప్రొడ్యూసర్: సైపు మురళి. -
‘ధృవ’ మాతృకకు సీక్వెల్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ధృవ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ధృవ తమిళనాట ఘనవిజయం సాధించిన తనీఒరువన్ సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. జయం రవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ను రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నారు చిత్రయూనిట్. అరవింద్ స్వామి, నయనతార ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సీక్వెల్ను తెరకెక్కించేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతున్నారు. సీక్వెల్ను కూడా మోహన్ రాజా దర్శకత్వలోనే తెరకెక్కనుందట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. -
ధ్రువకు జోడీ కుదిరింది!
తమిళసినిమా: కొన్ని చిత్రాలకు కథానాయికలు త్వరగా దొరకరు. కారణం దర్శక నిర్మాతలకు నచ్చకపోవడం కావచ్చు. కథానాయకులకు సెట్ కాకపోవచ్చు. ఆయా పాత్రలకు నప్పకపోవచ్చు. ఇంకేదైనా కావచ్చు. అలా నవ నటుడు ధ్రువ విక్రమ్కు జంటగా నటించే హీరోయిన్ కోసం కొన్ని నెలలుగా అన్వేషణ జరుగుతోంది. ధ్రువ విక్రమ్ అనగానే అతను హీరో విక్రమ్ వారసుడని ఇట్టే అర్థమవుతుంది. ప్రముఖ దర్శకుడు బాలా దర్శకత్వంలో ఈ యువ నటుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్రెడ్డి చిత్రానికి ఈ చిత్రం రీమేక్. విజయ్ దేవరకొండ నటించిన పాత్రను తమిళంలో ధ్రువ విక్రమ్ పోషిస్తున్నారు. తమిళంలో ‘వర్మ’ అనే టైటిల్తో నిర్మిస్తున్నారు. విశేషం ఏంటంటే హీరోయిన్ ఎంపిక కాకుండానే ఈ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ను పూర్తి చేసేశారు దర్శకుడు బాలా. తెలుగులో శాలినీపాండే నటించిన పాత్రను తమిళంలో పోషించే నటి కోసం చిత్ర యూనిట్ తెగ వెతికింది. పలువురు నటీమణులను పరిశీలించారు. చాలామంది పేర్లు ప్రచారమయ్యాయి కూడా. చివరికి బెంగాలీ బ్యూటీకి ఆ అదృష్టం దక్కింది. బెంగాలీలో పలు టీవీ, మూవీ చిత్రాల్లో నటించిన మేఘాచౌదరి వర్మ చిత్రంలో ధ్రువ్తో రొమాన్స్ చేయనుంది. ఈ బ్యూటీ హిందీ సీరియల్స్లోనూ నటించింది. మోడల్గా రాణించిన మేఘా చౌదరి తమిళంలో సూర్య హీరోగా నటించిన ‘చిల్లన్ను ఒరు కాదల్’ చిత్రంలో ఆయన కూతురిగా నటించిందన్నది గమనార్హం. తాజాగా వర్మ చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. మరి ఇక్కడ కథానాయకిగా ఏ పాటిగా నిలదొక్కుకుంటుందో చూడాలి. త్వరలో ప్రారంభం కానున్న వర్మ చిత్ర షూటింగ్ రెండవ షెడ్యూల్లో మేఘా చౌదరి పాల్గొననుందన్నది తాజా సమాచారం. ఇ4 ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు రాజుమురుగన్ సంభాషణలను రాస్తున్నారు. -
సస్పెన్స్ థ్రిల్లర్
ధ్రువ హీరోగా, శ్రావణి, అశ్విని హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘యమ్6’. జైరామ్ దర్శకత్వంలో స్టార్ యాక్టింగ్ స్టూడియో సమర్పణలో విశ్వనాథ్ తన్నీరు, సురేశ్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. విశ్వనాథ్ తన్నీరు మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. ఇందులోని ‘ఈ క్షణం..’ అనే మెలోడియస్ పాటను అరకు, మంగళూరులోని అందమైన లొకేషన్స్లో చిత్రీకరించాం. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా నిర్మించాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో సస్పెన్స్తో పాటు కామెడీ, యాక్షన్ సన్నివేశాలు హైలైట్గా నిలుస్తాయి. చక్కని ఫొటోగ్రఫీ, వీనుల విందైన సంగీతం అదనపు ఆకర్షణ’’ అన్నారు జైరామ్. ‘‘ఇది నా తొలి చిత్రం. ఓ మంచి సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు రుణపడి ఉంటాను’’ అన్నారు ధ్రువ. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బాలాజీ, కెమెరా: మహ్మద్ రియాజ్. -
స్టార్ట్ కెమెరా.. యాక్షన్
లైట్స్ ఆన్.. స్టార్ట్ కెమెరా.. యాక్షన్... అని డైరెక్టర్ అనగానే కెమెరా ముందు నటించే అరవింద్ స్వామి త్వరలో మెగా ఫోన్ పట్టుకోనున్నారట. మానిటర్ ముందు కూర్చుని లైట్స్ ఆన్.. స్టార్ట్ కెమెరా.. యాక్షన్... అనబోతున్నారని చెన్నై టాక్. నటనకు బ్రేక్ ఇచ్చిన ఆయన ‘కడల్’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి, వరుసగా సినిమాలు చేస్తున్నారు. తెలుగు చిత్రం ‘ధృవ’లో విలన్గా నటించిన అరవింద్ స్వామి మరోవైపు తమిళంలో లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఆయన హీరోగా నటించిన ‘భాస్కర్ ఒరు రాస్కెల్’ ఈరోజు రిలీజ్ అవుతోంది. మరోవైపు ‘సదురంగవేట్టై 2’, ‘వనంగాముడి’, ‘నరకాసురన్’, ‘చెక్క చివంద వానమ్’ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. నటుడిగా బిజీగా ఉన్నా దర్శకుడిగా కూడా చేయాలను కుంటున్నారట. కథ కూడా రెడీ చేశారట. -
లైట్స్ ఆన్.. స్టార్ట్ కెమెరా.. యాక్షన్
...అని డైరెక్టర్ అనగానే ఇప్పటివరకూ నటించిన అరవింద్ స్వామి వచ్చే ఏడాది లైట్స్ ఆన్.. స్టార్ట్ కెమెరా.. యాక్షన్ అనబోతున్నారు. ‘బొంబాయి, రోజా’ సినిమాలతో చాలామంది మనసుల్లో నిలిచిపోయారు ఈ అప్పటి లవర్ బోయ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారాక ఇటీవల రామ్చరణ్ ‘ధృవ’లో విలన్గా కూడా చేశారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూనే, హీరోగానూ నటిస్తున్నారు. ఆర్టిస్ట్గా ఆయన ఫుల్ బిజీ. అయినప్పటికీ అరవింద్స్వామి మెగా ఫోన్ పట్టనున్నారంటూ చాలా రోజులుగా కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతానికి నా దృష్టంతా నటనపైనే అంటూ చెప్పుకొచ్చిన ఆయన తాజాగా తన మనసులోని మాటను అభిమానులతో పంచుకున్నారు. దర్శకత్వం చేసే ఆలోచన ఉందా? అంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.. ‘‘కొత్త సంవత్సరం 2018లో డైరెక్షన్ చేసే ఆలోచన ఉంది. ఎవరి ఊహకు అందని కథతో సినిమా తీస్తా’’ అని సమాధానమిచ్చారు. -
మరైందిరుందు పార్కుంమర్మమెన్నకు సెన్సార్ కష్టాలు
తమిళసినిమా: మరైదిరుందు పార్కుం మర్మమెన్న చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్బోర్డు నిరాకరించింది. ఎక్స్ట్రా ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై వి.మదిఅళగన్, ఆర్.రమ్య నిర్మించిన చిత్రం మరైంది రుందు పార్కుంమర్మమెన్న. తిలగర్ చిత్రం ఫేమ్ ధ్రువకథానాయకుడిగా నటించిన ఇందులో ఐశ్వర్యదత్త, అంజన కథానాయికలుగా నటించారు. జేడీ.చక్రవర్తి, శరణ్యపొన్వన్నన్, రా ధారవి, మనోబాలా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాకేష్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మంగళవారం సెన్సార్బోర్డు సభ్యులకు ప్రదర్శించారు. సెన్సార్బృందం ఈ చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారట. దీని గురించి దర్శకుడు రాకేష్ తెలుపుతూ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాల గురించి తెరపై ఆవిష్కరించిన చిత్రం మరైం దిరుంది పార్కుం మర్మమెన్న అని తెలిపారు. మహిళలు, పిల్లలు ఎలా బాధింపునకు గురవుతున్నారన్న విషయాల గురించి అవగాహన కలిగించే విధంగా ఈ చిత్రాన్ని రూపొం దించామని చెప్పారు. ఇలాంటి సంఘటనలు నిత్యం పత్రికల్లో, ప్రసార సాధనాల్లో చూస్తున్నామన్నారు. వాటి గురించి పట్టించుకోని సెన్సార్బోర్డు సభ్యులు తమ చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించి రివైజింగ్ కమిటీకి వెళ్లమనడం ఎంత మాత్రం సమంజసం అని ఆవేదన వ్యక్తం చేశారు. -
రామ్ చరణ్కు టాప్ హీరో డబ్బింగ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ధృవ. తమిళ సూపర్ హిట్ తనీఒరువన్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగునాట ఘనవిజయం సాధించటమే కాదు, రికార్డ్ వసూళ్లను సాధించింది. అయితే ధృవ సినిమా డబ్బింగ్ వర్షన్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ కు ఓ బాలీవుడ్ టాప్ హీరో డబ్బింగ్ చెపుతున్నాడు. త్వరలో ఓ హిందీ టీవీ ఛానల్ లో ప్రసారం కానున్న ఈ సినిమా డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. జంజీర్ సినిమా ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన చరణ్ సినిమాలకు బాలీవుడ్ లో మంచి ఆదరణ ఉంది. అందుకే ధృవ సినిమాలో చరణ్ క్యారెక్టర్ అజయ్ దేవగన్ డబ్బింగ్ చెప్పేందుకు అంగీకరించాడు. సినిమాలో కీలకమైన విలన్ పాత్రకు సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ డబ్బింగ్ చెపుతున్నాడు. త్వరలో ధృవ డబ్బింగ్ వర్షన్ టీవీల్లో ప్రసారం కానుంది. -
ధృవలో విలన్గా నేను చేయాల్సింది: సీనియర్ హీరో
కొంత కాలంగా తన స్థాయికి తగ్గ సక్సెస్లు అంధించటంలో ఫెయిల్ అవుతున్న యాంగ్రీ హీరో రాజశేఖర్, త్వరలో గరుడవేగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటికే మొదలు పెట్టేశారు. అందులో భాగంగా తరువాత మీడియా ఇంటర్య్వూలతో సందడి చేస్తున్నాడు రాజశేఖర్. ఇటీవల ఓ ఇంటర్య్వూలో భాగంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. రామ్ చరణ్ హీరోగా తమిళ సూపర్ హిట్ సినిమా తనీఒరువన్కు రీమేక్గా తెరకెక్కిన సినిమా ధృవ. ఈ సినిమాలో విలన్ పాత్రకు ముందుగా రాజశేఖర్నే తీసుకోవాలని భావించారట. అంతా ఓకే అనుకున్న సమయంలో నిర్మాత అరవింద్ స్వామితోనే ఆ పాత్ర చేయిచేందుకు నిర్ణయించామని తెలిపాడట. తమిళంలో అరవింద్ స్వామి కనిపించిన సోలో సీన్స్ను రీ షూట్ చేసే అవసరం ఉండదన్న కారణంగా ఆ నిర్ణయం తీసుకున్నారని నిర్మాత తెలిపారన్నాడు రాజశేఖర్. అంతేకాదు త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న బాలకృష్ణ 102 సినిమా కోసం విలన్గా రాజశేఖర్ను సంప్రదించారట. అయితే అది రొటీన్ విలన్ పాత్రే కావటంతో సున్నితంగా తిరస్కరించానని తెలిపాడు. తేజతో తాను చేయాల్సిన సినిమా ఆగిపోవటంపై కూడా రాజశేఖర్ స్పందించాడు. కేవలం క్లైమాక్స్ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవటం వల్లే ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశామని, మంచి కథ వస్తే విలన్గా నటించడానికి తనకు అభ్యంతరం లేదని తెలిపాడు. -
