six years
-
మారుతీ ఎరీనా.. 70 లక్షల కస్టమర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా రిటైల్ విభాగం అయిన ఎరీనా ఆరు వసంతాల ఉత్సవాలను జరుపుకుంటోంది. 2017 నుంచి ఇప్పటి వరకు 70 లక్షలకుపైగా కార్లు ఎరీనా ఔట్లెట్ల నుంచి రోడ్డెక్కాయని కంపెనీ గురువారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 2,392 నగరాలు, పట్టణాల్లో 2,853 ఎరీనా విక్రయ శాలలు ఉన్నాయి. ఆల్టో కె–10, ఎస్–ప్రెస్సో, వేగన్–ఆర్, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా, ఈకో మోడళ్లను ఈ స్టోర్లలో విక్రయిస్తున్నారు. 2022లో భారత్లో అమ్ముడైన టాప్–10 మోడళ్లలో ఆరు వీటిలో ఉండడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు సంస్థ మొత్తం అమ్మకాల్లో అరీనా వాటా 68 శాతం ఉందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ ఈ సందర్భంగా వెల్లడించారు. ఏటా 10 లక్షల కుటుంబాల్లో సంతోషాలను నింపుతున్నట్టు తెలిపారు. ఎరీనా విక్రయశాలల్లో 32,130 మంది రిలేషన్íÙప్ మేనేజర్లు వినియోగదార్ల సేవల్లో నిమగ్నమయ్యారు. -
మహిళతో వివాహేతర సంబంధం.. ఆరేళ్ల క్రితం హత్య చేసి.. సినిమాను తలదన్నేలా..
ఆరిలోవ(విశాఖ తూర్పు): ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. నిందితుడే స్వయంగా పోలీసులకు లొంగిపోవడంతో పోలీసులకు పని సులువైంది. నిందితుడిని పోలీసులు గురువారం రిమాండ్కు తరలించారు. ఆరిలోవ సీఐ ఇమాన్యుయేల్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరిలోవ ప్రాంతానికి చెందిన దాడి లక్ష్మి (48) 2016 ఏప్రిల్ 7 నుంచి కనిపించడంలేదని ఆమె భర్త దాడి నాగేశ్వరరావు అదే నెల 9న ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అదే నెల 11న ముడసర్లోవ రిజర్వాయర్లో గుర్తు తెలియని మృతదేహం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. ఆ మృతదేహం మిస్సింగ్ అయిన దాడి లక్ష్మిదిగా ఆమె భర్త గుర్తించాడు. ఆమె కాళ్ల, చేతులు కట్టేసి ఉన్నాయి. దీంతో పాటు గోనె సంచికి పెద్ద రాయి కట్టి ఉండటంతో పోలీసులు అప్పట్లో అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సరైన ఆధారాలు లభించకపోవడంతో కొన్నాళ్ల తర్వాత ఆ కేసును పెండింగ్లో పెట్టారు. ఇదిలా ఉండగా ఈనెల 4న దాడి లక్ష్మిని 2016 ఏప్రిల్ 7న తానే హత్య చేశానంటూ గోపాలపట్నం ప్రాంతానికి చెందిన దాసరి దిల్లీశ్వరరావు ఆరిలోవ పోలీసులకు తెలియజేశాడు. దీంతో పోలీసులు అతడి నుంచి వివరాలు సేకరించి గురువారం కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఏటీఎంలో డబ్బులు తీయించి.. తరువాత హత్య... దిల్లీశ్వరరావు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. రిటైర్డ్ అయిన తర్వాత ఆయన నగరంలో ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. అక్కడ ఉన్న క్యాంటీన్లో దాడి లక్ష్మి వంట మనిషిగా పనిచేసేది. వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. దిల్లీశ్వరరావు 2016లో హౌసింగ్ లోన్ తీసుకొని గోపాలపట్నంలో ఇళ్లు కొన్నాడు. ఇళ్లు కొనగా మిగిలిన మరికొంత నగదు అతని భార్య బ్యాంక్ ఖాతాలో ఉంది. డబ్బులు అవసరమై అడిగితే ఆమె ఇవ్వలేదు. దీంతో ఆమె బ్యాంక్ ఏటీఎం కార్డు తీసుకొచ్చి లక్ష్మితో ఏటీఎంలో అవసరమైన డబ్బులు విత్డ్రా చేయించాడు. ఆ విషయమై దిల్లీశ్వరరావును అతని భార్య నిలదీసింది. అంతటితో ఆగకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె ఏటీఎం కార్డు ఉపయోగించి ఓ మహిళ డబ్బులు విత్డ్రా చేసినట్లు సీసీ కెమెరాలలో వెల్లడైంది. దీంతో లక్ష్మితో ఉన్న సంబంధం బయటపడిపోతుందనే భయంతో ఆమెను అంతం చేయాలనుకున్నాడు. అందుకు తగిన ప్లాన్ వేసుకున్నాడు. 