Sridevi Reddy
-
అనగనగా ఓ రచయిత్రి
సాక్షి,సిటీబ్యూరో :తల్లి సరదాగా రాసిన కథలు చదివి స్ఫూర్తి పొందిన ఓ యువతి తనూ అదే మార్గంలో ప్రయాణం మొదలుపెట్టారు. తెలుగు భాషపై పట్టు సాధించి అక్షరాలతో చెలిమి చేశారు. అలా తన మనసులోనిభావాలను కథలు, కవిత్వంగా మలిచి.. పుస్తకాల్లో అచ్చుగా చూసుకుని మురిసిపోయారు. ఆ రచనలు ప్రజాబాహుళ్యంలో ప్రాచుర్యం పొందడంతో పాటు తనకంటూ గుర్తింపు తెచ్చాయి. ఆమే నగరానికి చెందినతంగెళ్ల శ్రీదేవిరెడ్డి. 50కి పైగా కథలు ప్రచురణ రామంతపూర్లో నివాసముంటున్న తక్కెళ్లపల్లి శ్రీదేవిరెడ్డి తల్లి సుజాత కూడా పలు రచనలు చేశారు. అమ్మ నుంచి నేర్చుకున్న కథా నేర్పును శ్రీదేవిరెడ్డి ఒంటబట్టించుకున్నారు. ఈమె బతుకమ్మ, బోనాలు వంటి ప్రత్యేక వేడుకల కోసం రాసిన పాటలు అందరి నోళ్లలో పలుకుతున్నాయి. అంతేకాదు.. కథా వ్యాసాంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారామె. శ్రీదేవి ఇప్పటి దాకా దెయ్యం, దేవుడు పారిపోయాడు, ఇన్నూరు, కావలి బుడ్డమ్మ తదితర 50కి పైగా కథలు రాశారు. ఇవి పలు దినపత్రికల్లో ప్రచురణ కూడా అయ్యాయి. కథలు శ్రీదేవి ఊహల నుంచి పుట్టినవే అయినా.. ప్రతి కథా నిజ జీవితాలను ప్రబింబించడం గమనార్హం. అంతేకాదు.. అచ్చమైన పల్లె జీవన నాటిని ఒడిసిపట్టుకున్న శ్రీదేవిరెడ్డి చక్కని వాడుక పదాలతో రాసిన ‘కాముని పండుగ, ఎల్లగొట్టు’ వంటి కథల్లో వనపర్తి, ఆత్మకూరు, గద్వాల వంటి గ్రామాల్లోని ప్రజలు మాట్లాడే పదాలు, వారి జీవనాన్ని ప్రతిబింబిస్తాయి. శ్రీదేవిరెడ్డి రాజకీయ నేతల పొలిటికల్ క్యాంపెయిన్ పాటలు సైతం రాశారు. వీటిలో వైఎస్సార్సీపీకి, జగన్ వ్యక్తిత్వంపై, పొన్నం ప్రభాకర్ వంటి వారికి రాశారు. ప్రత్యేకహోదాపై రాసిన పాటను ఎంతో గుర్తింపు పొందింది. సినీ కవిత్వంలోనూ దిట్ట ఇటీవల విడుదలైన ‘దొరసాని’ సినిమాలో హీరో.. హీరోయిన్ను చూసిన ప్రతిసారీ ఓ కవిత చెబుతాడు. అవన్నీ శ్రీదేవి రాసినవే కావడం విశేషం. ఈమె ప్రతిభన గుర్తించిన శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ‘వాసిరెడ్డి రంగనాయకమ్మ సార్మక పురస్కారం’తో సత్కరించింది. కళాసంస్కృతి సంస్థ ‘కవితారాణి’, సూర్యచంద్ర సాంస్కృతిక సంఘ సేవా సంస్థ ‘గౌడ కవితారత్న’, హైదరాబాద్ సిటీ కేబుల్ నుంచి ‘బెస్ట్ రైటర్’ వంటి అవార్డులు అందుకున్నారు. ఈ కథలు బాగా ఫేమస్ ‘ప్లాస్టిక్ పూలు, పరమవీర చక్ర, టీజింగ్ రోమియో, అర్థాలే వేరులే, ఎదురింట్లో భామ–ఇంట్లో భామ, ద్వంసగీతం, ఒక ప్రేమకథ, ఎరుపెక్కిన తెల్లగులాబి, మస్కా, అమ్మ, సదువు, ఊహల పల్లకిలో, తనశవమై ఒకరికి వశమై, ప్రేమశకలం, మేఘమాల, ఆ రాత్రి, లవ్లీ మై హీరో, అమ్మకొడుకు, ప్రేమ శకలం, మాతృ హృదయం, నువ్వొస్తావని, వేకువ, మందాకిని’ వంటి