లిటిల్ తైక్వాండో స్టార్స్
ఆటలో రాణిస్తోన్న మాన్య, ధ్రువ హైదరాబాద్: నగరానికి చెందిన అక్కా తమ్ముళ్లు తైక్వాండోలో సత్తా చాటుతున్నారు. భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్కు చెందిన చిన్నారులు ఎన్. మాన్య , ధ్రువ తైక్వాండోలో ఇటీవల వివిధ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచారు. ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఓపెన్ ఇండియన్ కప్ అండర్–12 విభాగంలో ఈ చిన్నారులు పసిడి పతకాలతో సత్తాచాటారు. ఈ టోర్నీలో చెరో రెండు స్వర్ణాలను కైవసం చేసుకున్నారు. చిరుప్రాయం నుంచే క్రీడలపై ఆసక్తి కనబరిచే వీరిద్దరూ గత మూడు సంవత్సరాలుగా పాఠశాలలోనే తైక్వాండో ఈవెంట్లో శిక్షణ తీసుకుంటున్నారు. ప్రస్తుతం మాన్య ఆరో తరగతి చదువుతుండగా... ఆమె తమ్ముడు ధ్రువ మూడో తరగతిలో ఉన్నాడు. భవిష్యత్లో మరిన్ని పతకాలు సాధించడమే లక్ష్యంగా కోచ్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతిరోజూ 2గంటల పాటు సాధనలో శ్రమిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోన్న ఈ చిన్నారులను పాఠశాల యాజమాన్యం కూడా ప్రోత్సహిస్తోంది. క్రీడల్లోనే కాకుండా చ దువుల్లోనూ మంచి ప్రతిభను కనబరుస్తున్నారని స్కూల్ ప్రిన్సిపల్ రమాదేవి అన్నారు. -
ధృవ, అదితి ఆర్యల 'ఎప్పటికీ ప్రేమ'
ధృవ, అదితి ఆర్య( ఇజం ఫేమ్) కాంబినేషన్లో రూపొందిన ఇండిపెండెంట్ ఆల్బమ్ సాంగ్ `ఎప్పటికీ ప్రేమ` ఏప్రిల్ 14న విడుదల కానుంది. 300కు కైగా థియేటర్ షోస్ చేసి అంతర్జాతీయంగా మంచి గుర్తింపును తెచ్చుకున్న ధృవ, ఈ ఇండిపెండెంట్ ఆల్బమ్ తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ రొమాంటిక్ సాంగ్ను ప్రముఖ కొరియోగ్రాఫర్ స్వరూప్ రాజ్ మేడర డైరెక్ట్ చేశారు. ఇటీవల రిలీజ్ అయిన సాంగ్ టీజర్కు మంచి రెస్పాన్స వచ్చింది. శైలేష్ సువర్ణ సంగీతం అందించగా.. గ్రాండ్ విజువల్స్, హై క్వాలిటీ చాలా రిచ్గా పిక్చరైజ్ చేశారు.. మంచి లుక్, యాక్టింగ్ స్కిల్స్ ఉన్న ధృవకు ఈ సాంగ్, టాలీవుడ్లో మంచి ఎంట్రీ అవుతుందని భావిస్తున్నారు. ఈ నెల 14 ఎప్పటికీ ప్రేమ సాంగ్ను లహరి మ్యూజిక్వారు విడుదల చేస్తున్నారు. -
మణి సినిమాలో ధృవ కాంబినేషన్
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్లో పెట్టాడు. ఎప్పటి నుంచో కలలు కంటున్నట్టుగా లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తన నెక్ట్స్ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు చెర్రీ. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. జూన్ నుంచి ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే క్రేజీ కాంబినేషన్ అనిపించుకుంటున్న ఈ సినిమాకు ఇంట్రస్టింగ్ కాస్టింగ్ను సెట్ చేస్తున్నారు. మణిరత్నం వెండితెరకు పరిచయం చేసిన మిల్కీ బాయ్ అరవింద్ స్వామి.. రామ్ చరణ్, మణిల సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడు. ఇప్పటికే ధృవ సినిమాలో ఆకట్టుకున్న చెర్రీ, అరవింద్ స్వామిలు మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవటం ఆసక్తికరంగా మారింది. -
చరణ్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వడట..!
తన సినిమా రిలీజ్ డేట్లను ముందుగానే ప్రకటించే రామ్ చరణ్.. షూటింగ్ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోడన్న టాక్ వినిపిస్తోంది. ఆలస్యంగా షూటింగ్ మొదలు పెట్టడంతో చరణ్ గత చిత్రాలు హడావిడిగా పూర్తి చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా గోవిందుడు అందరివాడేలే, బ్రూస్లీ చిత్రాలను అనుకున్న సమయానికి రిలీజ్ చేయడానికి చాలా కష్టపడ్డాడు చరణ్. ఇక తాజా చిత్రం ధృవ విషయంలోనూ అదే తప్పు జరిగింది. ముందుగా ఈ సినిమాను దసరాకే రిలీజ్ చేయాలని భావించినా షూటింగ్ పూర్తి కాకపోవటంతో వాయిదా వేసి డిసెంబర్లో రిలీజ్ చేశారు. ఈ గ్యాప్లో పెద్ద నోట్ల రద్దు జరగటంతో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోయాడు. అదే ముందుగా అనుకున్నట్టుగా దసరాకే రిలీజ్ అయి ఉంటే ధృవ మరిన్ని రికార్డ్లు నమోదు చేసి ఉండేదని భావిస్తున్నారు. దీంతో రాబోయే సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు చరణ్. మూడు నాలుగు నెలల్లో సినిమా పూర్తి చేయటం కష్టం అని భావించిన చెర్రీ, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను ఫిబ్రవరిలోనే ప్రారంభిస్తున్నాడు. ఐదారు నెలల్లో సినిమాను పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లో దసరాకి సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. -
మణిరత్నం... అది నా మనసులో నాటారు!
‘‘ఇండస్ట్రీలోని హీరోలందరూ కేవలం సీటునో, లేదంటే నంబర్స్నో కాపాడుకోవడానికి సినిమాలు మొదలు పెడితే... నిజంగా మమ్మల్ని (హీరోల్ని) ఎవరూ కాపాడలేరు’’ అన్నారు రామ్చరణ్. ఆయన హీరోగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్లు నిర్మించిన సినిమా ‘ధృవ’. శుక్రవారం హైదరాబాద్లో ‘శాల్యూట్ టు ఆడియన్స్’ వేడుక నిర్వహించారు. ‘‘దర్శక – నిర్మాతలు కాదు... హీరోలు అనుకుంటే కొత్త తరహా సినిమాలు వస్తాయి. ‘ధృవ’ సరైన సమయంలో విడుదలైతే ఇంకో 20 శాతం రెవెన్యూ ఎక్కువ ఉండేది’’ అని ‘దిల్’ రాజు అన్నారు. రామ్చరణ్ మాట్లాడుతూ – ‘‘నేనూ, మామ (అల్లు అరవింద్) సినిమా చేస్తే ఎక్కువ ఆనందపడే వ్యక్తి మా అమ్మ. అమ్మ ఆనందం కోసం ‘ధృవ’ హిట్టవ్వడం ఇంకా హ్యాపీగా ఉంది. నా బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్స్ రెండూ (‘మగధీర, ధృవ’) గీతా ఆర్ట్స్లోనే అంటే గర్వంగా ఉంది. బన్నీ (అల్లు అర్జున్)కి మామ చాలా ఇచ్చారు. ఇంకా కోరుకుంటే అది బన్నీ తప్పు గానీ.. మామ తప్పు కాదు (నవ్వులు). బన్నీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ (‘సరైనోడు’) కూడా మామదేగా! ఓసారి మణిరత్నంగారు ‘నీ మార్కెట్కు లోటేమీ లేదు. ఒకవేళ నాతో సినిమా చేస్తే, ఎక్కువ వసూళ్లు సాధించక పోవచ్చు. కానీ, కచ్చితంగా నీకు మంచి పేరొస్తుంది. కథలు వినేటప్పుడు వసూళ్లు గురించి కాకుండా పేరు గురించి ఆలోచించు’ అనే విత్తనాన్ని నా మనసులో నాటారు. ఆ విత్తనమే ‘ధృవ’లా వచ్చింది. నాతో పాటు ఈ కథను నమ్మిన మా టీమ్కి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నోట్ల రద్దు ప్రభావం ఉన్నప్పటికీ రిస్క్ చేసి సినిమా రిలీజ్ చేశాం. అయినా... ప్రేక్షకులు మంచి హిట్ చేశారు. ఈ ఏడాది గీతా ఆర్ట్స్లో చరణ్తో ‘ధృవ’, బన్నితో ‘సరైనోడు’, అల్లు శిరీష్తో ‘శ్రీరస్తు శుభమస్తు’ వంటి హిట్ చిత్రాలు చేయడం వ్యక్తిగతంగా ఆనందాన్నిచ్చింది’’ అన్నారు అల్లు అరవింద్. ‘‘కథను నమ్మి హీరో, నిర్మాతలు ముందడుగు వేశారు. మంచి విజయం అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు సురేందర్రెడ్డి. కథానాయిక రకుల్, సంగీత దర్శకుడు ‘హిప్ హాప్’ తమిళ, నటులు నవదీప్, అలీ, పాటల రచయితలు చంద్రబోస్, వరికుప్పల యాదగిరి పాల్గొన్నారు. -
అఖిల్ మూడో సినిమాకు స్టైలిష్ డైరెక్టర్..?
అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నట వారసుడు రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. త్వరలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తన రెండో సినిమాను ప్రారంభించబోతున్నాడు అఖిల్. ఈ సినిమాతో సక్సెస్ ఫుల్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న అఖిల్ అదే సమయంలో తరువాత చేయబోయే సినిమా విషయంలో కూడా ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇటీవల ధృవ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు అఖిల్. స్టైలిష్ డైరెక్టర్గా పేరున్న సురేందర్ రెడ్డితో సినిమా చేసే అఖిల్ కెరీర్కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు అక్కినేని టీం. అందుకే రెండో సినిమా సెట్స్ మీదకు వెళ్లకు ముందే మూడో సినిమా కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. త్వరలోనే అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
నేను సినిమాల్లో నటించాలనుకోలేదు
‘‘దళపతి, రోజా సినిమాల్లో నటించేటప్పుడు నా వయసు 21 సంవత్సరాలు. అప్పట్లో నేను సినిమాల్లో నటించాలనుకోలేదు. ఎందుకంటే నాకు సిగ్గెక్కువ. అయితే నటించడం మొదలు పెట్టాక వరుసగా సినిమాలు చేశా’’ అన్నారు అరవింద్ స్వామి. రామ్చరణ్, రకుల్ ప్రీత్సింగ్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ‘ధృవ’ ఈ నెల 9న విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించి, మెప్పించిన అరవింద్ స్వామి మాట్లాడుతూ– ‘‘నేను సినిమాలే లోకం అనుకోలేదు. మధ్యలో బ్రేక్ తీసుకుని బిజినెస్లు చేశా. ‘ధృవ’ సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ‘తని ఒరువన్’లో నేను చేసిన పాత్రే ‘ధృవ’లో చేయడంతో పెద్ద కష్టం అనిపించలేదు. సిద్ధార్థ అభిమన్యు పాత్రలో తెలుగు ప్రేక్షకులు కూడా నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. భవిష్యత్తులోనూ నెగటివ్ రోల్స్ చేస్తా. వచ్చే ఏడాది చివర్లో డైరెక్షన్ చేయాలను కుంటున్నా. కథలు రెడీ చేసుకున్నా. అయితే, నా చిత్రంలో నేను నటించను. దర్శకులు మణిరత్నం గారితో పని చేయడానికి ఎప్పుడైనా సిద్ధమే. ‘తని ఒరువన్’ తర్వాత ‘జయం’ రవి, నేను నటించిన తమిళ చిత్రం∙‘బోగన్’ షూటింగ్ పూర్తయింది. ‘సదురంగ వేటై్ట’ సీక్వెల్, ‘వనంగా ముడి’, ‘భాస్కర్ ది రాస్కెల్’ తదితర చిత్రాల్లో నటిస్తున్నా’’ అని చెప్పారు. -
నా స్వార్థంతోనే ధృవ తీశా..