2016 ఏప్రిల్ 7న రాత్రి లక్ష్మిని బైక్పై ఎక్కించుకొని ముడసర్లోవ ప్రాంతానికి తీసుకెళ్లాడు. బీఆర్టీఎస్ పక్కన సింహాచలం కొండ అంచున ఆమె మెడ గట్టిగా పట్టి చంపేశాడు. కాళ్లు చేతులు కట్టేసి మృతదేహాన్ని ఓ గోనె సంచిలో పెట్టాడు. మృతదేహం తేలకుండా గోనె సంచికి పెద్ద రాయిని తాడుతో కట్టి ముడసర్లోవ రిజర్వాయర్లో పడేశాడు. చదవండి: షాకింగ్ ఘటన.. ద్విచక్ర వాహనంపై ఒంటరిగా మహిళ.. పొదల్లోకి లాక్కెళ్లి.. ఇదంతా ఆయన స్వయంగా వచ్చి లొంగిపోయి వివరించడంతో పోలీసులు అవాక్కయ్యారు. దీని ప్రకారం దిల్లీశ్వరరావును కోర్టులో హాజరుపరిచి అనంతరం రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. తాను చేసిన పాపానికి తగిన శిక్ష అనుభవిస్తున్నానని, తన భార్య, పిల్లలు తనకు దూరంగా ఉండటంతో తాను ఒంటరయ్యానని పోలీసులకు తెలియజేశాడు. ఇటీవల తన కుమార్తె వివాహం కూడా తనకు తెలియకుండా జరిపించారని పేర్కొన్నాడు. పశ్చాత్తాపంతో చేసిన నేరం అంగీకరిస్తున్నట్లు తెలిపాడు. -
ఆరేళ్ళ బాలికపై తండ్రి వరసైన వ్యక్తి అత్యాచారం
-
విశాఖ కోకిల.. వెండితెరపై వెలుగుతున్న వాగ్దేవి
వచ్చీరాని మాటల వయసది.. బోసి నవ్వులతో ఆలిపించిన వంద దేవుళ్లే కలిసొచ్చినా (బిచ్చగాడు చిత్రం) పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతే ఒక్కసారిగా ఆ చిన్నారి వాగ్దేవి ఫేమస్ అయింది. తల్లి శాంతమ్మ పర్యవేక్షణలో ఆలపించిన ఈ గీతం టాలీవుడ్ మ్యూజిక్ మెజిషియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆరేళ్ల ప్రాయంలో జీ తెలుగు లిటిల్ ఛాంప్ సరిగమప విన్నర్గా నిలిచి బుల్లితెర లతా మంగేష్కర్గా శభాష్ అనిపించుకుంది. – మద్దిలపాలెం (విశాఖ తూర్పు) ‘వెయ్యి జన్మలెత్తిన నీ రుణం తీర్చుకోలేనమ్మ’కు 60 లక్షల వ్యూస్ శ్రీమాత రికార్డింగ్ కంపెనీ అధినేత పల్లి నాగభూషణ్రావు రచించిన వెయ్యి జన్మలేత్తినా నీ రుణం తీర్చుకోలేనమ్మా.. గీతాన్ని వాగ్దేవి తండ్రి వేణుమాధవ్ సంగీతం అందించారు. ఈ పాటను వాగ్దేవి ఆలపించింది. యూట్యూబ్ అప్లోడ్ చేయగా అనూహ్య రీతిలో 60 లక్షల వ్యూస్ లభించాయి. వెండితెరపై వెలుగుతున్న వాగ్దేవి కేరాఫ్ కంచరపాలెం ఫేం సంగీతం దర్శకుడు స్వీకర్ ఆగస్తీ మెయిల్ చిత్రంలో వాగ్దేవికి అవకాశం కల్పించారు. ప్రియాంకదత్ నిర్మాతగా ప్రియదర్శి íహీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో వాగ్దేవి టిపిరి..టిపిరి గీతాన్ని ఆలపించింది. హీరో విశ్వక్సేన్ చిత్రం పాయల్లో, జాతిరత్నలు చిత్ర సంగీత దర్శకుడు రథన్ కంపోజ్ చేసిన సిద్ శ్రీరామ్తో కలిసి అమ్మా అమ్మా నీ వెన్నెల.. నిత్యం నాపై ఉండాలి ఇలా...అనే గీతాన్ని ఆలపించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అటు పాటలు..