SMS poll
-
కాల్స్ కోసమే ప్రత్యేక ప్యాక్.. వాట్సప్కు ఊరట
న్యూఢిల్లీ: కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేక ప్రీపెయిడ్ ప్యాక్స్ను టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో(Jio), భారతీ ఎయిర్టెల్(Airtel) పరిచయం చేశాయి. 84 రోజుల కాల పరిమితితో రూ.499 ధరలో కొత్త ప్లాన్ను ఎయిర్టెల్ అందుబాటులోకి తెచ్చింది. అపరిమిత కాల్స్, 900 ఎస్ఎంఎస్లు ఆఫర్ చేస్తారు. అలాగే రూ.1,959 ధరలో 365 రోజుల వ్యాలిడిటీ గల ప్యాక్ కింద అపరిమిత కాల్స్, 3,600 ఎస్ఎంఎస్లు అందుకోవచ్చు.రిలయన్స్ జియో రూ.458 ధరలో 84 రోజుల కాల పరిమితితో అపరిమిత వాయిస్కాల్స్, 1,000 ఎస్ఎంఎస్లను అందిస్తోంది. ఏడాది కాల పరిమితితో రూ.1,958 ధరలో అపరిమిత కాల్స్, 3,600 ఎస్ఎంఎస్లను పొందవచ్చు. డేటా అవసరం లేకపోయినా బండిల్ ప్యాక్స్ వల్ల కస్టమర్లకు చార్జీల భారం పడుతోందన్న ఫిర్యాదుల పెద్ద ఎత్తున రావడంతో టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ గత నెలలో టారిఫ్ నిబంధనలను సవరించింది. దీనికి అనుగుణంగా డేటా అవసరం లేని కస్టమర్ల కోసం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం టెలికం కంపెనీలు ప్రత్యేక ప్లాన్స్ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: త్రైమాసిక ఫలితాల్లో కంపెనీలకు లాభాలుఎన్సీఎల్ఏటీలో వాట్సాప్కి ఊరటన్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్లో (NCLAT) వాట్సాప్కు ఊరట లభించింది. మాతృ సంస్థ మెటాతో వాట్సాప్ అయిదేళ్ల పాటు యూజర్ల డేటాను షేర్ చేసుకోరాదంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) నిషేధంపై ఎన్సీఎల్ఏటీ స్టే విధించింది. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది. ప్రకటనల అవసరాలరీత్యా యూజర్ల డేటాను మెటాతో పాటు గ్రూప్ కంపెనీలకు అందించేలా 2021లో వాట్సాప్ గోప్యతా పాలసీని అప్డేట్ చేసింది. అయితే, ఇలాంటివి అనుచిత వ్యాపార విధానాల కిందికి వస్తాయంటూ నవంబర్లో సీసీఐ అయిదేళ్ల నిషేధంతో పాటు మెటాపై రూ.213 కోట్ల జరిమానా విధించింది. దీన్ని సవాలు చేస్తూ మెటా, వాట్సాప్ సంస్థలు ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. -
ఫోన్ చేసి ఓటీపీ తీసుకుని...
సాక్షి, సిటీబ్యూరో: ఎస్సెమ్మెస్లు, ఈ–మెయిల్స్ పెట్టుబడిగా ఆన్లైన్లో అందినకాడికి దండుకునే సైబర్ నేరగాళ్లు నానాటికి తెలివి మీరుతున్నారు. ఈ క్రిమినల్స్ ఇటీవలి కాలంలో ‘సీజనల్ ఫ్రాడ్స్’ మొదలెట్టారు. వీరు సాధారణంగా ప్రముఖ కంపెనీల పేర్లతో లాటరీలంటూ పుట్టి ముంచుతుంటారు. వరల్డ్ కప్, ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో వాటి పేర్లు చెప్పి ‘వర్తమానం’ పంపిస్తారు. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) రిటరన్స్ సమర్నించే సమయం కావడంతో ఆ పేరు చెప్పి మోసాలకు తెరలేపినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఐటీశాఖ పేరుతో ఫిషింగ్ మెయిల్స్ పంపిస్తూ బోగస్ వెబ్సైట్స్ ద్వారా కొల్లగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు హెచ్చరిస్తున్నారు. బ్యాంకు ఖాతా సరిచూసుకోవాలంటూ... ఐటీ రిటర్న్స్ గడువు లోపు ఫైల్ చేసిన వారికి ప్రస్తుతం తమకు రావాల్సిన నగదు ఐటీ విభాగం నుంచి వచ్చే సమయం కావడంతో దాన్నీ సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ర్యాండమ్గా కొన్ని నంబర్లను ఎంపిక చేసుకుని బల్క్ ఎస్సెమ్మెస్లు పంపిస్తున్నారు. స్థానిక భాషల్లోనూ ఉంటున్న ఆ సందేశాల్లో ఈ–ఫైలింగ్ ద్వారా పంపిన రిటర్న్ను అందుకున్నామని, ఖరారైందని చెబుతూ తమ నుంచి రావాల్సిన మొత్తం ఇంత అంటూ సూచిస్తున్నారు. ఆ నగదును మీకు సంబంధించిన బ్యాంకు ఖాతాకు పంపిస్తున్నామంటూ అక్కడ తప్పు ఖాతా నంబర్ చూపిస్తున్నారు. సదరు బ్యాంకు ఖాతా మీది కాకున్నా... అప్డేట్ చేయాలన్నా ఈ కింది లింకులోకి వెళ్ళాలంటూ దాన్ని పొందుపరుస్తున్నారు. ఈ ఎస్సెమ్మెస్లు అందుకున్న వారిలో రిటర్న్ రావాల్సిన వారు లేకపోతే పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. రావాల్సిన వారు ఉంటే ఆ ఎస్సెమ్మెస్లో ఉన్న బ్యాంకు ఖాతా తమది కాదని భావించి లింకులోకి వెళ్ళి సైబర్ నేరగాళ్ళకు చెందిన బోగస్ ఐటీ వెబ్సైట్లో అసలు బ్యాంకు ఖాతా వివరాలు అప్లోడ్ చేస్తున్నారు. ఫోన్ చేసి ఓటీపీ తీసుకుని... ఇలా బోగస్ వెబ్సైట్స్ ద్వారా నెట్ బ్యాకింగ్కు సంబంధించిన పూర్తి వివరాలు సదరు సైబర్ నేరగాళ్లకు చేరిపోతున్నాయి. వీటిని వినియోగించి లావాదేవీలు చేయాలంటే వారికి కావాల్సిందల్లా వన్టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) మాత్రమే. దీన్ని సంగ్రహించడానికి సైబర్ నేరగాళ్లు ఫోన్కాల్స్ చేస్తున్నారు. తప్పుడు వివరాలతో తీసుకునే సిమ్కార్డులతో కాల్స్ చేసే క్రిమినల్స్ ఆ నంబర్లను ముందే ‘ట్రూకాలర్’లో ‘ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్’, ‘ఐటీ ఆఫీస్ ల్యాండ్లైన్’, ‘ఐటీ అసిస్టెంట్ కమిషనర్’ తదితర పేర్లతో సేవ్ చేస్తున్నారు. దీంతో ఈ కాల్స్ అందుకునే వారు ట్రూకాలర్ ద్వారా ఈ పేర్లను చూస్తే ఐటీ శాఖ నుంచి ఫోన్ వస్తున్నట్లు భావిస్తారు. అప్పటికే బోగస్ వెబ్సైట్ ద్వారా తమకు చేరిన వివరాలు చెప్పి మరింత నమ్మకం కలిగించే నేరగాళ్ళు కరెక్షన్ పూర్తయిందని, మీ ఫోన్కు వచ్చే ఓటీపీ చెప్పాలంటూ అడిగి తీసుకుంటుంటారు. ఇలా అన్ని వివరాలు చేరిన తర్వాత ఆన్లైన్లో ఖాతాలు ఖాళీ చేస్తుంటారని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వెలుగులోకి వస్తున్న బోగస్ వెబ్సైట్స్ను బ్లాక్ చేసినప్పటికీ నేరగాళ్ళు మరికొన్ని మార్పులతో మరొటి సృష్టించి ఫిషింగ్ చేస్తున్నట్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి మెయిల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఏ మాత్రం నెట్ బ్యాకింగ్ సహా వ్యక్తిగత సమాచారం పొందుపరచాలని అందులో ఉన్నా అనుమానించి అధికారులను ఆశ్రయించి సందేహం నివృత్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. రిటర్న్స్లో తప్పులు ఉన్నాయంటూ... ఐటీ రిటర్న్స్లో పొరపాట్లు దొర్లినా, సరైన సమయంలో ఆ విభాగానికి చేరకపోయినా పాన్ హోల్డర్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. దీనిని ఆసరాగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు ఐటీ శాఖ వెబ్సైట్ను పోలిన దాన్నే తయారు చేస్తున్నారు. అసలు వెబ్సైట్ (donotreply@incometaxindiaefiling.gov.in ) చిరునామాతో ఉంటుంది. అయితే నేరగాళ్లు గుర్తించడానికి వీలులేని కొన్ని చిన్న చిన్న మార్పులతో దీనినే పోలి ఉండేలా సైట్స్ రూపొందిస్తున్నారు.గతేడాది సైబర్క్రైమ్అధికారులు గుర్తించిన దాని ప్రకారం సైబర్నేరగాళ్ళు తయారు చేసిన బోగస్ వెబ్సైట్ (donotreply@incometaxindiafilling.gov.in) చిరునామాతో ఉంటోంది. ఈ–ఫైలింగ్ అనే పదంలో ‘ఇ’ అక్షరం లేకుండా (filing), ఫిల్లింగ్ అనే పదాన్ని (filling)గా పేర్కొంటూ ఈ సైట్ రూపొందిస్తున్నారు. ఈ లింకును పంపిస్తున్న సైబర్ నేరగాళ్లు తక్షణం మళ్లీ రిటర్న్స్ దాఖలు చేయాలని గతంలో చేసిన ఈ–ఫైలింగ్లో తప్పులు ఉన్నాయని చెబుతూ మళ్లీ దాఖలు చేయకుంటే భారీ జరిమానా తప్పదని హెచ్చరిస్తుంటారు. వీటిని నమ్మిన ఎవరైనా ఆ లింకులోని ప్రవేశిస్తే అది నేరుగా సైబర్ నేరగాళ్లకు చెందిన సర్వర్కు చేరుతుంది. ఆ లింకు ద్వారా ఓపెన్ అయ్యే పేజ్ పాన్ వివరాలతో పాటు నెట్ బ్యాకింగ్కు సంబంధించిన వివరాలనూ పొందుపరచాలని కోరుతుంది. ఈ బోగస్ వెబ్సైట్ సైతం అసలు దాన్నేపోలి ఉండటంతో పలువురు నిజమేనని నమ్మివాటిని పూరించేస్తారు. -
ఈసారి విశాఖలో టీఎస్సార్–టీవీ9 అవార్డ్స్
‘‘కళాకారులను గౌరవించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా పలువురు అవార్డులు ఇస్తున్నారు. కానీ, ప్రజాభిప్రాయాన్ని సేకరించి, అవార్డులు ఇవ్వడం మా ‘టీఎస్సార్–టీవీ9’ అవార్డుల ప్రత్యేకత. గత ఆరేళ్లుగా పాటిస్తున్న ‘ఎస్ఎమ్ఎస్’ పోల్ సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నాం’’ అన్నారు కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి. టీవీ9 ఛానల్తో కలిసి ప్రతి ఏడాది ‘టీఎస్సార్– టీవీ9’ జాతీయ అవార్డులను ఆయన అందజేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం 2015, 2016 సంవత్సరాలకు గాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, పంజాబీ, హిందీ రంగాల్లో నామినేషన్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ – ‘‘కళాకారులంటే నాకెంతో అభిమానం. వాళ్లను సత్కరించడం ద్వారా నాకెంతో ఆత్మసంతృప్తి లభిస్తుంది. ఈసారి విశాఖలో 50 వేల మంది ప్రేక్షకుల సమక్షంలో అవార్డుల వేడుకను నిర్వహించాలనుకుంటున్నాం. దీన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నాం. మార్చి 8 నుంచి నెల రోజుల పాటు టీవీ9లో ప్రేక్షకులు తమకు నచ్చిన స్టార్, టెక్నీషియన్ లను అవార్డుకు ఎంపిక చేసుకునే ఎస్ఎమ్ఎస్ పోల్ జరగనుంది. ఏప్రిల్ 8న విశాఖ క్రికెట్ స్టేడియమ్లో ఈ వేడుక జరుపుతాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అవార్డ్స్ కమిటీ జ్యూరీ సభ్యులు బి. గోపాల్, పీవీపీ, రఘురామ కృష్ణంరాజు, జయసుధ, జీవిత, మీనా, పింకీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.