‘‘చాలా మంది హీరోలు సెట్స్కి వచ్చామా.. డైరెక్టర్ చెప్పినట్లు చేశామా.. వెళ్లిపోయామా.. అన్నట్టు ఉంటారు. కానీ, చరణ్లో నాకు నచ్చే విషయం ఏంటంటే... సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్నీ కూలంకషంగా డిస్కస్ చేస్తాడు. అందువల్ల కంటెంట్ మీద నమ్మకం పెరుగుతుంది. అవుట్పుట్ కూడా బాగుంటుంది. నిర్మాతకు ఏ విధమైన అభద్రతాభావం ఉండదు. మా ‘ధృవ’ హిట్ టాక్తో మంచి వసూళ్లు రాబడుతోంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. రామ్చరణ్, రకుల్ ప్రీత్సింగ్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ‘ధృవ’ ఈ నెల 9న విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం గురించి అల్లు అరవింద్ పలు విశేషాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో హీరో పాత్రతో సమానంగా విలన్ (అరవింద్ స్వామి) పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంకో హీరో అయితే నా పాత్ర పరిధి పెంచండి, నా క్యారెక్టర్కు ఇంపార్టెన్స్ ఉండాలి అనేవారేమో. కానీ, చరణ్ మాత్రం ఎటువంటి డిస్కషన్స్ పెట్టలేదు. ‘తని ఒరువన్’ ఒరిజినల్లో పెద్ద మార్పులేమీ చేయొద్దన్నాడు. అందుకే సినిమాలో అరవింద్స్వామి పాత్రకూ అంత ఇంపార్టెన్స్ ఉంది. యాక్టింగ్, మేకోవర్ పట్ల చరణ్ ఎంతో శ్రద్ధ తీసుకుని సినిమా బాగా రావాలనే తపనతో వర్క్ చేశాడు. టీమ్ అందర్నీ కలుపుకుని వర్క్ చేయించాడు. దర్శకుడు సురేందర్ రెడ్డిని ఎంత బాగా ఎంకరేజ్ చేశాడో నాకు తెలుసు. ► ‘మగధీర’, ఇప్పుడు ‘ధృవ’.. చరణ్తో రెండు సినిమాలు నిర్మించా. తన కెరీర్ గ్రాఫ్ చూస్తే.. అందులో అత్యధిక వసూళ్లు సాధించిన రెండు సినిమాలూ నావే ఉండాలనే స్వార్థంతో ‘ధృవ’ తీశా. ఈ సినిమా ప్లాన్ చేసినప్పుడు ‘మగధీర’ కంటే ఎక్కువ వసూలు చేయాలనీ, చరణ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన మరో సినిమా కావాలనీ అనుకున్నా. సినిమా సూపర్హిట్. వసూళ్లు గురించి ఈ వారాంతం తర్వాత మాట్లాడితేనే బాగుంటుంది. శని, ఆదివారాల్లో వసూళ్లు బాగుంటాయి కదా. ► ‘ధృవ’కు కంటెంట్ ఈజ్ కింగ్. కథా బలం ఉండటంతో నోట్ల రద్దు కలెక్షన్స్పై ప్రభావం చూపదని నా బలమైన నమ్మకం. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రం కూడా కథా బలంతోనే బాగా ఆడింది. ‘ధృవ’ విడుదల తర్వాత అన్ని చోట్లా వసూళ్లు సంతృప్తికరంగా ఉన్నాయి. ఓవర్సీస్లోనూ వసూళ్లు చాలా బాగున్నాయి. ‘ఏ’ సెంటర్లలో వసూళ్లపై నోట్ల రద్దు ప్రభావం అంత లేకపోయినా, ‘బి, సి’ సెంటర్లలో మాత్రం కచ్చితంగా ఉందనే చెప్పాలి. ప్రస్తుతానికి మా సినిమా కలెక్షన్స్ చూస్తే 10 నుంచి 20 శాతం నోట్ల రద్దు ప్రభావం ఉందని అర్థమైంది. లేకపోతే, వసూళ్లు ఇంకా ఎక్కువగా ఉండేవనడంలో సందేహం లేదు. ► ‘ధృవ’ విడుదల గురించి నేను, చరణ్ చాలా డిస్కస్ చేసుకున్నాం. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఇప్పుడు సినిమా విడుదల చేస్తే వసూళ్లపై ప్రభావం పడుతుందేమో? అన్నాడు చరణ్. పోనీ సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకుంటే అప్పుడు చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ వస్తుంది. ఆ తర్వాత అంటే సమ్మర్లోనే. అంత గ్యాప్ తీసుకోవడం ఇష్టం లేక డిసెంబర్లోనే రిలీజ్ చేద్దామనుకున్నాం. ► ‘వసూళ్లపై ప్రభావం పడితే.. ఆ రిస్క్ ఏదో నేనే పడతాను’ అని చరణ్కి చెప్పా. ముందుగా డిసెంబర్ 2న రిలీజ్ అనుకున్నాం. అయితే, నెల మొదట్లో అంటే జనాలకు డబ్బుల ఇబ్బంది ఉంటుంది. 9న అయితే వారం గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ సమస్య ఉండదని చరణ్ చెప్పడంతో.. నిజమే కదా అనిపించి 9న విడుదల చేశాం. అయితే ఒకటి మాత్రం చెప్పాలి.. చరణ్ మానిటరింగ్ లేకపోతే ఈ సినిమా తీసేవాణ్ణి కాదు. -
మెగా అభిమానులకు మరో షాక్
దాదాపు దశాబ్ద కాలంగా మెగాస్టార్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆ రోజు దగ్గరకొచ్చింది. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో సందడి మొదలైపోగా, ఆడియో వేడుక కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో మెగా అభిమానులకు భారీ షాక్ ఇచ్చారు చిత్రయూనిట్. మెగా ఫ్యామిలీ గత చిత్రాలు సరైనోడు, ధృవ మాదిరిగానే ఖైదీ నంబర్ 150కి ఆడియో ఫంక్షన్ ఉండదన్న టాక్ వినిపిస్తోంది. అభిమానుల కోసం ఈ నెల 18న 'అమ్మడు లెట్స్ డు కుమ్మడు' అనే సాంగ్ టీజర్ను రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 25న ఆడియోను డైరెక్ట్గా మార్కెట్ లోకి రిలీజ్ చేసి.. తరువాత సినిమా రిలీజ్కు ముందు ఓ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా. సెంటిమెంట్ పరంగా కూడా ఆడియో వేడుకను క్యాన్సిల్ చేసే అవకాశాలే ఎక్కువ అన్న టాక్ వినిపిస్తోంది. -
చిరుతో సురేందర్ రెడ్డి సినిమా ఏమైంది..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ధృవ. తమిళ సినిమా తనీ ఒరువన్కు రీమేక్ తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యేలా తెరకెక్కించటంలో విజయం సాధించాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. అందుకే సూరి వర్కింగ్ స్టైల్, టేకింగ్ నచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన నెక్ట్స్ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తారన్న ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ధృవ కలెక్షన్లకు కూడా ప్లస్ అయ్యింది. ఆశించినట్టుగా ధృవ మంచి టాక్ సొంతం చేసుకుంది. కానీ మెగాస్టార్ తో సురేందర్ రెడ్డి సినిమా మాత్రం వాయిదా పడింది. ధృవ తరువాత అంతా కొత్త వారితో ఓ సినిమా చేయబోతున్నట్టుగా ప్రకటించాడు సురేందర్ రెడ్డి. మెగాస్టార్ తో సినిమా ఉంటుందని కాని ఏది ఎప్పుడు అన్నది ఇప్పుడే చెప్పలేమన్నాడు. నిజంగానే చిరుతో సురేందర్ రెడ్డి సినిమా ఉంటుందా..? లేక ధృవ ప్రమోషన్ కోసం ఇలాంటి టాక్ సృష్టించారా.. అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. -
ధృవ వసూళ్లు.. ఆ మైలురాయిని దాటుతుందా?
మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజా సినిమా 'ధృవ'. గతవారం విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్, సానుకూల రివ్యూలు వచ్చినా.. అనుకున్నంతగా వసూళ్లు మాత్రం సాధించలేదని వినిపిస్తోంది. 'ధృవ' వసూళ్లలో దూసుకుపోకపోవడానికి ప్రధాన కారణాల్లో నోట్లరద్దు ఒకటని చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విడుదలైన 'ధృవ' సినిమా తొలి మూడు రోజుల్లో దాదాపు 20 కోట్లు మాత్రమే వసూలు చేసిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా 50 కోట్ల క్లబ్బులో చేరుతుందా అంటే పరిశీలకులు ఏమీ చెప్పలేకపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా.. ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం ఈ సినిమా దుమ్మురేపుతోంది. తొలిసారిగా విదేశాల్లో మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించిన రాంచరణ్ సినిమాగా నిలిచింది. అయితే, రానున్న రెండువారాల్లో పెద్ద సినిమాల విడుదల లేకపోవడం 'ధృవ'కు అడ్వాంటేజ్ అని పరిశీలకులు అంటున్నారు. ఈ రెండువారాల్లో వసూళ్లు పుంజుకుంటే.. ఈ చిత్రం 50 కోట్ల క్లబ్బులో చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్టైలిష్ దర్శకుడు సురేందర్రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్, రకుల్ప్రీత్, అరవిందస్వామి ప్రధాన పాత్రల్లో భారీ బడ్జెట్తో 'ధృవ' తెరకెక్కింది. -
మేకింగ్ ఆఫ్ మూవీ - ధృవ
-
ధ్రువపై డైరెక్టర్ రాజమౌళి కామెంట్!