ఇటు డబ్బింగ్ వాగ్ధేవి ఓ వైపు పాటలతో అలరిస్తూనే..మరో వైపు బుల్లితెర చిన్నారి నటులకు డబ్బింగ్ చెబుతోంది. రామసక్కని సీత, జెమినిలో వస్తున్న భాగ్యరేఖ సీరియల్స్కు డబ్బింగ్ చెబుతోంది. కీరవాణి ఫిదా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వరా భక్తి చానల్లో వాగ్దేవి ఆలపించిన అన్నమయ్య కీర్తనలకు ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఎం.ఎం.కీరవాణి ఫిదా అయ్యారు. వ్యాఖ్యాతగా ఉన్న గాయకురాలు సునీతను సైతం వరెవ్వా అనిపించింది. దీంతో బుల్లితెరపై అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. సాధించిన విజయాలు ►2007 లిటిల్ ఛాంప్ విన్నర్ సాయిదేవ హర్షతో వాగ్దేవి బుల్లితెరపై పాడడం ప్రారంభించింది ►ఐదేళ్ల ప్రాయంలో లవ్ ఇండియా నేషనల్ సింగింగ్ రియాల్టీ షోలో పాల్గొంది ►ఐదేళ్ల ప్రాయంలో హిందీ పాటాలు పాడేందుకు వాగ్దేవి ముంబై కేంద్రంగా లవ్మీ ఇండియా నేషనల్ సింగింగ్ రియాల్టీ షోకు ఎంపికైంది. ఈ షో హిమేష్ రేషి్మయా, నేహా బాసిన్ను తన గానంతో మైమరపించింది. ►జీ తెలుగు లిటిల్ చాంప్ సరిగమప విన్నర్ ( 2019 )గా నిలిచింది. దీంతో స్వర్ణభూమి సంస్థ రూ.35 లక్షల విలువైన విల్లా బçహూకరించారు. మ్యూజిక్ ఫ్యామిలీ వాగ్దేవి తల్లిదండ్రులు మాధవధారలో నివాసముంటున్నారు. తండ్రి సుదర్శనం వేణుమాధవ్ సంగీతం మాస్టర్గా, తల్లి శాంతి గాయని..అన్నయ్య సాయిదేవ హర్ష జీ లిటిల్ ఛాంప్ 2007 విన్నర్గా సుపరిచితులు. మణిశర్మ సంగీత దర్శకత్వంలో... అరుణగిరి ప్రొడక్షన్లో య్యూట్యూబ్ చానల్కు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఆధ్వర్యంలో 14 పాటల వాగ్దేవి ఆలపించే అవకాశం రావడం గొప్ప అవకాశమని ఆమె తల్లి శాంతి పేర్కొన్నారు. -
ఆరేళ్ల ఆర్నా ప్రపంచ రికార్డు.. విమానం తోక చూసి..
చిన్నారులకు పదేపదే చెబితేగానీ ఎ.బి.సి.డిలు గుర్తుండవు. అటువంటిది ఆరేళ్ల ఆర్నా గుప్తా విమానం తోక చూసి అది ఏ దేశానికి చెందినదో ఇట్టే చెప్పేస్తుంది. నిమిషంలో 93 దేశాలకు చెందిన విమానాలను గుర్తించి ‘అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. హర్యాణాలోని పంచకులకు చెందిన ఆర్నా ఏదైనా ఒక్కసారి చూసినా, విన్నా వెంటనే తన మెదడు లో నిక్షిప్తం చేసుకుంటుంది. వాటి గురించి ఎప్పుడు అడిగినా టక్కున చెప్పేస్తుంది. రెండేళ్ల వయసునుంచే ఆర్నా చెప్పిన ప్రతివిషయాన్ని ఆపోశన పట్టేస్తుంది. ఇది గమనించిన ఆర్నా తల్లి నేహా గుప్తా.. ఆర్నాను ప్రోత్సహించారు. దీంతో ఈ రోజు ఆర్నా ప్రపంచ రికార్డును సాధించింది. గతేడాది ఆగస్టులో 120 మంది ప్రముఖుల పేర్లను 92 సెకన్లలో చెప్పి రికార్డు సృష్టించింది. -
ధరల మంట: రీటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల గరిష్టం
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు ఆర్థికమందగమనంపై భయాలు, ద్రవ్యోల్బణంపై తీవ్ర ఆందోళన,. కొనసాగుతుండగానే జనవరి నెలలో రీటైల్ ఇన్ఫ్లేషన్ అంచనాలకుమించి ఆరేళ్ల గరిష్టానికి చేరింది. వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జనవరి నెలలో 7.59 శాతానికి పెరిగింది. డిసెంబర్ నెలలో 7.35 శాతంగా ఉంది.సీపీఐ డేటా గణాంకాలను నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) బుధవారం వెల్లడించింది. 