కథలు పాఠకులకు బాగా చేరువయ్యాయి. ఇక ‘ఆశ్రమం, పూలు నలుగుతున్నాయి, నాయిన, చారాణ, అమ్మా మల్లెప్పుడొస్తవే!, మొగిలి, ష్.., తాత చెప్పిన కథ, వెన్నెల కురుస్తుందో లేదో!, పాడుబడ్డ బాయి, తగలబడిన వెన్నెల’ వంటి కథలు ఆన్లైన్ కూడా ఎంతో పేరు, ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. అందరికీ చేరువవ్వాలి నాకు చిన్నప్పటి నుంచి కథలు, కవితలు రాయడమంటే చాలా ఇష్టం. నిజ జీవితానికి దగ్గరగా, ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా నా రచనలు ఉంటాయి. కొన్ని సినిమా కథలు కూడా సిద్ధం చేసుకున్నాను. బతుకమ్మ, బోనాలకు గ్రామాల్లో ఉండే వాతావరణాన్ని ప్రపంచానికి తెలిసేలా పాటలు రాశాను.– తంగెళ్ల శ్రీదేవిరెడ్డి, రచయిత్రి -
‘కేఈ కుటుంబం నుంచి ప్రాణహాని’
కర్నూలు: తన భర్త చెరుకులపాడు నారాయణరెడ్డిని పథకం ప్రకారమే హత్య చేశారని ఆయన భార్య శ్రీదేవిరెడ్డి ఆరోపించారు. తన భర్త మరణానికి ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కొడుకు శ్యాంబాబు కారణమని ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆరోపించారు. కేఈ కృష్ణమూర్తి అక్రమాలపై పోరాడినందునే తన భర్తను పొట్టన పెట్టుకున్నారని వాపోయారు. కేఈ కుటుంబం నుంచి తమకు ప్రాణహాని ఉందని చెప్పారు. తమకు ఏం జరిగినా కేఈ కృష్ణమూర్తిదే బాధ్యతని అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను చంపిన హంతకులకు పోలీసులు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో నిష్పక్ష విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పత్తికొండ నియోజకవర్గంలో నారాయణరెడ్డి ఎంతో పేరు సంపాదించుకున్నారని, ప్రజలకు అందుబాటులో ఉండేవారని గుర్తు చేసుకున్నారు. -
'వారికి జీవితాంతం గెలుపు లేకుండా చేస్తా'
-
నా భర్తను చంపించింది వారే: నారాయణరెడ్డి భార్య
-
నా భర్తను చంపించింది వారే: నారాయణరెడ్డి భార్య
కర్నూలు: పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యకు కేఈ సోదరులే కారణమని నారాయణరెడ్డి భార్య శ్రీదేవి రెడ్డి, సోదరుడు ప్రదీప్రెడ్డి ఆరోపించారు. కేఈ కుమారుడు శ్యాంబాబు, ఎస్సై నాగ తులసీప్రసాద్ హత్యలో కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. పత్తికొండలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆగడాలు ఎక్కువయ్యాయని అన్నారు. కేఈ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నారాయణరెడ్డి న్యాయ పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పోరాడినందునే నారాయణరెడ్డిని హత్య చేశారని ఆరోపించారు. ఇసుక మాఫియాకు కేఈ కుమారుడు శ్యాంబాబు నేతృత్వం వహిస్తున్నాడని వెల్లడించారు. గన్మెన్లను ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరినా పట్టించుకోలేదని వాపోయారు. రెన్యువల్ కోసం ఇటీవలే లైసెన్సెడ్ తుపాకీని నారాయణరెడ్డి డిపాజిట్ చేశారని తెలిపారు. మూడు నెలలైనా రెన్యువల్ చేయకపోవడం వల్లే ఆయన హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. తమ కుటుంబంపై ఎన్నేళ్లు కక్ష సాధిస్తారని శ్రీదేవి రెడ్డి ప్రశ్నించారు. హత్య రాజకీయాలు చేసే బదులు ఇంట్లో కూర్చుని చీరలు కట్టుకోవాలని అన్నారు. తన పిల్లలకు తండ్రి లేకుండా చేశారని కన్నీళ్లపర్యంతమయ్యారు. ఏదైతే లక్ష్యం కోసం తన భర్త పోరాడారో దాని కోసం తన ఊపిరి ఉన్నంతవరకు పోరాడతానని పేర్కొన్నారు. -
సేవాదళ్ అధికార ప్రతినిధిగా శ్రీదేవిరెడ్డి
సాక్షి ప్రతినిధి, చెన్నై: వైఎస్ఆర్ కాంగ్రెస్ సేవాదళ్ తమిళనాడు విభాగం అధికార ప్రతినిధిగా కమలాపురం లక్ష్మీ శ్రీదేవిరెడ్డిని నియమించినట్లు సేవాదళ్ జాతీయ అధ్యక్షులు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ప్రకటించారు. సేవాదళ్ మహిళావిభాగం అధ్యక్షురాలిగా ఉన్న ఆమె అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు సేవాదళ్ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న సైకం రామకృష్ణారెడ్డిని ఆ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు ఆయన చెప్పారు. సేవాదళ్ బలోపేతంపై చర్చ తమిళనాడులో వైఎస్ఆర్ సీపీ సేవాదళ్ బలోపేతంపై చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తమతో చర్చించినట్లు సేవాదళ్ తమిళనాడు విభాగం ఉపాధ్యక్షులు జకీర్హుస్సేన్, ప్రముఖనేత శరవణన్ తెలిపారు. సేవాదళ్ కార్యక్రమాలపై చర్చించేందుకు గురువారం తిరుపతికి వెళ్లి చెవిరెడ్డిని కలుసుకున్నట్లు వారు తెలిపారు. సేవా కార్యక్రమాలతో సేవాదళ్ ప్రజలకు అండగా నిలవాలని ఆయన సూచించారని అన్నారు. ముఖ్యంగా తమిళనాడులోని సేవాదళ్ అధికార ప్రతినిధిగా శ్రీదేవిరెడ్డి తెలుగు కుటుంబాలకు సేవాదళ్ కార్యకర్తలు చేరువ కావాలని చెప్పారని తెలిపారు. తమిళనాడు సేవాదళ్ విభాగంలో అనేక మార్పులు చేస్తున్నట్లు ఆయన వివరించారని అన్నారు. తమతోపాటు సేవాదళ్ తమిళనాడు నేత ప్రకాష్ సైతం చెవిరెడ్డిని కలిసినట్లు వారు తెలిపారు. శ్రీదేవి కృతజ్ఞతలు: వైఎస్ఆర్ సీపీ సేవాదళ్ తమిళనాడు విభాగం అధికార ప్రతినిధిగా తనను నియమించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలని శ్రీదేవిరెడ్డి చెప్పారు. అలాగే తన పేరును సిఫారసు చేసిన ఉపాధ్యక్షులు జకీర్హుస్సేన్, శరవణన్లకు ధన్యవాదాలని అన్నారు. 2019 నాటి ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం పీఠం ఎక్కించే వరకు అవిశ్రాంతంగా పాటుపడతానని అన్నారు. అధికార ప్రతినిధిగా పార్టీకి వన్నెతెచ్చేట్లుగా వ్యవహరిస్తానని తెలిపారు.