మెగాపవర్ స్టార్ రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన తాజా సినిమా ధ్రువ. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై స్టార్ డైరెక్టర్ రాజమౌళి ట్విట్టర్లో స్పందించాడు. ఇమేజ్ కన్నా కథకు అధిక ప్రాధాన్యమివ్వడం వల్ల ధ్రువ సినిమా ఆసక్తికరంగా, కట్టిపడేసేలా ఉందని, అందుకు చరణ్ను, డైరెక్టర్ సురేందర్ రెడ్డిని ఎంతగానో అభినందిస్తున్నానని రాజమౌళి ట్వీట్ చేశాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు అద్భుతమైన ఫిజిక్తో చరణ్ గొప్పగా కనిపించాడని, సినిమా మొత్తం చక్కని ఎక్స్ప్రెషన్స్ చూపించాడని, రకుల్ కూడా చక్కగా నటించిందని కితాబిచ్చారు. ఇప్పటికే ఈ సినిమా తమిళ్ వెర్షన్లో తానేంటో రుజువు చేసుకున్న అరవింద్ స్వామి తెలుగులోనూ అద్భుతంగా నటించాడని, ఈ సినిమాకుగాను రైటర్కు ఫుల్ మార్కులు ఇవ్వొచ్చునని, అతనే నిజమైన హీరో అని కొనియాడారు. My full appreciation to charan and surendarreddy for keeping the story infront instead of image which made Dhruva intresting and captivating — rajamouli ss (@ssrajamouli) 11 December 2016 -
'ఆ పాత్ర కోసం ఎవరినీ అడగలేదు'
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ధృవ. తమిళ సూపర్ హిట్ తనీ ఒరువన్కు రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. థ్రిల్లింగ్ మైండ్ గేమ్తో సాగే ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర కూడా హీరోకు సమానంగా ఉంటుంది. తమిళ నాట ఈ పాత్రలో నటించిన అరవింద్ స్వామికి మంచి గుర్తింపు వచ్చింది. అందుకే తెలుగు వర్షన్ లోనూ ఆయన్నే విలన్గా తీసుకున్నారు. అయితే ధృవ సినిమా ప్రారంభానికి ముందు విలన్ పాత్రకు టాలీవుడ్ ప్రముఖులను సంప్రదించారన్న టాక్ వినిపించింది. ముఖ్యంగా సీనియర్ హీరో నాగార్జున ఈ విలన్ పాత్రకు అంగీకరించాడన్న వార్త అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. అదే సమయంలో జగపతిబాబు లాంటి సీనియర్ హీరోల పేర్లు కూడా వినిపించాయి. అయితే తాజాగా ఈ రూమర్స్ క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. తనీ ఒరువన్ సినిమాను రీమేక్ చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడే విలన్ పాత్రకు అరవింద్ స్వామినే తీసుకోవాలని ఫిక్స్ అయినట్టుగా తెలిపాడు. మరే నటుణ్ని సంప్రదించలేదన్న డైరెక్టర్, ఈ పాత్ర కేవలం ఆయన కోసం పుట్టింది. ఆయన తప్ప ఇంకెవరూ ఆ పాత్రకు న్యాయం చేయలేరన్నాడు. తొలి రోజే 10 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన ధృవ ఓవర్సీస్లో హాఫ్ మిలియన్ మార్క్ను దాటి వన్ మిలియన్ క్లబ్లో స్థానం కోసం పరుగులు తీస్తోంది. -
'ధృవ' మూవీ రివ్యూ
టైటిల్ : ధృవ జానర్ : యాక్షన్ థ్రిల్లర్ తారాగణం : రామ్చరణ్, అరవింద్ స్వామి, రకుల్ ప్రీత్ సింగ్, నవదీప్, పోసాని కృష్ణమురళి సంగీతం : హిప్ హప్ తమిళ (ఆదిత్య) దర్శకత్వం : సురేందర్ రెడ్డి నిర్మాత : అల్లు అరవింద్, ఎన్ వీ ప్రసాద్ బ్రూస్ లీ సినిమాతో మెగా అభిమానులను నిరాశపరిచిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, రీమేక్ గా తెరకెక్కిన ధృవ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో భారీ రికార్డ్ ల మీద కన్నేసిన చరణ్, అందుకు తగ్గట్టుగా లుక్, బాడీలాంగ్వేజ్ విషయంలో కూడా కొత్తదనం చూపించే ప్రయత్నం చేశాడు. మరి చరణ్ ఈ ప్రయత్నంలో సక్సెస్ సాధించాడా..? ధృవ ఆశించినట్టుగా రికార్డ్ లను తిరగరాస్తుందా..? కథ : ధృవ(రామ్చరణ్).. దేశంలో జరిగే అన్యాయాలను అంతం చేయాలన్న ఆశయంతో ఐపీఎస్ లో జాయిన్ అయిన కుర్రాడు. నీ శత్రువు గురించి తెలిస్తే నీ స్టామినా ఏంటో తెలుస్తుంది అనే మనస్థత్వం కలిగిన కుర్రాడు. అదే బ్యాచ్ లో తనలాంటి భావాలున్న వ్యక్తులతో కలిసి రాత్రుళ్లు కొన్ని కేసులకు సంబంధించిన నేరస్తులను పోలీసులకు పట్టిస్తుంటాడు. అంతేకాదు తాను చూసిన ప్రతీ కేసు వెనుక ఉన్న నిజానిజాలను ఎంక్వైరీ చేసి ఆ నేరాల వెనుక ఉన్న అసలు నేరస్తులను పట్టుకోవాలని భావిస్తాడు. ధీరజ్ చంద్ర, జయంత్ సూరి, ఇర్ఫాన్ అలీ అనే వ్యక్తులు హైదరాబాద్ లో జరిగే నేరాలకు ముఖ్య కారకులని తెలుసుకున్న ధృవ, వీళ్లలో అందరికంటే బలమైన నేరస్తుడ్ని తన టార్గెట్ గా ఫిక్స్ చేసుకోవాలనుకుంటాడు. అప్పుడే ఈ ముగ్గురు వెనకాల ఉన్నది ఒకే వ్యక్తి అన్న నిజం తెలుస్తుంది. ప్రఖ్యాత సైంటిస్ట్ గా, సమాజంలో పెద్ద మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న సిద్దార్థ్ అభిమన్యు (అరవింద్ స్వామి) ఈ ముగ్గురినీ బినామీలుగా పెట్టుకొని నేరాలు చేస్తున్నాడని తెలుసుకుంటాడు. పేదవారి ప్రాణాలను కాపాడటం కోసం అతి తక్కువ రేటుకే మందులను అందించే అగ్రిమెంట్ను అడ్డుకొని దేశం మొత్తం తన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవాలనుకుంటాడు సిద్దార్థ్. ఈ విషయం తెలుసుకున్న ధృవ... సిద్దార్ధ్ ను ఎలా అడ్డుకున్నాడు..? ఎంతో తెలివిగా నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న సిద్దార్ధ్ అంత ఈజీగా పట్టుబడ్డాడా..? చివరకు ధృవ అనుకున్నది సాధించాడా..? సిద్దార్ధ్ అభిమన్యు ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఈ సినిమా కోసం తన లుక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న రామ్చరణ్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయాడు. సిక్స్ ప్యాక్ బాడీతో, సరికొత్త బాడీలాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు. తన గత సినిమాలతో పోలీస్తే నటుడిగాను ఈ సినిమాతో తన స్థాయిని ప్రూవ్ చేసుకున్నాడు. తెలివైన శత్రువుతో పోరాడే సమయంలో ఎదురయ్యే మానసిక సంఘర్షణను అద్భుతంగా చూపించాడు. విలన్గా అరవింద్ స్వామి సూపర్బ్. ఎక్కడ అతి లేకుండా సెటిల్డ్ పర్ఫామెన్స్ తో సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచాడు. హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రాతకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా.. ఉన్నంతలో మంచి నటన కనబరించింది. ముఖ్యంగా రకుల్ గ్లామర్ షో సినిమాకు మరో ఎసెట్. ఇతర పాత్రల్లో నవదీప్, పోసాని కృష్ణమురళీ, విద్యుల్లేక లు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : మరో భాషలో ఘనవిజయం సాధించిన సినిమాను రీమేక్ చేయటం అంత ఈజీ కాదు. ప్రతీ విషయంలోనూ ఒరిజినల్ సినిమాతో పోల్చి చూస్తారు. అయితే ఆ రిస్క్ ను తలకెత్తుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి మంచి సక్సెస్ సాధించాడు.అదే కథను మరింత రేసీ స్క్రీన్ ప్లే తో తెరకెక్కించాడు. యాక్షన్ సీన్స్ తో పాటు సాంగ్స్ చాలా స్టైలిష్ గా ప్లాన్ చేసిన సూరి, థియేటర్లో ఉన్నంత సేపు ఇది రీమేక్ సినిమా అన్న విషయం మరిచిపోయేలా చేశాడు. హిప్ హప్ తమిళ అందించిన పాటలు వినటానికి సోసోగా ఉన్న విజువల్ గా మాత్రం అలరిస్తాయి. నేపథ్య సంగీతం సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్. పి ఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా ట్రైనింగ్ సమయంలో తీసిన సీన్స్, సాంగ్స్ విషయంలో కెమరా వర్క్ చాలా బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్, గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : రామ్చరణ్, అరవింద్ స్వామి స్క్రీన్ ప్లే నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : పాటలు సినిమా లెంగ్త్ ఓవరాల్గా ధృవ.. రామ్చరణ్ స్థాయిని పెంచే చేసే స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
‘ధృవ’ చిచ్చు
పార్టీల విషయంలో రెండు వర్గాలుగా చీలిన చిరు యువత సినిమా టికెట్ల విషయంలో పోట్లాట సిరి థియేటర్లో పంచాయతీ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ వర్గం నెల్లూరు సిటీ: సినీ నటుడు చిరంజీవి తనయుడు రామ్చరణ్తేజ నటించిన ధృవ సినిమా చిరంజీవి యువతలోని రెండు వర్గాల మధ్యన చిచ్చు రేపింది. పార్టీల నేపథ్యంలో చిరంజీవి యువత రెండు వర్గాలుగా విడిపోయి టికెట్ల విషయంలో తరచూ గొడవపడుతున్న విషయం తెలిసిందే. నగరంలోని సిరి థియేటర్లో ఈ నెల 9న ధృవ సినిమా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి యువతలోని ఓ వర్గం థియేటర్ వద్దకు చేరుకుని యాజమాన్యంతో తమ వాటా టికెట్లు ఇవ్వాలని కోరింది. దీంతో మేనేజర్ శ్రీనివాసులు చిరంజీవి యువత నాయకులు తమకు ఇవ్వాల్సిన టికెట్లను తీసిòపెట్టాలని చెప్పారని, ఇన్ని వర్గాలు వస్తే తాము టికెట్లు ఇవ్వలేమని తెలిపారు. దీంతో ఆ వర్గం తమకు రావాల్సిన 30శాతం టికెట్లు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో యాజమాన్యం చిరంజీవి యువత అధ్యక్షుడు కొట్టే వెంకటేశ్వర్లు, రవి, కృష్ణారెడ్డికు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. దీంతో మరో వర్గం థియేటర్ వద్దకు చేరుకుంది. కాంగ్రెస్ను వీడి ఇతర పార్టీలోకి వెళ్లిన వారికి టికెట్లు ఇవ్వవద్దని చెప్పడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది. థియేటర్ యాజమాన్యం జోక్యం చేసుకోవడంతో వివాదం సమసింది. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు... తమకు రావాల్సిన టికెట్లు ఇవ్వడం లేదని, అభిమానులకు టికెట్లు దక్కకుండా చూస్తున్నారని ఓ వర్గం నాయకులు సుజయ్బాబు, చక్రవర్దన్రెడ్డి, సనత్, వెంకటరమణ, మదన్ మూడో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు టికెట్ల పంపకాలు నిలిపివేయాలని థియేటర్ యాజమాన్యాన్ని ఆదేశించారు. -
ధృవ కోసం మరో సినిమా వాయిదా
బ్రూస్లీ లాంటి డిజాస్టర్ తరువాత రామ్చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ధృవ. తమిళ సినిమా తనీ ఒరువన్కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద యూనిట్ సభ్యులతో పాటు రామ్చరణ్ కూడా భారీ ఆశలు పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్టుగా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా ధృవ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. రామ్చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా, ఒరిజినల్ వర్షన్లో విలన్గా నటించిన అరవింద్ స్వామి ఈ సినిమాలో కూడా ప్రతినాయక పాత్రలో నటించాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలలో కూడా భారీ రిలీజ్కు ప్లాన్ చేసిన నిర్మాత అల్లు అరవింద్, ప్రస్తుతం ఈ సినిమాకు లైన్ క్లియర్ చేసే పనిలో ఉన్నాడు. అందుకోసం ఇప్పటికే తమిళ స్టార్ హీరో సూర్య సినిమా సింగం 3ని వారం పాటు వాయిదా వేయించాడు. తాజాగా ఓ కన్నడ సినిమాను కూడా వాయిదా వేయించాడు అరవింద్. తెలుగులో సూపర్ హిట్ అయిన భలే భలే మొగాడివోయ్ సినిమా కన్నడలో సుందరంగ జాణ పేరుతో రీమేక్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అక్కడ మంచి ఫాలోయింగ్ ఉన్న గణేష్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. అయితే ఈ సినిమాను డిసెంబర్ 9న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ ధృవ రిలీజ్కు సాండల్వుడ్లో థియేటర్ల సమస్య ఎదురవుతుందన్న ఆలోచనతో అరవింద్,ఈ సినిమాను కూడా డిసెంబర్ 23కు వాయిదా వేయించాడట. ప్రముఖ నిర్మాత రాక్లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న సుందరంగ జాణకు అల్లు అరవింద్ నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరిస్తున్నాడు. -
చిరంజీవిగారితో...ప్రేక్షకులకు కిక్ ఇస్తా!