2019 జనవరిలో ద్రవ్యోల్బణ రేటు 2.05 శాతంగా ఉంది. ఎన్ఎస్ఓ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఆహార ద్రవ్యోల్బణం 2019 డిసెంబర్లో 14.12 శాతం నుండి 13.63 శాతానికి తగ్గింది. ఆహార ద్రవ్యోల్బణ రేటు 2019 జనవరిలో (-) 2.17 శాతంగా ఉంది. ఈ నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 50.19 శాతానికి పెరిగింది, 2019 డిసెంబర్లో 60.50 శాతంగా ఉంది. అదేవిధంగా, తృణధాన్యాలు, ఉత్పత్తుల ధరలు 5.25 శాతం వేగంతో పెరిగాయి. పప్పుధాన్యాలు, సంబంధిత ఉత్పత్తుల ధరలు ఈ నెలలో 16.71 శాతం పెరిగాయి. ముఖ్యంగా మార్చి 2019 నుంచి క్రమంగా పెరుగుతూ నింగిని తాకిన ఉల్లిపాయల ధరలు ద్రవ్యోల్బణం పెరగడానికి దోహదం చేసింది. దీనికి తోడు కూరగాయలు, పప్పుధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార ఉత్పత్తుల ధరల మంట దీనికి కారణంగా భావిస్తున్నారు. కాగా ఫిబ్రవరి నాటి పరపతి విధాన సమీక్షలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను యథాతథంగా వుంచింది. ద్రవ్యోల్బణం చాలా అనిశ్చితంగా ఉన్నందున రెపో రేటును 5.15 శాతంగానే ఉంచినట్టు ఆర్బీఐ వెల్లడించింది. అలాగే దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతానికి (2 శాతం మార్జిన్తో) అటూ ఇటూగా వుండాలే చూడాలని కేంద్రానికి ఆర్బీఐ ఆదేశించింది. మరోవైపు మందగమన పరిస్థితులకు అద్దం పడుతూ దేశంలోని పారిశ్రామిక ప్రగతి మరింత ఆందోళనకర స్థాయికి పడిపోయింది. ఇప్పటికే నెగటీవ్ జోన్లోకి చేరిన పారిశ్రామికోత్పత్తి డిసెంబరులో 0.3 శాతానికి పతమైంది. ఉత్పాదక రంగం క్షీణించి, ఏడాది క్రితం ఇదే నెలలో 2.5 శాతం వృద్ధిని సాధించింది. చదవండి : దారుణంగా పడిపోయిన పారిశ్రామికోత్పత్తి -
ఆరేళ్ల చిన్నారిపై బాలుడి లైంగికదాడి
రెంజల్ (బోధన్): ఆరేళ్ల చిన్నారిపై పదిహేనేళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రానికి సమీపంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం బాలిక తన ఇంటి ముందు ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన బాలుడు ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడి జరిపాడు. సాయంత్రం కూలి పనుల నుంచి ఇంటికి వచ్చిన తల్లి బాలిక స్పృహలో లేకపోవడంతో ఆందోళనకు గురైంది. కొద్దిసేపటికి స్పృహలోకొచ్చిన బాలిక జరిగిన విషయం తల్లికి తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. బాలుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
డెంగీతో ఆరేళ్ల చిన్నారి మృతి
మాడ్గుల: రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం ఫిరోజ్నగర్లో డెంగీతో ఆరేళ్ల చిన్నారి మృతిచెందింది. అంజయ్య, పద్మ దంపతుల కుమార్తె దివ్య(6) తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా స్థానికంగా చికిత్స చేయించారు. జ్వరం తగ్గకపోవడంతో గురువారం ఆమనగల్లులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు డెంగీ అని చెప్పారు. దీంతో హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రి కి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
కేసీఆర్ చరిష్మా.. ఆరేళ్లుగా హ్యాపీ జర్నీ!
సాక్షి, హైదరాబాద్: 2014 ఎన్నికల్లో 63 అసెంబ్లీ, 11 లోక్సభ స్థానాల్లో విజయం.. ఆ తర్వాత జరిగిన మెదక్, వరంగల్ లోక్సభ, నారాయణ్ఖేడ్, పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ గెలుపు.. 2018 ముందస్తు ఎన్నికల్లో ఏకంగా 88 అసెంబ్లీ స్థానాల్లో విజయం.. అనంతరం జరిగిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ ఎన్నికల్లో 60% పైగా స్థానాలు, దేశ చరిత్రలో ఏ పార్టీ సాధించని విధంగా ఏకంగా 32 జడ్పీ పీఠాలు కైవసం.. తాజాగా హుజూర్నగర్ ఉప ఎన్నికలో 50 శాతానికి పైగా ఓట్లతో రికార్డు విజయం.. ఒక్క 2019 లోక్సభ ఎన్నికల్లో తడబాటు మినహా రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా.. అది ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా.. కారు జోరుగా దూసుకుపోతోంది. ఎన్నికల పేరు మార డమే తప్ప.. ఆరేళ్లుగా విజయం మాత్రం టీఆర్ఎస్నే వరిస్తోంది. దీంతో అధికార పార్టీ జైత్రయాత్రకు ఎలా అడ్డుకట్ట వేయాలి? ఆ పార్టీ అధినేత కేసీఆర్ చరిష్మాకు గండికొట్టి ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఎలా ఓడించాలన్న దానిపై రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల్లో అంతర్మథనం ప్రారంభమైంది. ముఖ్యంగా ప్రభుత్వానికి అననుకూల పరిస్థితుల్లో జరిగాయని భావిస్తున్న హుజూర్నగర్ ఉప ఎన్నికల్లోనూ 43వేల మెజారిటీతో టీఆర్ఎస్ గెలవడంతో తమ భవిష్యత్తు ఏమిటన్న దానిపై ఆ పార్టీల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఏం చేద్దాం చెప్మా...! టీఆర్ఎస్ జోరుకు అడ్డుకట్ట వేయడం ఎలా అన్నది ఇప్పుడు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు పెద్ద సవాల్గా మారింది. మున్సిపల్ ఎన్నికలు రాబో తున్న తరుణంలో వెలువడిన హుజూర్నగర్ ఉప ఎన్నికల ఫలితం ప్రతిపక్షాల ఆశలపై నీళ్లు చల్లింది. ఈ ఎన్నికల్లోనూ అదే ఫలితం పునరావృతం అయితే రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లోని పదవుల్లోనూ టీఆర్ఎస్దే పూర్తిస్థాయిలో ఆధిపత్యం కానుంది. ఓ వైపు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే పార్టీ పరంగా సంస్థాగతంగా వేళ్లూనుకుంటున్న టీఆర్ఎస్కు పట్టణ ప్రాంతాల్లో అయినా కళ్లెం వేయడం ప్రతిపక్ష పార్టీలకు తక్షణ కర్తవ్యం కానుంది. అయితే, రాష్ట్రంలోని ప్రధాన పార్టీల ప్రస్తుత పరిస్థితి, ప్రజల మూడ్ చూస్తే ఇది సాధ్యమేనా అనే సందేహాలు వస్తున్నాయి. రాష్ట్రంలో మంచి కేడర్, క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలున్న కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికలోనూ అధికార పార్టీని ఢీకొడుతోంది కానీ పైచేయి సాధించలేకపోతోంది. దీంతో వరుస ఓటములు ఆ పార్టీ కేడర్ను నైరాశ్యంలో ముంచేస్తున్నాయి. కేసీఆర్ గురించి, రాష్ట్ర ప్రభుత్వం గురించి ఏం చెప్పినా ఎన్నికల బరిలో కాంగ్రెస్ నేతల మాటలు ప్రజలు విశ్వసించకపోవడంతో ఆ పార్టీ కేవలం పోటీకి మాత్రమే పరిమితమవుతోంది. ఇక, టీఆర్ఎస్ను గద్దె దించి 2023లో తెలంగాణపై జెండా ఎగరవేస్తామని చెబుతున్న బీజేపీ కేవలం మాటలకే పరిమితమవుతోందనే అభిప్రాయం వినిపిస్తోంది. 2014 నుంచి జరిగిన ఎన్నికల్లో ఒక్క 2019 లోక్సభ ఎన్నికల్లో మినహా ఆ పార్టీ కనీసం టీఆర్ఎస్కు పోటీ ఇవ్వడమే కాదు.. రెండో స్థానానికి కూడా ఆమడ దూరంలో నిలిచింది. ఇక, హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో అయితే డిపాజిట్ కూడా కోల్పోయి పరాభవం మూటగట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కోవడం ప్రతిపక్షాలకు పద్మవ్యూహంగానే కనిపిస్తోంది. ఆ పార్టీలు ‘ఖల్లాస్’.. రాష్ట్రంలోని టీడీపీ, వామపక్షాల ఓటు బ్యాంకును టీఆర్ఎస్ తమ ఖాతాలో వేసేసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. హుజూర్నగర్లో 2014 ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీకి 25వేల పైచిలుకు ఓట్లు రాగా, తాజా ఉప ఎన్నికలో 1500 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2014 తర్వాతి రాజకీయ పరిణామాల్లో ఆ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా నష్టం జరిగినా హుజూర్నగర్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో టీడీపీకి కనీసంగా 7వేలకు తగ్గకుండా ఓట్లు రావాల్సి ఉంది. కానీ, అందులో పావు వంతు కూడా రాకపోవడంతో తెలుగు తమ్ముళ్లు సైకిల్ను వదిలి కారెక్కినట్టు అర్థమవుతోంది. వామపక్షాలదీ అదే పరిస్థితిగా కనిపిస్తోంది. సీపీఎంకి 2018 ముందస్తు ఎన్నికల్లో 2వేల పైచిలుకు ఓట్లు రాగా, ఇప్పుడు ఆ పార్టీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థికి వెయ్యి ఓట్లు కూడా రాలేదు. ఇక, సీపీఐ పోటీలో లేనప్పటికీ ఆ పార్టీ ఓట్లు కూడా కారుకే పడ్డాయనేది అంచనా. ఒక్క హుజూర్నగర్లో కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందనేది రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, వామపక్షాల ఓట్లు టీఆర్ఎస్ వైపు దాదాపు మళ్లినట్టేనని, ఆ పార్టీల ఓటు బ్యాంకును కారు కొల్లగొట్టందని హుజూర్నగర్ ఉప ఫలితమే చెబుతోంది. క్షేత్రం.. మరింత పటిష్టం టీఆర్ఎస్ ఆవిర్భావ దశ నుంచి ఉత్తర తెలంగాణలో బలంగా ఉండగా, దక్షిణ తెలంగాణలో కొంత వెనుకబడేది. అయితే, 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇక 2019 అక్టోబర్ నాటికి చూసుకుంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో బలీయ శక్తిగా ఎదిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రాబల్యం కొట్టిచ్చినట్టు కనిపించే నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్లతో పాటు ఖమ్మంలోనూ పటిష్ట స్థితికి చేరింది. తాజా ఉప ఎన్నికతో పాటు ఖమ్మం కార్పొరేషన్ను స్వంతంగా దక్కించుకునే స్థాయికి అధికార పక్షం వేళ్లూనుకుంది. ఇక, ఇతర పార్టీల నుంచి చాలా రోజులుగా పెద్ద ఎత్తున జరుగుతున్న వలసలు క్షేత్రస్థాయిలో గులాబీ పార్టీకి టానిక్లా పనిచేస్తున్నాయి. ఇటీవలి ఉప ఎన్నికల్లో పోలింగ్ రోజున కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించేందుకు కూడా కొన్ని గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు లేనంతగా అవి ఉపయోగపడ్డాయి. రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీకి పటిష్ట కేడర్ ఉన్న హుజూర్నగర్లోనే ఆ పరిస్థితి ఉందంటే మిగిలిన చోట్ల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రామాలు, మండలాలు, జిల్లాల స్థాయిలో పేరు మోసిన నేతలందరినీ పార్టీలో చేర్చుకోవడం, గ్రామాల్లో కనీసం పార్టీ జెండాలు మోసేందుకు, మోయించేందుకు కూడా ఇతర పార్టీలకు మనుషులు లేకుండా చేయడమే వ్యూహంగా పథకం ప్రకారం టీఆర్ఎస్ ఆడుతున్న రాజకీయ చదరంగం.. ప్రతిపక్షాలకు భవిష్యత్తు లేకుండా చేస్తోందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. -
దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లకు నేటితో ఆరేళ్లు పూర్తి
-
మూడు లక్షల మంది మరణించారు