రామ్చరణ్, రకుల్ప్రీత్ సింగ్ జంటగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్లు నిర్మించిన ‘ధృవ’ ఈ నెల 9న విడుదలవుతోంది. తమిళ హిట్ ‘తని ఒరువన్’కి రీమేక్గా తెరకెక్కిన ఈ ‘ధృవ’తో పాటు తదుపరి చిత్రాల గురించి సురేందర్రెడ్డి చెప్పిన ముచ్చట్లు... ► చరణ్ (రామ్చరణ్)తో సినిమా చేయాలనుకున్నాక ఓ కథ గురించి డిస్కస్ చేశా. ఓ రోజు ‘తని ఒరువన్’ రీమేక్ చేస్తే? ఎలా ఉంటుందన్నారు. నా అభిప్రాయాలు చెప్పా. ‘నువ్వు డెరైక్ట్ చేస్తావా?’ అని అడిగారు. ‘నేను చేయగలనా, లేదా?’ అని రెండు రోజులు ఆలోచించి ఓకే చెప్పా. కానీ, ఈ సినిమాకి ఎంత ఎంజాయ్ చేశానో... అంత కష్టపడ్డా. లైఫ్లో మళ్లీ రీమేక్స్ చేయను. ఎందుకంటే, మన క్రియేటివిటీ చూపించలేం. ‘ధృవ’కి మూలకథను మార్చకుండా స్క్రిప్ట్లో చిన్న మార్పులు చేశాం. తెలుగులో అరవింద్ స్వామి పాత్ర నిడివి కూడా తగ్గించలేదు. ►క్యారెక్టర్ కోసం ఏమైనా చేసే హీరో చరణ్. దర్శకులకు పూర్తి స్వేచ్ఛనిస్తారు. ‘ధృవ’ కోసం ఆరు నెలలు జిమ్ బాడీ మెయిన్టైన్ చేశారు. అది చాలా కష్టం. అంతకు ముందు చరణ్ గురించి చాలా విన్నాను. కానీ, ఆయన ఓ మంచి మనసున్న వ్యక్తి. ఓ మాట ఇచ్చారంటే ఎప్పటికీ మర్చిపోరు. ► ‘జాగ్వార్’ చిత్ర ఫేమ్ అయిన కన్నడ హీరో నిఖిల్గౌడతో సినిమా ఆఫర్ ఉంది కానీ, చేయడం లేదు. చిరంజీవిగారితో చిత్రానికి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆయనతో కలసి ప్రేక్షకులకు ‘కిక్’ తరహా యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్తా. కథ రెడీగా ఉంది. వచ్చే ఏడాది కచ్చితంగా ఆ సినిమా ఉంటుంది. -
‘ధృవ’ చిత్రం ప్రీ-రిలీజ్ ఫంక్షన్
-
‘ఆ సీడీ చూడగానే చరణ్ పెద్ద హీరో అవుతాడనుకున్నాం’
‘‘అభిమానులను అలరించడానికి ప్రతి హీరో ప్రతి చిత్రాన్ని కష్టపడి చేస్తారు. లోకువగానో, ఈజీగానో తీసుకోరు. నేనూ అంతే. ఇంత కష్టపడకపోతే తప్పవుతుంది. పైగా, జనవరిలో నాన్నగారి ‘ఖైదీ నంబర్ 150’ వస్తుంది. ఆయన లేని టైమ్లో మేము అటూ ఇటూగా ఉన్నా ఫర్వాలేదు. ఆయన వస్తున్నారు కనుక ఇప్పుడింకా క్రమశిక్షణతో ఉంటాం’’ అన్నారు రామ్చరణ్. ఆయన హీరోగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘ధృవ’. ఆదివారం రాత్రి హైదరాబాద్లో ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరిగింది. తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. కేటీఆర్ మాట్లాడుతూ - ‘‘నిర్మలమైన, మంచి మనసున్న వ్యక్తి చిరంజీవిగారు. చరణ్ పెంపకంలో అది కనిపిస్తోంది. చరణ్ 9వ చిత్రమిది. ఆయన లక్కీ నంబర్.. కార్ నంబర్... బర్త్డే టోటల్ నంబర్ కూడా 9. ‘ధృవ’ కూడా ఈ నెల 9న వస్తోంది. తప్పకుండా హిట్టవుతుంది. ట్రైలర్ చూసిన తర్వాత నేను కూడా ఫిట్ కావాలనుకున్నా. సిక్స్ప్యాక్ మన వల్ల కాదు. నాకు రెండు ప్యాక్స్ చాలు’’ అన్నారు. గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ - ‘‘ఈ వేడుకను విశాఖలో చేస్తామని చరణ్ ప్రామిస్ చేశారు. సక్సెస్ మీట్ను విశాఖలో జరపాలి. ‘ఖైదీ నంబర్ 150’ వేడుకనూ అక్కడే జరపాలని కోరుతున్నాం’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ - ‘‘మెగాస్టార్ కొడుకు హీరోగా వస్తే బాగుంటుందనే ఆశ మాకు ఉండేది. చరణ్ పెద్ద హీరో అవుతాడా? లేదా? అని సస్పెన్స్ ఉండేది. ముంబై ఫిల్మ్ స్కూల్కి చరణ్ వెళ్లొచ్చిన తర్వాత.. అందులో చేసిన ఆడిషన్ సీడీని చిరంజీవి గారు చూపించగానే పెద్ద యాక్టర్ అవుతాడనిపించింది’’ అన్నారు. అరవింద్ స్వామి మాట్లాడుతూ - ‘‘కొందరు దర్శకులు ఉన్నది ఉన్నట్టుగా రీమేక్ చేస్తే, ఇంకొందరు మార్పులు చేస్తారు. సురేందర్రెడ్డిగారు సరైన మార్పులు చేశారు. ప్రతి ఒక్కరూ వాళ్ల చిన్నప్పుడు నేనెలా ఉన్నానో, ఇప్పుడూ అలానే ఉన్నానని చెప్తున్నారు. రేపు వాళ్ల పిల్లలు పెద్దైన తర్వాత కూడా ఇదే చెప్తారని ఆశిస్తున్నా’’ అన్నారు. ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ - ‘‘విడుదలైన రోజునే ‘తని ఒరువన్’ చూశా. మర్నాడు చరణ్కి ఫోన్ చేసి సినిమా చూడమని చెప్పా. చూసిన తర్వాత చేస్తానని చెప్పారు’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘మనకు కనపడే చరణ్ వేరు, ఆయన హృదయం వేరు. ఈ సినిమా ద్వారా మంచి హీరో, స్నేహితుడు దొరికాడని గర్వంగా చెప్పుకోవచ్చు. చరణ్ ఇష్టపడి, తను కొత్తగా చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను సెలెక్ట్ చేసుకుని నాకు ఇచ్చారు’’ అన్నారు. దర్శకులు వీవీ వినాయక్, బోయపాటి శ్రీను, సుకుమార్, వంశీ పైడిపల్లి, పరశురామ్, మారుతి, హీరోలు రానా, నవదీప్, హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్, సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ (ఆది) పాల్గొన్నారు. -
విలన్ పాత్రకు కత్తెర
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ధృవ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ్లో ఘనవిజయం సాధించిన తనీఒరువన్కు ధృవ రీమేక్గా తెరకెక్కింది. ఒరిజినల్ వర్షన్లో హీరోకు ధీటుగా కనిపించే విలన్ పాత్రలో నటించిన అరవింద్ స్వామి, తెలుగు వర్షన్ లోనూ విలన్ రోల్లో నటిస్తున్నాడు. అయితే ఒరిజినల్ వర్షన్ విలన్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. దాదాపు హీరో కనిపించినంత సేపు విలన్ కూడా తెర మీద కనిపిస్తాడు. కానీ తెలుగు వర్షన్లో మాత్రం ఆ క్యారెక్టర్కు ఉన్న ఇంపార్టెన్స్కు కోత పెట్టారన్న టాక్ వినిపిస్తోంది. తమిళ్తో పొలిస్తే ధృవ సినిమాలో అరవింద్ స్వామి పాత్ర చాలా తక్కువగా ఉంటుందట. అయితే కోలీవుడ్లో సక్సెస్లో కీ రోల్ ప్లే చేసిన విలన్ క్యారెక్టర్కు కోత పెడితే.., తెలుగులో సినిమా రిజల్ట్ తేడా పడే చాన్స్ ఉందన్న టాక్ కూడా వినిపిస్తోంది. -
మెగా అభిమానులకు నిరాశే..!