సిరియా యుద్ధం ప్రారంభమై దాదాపు ఆరేళ్లు కావొస్తోంది. ఈ కాలంలో ఆ దేశంలోని కీలక భాగాలు నాశనమయ్యాయి. యుద్ధంలో ఇప్పటివరకూ మూడు లక్షల పన్నెండు వేల మంది మరణించగా.. దేశ జనాభాలో సగానికిపైగా జనాభా శరణార్ధులుగా పొరుగు దేశాలకు వెళ్లిపోయారు. భారీగా మరణాలు 2011 మార్చిలో ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేక నినాదాల నుంచి ఇప్పటివరకూ మూడు లక్షల పన్నెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ గత వారం పేర్కొంది. వీరిలో 90 వేల మందికి పైగా పౌరులు ఉన్నట్లు తెలిపింది. యుద్ధానికి ముందు 23 మిలియన్లు జనాభా కలిగిన సిరియాలో యుద్ధం కారణంగా 6.6 మిలియన్ల జనాభా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని చెప్పింది. శరణార్ధులు యుద్ధం కారణంగా 48 లక్షల మంది ప్రజలు సిరియాను వదిలి వెళ్లిపోయారని యూనైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్(యూహెచ్ సీఆర్) పేర్కొంది. వీరిలో 27 లక్షల మంది పైగా టర్కీకి వలస వెళ్లారని చెప్పింది. టర్కీ తర్వాత లెబనాన్, జోర్డాన్, ఇరాక్, ఈజిప్టులు శరణార్ధులకు ఆశ్రయం కల్పించాయి. అయితే, పెద్ద సంఖ్యలో శరణార్ధులు యూరప్ చేరుకోవడానికి సముద్రమార్గాన్ని ఎంచుకుని ప్రాణాలు కోల్పోయారు. యూరప్ చేరుకున్న కొంతమంది శరణార్ధులను అక్కడ అధికారులు జైళ్లలో బంధించి చిత్రవధ చేశారు. దాదాపు 17,700 మంది యూరప్ జైళ్లలో మరణించగా, వేల మంది జీహాదిస్టుల చెరలో ప్రాణాలు వదిలారని యూహెచ్ సీఆర్ చెప్పింది. నాశమైన ఆర్ధిక వ్యవస్ధ సిరియా యుద్ధం కారణంగా ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ మూడు దశాబ్దాల వెనక్కు వెళ్లిపోయిందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వానికి వచ్చే అన్ని రకాల ఆదాయాలకు గండి పడగా.. వసతులు, ఆరోగ్య, విద్యావ్యవస్ధలు సమూలంగా నాశనమయ్యాయి. సిరియా మొత్తం(కొన్ని ప్రాంతాల మినహా) విద్యుత్తు సౌకర్యం లేకుండా జీవనం సాగిస్తోందని ఓ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ 2015లో చెప్పింది. 80శాతం జనాభా పేదరికంలో బతుకీడుస్తున్నారు. 2010 నుంచి 2015 మధ్యలో 55శాతం మేర సిరియా ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలింది. -
ఆరు సంవత్సరాల దిగువకు పుత్తడి
ముంబై: కొంతకాలంగా స్థిరంగా ఉన్న బంగారం విలువ దిగి వస్తోంది. అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్ లో డాలర్ డిమాండ్ పుంజుకోవడంతో బంగారం దాదాపు ఆరు సంవత్సరాల దిగువకు పడిపోయింది. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఈ డిసెంబర్లో పెరగనున్నాయనే వార్తల నేపథ్యంలో 10గ్రాముల బంగారం ధర 25 వేలకు కొంచెం ఎగువన ట్రేడవుతోంది. దీంతో ఇన్వెస్టర్లలో ధరలు మరింత దిగి వస్తాయనే కొత్త ఆశలు చిగురించాయి. రాబోయే కాలంలో పసిడి ధర 25 వేలకు దిగి రావచ్చని ఆశిస్తున్నారు. పసిడితోపాటు ఇతర విలువైన మెటల్స్ రేట్లు కూడా దిగి వస్తున్నాయి. ముఖ్యంగా ప్లాటినం, వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. బులియన్ మార్కెట్లో గత 10, 15 సెషన్లుగా క్షీణిస్తూ వస్తున్న పసిడి ధర బుధవారం 25 వేల మార్కు దగ్గర ట్రేడవుతోంది. ఈ క్షీణత కొనసాగితే , పుత్తడి ధర ఇంకా దిగి వచ్చే అవకాశాలున్నాయని ఎనలిస్టులు సూచిస్తున్నారు. 2010 ఫిబ్రవరితో పోలిస్తే ..బంగారం విలువ బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాములు రూ. 25,117 స్థాయిని తాకింది. మంగళవారం 450 రూపాయల పతనమైన బంగారం విలువ ఈ రోజు కూడా కొనసాగి మరింత నేలచూపులు చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రిటైల్ మార్కెట్ లో ఆర్నమెంట్ బంగారం, నగలకు డిమాండ్ తగ్గుముఖం పట్టడం కూడా ఒక కారణమని ఎనలిస్టులు భావిస్తున్నారు. గత కొన్ని రోజులు పసిడి ధరలో క్షీణత గమనిస్తున్నప్పటికీ, ఈ పతనం కీలకమైందంటున్నారు ట్రేడ పండితులు. అటు ఫెడ్ అంచనాలు, పారిస్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. నిఫ్టీ 100, సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా నష్టపోయాయి. -
ఆరేళ్లుగా సాక్షి పండగ సంబరాలు
-
సూత్రధారిని పట్టూకోలేరా?