ప్రస్తుతం టాలీవుడ్లో ధృవ ఫీవర్ నడుస్తోంది. బడా స్టార్ హీరో సినిమా రిలీజ్ అయి చాలా కాలం అవుతుండటంతో రామ్చరణ్ హీరోగా తెరకెక్కిన ధృవ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తన గత సినిమా బ్రూస్లీ నిరాశపరచటంతో చరణ్ కూడా ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ముఖ్యంగా ఓవర్సీస్లో మిలియన్ మార్క్ను అందుకోవటంతో పాటు ఓవరాల్గా వందకోట్ల క్లబ్లో చేరాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. డిసెంబర్ 9న రిలీజ్ అవుతున్న ధృవ విషయంలో మెగా అభిమానులకు నిరాశ తప్పదని తెలుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అర్థరాత్రి నుంచే బెనిఫిట్ షోల సందడి మొదలవుతుంది. తమ అభిమాన నటుడి సినిమాను అందరికంటే ముందే చూసేందుకు ఫ్యాన్స్ ఎంత రేటు పెట్టైనా టికెట్ కొనేందుకు సిద్ధమవుతారు. అయితే ధృవ విషయంలో మాత్రం నిర్మాత అల్లు అరవింద్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. ధృవ సినిమాకు ఎలాంటి బెనిఫిట్ షోస్ ఉండవట. ఉదయం ఆరుగంటల తరువాతే తొలి షో వేసేలా ప్లాన్ చేస్తున్నారు. బెనిఫిట్ షోస్ కారణంగా ముందే టాక్ బయటికి వచ్చేయటంతో సినిమా కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలో సరైనోడు రిలీజ్ సమయంలోనూ బెనిఫిట్ షోలకు నో చెప్పిన అల్లు అరవింద్. ప్రస్తుతం ధృవ విషయంలోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. -
నానీని ఇబ్బంది పెడుతున్న రామ్చరణ్
వరుస సక్సెస్లతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని ప్రస్తుతం నేను లోకల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు అనుకున్న సమయానికి నాని సినిమా రిలీజ్ కాకుండా రామ్చరణ్ అడ్డుపడుతున్నాడట. అంటే రామ్ చరణ్ నానికి సినిమా ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నాడని కాదు. ధృవ సినిమా రిలీజ్ కూడా ఇదే నెలలో ఉండటంతో ఇతర సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో ఇబ్బందులు తప్పటం లేదు. డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ధృవ సినిమాతో భారీ కలెక్షన్లను టార్గెట్ చేశాడు రామ్ చరణ్. అందుకే సినిమా రిలీజ్ అయిన వారం తరువాత కూడా పెద్ద సినిమాలేవి అడ్డు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా డిసెంబర్ 16న రిలీజ్ కావాల్సిన సూర్య సింగం 3 సినిమాను వారం పాటు వాయిదా వేయించాడు. దీంతో సింగం 3 డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. సింగం వాయిదా పడటంతో డిసెంబర్ 23న రావాల్సిన నాని, నేను లోకల్ రిలీజ్ విషయంలో కూడా డైలమా ఏర్పడింది. సింగంతో పోటి పడాలా.. లేక తను కూడా సినిమాను వాయిదా వేసుకోవాలా అన్న ఆలోచనలో ఉన్నాడు నేచురల్ స్టార్. -
ధృవ కోసం సింగం 3 వాయిదా..?
ఈ సారి ఎలాగైన వంద కోట్ల క్లబ్లో అడుగుపెట్టాలన్న కసితో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. కాస్త ఆలస్యంగా అయినా పర్ఫెక్ట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావాలని దసరాకే రిలీజ్ కావాల్సిన ధృవ సినిమాను డిసెంబర్కు వాయిదా వేశాడు. డిసెంబర్ 9న ధృవ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అయితే చరణ్ అనుకున్నట్టుగా వంద కోట్ల కలెక్షన్లు సాధించాలంటే ఈ సినిమా కనీసం రెండు వారాల పాటు థియేటర్లలో ఉండాలి. కానీ ధృవ రిలీజ్కు కరెక్ట్గా వారం తరువాత, డిసెంబర్ 16న సూర్య హీరోగా తెరకెక్కిన మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ సింగం 3 రిలీజ్ అవుతోంది. తమిళ్తో పాటు తెలుగు నాట కూడా భారీ ఫాలోయింగ్ ఉన్న సూర్య సినిమా విడుదలైతే ధృవ కలెక్షన్లపై ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. అందుకే ఎలాగైన సింగం 3ని వాయిదా వేయించాలని భావించారు. సూర్యకు మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో సింగం 3 వాయిదా పడటం కాయం అని భావించారు. అనుకున్నట్టుగానే సూర్య తన సినిమాను వారం పాటు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాకపోయినా.., వాయిదా వేస్తేనే రెండు సినిమాలకు మంచిదన్న ఆలోచనలో ఉన్నారట. అందుకే ముందుగా అనుకున్నట్టుగా డిసెంబర్ 16న కాకుండా డిసెంబర్ 23న సింగం 3ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలో సింగం 3 రిలీజ్ డేట్పై అధికారిక ప్రకటన వెలువడనుంది. -
ధృవలో అరవింద్ స్వామికి డబ్బింగ్ ఎవరు..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా.. అరవింద్ స్వామి విలన్గా కనిపించనున్నాడు. తమిళ సూపర్ హిట్ సినిమా తనీఒరువన్కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ఎంతో మందిని సంప్రదించిన తరువాత ఒరిజినల్ వర్షన్లో నటించిన అరవింద్ స్వామినే ఆ పాత్రకు తీసుకున్నారు. అయితే ఇంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్కు తెలుగులో డబ్బింగ్ ఎవరు చెపుతున్నారు. అన్న చర్య జరుగుతోంది. తమిళ నటుడైన అరవింద్ స్వామి తెలుగులో స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోలేడు. అందుకే తెలుగులో ఈ పాత్రకు ఓ యువ గాయకుడితో డబ్బింగ్ చెప్పించారట. గతంలో స్నేహితుడు సినిమాలో విజయ్కి డబ్బింగ్ చెప్పిన గాయకుడు హేమచంద్ర, ధృవ సినిమాలో అరవింద్ స్వామికి డబ్బింగ్ చెపుతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లో హేమచంద్ర వాయిస్కు మంచి మార్కులే పడ్డాయి. -
చెర్రీ నయా మాస్టర్ ప్లాన్
-
రామ్చరణ్ ఈ సారైనా కొడతాడా..?
మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తొలి సినిమాతోనే తానేంటో నిరూపించుకున్నాడు. ఆ తరువాత కూడా ఎన్నో ఘనవిజయాలు సాధించినా.. ఒక కల మాత్రం ఇంతవరకు నెరవేరలేదు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలందరూ ఇప్పటికే ఓవర్సీస్లో మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిపోయారు. భలే భలే మొగాడివోయ్, పెళ్లిచూపులు లాంటి చిన్న సినిమాలు కూడా ఈ ఘనతను సాధించగా, తాజాగా నిఖిల్.. ఎక్కడి పోతావు చిన్నవాడా సినిమా కూడా ఈ లిస్ట్ చేరేందుకు పరుగు తీస్తుంది. కానీ రామ్ చరణ్కు మాత్రం ఇంత వరకు మిలియన్ డాలర్ మార్క్ అందలేదు. ముఖ్యంగా చరణ్ చేసేవి ఎక్కువగా మాస్ మాసాలా ఎంటర్టైనర్స్ కావటంతో ఓవర్సీస్ ఆడియన్స్ను ఆ సినిమాలు పెద్దగా ఆకట్టుకోవటం లేదు. దీంతో ఈ సారి ఎలాగైన తన కలను నిజం చేసుకోవాలనుకుంటున్నాడు చరణ్. ధృవ సినిమా కూడా చరణ్ కలను తీర్చేలాగే ఉంది. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అవ్వటంతో పాటు. ధృవ కంటెంట్ కూడా ఓవర్సీస్ ఆడియన్స్కు నచ్చేది కావటం కలిసొస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. అనుకున్నట్టుగా ధృవ ఓవర్సీస్ మార్కెట్లో మిలియన్ డాలర్ల మార్క్ అందుకుంటుందో.. లేదో..? చూడాలి. -
చరణ్ కోసం చెమటోడుస్తోంది
ధృవ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావటంతో, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తన నెక్ట్స్ సినిమా మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో విలేజ్ బ్యాక్డ్రాప్లో పీరియాడిక్ లవ్ స్టోరి చేస్తున్నట్టుగా ప్రకటించాడు చరణ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్లో హీరోయిన్గా రాశీఖన్నాను ఫైనల్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే రాశీఖన్నాతో ఫోటో షూట్ కూడా చేసిన సుకుమార్, బరువు తగ్గితే హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని కండిషన్ పెట్టాడట. రామ్చరణ్ లాంటి స్టార్ హీరో సినిమాలో అవకాశం కావటంతో ఎలాగైన సాధించాలని భావిస్తోంది రాశీ. అందుకే వీలైనంత త్వరగా బరువు తగ్గి, స్లిమ్ లుక్లోకి మారేందుకు జిమ్లో చెమటోడుస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ధృవ డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్కు రెడీ అవుతోంది. ధృవ రిలీజ్ తరువాత సుకుమార్, చరణ్ల కాంబినేషన్లో సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
ధృవ ట్రైలర్పై రాజమౌళి కామెంట్
రామ్చరణ్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ధృవ ట్రైలర్ శుక్రవారం రిలీజ్ అయ్యింది. ఆన్లైన్లో రిలీజ్ అయిన గంటల్లోనే లక్షల వ్యూస్తో సత్తా చాటిన ఈ ట్రైలర్ పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా తనకు బాగా నచ్చిన ట్రైలర్లు, సినిమాలను చిన్నపాటి రివ్యూలతో ప్రశంసించే టాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి, ధృవ టీంను అభినందించారు. తన ట్విటర్ పేజ్లో ధృవ ట్రైలర్ లింక్తో పాటు అభినందనలు తెలియజేశారు. 'చాలా స్టైలిష్, ఎంతో ప్రామిసింగ్, సురేందర్ రెడ్డి, చరణ్లకు అభినందనలు. అంచనాలకు మించి ఉంది ట్రైలర్, నిజానికి రీమేక్ సినిమాలు చేయటం చాలా కష్టం' అంటూ ట్వీట్ చేశారు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఒరిజినల్ వర్షన్లో విలన్గా నటించిన అరవింద్ స్వామి మరోసారి విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ధృవ డిసెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అవుతోంది. Quite stylish Quite promisinghttps://t.co/sRFt4LzdJB Well done SurenderReddy and Charan. Contrary to the belief, Remakes are actually tough — rajamouli ss (@ssrajamouli) 25 November 2016 -
అందరి కన్నా ఎక్కువ కష్టం... చరణ్దే!