-
ముంబై ముట్టడికి ఆరేళ్లు
-
ఆరేళ్ల తర్వాత వెలుగు చూసిన హత్యోదంతం
ఐదేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసుకు సంబంధించి నిందితులను విచారణ జరుపుతుండగా ఆరేళ్ల క్రితం జరిగిన మరో హత్యోదంతం వెలుగు చూసింది. దీంతో పోలీసులు సదరు మృతదేహాన్ని వెలికితీయించి దర్యాప్తు చేపట్టారు. వివరాలు మారళ్లికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి ఐదేళ్ల క్రితం హత్యకు గురయ్యాడు. తాలూకాలోని నారసింగనహళ్లి సమీపంలోని అడవిలో కాలువ ఒడ్డున పూడ్చి పెట్టిన మృతదేహాన్ని గత నెల మే 30న డీవైఎస్పీ కోనప్పరెడ్డి, హసీల్దార్ సిద్ధలింగయ్యల సమక్షంలో గ్రామీణ పోలీసులు వెలికి తీశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నారాయణ స్వామి,రామాంజి అనే వ్యక్తులను విచారిస్తుండగా చంద్రశేఖర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణప్ప..ఆరేళ్ల క్రితం ఆనందకుమార్ అనే వ్యక్తిని హత్య చేసి మారళ్లి గ్రామం శివారులోని శ్మశానంలో పూడ్చిపెట్టాడని, తాము సురేశ్,హరీశ్,వెంకటేశ్తో కలిసి మృతదేహాన్ని మోయడానికి సహక రించినట్టు నిందితులు గుట్టు విప్పారు. దీంతో ఆనంద్కుమార్ కుటుంబ సభ్యులతో ఫిర్యాదు తీసుకున్న పోలీసులు తహశీల్దార్ రమేశ్కుమార్, సీఐ శివారెడ్డి, రూరల్ ఎస్ఐ నవీన్కుమార్ శుక్రవారం మారళ్లి శ్మశానానికి వెళ్లి ఆనంద్(38) మృతదేహాన్ని వెలికితీయించారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రధాన నిందితుడు కృష్ణప్ప సెంట్రల్ జైలులో ఉన్నాడని, కోర్టు అనుమతితో అతన్ని కస్టడీకి తీసుకుని హత్యకు దారి తీసిన కారణాలను తెలుసుకుంటామన్నారు. హతుడు ఆనంద్కుమార్ భార్య లక్ష్మమ్మ మాట్లాడుతూ తన భర్త కృష్ణప్ప వద్ద డ్రై వర్గా పని చేసేవాడన్నారు, గొడవలు రావడంతో పని మానేశాడన్నారు. ఆ తర్వాత హఠాత్తుగా కనిపించకుండాపోయాడన్నారు, ఎప్పటికయినా వస్తారని ఇన్నేళ్లు వేచి చూసామని, ఇంతలోనే అతను హత్యకు గురైనట్లు పోలీసులు చెప్పారని వివరించింది. నిందితుడు కృష్ణప్ప ఫిల్టర్ ఇసుక దందా నిర్వహిస్తూ ఎదురు తిరిగినవారిని హత్యచేసేవాడని ఆమె ఆరోపించింది. సాక్ష్యాలను, శవాలను మాయం చేయడానికి తన వద్ద పని చేసే కూలీలను ఉపయోగించుకునేవాడని పేర్కొంది. -
ఆరేళ్ళుగా చీకటి గదిలో బంధించిన భర్త