‘‘డిసెంబర్ 9న మా ‘ధృవ’ను రిలీజ్ చేస్తున్నాం. మధ్యలో డిసెంబర్ 2తో పాటు పలు విడుదల తేదీలు అనుకున్నాం. కానీ, ప్రజలంతా బ్యాంకులు, ఏటీయంల ముందు క్యూలు కడుతున్నారు. ఆ డేట్స్ అయితే సినిమాకి వస్తారో? రారో? అని డిసెంబర్ 9న రిలీజ్ చేయాలని నిర్ణయించాం’’ అన్నారు అల్లు అరవింద్. రామ్చరణ్, రకుల్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ‘ధృవ’ ట్రైలర్ను శుక్రవారం రిలీజ్ చేశారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ - ‘‘అమెరికాలోని న్యూజెర్సీ, శాన్ ఫ్రాన్సిస్కోల్లో జరిగే ప్రీమియర్ షోలకు చిత్రబృందం హాజరవుతుంది. డిసెంబర్ 4న ప్రీ-రిలీజ్ ఫంక్షన్, ఆ తర్వాత తిరుపతి, విజయవాడ, విశాఖలలో ఫంక్షన్స్ నిర్వహిస్తాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం అందరి కన్నా చరణ్ ఎక్కువ కష్టపడ్డాడు’’ అన్నారు సురేందర్రెడ్డి. ‘‘అరవింద్తో కలసి సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఎన్వీ ప్రసాద్. ‘‘చరణ్తో ‘బ్రూస్ లీ’ తర్వాత, ‘కిక్’ తర్వాత సురేందర్రెడ్డితో, ‘సరైనోడు’ తర్వాత గీతా ఆర్ట్స్లో చేస్తున్న చిత్రమిది’’ అన్నారు రకుల్. -
ఆ క్రిమినల్నే అంతం చేస్తా..మెగా పవర్ స్టార్
మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజా చిత్రం 'ధృవ' థియేట్రికల్ ట్రైలర్ ఆన్ లైన్లో దూసుకుపోతోంది. శుక్రవారం విడుదల చేసిన ట్రైలర్కు మంచి స్పందన వస్తోంది. నాకొక ఇంపార్టెంట్ గొల్ ఉంది..ఎవడిని కొడితే 100 మంది క్రిమినల్స్ అంతమవుతారో.. ఆ క్రిమినల్నే నేను అంతం చేయాలి...ఐయామ్ కమింగ్...అంటూ 'ధృవ' థిరిటికల్ ట్రైలర్ ప్రారంభమవుతుంది. నీలాంటి క్రిమినల్ పాస్ట్, ప్రెజెంట్, ప్యూచర్ని నామ రూపాలు లేకుండా చేస్తా..అంటూ రాంచరణ్ చెప్పిన డెలాగ్ అభిమానులకు ఆకట్టుకుంటోంది. ప్రజల తలరాతలను నిర్ణయించేది రాజకీయ నాయకుడు కావొచ్చు..కానీ ఆ రాజకీయ నాయకుడి తలరాతను నిర్ణయించేది ఓ బిజినేస్ మ్యాన్ అంటూ మంచి మాస్ ఎలిమెంట్ ఉన్న డైలాగ్తో సినిమా పై అంచనాలు పెంచేశాడు రాంచరణ్. తమిళ హిట్ సినిమా ‘తని ఒరువన్’కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాంచరణ్ సరసన రకుల్ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. -
ఆ క్రిమినల్నే అంతం చేస్తా..మెగా పవర్ స్టార్
-
చరణ్ను భయపెడుతున్న మెగా సెంటిమెంట్
రామ్చరణ్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ధృవ. తమిళ సూపర్ హిట్ సినిమా తనీ ఒరువన్కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై చెర్రీ చాలా ఆశలు పెట్టుకున్నాడు. బ్రూస్లీ సినిమాకు డిజాస్టర్ టాక్ రావటంతో ఈ సినిమాను సూపర్ హిట్గా నిలిపి, తిరిగి సత్తా చాటాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టు న్యూ లుక్లో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు చెర్రీ. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ధృవ సినిమాను డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ రిలీజ్ డేటే ఇప్పుడు చిత్రయూనిట్ను మెగా అభిమానులను కలవరపెడుతోంది. డిసెంబర్లో రిలీజ్ అయిన మెగా హీరోల సినిమాలేవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన పంజా, వరుణ్ తేజ్ హీరోగా పరిచయం అయిన ముకుందా, వరున్ రెండో సినిమా లోఫర్లు డిసెంబర్ నెలలోనే రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలేవి మెగా స్టామినాను ప్రూవ్ చేసే స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇప్పుడు అదే నెలలో రిలీజ్ అవుతున్న ధృవకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో అన్న టెన్షన్లో ఉన్నారు ఫ్యాన్స్. -
దుష్టశిక్షణకు వచ్చేస్తున్నాడు!
ఎట్టకేలకు రామ్చరణ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. దసరా, దీపావళి మీదుగా డిసెంబర్ దాకా సాగుతూ వెళ్ళిన ‘ధృవ’ డిసెంబర్ 9న జనం ముందుకొస్తు న్నాడు. ‘విద్రోహులకు ద్రోహం చేయడం... చెడును అంతం చేయడానికి స్వార్థంగా ఆలోచించడం... ‘ధృవ’ లక్షణం. ఆ యువకుడి వైనం ఈ చిత్రం’ అంటున్నారు దర్శకుడు సురేందర్రెడ్డి. రామ్చరణ్, రకుల్ప్రీత్ సింగ్ జంటగా ఆయన దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ధృవ’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. విలన్గా అరవింద్ స్వామి నటించారు. -
మెగా అభిమానులకు భారీ షాక్..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ధృవ, మెగాస్టార్ చిరంజీవి.. ఖైదీ నంబర్ 150 సినిమాల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు షాక్ ఇచ్చే వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ధృవ సినిమా ఆడియో రిలీజ్ కూడా అయిపోయింది. షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే దేశ వ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దుతో జనం థియేటర్ల మొహం చూడటమే మానేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ధృవ సినిమాను రిలీజ్ చేస్తే కలెక్షన్ల విషయంలో తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉందన్న ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. అందుకే సినిమాను వాయిదా వేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో చేస్తున్నారట. ధృవ సినిమాను నెల రోజుల పాటు వాయిదా వేస్తే జనవరిలో రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ అదే సమయం మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకే సమయంలో రెండు మెగా ఫ్యామిలీ సినిమాలు విడుదల చేయడం కరెక్ట్ కాదన్న ఆలోచనలో ఉన్నారు యూనిట్. అందుకే ధృవను సంక్రాంతికి రిలీజ్ చేసి, ఖైదీ నంబర్ 150ని సమ్మర్కు పోస్ట్ పోన్ చేస్తే ఎలా ఉంటుదన్న ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాల వాయిదాపై అధికారిక ప్రకటన లేకపోయినా.. పరిస్థితులు చూస్తుంటే వాయిదా పడటం ఖాయంగానే కనిపిస్తోంది. -
చరణ్ను ఇబ్బంది పెడుతున్న సూర్య
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ధృవ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్రూస్లీ లాంటి డిజాస్టర్ తరువాత చేస్తున్న సినిమా కావటంతో అభిమానులతో పాటు రామ్ చరణ్ కూడా ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో ఎలాగైన వంద కోట్ల క్లబ్లో స్థానం సంపాదించాలని భావిస్తున్న చరణ్, రిలీజ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఆడియో కూడా రిలీజ్ అయిన ధృవ సినిమాను డిసెంబర్ 2న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే భారీ వసూళ్ల మీద కన్నేసిన మెగా ఫ్యామిలీ తరువాత రెండు వారాల పాటు భారీ చిత్రాలేవి లేకుండా ఉంటే కలెక్షన్ల రికార్డులు సాధ్యమని భావిస్తోంది. కానీ సూర్య హీరోగా తెరకెక్కిన సింగం 3 డిసెంబర్ 16న భారీ రిలీజ్కు రెడీ అవుతోంది. సూర్యకు తెలుగు రాష్ట్రల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉండటం, సింగం సీరీస్ టాలీవుడ్లో కూడా ఘనవిజయం సాధించి ఉండటంతో ఈ సినిమా ధృవ కలెక్షన్ల మీద ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే ధృవ నిర్మాత అల్లు అరవింద్ ఇప్పటికే సూర్యతో పాటు సింగం 3 నిర్మాత జ్ఞానవేల్ రాజాతో సంప్రదింపులు జరుపుతున్నాడట. త్వరలోనే ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
కెరీర్లో బెస్ట్ లుక్ ఇదే!
‘శత్రువుతో ఆట... ప్రేయసితో పాట... మిత్రులతో సరదా ముచ్చట... మా ‘ధృవ’లో యాక్షన్, లవ్, కామెడీ తదితర కమర్షియల్ హంగులన్నీ ఉన్నాయి’ అంటున్నారు దర్శకుడు సురేందర్రెడ్డి. రామ్చరణ్, రకుల్ప్రీత్ సింగ్ జంటగా ఆయన దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ధృవ’. ఆదివారంతో ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. థాయ్ల్యాండ్లోని కర్బీ దీవిలో చరణ్, రకుల్లపై చిత్రీకరించిన చివరి పాటతో చిత్ర బృందం ‘ధృవ’కి ప్యాకప్ చెప్పేశారు. ఈ పాటలో నా లుక్ చాలా బాగుంటుందంటున్నారు రకుల్. ‘నా కెరీర్లో ఇదే బెస్ట్ లుక్’ అంటూ కాస్ట్యూమ్ డిజైనర్ గీతికా చద్దాను కౌగిలించుకున్న ఫొటోను ట్వీట్ చేశారామె. ‘హిప్ హాప్’ ఆది (తమిళ) సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇటీవల విడుదలయ్యాయి. డిసెంబర్లో సినిమా విడుదల కానుంది. విలన్గా అరవింద్ స్వామి, కీలక పాత్రల్లో నాజర్, పోసాని కృష్ణమురళి, నవదీప్ తదితరులు నటించారు. -
ఆలోచనలే అతని ఆయుధం
ఆలోచనలే ఆయుధంగా శాంతి కోసం యుద్ధం చేసిన యువకుడు ధృవ. ఒంటరి సైన్యంతోనే శత్రువుకి చెమటలు పట్టించిన అతడి కథ తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకూ వెయిట్ చేయమంటున్నారు దర్శకుడు సురేందర్రెడ్డి. రామ్చరణ్ హీరోగా ఆయన దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘ధృవ’. హిప్ హాప్ ఆది (తమిళ) సంగీతమందించిన ఈ సినిమాలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా బుధవారం విడుదలయ్యాయి. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ప్రస్తుతం బ్యాంకాక్లో చివరి పాట చిత్రీకరణ జరుగుతోంది. పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. భారీ నిర్మాణ వ్యయం, ఉన్నత సాంకేతిక విలువలతో రూపొందిస్తోన్న ఈ చిత్రాన్ని డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. రామ్చరణ్కు జోడీగా రకుల్, విలన్గా అరవింద్ స్వామి నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: పీయస్ వినోద్, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వై.వి. ప్రవీణ్కుమార్. -
శత్రువుని సెలక్ట్ చేసుకున్నధృవ
‘‘నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది.. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువును నేను సెలక్ట్ చేసుకున్నా’’ అంటున్నారు రామ్చరణ్. ఆయన పవర్ఫుల్ పోలీసాఫీసర్గా నటిస్తున్న చిత్రం ‘ధృవ’. రకుల్ప్రీత్ సింగ్ కథానాయిక. సురేందర్ రెడ్డి దర్వకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. హిప్ హాప్ ఆది స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ నెల 9న నేరుగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఇది కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ. హై బడ్జెట్, టెక్నికల్ వేల్యూస్తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నాం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. సినిమా విడుదలకు ముందు మెగా అభిమానులు, ప్రేక్షకుల మధ్య గ్రాండ్ ప్రీ రిలీజ్ . డిసెంబర్ఫంక్షన్ నిర్వహించాలనుకుంటున్నాం మొదటి వారంలో సినిమా విడుదల చేస్తాం’’ అని చెప్పారు. అరవింద్ స్వామి, నాజర్, పోసాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.యస్.వినోద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై. ప్రవీణ్ కుమార్. -
మెగా అభిమానులకు చెర్రీ షాక్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రస్తుతం తనీ ఒరువన్ సినిమాకు రీమేక్గా తెరకెక్కుతున్న ధృవ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆడియో రిలీజ్ ఫంక్షన్ను చేయటం లేదని ప్రకటించాడు చరణ్.లాంచింగ్ ఈవెంట్ లేకుండానే ఈ నెల 9న ధృవ ఆడియోను డైరెక్ట్ గా మార్కెట్ లోకి రిలీజ్ చేయనున్నారు. చెర్రీ ఆడియో వేడుక అంటే మెగా హీరోలందరూ వస్తారని ఫీల్ అయిన అభిమానులకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రస్తుతం ధృవ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ఖైదీ నంబర్ 150 ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చెర్రీ ఆడియో వేడుకను నిర్వహించకుండా.. సినిమా రిలీజ్కు ముందు ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ ఫంక్షన్ను విజయవాడ వేదికగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ధృవ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. -
‘ధృవ’ మూవీ స్టిల్స్
-
శత్రువు ఆట.. ధృవ వేట
మంచి అనే ముసుగులో ఓ శాస్త్రవేత్త మోసం చేస్తుంటాడు. అతడి చీకటి సామ్రాజ్యానికి ఐపీయస్ ట్రైనింగ్లో ఉన్న ధృవ చెక్ పెట్టాలనుకుంటాడు. ఇది తెలిసిన శాస్త్రవేత్త ధృవ అడుగులకు అడ్డు తగులుతూ ఓ ఆట ఆడాలనుకుంటాడు. తన కంటే బలవంతుడైన శత్రువుకి అసలు విషయం తెలిసిన తర్వాత కూడా, అతడి ఆటకు ధీటుగా ధృవ వేటాడిన తీరు చూడాలంటే డిసెంబర్ వరకూ వెయిట్ చేయక తప్పదు. రామ్చరణ్ హీరోగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘ధృవ’. త్వరలో పాటల్ని, డిసెంబర్లో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ధృవగా రామ్చరణ్, శాస్త్రవేత్తగా అరవింద్ స్వామి నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్ప్రీత్ సింగ్ హీరోయిన్. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ‘‘నవంబర్ తొలి వారంలో హీరో పరిచయ గీతం చిత్రీకరిస్తాం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. భారీ నిర్మాణ వ్యయం, ఉన్నత సాంకేతిక విలువలతో చిత్రం రూపొందుతోంది’’ అని చిత్ర బృందం తెలిపింది. నాజర్, పోసాని నటించిన ఈ చిత్రానికి కెమేరా: పి.యస్.వినోద్, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.వై.ప్రవీణ్ కుమార్, సంగీతం: హిప్ హాప్ తమిళ (ఆది). -
రామ్చరణ్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాడు
బ్రూస్లీ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మెగా పవర్ స్టార్ రామ్చరణ్, ధృవ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ సినిమా తనీ ఒరువన్కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా దర్శకుడు సురేందర్ రెడ్డి స్టైలిష్ ఎంటర్టైనర్గా ధృవ సినిమాను రూపొందిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను దసరాకే రిలీజ్ చేయాలని భావించినా.. చరణ్, చిరంజీవి 150వ సినిమా నిర్మాణ పనుల్లో బిజీగా ఉండటం, మధ్యలో విలన్గానటిస్తున్న అరవింద్ స్వామి ఆరోగ్యం బాలేకపోవటంతో ఆలస్యమైంది. దీంతో రెండు నెలలు ఆలస్యంగా సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించిన చిత్రయూనిట్ ఫైనల్గా సినిమా రిలీజ్ డేట్పై ఓ అభిప్రాయానికి వచ్చారన్న టాక్ వినిపిస్తోంది. అన్నికార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ 2న ధృవ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్పై భారీగా నిర్మిస్తున్నారు. రామ్చరణ్ కూడా డిఫరెంట్ మేకోవర్లో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. -
మైండ్ గేమ్
ఐపీయస్ ట్రైనింగ్ పూర్తికాక ముందే ఆ కుర్రాడు డ్యూటీ స్టార్ట్ చేస్తాడు. సీక్రెట్గా శత్రువుకి చుక్కలు చూపిస్తాడు. తనకు చెక్ పెడుతున్నది ఎవరో శత్రువుకి తెలియడంతో ఆ కుర్రాడితో మైండ్ గేమ్ ఆడాలనుకుంటాడు. అప్పుడు ట్రైనీ ఐపీయస్ ఏం చేశాడు? రివర్స్లో ఎలాంటి మైండ్ గేమ్ ఆడాడు? అనే కథతో తెరకెక్కుతోన్న సినిమా ‘ధృవ’. రామ్చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ను విజయదశమి కానుకగా సోమవారం సాయంత్రం విడుదల చేయనున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్రెడ్డి దర్శకుడు. తమిళ హిట్ సినిమా ‘తని ఒరువన్’కి రీమేక్ ఇది. ఈ చిత్రం కోసం రామ్చరణ్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఐపీఎస్ ఆఫీసర్గా కనిపించడం కోసం కండలు పెంచారు. మీసకట్టు స్టైల్ మార్చారు. కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం చివరి పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో రకుల్ప్రీత్ సింగ్ హీరోయిన్. విలన్గా అరవింద్ స్వామి, హీరో స్నేహితుడిగా నవదీప్ నటిస్తున్నారు. -
సురేందర్ రెడ్డితో జాగ్వర్..?
జాగ్వర్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన యంగ్ హీరో నిఖిల్ గౌడ. తొలి సినిమాతో భారీ బడ్జెట్ తో తెరకెక్కించటంతో నిఖిల్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఆ అంచనాలను అందుకోవటం జాగ్వర్ విఫలమైంది. అయితే తొలి సినిమా రిజల్ట్ తో సంబందం లేకుండా నిఖిల్ రెండో సినిమాను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. జాగ్వర్ ఆడియో రిలీజ్ లో చెప్పినట్టుగా ఓ తెలుగు దర్శకుడితో నిఖిల్ రెండో సినిమా ఉండబోతుందన్న వార్త ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ధృవ సినిమాను తెరకెక్కిస్తున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నిఖిల్ తన రెండో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. స్టైలిష్ ఎంటర్టైనర్ లు రూపొందించటంతో స్పెషలిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి నిఖిల్ కు సక్సెస్ ఇస్తాడేమో చూడాలి. -
చరణ్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్
బ్రూస్ లీ సినిమాతో నిరాశపరిచిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన నెక్ట్స్ సినిమా ధృవ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే దసరా బరిలో రిలీజ్ కావల్సిన సినిమాను రెండు నెలల పాటు వాయిదా వేసి డిసెంబర్ రిలీజ్కు ప్లాన్ చేశాడు. అయితే దసరాకు సినిమా వస్తుందన్న ఆశతో ఉన్న అభిమానులకు కాస్త ఊరట కల్గించేందుకు పండుగ కానుకను సిద్ధం చేస్తున్నాడు చెర్రీ. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్తో అలరించిన చరణ్, దసరా కానుకగా టీజర్ను రిలీజ్ చేయనున్నాడుట. ఇప్పటికే ఈ టీజర్ కోసం సంగీత దర్శకుడు హిప్ హాప్ తమీజా థీమ్ మ్యూజిక్ కూడా రెడీ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ టీజర్లో చరణ్ డైలాగ్ ఉండాలా..? లేదా..? అన్న విషయంలో దర్శకుడు సురేందర్ రెడ్డి ఆలోచనలో పడ్డాడట. ఏది ఏమైనా దసరాకు మెగా అభిమానుల కోసం ధృవ టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు చరణ్. -
పక్కా కమర్షియల్!
అగ్ర దర్శకుల్లో సుకుమార్ది కాస్త విభిన్నమైన శైలి. తీసింది ఆరు సినిమాలే అయినా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. స్టోరీ, స్క్రీన్ప్లేలలో వైవిధ్యం చూపిస్తారాయన. ప్రస్తుతం రామ్చరణ్తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ‘సుకుమార్ ట్రేడ్మార్క్ స్టైల్లో ఉండే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది’ అంటున్నారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్, సీవీ మోహన్. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై వీరు నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ను ప్రస్తుతం రామ్చరణ్ నటిస్తున్న ‘ధృవ’ షూటింగ్ పూర్తయిన వెంటనే నవంబర్లో ప్రారంభిస్తారట. త్వరలోనే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. -
పోలీసులకు ఆహ్వానం!
ఐపీయస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి? చూడగానే రౌడీల గుండెల్లో గుబులు పుట్టాలి. తప్పు చేయాలనుకునేవాళ్లు హడలిపోవాలి. అలా అవ్వాలంటే ఆ ఐపీయస్ ఆఫీసర్ కండలు తిరిగిన దేహంతో ఉండాలి. చూపులు షార్ప్గా ఉండాలి. మీసకట్టులో పవర్ కనిపించాలి. రామ్చరణ్ ప్రస్తుతం అలానే కనిపిస్తున్నారు. తమిళ చిత్రం ‘తని ఒరువన్’ తెలుగు రీమేక్ ‘ధృవ’లో ఆయన ఐపీయస్ ఆఫీసర్గా నటిస్తున్న విషయం తెలిసిందే. సురేందర్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ ఆరంభించే ముందు కొంతమంది ఐపీయస్ ఆఫీసర్స్ని పర్సనల్గా చరణ్ కలిశారట. కొన్ని సలహాలు అడిగి తెలుసుకున్నారట. అందుకే ఈ చిత్రాన్ని పలువురు పోలీసాఫీసర్లకు చూపించాలనుకుంటున్నారట. ఎవరి దగ్గరైతే సలహాలు తీసుకున్నారో వాళ్లనే కాకుండా దక్షిణాదికి చెందిన పలు జిల్లాల్లోని ఆఫీసర్లను కూడా ఈ ప్రత్యేక షోకు ఆహ్వానించాలనుకుంటున్నారని సమాచారం. ఆఫీసర్లతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులకు కూడా ఈ చిత్రాన్ని చూపించాలనుకుంటున్నారట. ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలనుకున్నారు. అయితే, వాయిదా వేయాలనుకుంటున్నారన్నది తాజా సమాచారం. రాజీపడకుండా చిత్రీకరించడంవల్ల ఎక్కువ రోజులు పట్టే అవకాశం ఉందట. -
చెర్రీ రేసు నుంచి తప్పుకున్నాడా..?
ధృవ సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి ముందే దసరాకు రిలీజ్ అంటూ ప్రకటించేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట తప్పబోతున్నాడా..? ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్లో ఇదే చర్చ జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో దసరాకు సినిమా రిలీజ్ అంటూ ప్రకటించినా.. ప్రస్తుతం అది సాధ్యమయ్యేలా కనిపించటం లేదు. ధృవ షూటింగ్తో పాటు చిరంజీవి 150 సినిమా నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్న చెర్రీ తన సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోతున్నాడట. దసరా వరకు షూటింగ్ అయిపోయినా నిర్మాణాంతర కార్యక్రమాలకు మరింత సమయం పట్టే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. హడావిడిగా రిలీజ్ చేస్తే సినిమా రిజల్ట్ పై ప్రభావం పడే అవకాశం ఉందని, అందుకే వాయిదా వేయటమే కరెక్ట్ అని భావిస్తున్నారట. అంతేకాదు ఇప్పటికే దసరా బరిలో నాలుగు సినిమాలు ప్రకటించటంతో సినిమా వాయిదా వేయటమే కరెక్ట్ అన్న ఆలోచనలో ఉన్నారు మెగా టీం. అయితే ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. ప్రేమమ్, వీడు గోల్డె హే, మన ఊరి రామాయణం, అభినేత్రి లాంటి సినిమాలు దసరాకే రిలీజ్ ఫిక్స్ చేసుకోవటంతో ధృవను డిసెంబర్కు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. -
చరణ్ని లైట్ తీసుకుంటున్నారు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ సినిమా తనీ ఒరువన్కు రీమేక్గా రూపొందుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. చరణ్ కూడా బ్రూస్ లీ బాధ నుంచి అభిమానులను బయటికి తీసుకువచ్చేందుకు ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. అయితే దసర బరిలో భారీ రిలీజ్కు ప్లాన్ చేస్తున్న చరణ్కు ఇప్పుడు గట్టి పోటి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ప్రేమమ్ సినిమాను దసరకే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డేట్ ప్రకటించకపోయినా దసర రిలీజ్ మాత్రం కన్ఫామ్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇక భారీ బడ్జట్తో తెరకెక్కుతున్న కన్నడ సినిమా జాగ్వర్ను అదే పేరుతో అక్టోబర్ 6న రిలీజ్ చేయనున్నారు. ప్రభుదేవ, సోనూసూద్, కోన వెంకట్లు సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం అభినేత్రిని కూడా అదే రోజు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. జాగ్వర్, అభినేత్రి డబ్బింగ్ సినిమాలే అయినా భారీ బడ్జెట్ సినిమాలు కావటంతో తెలుగు మార్కెట్ మీద కూడా సీరియస్గా దృష్టి పెడుతున్నారు. చరణ్ ధృవ రిలీజ్ అవుతున్నా, థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ భారీ పోటి చరణ్ సినిమా మీద ఎంత వరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి.