breaking news
sv satish kumar reddy
-
ఆంధ్రజ్యోతిపై పరువునష్టం దావా వేస్తాం: ఎస్వీ సతీష్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఏపీపై పడి పచ్చమూక దోచుకుని తింటుందంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు కష్టాల్లో ఉన్నారని.. కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ‘‘పేద విద్యార్థి వైద్య విద్యను అందించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు తెచ్చింది. అలాంటి మెడికల్ కాలేజీలను కూటమి సర్కార్ అంగట్లో పెట్టి అమ్ముతుందని సతీష్రెడ్డి దుయ్యబట్టారు. రైతులకు రూ.25 వేల ఆర్థిక సహాయం అన్నారు. కనీసం ఇలాంటి ఒక హామీ ఇచ్చామన్న విషయం కూడా కూటమికి గుర్తు లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యా సంస్థలు నడపలేని పరిస్థితి. ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్పై విష ప్రచారం చేయడమే కూటమి ఏజెండాగా పెట్టుకున్నారు. వైఎస్ జగన్ బంధువు అనిల్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఉన్నాడంటూ కూటమి ప్రభుత్వం లీకులు ఇస్తుంది. రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి తీసుకున్న నోట్లపై పెద్ద డ్రామా చేశారు. ఏపీలో యూరియా కొరత తీవ్ర స్థాయిలో ఉంది. కూటమి ప్రభుత్వం పలుకుబడి అంతా వైఎస్సార్సీపీ నేతల పై కక్ష సాధింపు చర్యల కోసం వాడుతున్నారు.’’ అంటూ సతీష్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘వైఎస్ భారతికి రెండు కంపెనీలలో వాటాలున్నాయని ఆంధ్రజ్యోతిలో రాశారు.. దీన్ని రాధాకృష్ణ నిరూపిస్తారా?.. నిరూపించకపోతే పరువు నష్టం దావా వేస్తాం. వైఎస్ భారతి నిరాడంబరంగా జీవిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థకు ఎంతో సహాయం చేస్తున్నారు.’’ అని సతీష్రెడ్డి పేర్కొన్నారు. ‘‘మద్యం ఏరులైపారుతుంది. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం రేట్లు పెంచారు. నాడు-నేడు పేరుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమూల మార్పు తీసుకువచ్చింది. రాష్ట్రంలో ఉన్న డిస్టరీలు అన్ని చంద్రబాబు హాయాంలో ఏర్పాటు చేసినవే.. చంద్రబాబు నీ అబద్దాలు ఆపు’’ అంటూ ఎస్వీ సతీష్రెడ్డి నిప్పులు చెరిగారు. -
మీకు సిగ్గుచేటుగా లేదా.. పదే పదే సునీతని,షర్మిలని పెట్టుకుని.. ABNకు సతీష్ రెడ్డి కౌంటర్
-
ఏ ముఖం పెట్టుకుని ఈ సంబరాలు బాబూ: సతీష్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్కదాన్ని పూర్తిగా అమలు చేయలేని కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ పేరుతో విజయోత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తన అనుభవంతో సంపద సృష్టించి, ప్రజలకు పంచుతానంటూ గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు చివరికి ప్రభుత్వ ఆస్తులను అమ్ముకునే దుస్థితికి తన పాలనను తీసుకెళ్లారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ రాష్ట్రంలో విద్య, వైద్యరంగాల్లో అత్యంత కీలకమైన మార్పులు తీసుకువచ్చేందుకు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు వ్యక్తులకు ధరాదత్తం చేసేందుకు చంద్రబాబు తెగబడ్డారని, ఇటువంటి సీఎం ఉండటం ప్రజల దురదృష్టమని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావొస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తప్పుడు ప్రకటనలతో కూటమి నాయకులు ప్రజల్ని ఇప్పటికీ తప్పుదోవ పట్టిస్తున్నారు. గత ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలను మాత్రమే కాకుండా ఇంకా రెట్టింపు ఇస్తామని 143 హామీలతో నమ్మబలికి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండానే దాదాపు రూ.2 లక్షల కోట్ల అప్పులు చేశారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రజలు తనని తిట్టుకుంటున్నారని తెలిసి కూడా ఏదో బ్రహ్మాండం బద్దలు కొట్టేసినట్టు చంద్రబాబు 'సూపర్ సిక్స్ సూపర్ హిట్' పేరుతో అనంతపురంలో హడావుడి చేశాడు.సూపర్ సిక్స్లో సుఖీభవ పేరుతో రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రంతో సంబంధం లేకుండా ఏడాదికి రూ.20 వేలు ఇస్తానని హామీఇచ్చాడు. ఈ పథకానికి రూ.10,800 కోట్లు అవసరం అనుకుంటే, గతేడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది కేవలం రూ.5 వేలిచ్చి చేతులు దులిపేసుకున్నాడు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామని చెప్పి రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపానపోలేదు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా 1.80 కోట్ల మంది మహిళలను వంచించాడు.ఆ లెక్కన ఈ పథకం అమలు చేయడానికి ఏడాదికి రూ.32,400 కోట్లు చొప్పున అవసరం అవుతాయి. అమ్మ ఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనం పేరుతో ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేస్తామని చెప్పి, గతేడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది మాత్రం అరకొరగా అమలు చేశాడు. ఆఖరుకి స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని మొదలుపెట్టి కేవలం 5 రకాల బస్సులకే పరిమితం చేసి ఆంక్షలు విధించాడు. దీపం-2 పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి గతేడాది ఒక్క సిలిండర్ ఇచ్చాడు.ఈ ఏడాది ఒక్క సిలిండర్ కూడా ఇచ్చింది లేదు. ఆ ఆరు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ కావాలంటే ఏడాదికి రూ.70 వేల కోట్లు కావాలి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి నేటికి 15 నెలలు గడిచిపోయాయి. వారిచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ అమలు చేయాలంటే దాదాపు రూ. 90 వేల కోట్లు కావాలి. కానీ రూ. 12 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. గత వైఎస్సార్సీపీ హయాంలో పథకాల లబ్ధిదారుల వివరాలను గ్రామ సచివాలయాల్లోనే ప్రదర్శించేవాళ్లం. ఆ విధంగానే ఆయా గ్రామాల్లో ఏ పథకానికి ఎంతెంత ఖర్చు చేశారో ఆ వివరాలు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించే దమ్ము చంద్రబాబుకి ఉందా?50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చాడు. ఆ ఊసే ఎత్తడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క కొత్త పింఛన్ ఇవ్వకపోగా 15 నెలల్లో దాదాపు 5 లక్షల పింఛన్లు పీకేశాడు. ఇది కాకుండా మరో 7 నుంచి 10 లక్షల మంది పింఛన్లకు అర్హులై ఉండి దరఖాస్తు చేసుకున్నా వారికి పింఛన్లు మంజూరు చేయడం లేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద దాదాపు రూ.6400 కోట్లు చెల్లించాల్సి ఉంది. పీజుల కోసం కాలేజీలు విద్యార్థులను వేధిస్తున్నా పట్టించుకున్న పాపానపోవడం లేదు.ప్రభుత్వం దగ్గర రూ. 4500 కోట్లు లేవా?నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజి కూడా తీసుకురాలేదు. వైయస్ జగన్ తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలను మాత్రం కుట్ర పూరితంగా ప్రైవేటుపరం చేసి పేదలకు దూరం చేస్తున్నాడు. పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందించాలని వైఎస్ జగన్ కోరుకుంటే చంద్రబాబు మాత్రం పప్పుబెల్లాలకు తన వారికి ధారాదత్తం చేసేస్తున్నాడు. వైఎస్ జగన్ ప్రణాళిక ప్రకారం 17 మెడికల్ కాలేజీలు పూర్తయితే 2550 మెడికల్ సీట్లు వచ్చేవి. కానీ మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను ఏడాది కాలంగా ఆపేసి, సేఫ్ క్లోజ్ పేరుతో వాటిని మూసేశాడు.డాక్టర్లు కావాలనుకునే పేద విద్యార్థుల కలను చిదిమేశాడు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికే 5 మెడికల్ కాలేజీలు నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం, రాజమండ్రిలో పూర్తయి క్లాసులు జరుగుతున్నాయి. రెండో విడతలో పాడేరులో 50 సీట్లతో క్లాసులు జరుగుతున్నాయి. వైయస్ జగన్ మీద కోపంతో పులివెందుల మెడికల్ కాలేజీకి సీట్లు వద్దంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి లేఖ రాసిన దుర్మార్గుడు చంద్రబాబు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే అసలు పనులే జరగలేదంటూ పిల్లర్ల దశలో ఉన్న భవనాల వద్దకు పోయి వీడియోలు తీసి దుష్ప్రచారం చేస్తున్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా పక్కనపెట్టేశాడు. ఎందుకని అడిగితే వాటిని పూర్తి చేయాలంటే రూ. 4500 కోట్లు ఖర్చవుతుందని, ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదని బీద అరుపులు అరుస్తున్నాడు. చంద్రబాబు చేసిన రూ. 2 లక్షల కోట్ల అప్పుల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం రూ. 4500 కోట్లు ఖర్చు చేయలేకపోతున్నారంటే ఈయన్ను విజనరీ అని ఎలా అనాలో అర్ధం కావడం లేదు. సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ప్రభుత్వ ఆస్తులను కుట్రపూరితంగా ప్రైవేటుపరం చేసే విధానాలను చూసి అసహ్యించుకుంటున్నారు. గత ఐదేళ్ల జగన్ పాలనతో చంద్రబాబు పాలననను పోల్చి చూస్తూ అసలైన విజనరీ జగనా, చంద్రబాబో ప్రజలు నిర్ణయానికొచ్చేశారు.రైతులను పట్టించుకోవడం మానేశారుకూటమి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు వ్యవసాయాన్ని పట్టించుకోవడం మానేశాడు. రైతులను చిన్నచూపు చూస్తున్నాడు. అన్నదాత సుఖీభవ పేరుతో పెట్టుబడి సాయం ఇవ్వకుండా మోసం చేసిందే కాకుండా వైయస్ జగన్ హయాంలో అమలు చేసిన ఉచిత పంటల బీమా, ధరల స్థిరీకరణ నిధి, ఆర్బీకే వ్యవస్థలను నిర్వీర్యం చేసేశాడు. గతంలో ఎప్పుడూ లేనిది రైతులు యూరియా బస్తా కోసం గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడే పరిస్థితులు తీసుకొచ్చాడు. యూరియా ఏదని అడిగిన రైతులకు రాజకీయాలు ఆపాదించి కేసులు పెట్టి బెదిరిస్తున్నారు.వైఎస్సార్సీపీ హయాంలో కిలో ఉల్లి రూ.40ల ధర పలికితే నేడు రూ.3 లకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. కిలో టమాట రూపాయిన్నరకి అమ్మాల్సి వస్తుంది. రైతులకు కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. అరటి, పొగాకు, మిర్చి, మామిడి, చీనీ, వరి, శెనగ, వేరుశెనగ.. ఇలా రైతులు పండించే ఏ పంటకు గిట్టుబాటు ధర ఉండటం లేదు. వైఎస్ జగన్ ధరల పతనంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమీక్షల పేరుతో రెండురోజులు హడావుడి చేసి చేతులు దులుపుకోవడం తప్పించి రైతులకు మేలు చేయాలన్న ఆలోచన చేయడం లేదు. చంద్రబాబు అధికారంలో ఉంటే వ్యవసాయం అధోగతే అని మరోసారి రుజువైంది. ఇప్పటికైనా చంద్రబాబు రైతు సమస్యలపై దృష్టిపెట్టాలి.వివేకా హత్య కేసును రాజకీయంగా వాడుకుంటున్నారుప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పుకోలేక సందర్భం లేకపోయినా వివేకానందరెడ్డి హత్య కేసు గురించి అనుకూల మీడియాలో పతాక శీర్షికల్లో వార్తలు రాయించి డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఆయన మరణాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననం చేయడం, వైఎస్సార్సీపీని రాజకీయంగా లేకుండా చేయాలనే కుట్రలు చేస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లిలా బురద రాజకీయాలు చేస్తారో చంద్రబాబు నిర్ణయించుకోవాలి. షర్మిల, సునీతలను అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్ మీద విష ప్రచారం చేస్తున్నారు. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ పూర్తి చేసి చార్జిషీట్ వేసిన తర్వాత కూడా పునర్విచారణ కావాలని కోరడం వెనుక ఎవరి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయో అర్థం చేసుకోలేనంత దుస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు.కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అవినీతి చేస్తున్నారని టీడీపీ భజన పత్రిక ఆంధ్రజ్యోతిలో పుంఖానుపుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. వారికి ఆ ధైర్యం ఇచ్చింది చంద్రబాబు కాదా? అవినీతి ఎమ్మెల్యేలు, మంత్రులపై చర్యలు తీసుకున్న ఒక్క సంఘటన కూడా లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ సైతం అవినీతి సంపాదనకి డోర్లు తెరిచారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలెక్షన్ కోసం ఏకంగా ఒక ఫ్లోర్నే కేటాయించారు. చంద్రబాబు ఇచ్చిన 143 హామీలన్నింటికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్యారంటీ సంతకాలు చేశాడు. కానీ వాటి అమలు గురించి మాత్రం ఆయన మాట్లాడటం లేదు. స్పెషల్ హెలికాఫ్టర్లలో తిరిగే ఆయనకి ప్రజా సమస్యలు కనిపించడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన ఉండటం లేదు.చంద్రబాబుకి రాజ్యాంగం మీద గౌరవం లేదు..చంద్రబాబుకి ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద గౌరవం లేదు కాబట్టే 40 శాతం ఓటింగ్ ఉన్న పార్టీకి ప్రతిపక్ష గుర్తింపు ఇవ్వడం లేదు. సమస్యల మీద చర్చ జరిగితే ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలుస్తాయని చంద్రబాబు భయపడిపోతున్నారు. 11 మంది వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలను చూసి 164 మంది భయపడిపోతున్నారు. 15 నెలల కాలంలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ అనేక ప్రెస్మీట్ల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించారు. కానీ ఒక్కదానికి కూడా సూటిగా సమాధానం చెప్పే దమ్ము అధికార పార్టీకి లేదు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే వైయస్సార్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. అలాంటి వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడనిస్తారంటే ఎవరైనా నమ్మగలరా? -
ఇంతకంటే దారుణం ఉంటుందా?: సతీష్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ప్రతి పౌరుడికి ఉన్న ఆస్తి ఓటు.. నిజమైన స్వాతంత్ర్యం అంటే నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడమేనన్నారు. ఎల్లో మీడియా నీచమైన వార్తలు రాస్తోందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘పులివెందులలో టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి దాడులకు తెగబడ్డారు. మరణాయుధాలతో దాడులు చేసి చాలామందిని గాయపరిచారు. ఎస్పీని కలిసి పులివెందుల వచ్చే లోపే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాముపై దాడి చేశారు. వారు ఉన్న కారుపై పెట్రోల్ పోసి చంపడానికి యత్నించారు. ఇప్పటికీ వేల్పుల రాము ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. తిరిగి మా వాళ్లపైనే ఎస్సీ,ఎస్టీ కేసులు పెట్టారు’’ అంటూ సతీష్రెడ్డి నిప్పులు చెరిగారు.‘‘గ్రామాల్లో ఉన్న వైఎస్సార్సీపీ నేతలపై కూడా తప్పుడు కేసులు పెట్టారు. 11న అర్ధరాత్రి ఎంపీ అవినాష్రెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారు. వందల కిలోమీటర్లు తిప్పుతూ అవినాష్రెడ్డిని వేధించారు. నన్ను కూడా అక్రమంగా నిర్బంధించారు. జడ్పీటీసీ ఎన్నిక కోసం 700 మంది పోలీసులను పెట్టారు. 3 వేల మందికిపైగా టీడీపీ గూండాలను పులివెందులలో దింపారు. టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ము కాశారు. పోలింగ్ బూతులకు ఓటర్లను రాకుండా అడ్డుకున్నారు. వచ్చిన ఓటర్లను బెదిరించి స్లిప్పులు లాక్కున్నారు. 13 బూత్ల్లోకి మీడియాను కూడా అనుమతించలేదు’’ అంటూ సతీష్రెడ్డి దుయ్యబట్టారు.‘‘పులివెందుల్లో స్వేచ్ఛగా ఎన్నిక జరిగిందని ఎల్లో మీడియా రాయడం విడ్డూరం. ఈ దిగజారిన వార్తలు చూసి సిగ్గుపడే పరిస్థితి. వైఎస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి పులివెందుల్లో ఏనాడు ఎన్నికల్లో అక్రమాలు జరగలేదు. టీడీపీ ఏనాడు ఎన్నికల్లో పులివెందుల్లో అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదు చేయలేదు. అలాంటప్పుడు 30 ఏళ్లుగా పులివెందుల్లో ప్రజాస్వామ్యం లేదని ఎలా వార్తలు రాస్తారు..?. గతంలో మేం టీడీపీలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలవడం నిజం కాదా..?పులివెందుల్లో కూటమి ప్రభుత్వం కొత్త సంప్రదాయాన్ని తీసుకుచ్చింది. టీడీపీ అధికారిక సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోల్లోనే దొంగ ఓటర్లు ఉన్నారు. వారు దొంగ ఓటర్లు కాదు అని నిరూపించగలరా..?. జిల్లా కలెక్టర్ తను ఉన్న ఫోటోలో దొంగ ఓటర్ ఉన్నాడని గ్రహించి ఫోటోను డిలీట్ చేయలేదా..?. 700 మంది పోలీసులు బూత్లను స్వాధీనం చేసుకుని దొంగ ఓటర్లతో పోలింగ్ చేయించారు. దొంగ ఓట్లతో గెలిచిన వ్యక్తిని సీఎం సతీమణి అభినందించడం దారుణం’’ అని సతీష్రెడ్డి మండిపడ్డారు. -
నాకు ఏమైనా జరిగితే లోకేశ్ దే బాధ్యత: S.V సతీష్ రెడ్డి
-
వైఎస్సార్సీపీ నేత సతీష్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తనపై దాడి జరగబోతున్నట్లు స్పష్టమైన సమాచారం ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దాడి చేయబోతున్నట్లు టీడీపీ నేతలే తనకు చెప్పారన్నారు. ‘‘నన్ను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే. నాపై దాడి జరిగితే సుమోటోగా స్వీకరించండి. నాపై దాడి జరిగితే లోకేష్, బీటెక్ రవే బాధ్యత వహించాలి’’ అని సతీష్ కుమార్రెడ్డి పేర్కొన్నారు.‘‘నాకు ఏమైనా జరిగితే సీబీఐతో ఎంక్వైరీ చేయించాలి. ఇక్కడి పోలీసులతో న్యాయం జరగదు. ఎందుకంటే పోలీసులు పచ్చ చొక్కాలేసుకున్నారు’’ అంటూ సతీష్కుమార్రెడ్డి వ్యాఖ్యానించారు. పులివెందులలో జరుగుతున్న వ్యవహారాలు రాష్ట్రాన్ని దిగ్భ్రాంతి కల్గిస్తున్నాయి. పోలీస్, టీడీపీ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం పోయేలా చేస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం పెళ్లికి వెళ్లిన వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అది మరువక ముందే మరుసటి రోజు ఒక ఎమ్మెల్సీ, వేల్పుల రాముపై హత్యాయత్నం చేశారు...దాడి చేసిన వారే వైఎస్సార్సీపీ నేతలపై ఎదురు కేసు పెట్టీ ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేశారు. ఒక డీఐజీ స్థాయి అధికారి పత్తి వ్యాపారానికి వెళ్లారా అని మాట్లాడుతున్నాడు. మీరు మాట్లాడే తీరు చూస్తే మీకు కానిస్టేబుల్కి ఇచే గౌరవం కూడా ఇవ్వరు. పోలీసులు 100 మీటర్ల దూరంలో ఉండి కూడా మీ పోలీసులు రాలేదు. మీరు లేకపోతే తలకాయలు ఎగిరిపోయేవి అంటున్నారా?. ఇంత పనికిమాలిన వ్యవస్థ అండ చూసుకుని టీడీపీ చెలరేగిపోతోంది. ఇప్పుడు సాక్షి వాహనాలను ధ్వంసం చేస్తామని బెదిరిస్తావా?. కొంత మంది వ్యక్తులు చేస్తున్న పైశాచికాన్ని మీ ప్రభుత్వం కాపాడుతున్నారు..నాకు కూడా భద్రత లేదు.. అయినా ఎన్నికలను జరిపిస్తాం. ఒక వైపు వీళ్లే దాడి చేయడం, ఆ నెపం మాపై నెట్టడం వాళ్లకి రివాజుగా మారింది. నిన్న రాత్రి మా వాళ్లను కొంత మంది అరెస్ట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసులో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వాళ్లు ఆ సమయంలో పోలీసు స్టేషన్లోనే ఉన్నారు. ఈ అరాచకాలు భరించలేక ఈ ఎన్నిక వదిలిపెడతాం అనుకుంటున్నారేమో.. మా మహిళలే ముందుండి ఎన్నికలు నడిపిస్తారు. చంద్రబాబు ఇక్కడ జరుగుతున్న అంశాలు ఏంటి..? మాకు హై కమాండ్ నుంచి ఆదేశాలు అని చెప్తున్నారు..లోకేష్ ఎన్ని దౌర్జన్యాలు చేసైనా పులివెందుల గెలిచి తండ్రికి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాడు. లోకేష్ మీరు అనుచితంగా మాట్లాడితే.. మేము అలానే మాట్లాడతాం. నేను మాట్లాడానని నాపై వేధింపులు చేస్తానంటే భయపడే వారు లేరు. ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ అంశాలు అన్నీ తీసుకెళ్లాం. మీకు ఎన్నిక నిర్వహించలేనప్పుడు ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వడం..?. ఒక గ్రామ ఓటర్లు వేరే గ్రామంలో ఓటు వేయాలా..?. ఈ అరాచకాలు ఆగేటట్లు లేవు...పులివెందుల ఆడబిడ్డలు ముందుండి నడపండి. ఈ ఎన్నిక పులివెందుల పౌరుషానికి, లోకేష్ రెడ్ బుక్ అహంకారానికి మధ్య పోరు. దాని కోసం అక్రమ మార్గాలు, దౌర్జన్యంతో గెలవాలని చూస్తున్నారు..ప్రజలు ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, పిల్లలకు వస్తున్న కృష్ణా జలాలను చూడండి. స్వార్థంతో కొంతమంది చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిండి. ఈ 14 నెలల కాలంలో ఈ పులివెందులకు కూటమి ప్రభుత్వం ఏమి చేసిందో గమనించండి. పులివెందుల మెడికల్ కాలేజీకి వచ్చిన 50 మెడికల్ సీట్లు వెనక్కి పంపిన వాళ్లు పోటీలో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ నాయకులు, వారికి మద్దతు పలికే నాయకులను ప్రశ్నిస్తున్నా.. మీరు పులివెందులకు ఏమి చేశారు..?.అసలు మీరు ధైర్యంతో పులివెందుల ప్రజల ఓట్లు అడుగుతున్నారు?. ఏమి చూసి మీకు ప్రజలు ఓటు వేయాలి అని ప్రశ్నిస్తున్నా.. పైగా అరాచకాలు, మీడియా వాహనాలు పగలగొడతాం అంటున్నారు. ఒక పెద్ద మనిషిగా ఇవన్నీ ఆపాల్సిన స్థానంలో ఉన్న చంద్రబాబు ఏమీ చేయడం లేదు. చివరి అంకంలో చంద్రబాబు ఇలాంటివి అనుమతించి మరింత చెడ్డపేరు తెచ్చుకుంటారు. మీరు దాడులు, అక్రమాలు చేసి గెలిచినా అది గెలుపు కాదు. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితులు ఎన్నడూ చూడలేదు. డీఐజీ ఒక ఉన్నత అధికారిగా వ్యవహరించడం లేదు.’’ అంటూ సతీష్రెడ్డి మండిపడ్డారు. -
ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్ జగన్ను నిలువరించలేరు: ఎస్వీ సతీష్రెడ్డి
సాక్షి, నెల్లూరు: నెల్లూరులో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు చంద్రబాబు డైరెక్షన్లో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ కుట్రలో భాగంగా పోలీసులు ఇప్పటికే జిల్లాలో రెండు వేల మందికి నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు.మహిళా నేతల ఇంటికి అర్థరాత్రి సమయాల్లో వెళ్ళి నోటీసుల పేరుతో వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్ జగన్ పర్యటనకు ఎవరూ వెళ్ళకూడదంటూ ప్రభుత్వమే అడ్డుకోవడం చూస్తుంటే అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని అడ్డుకోవాలనుకునే అవివేకమే కనిపిస్తోందని అన్నారు. ఇంకా వారేమన్నారంటే..ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక ఎస్పీ సెలవుపై వెళ్లిపోయారు: సతీష్రెడ్డివైఎస్ జగన్ గురువారం నెల్లూరు పర్యటనకు రానున్నారు. అక్రమ కేసుల్లో జైలుపాలైన మా పార్టీ నాయకులు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని పరామర్శించడానికి రావాలని నిర్ణయించుకుంటే పోలీసుల ఆంక్షల వల్ల రెండుసార్లు వాయిదా పడింది. హెలిప్యాడ్కి స్థలం కేటాయింపు దగ్గర నుంచి నాయకులను అడ్డుకోవడం వరకు అడుగడుగునా వైఎస్ జగన్ని రాకుండా చేయాలని కుట్రలు చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే నెల్లూరులో 2 వేల మందికి పైగా నోటీసులిచ్చారు.పట్టాభిరామిరెడ్డి అనే 75 ఏళ్ల వృద్ధుడికి కూడా నోటీసులిచ్చారు. అర్ధరాత్రి 1.26 గంటలకు టూటౌన్ ఎస్సై ఒక మహిళ కార్పొరేటర్ను నిద్రలేపి నోటీసులిచ్చి వెళ్లారు. వారితో కనీసం ఒక మహిళా కానిస్టేబుల్ను కూడా తీసుకురాలేదు. జగన్ కార్యక్రమానికి వెళితే మీ వాహనాలను సీజ్ చేస్తామని కిరాయి వాహనాల యజమానులకు నోటీసులిచ్చారు.ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలను చూడలేక, వాటిలో భాగంకాలేక, అధికార పార్టీ పెట్టే ఒత్తిడిని తట్టుకోలే జిల్లా ఎస్పీ సెలవుపై వెళ్లారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రేపటి వైయస్ జగన్ పర్యటను ఆపలేరు. వైయస్ జగన్ కోసం వచ్చే జన ప్రభంజనాన్ని అడ్డుకోలేరు. వైయస్ పర్యటనలకు జనాన్ని రాకుండా అడ్డుకోవడమంటే అరచేతితో సూర్యకిరణాలను ఆపాలనుకోవడమే అవుతుంది.ప్రశాంతమైన నెల్లూరులో ప్రతీకార రాజకీయాలకు తెరదీశారు:దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న నెల్లూరు జిల్లాలో ప్రతీకార రాజకీయాలకు తెరదీస్తున్నారు. సీనియర్ నాయకులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి మీద టీడీపీ గూండాలు దాడి చేసి ఫర్నీచర్ పగలగొట్టి కారు మీద పెట్రోల్ పోసి తగలబెడితే, ఇంటిని ధ్వంసం చేస్తే నిందితుల మీద పోలీసులు కనీసం కేసులు కూడా నమోదు చేయలేదు. మరీ విచిత్రంగా దాడి జరిగిన సమయంలో పోలీసులే అక్కడే ఉండి కూడా గూండాలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇదంతా చూస్తుంటే మనం ప్రజాస్వామయంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది.ప్రజా సమస్యల మీద వైయస్ జగన్ బయటకొచ్చి మాట్లాడుతుంటే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. గుంటూరు, పొదిలి, సత్తెనపల్లి, బంగారుపాళ్యెం పర్యటనలకు వెళితే అక్కడి నాయకులను అక్రమంగా నిర్బంధించారు. పర్యటన తర్వాత వందలాది మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు నమోదు చేశారు. ఆఖరుకి ప్రమాదవశాత్తు జరిగిన మరణాన్ని కూడా వైఎస్ జగన్ మీదకి నెట్టి క్షుద్ర రాజకీయం చేశారు.ప్రజా సమస్యలను వినిపిస్తున్న సాక్షి ఛానెల్ మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఎంతసేపటికీ వైయస్ జగన్ని అడ్డుకోవాలని, వైఎస్సార్సీపీని లేకుండా చేయాలనే ఆరాటం తప్ప, ఓటేసిన ప్రజలకు న్యాయం చేద్దామని, ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకుందామన్న ఆలోచన చంద్రబాబుకి, లోకేష్కి ఉన్నట్టు కనిపించడం లేదని ఎస్వీ సతీష్కుమార్ రెడ్డి మండిపడ్డారు.వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోలేరు: ఎమ్మెల్సీ పర్వతరెడ్డిగత వారం పది రోజులుగా నెల్లూరులో నెలకొన్న పరిస్ధితులు చూస్తే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నది రాక్షస పాలనకు నిదర్శనంగా నిలుస్తుంది. నెల్లూరులో జిల్లాలో మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోవడానికి కూటమి నాయకులు చేయని ప్రయత్నం లేదు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి కార్యక్రమానికి రాకుండా చేయాలని చూస్తున్నారు. హెలిప్యాడ్కి అనుమతుల విషయంలోనూ పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోలేరు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు వైఎస్ జగన్ను కలవనివ్వకండా జనాన్ని ఆంక్షల పేరుతో కట్టడి చేయాలనుకోవడం చంద్రబాబు అవివేకం. ప్రజలు స్వచ్ఛందంగా ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారనేందుకు గతంలో జరిగిన పర్యటనలే నిదర్శనం. ప్రశాంతంగా జరిగే పర్యటనలను కావాలనే రెచ్చగొట్టి, కార్యకర్తలను, అభిమానులు ఇబ్బందిపెట్టి విఫలం చేయాలని పోలీసులను పావులుగా చంద్రబాబు, లోకేష్లు వాడుకుంటున్నారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. -
ఏ హామీలు అమలు చేశారో చంద్రబాబు, లోకేష్, పవన్ చెప్పాలి
-
‘చంద్రబాబు మీద కూడా అవే సెక్షన్లు పెట్టవచ్చు’
తాడేపల్లి: ఉత్తారంధ్ర టీచర్స్ ఎమ్మెల్నీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రఘువర్మ ఓటమికి ప్రభుత్వ పనితీరే నిదర్శనమన్నారు , వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి,. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ నిర్వహించిన సతీష్ రెడ్డి.. కూటమి సానుకూలే వర్గాలే ఆ పార్టీని ఓడించాయన్నారు. అవతల వాళ్ల మీది బురదజల్లడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య అని, వాటిని అవతల వాళ్లు కడుక్కునే లోపేలే నీవు చేసే పనులు నువ్వు తెలివిగా చక్కబెట్టుకుంటావంటూ సతీస్ రెడ్డి మండిపడ్డారు.చంద్రబాబుపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేస్తాం‘చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21 ని వయిలెట్ చేశారు. ఆయనపై అనర్హతా వేటు వేయాలని గవర్నరుని కోరతాం. త్వరలోనే గవర్నరుని కలుస్తాం. గవర్నరు న్యాయం చేయకపోతే కోర్టుకు వెళతాం. చంద్రబాబు సీఎం పదవికి అనర్హుడు. సీఎం గా ఉన్న వ్యక్తి హేట్ స్పీచ్ చేయటం కరెక్టు కాదు. పోసాని మీద పెట్టిన సెక్షన్లే చంద్రబాబు మీద కూడా పెట్టవచ్చు. దాని ప్రకారం చంద్రబాబుపై అనర్హతా వేటు చేయవచ్చు. చంద్రబాబుపై అనర్హతా వేటు వేయాలని కోర్టులో పిటిషన్ వేస్తాం.అప్పుడు వారి వల్లే గెలిచారు.. ఇప్పుడు వారి వల్లే ఓడిపోయారు..2024లో ఉద్యోగుల మద్దతుతో కూటమి గెలిచింది. కానీ అదే ఉద్యోగుల చేతిలో 9 నెలలకే కూటమి ఘోరంగా ఓడిపోయింది. ఐఆర్, పిఆర్సీతో సహా ఏ సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించలేదు. పిఆర్సీ కమీషన్ ని కూడా వేయలేదంటే ఉద్యోగులపై ప్రభుత్వానికి ఏం ప్రేమ ఉన్నట్టు?, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. తెలంగాణ నుండి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని తీసుకురాలేకపోయారు.ఈ సంవత్సరం ఒక్క అడ్మిషన్ ని కూడా ఏపీ నుంచి అంబేద్కర్ యూనివర్సిటీ తీసుకోలేదు. దీంతో 33 వేలమంది విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏ సమస్య అడిగినా తప్పించుకునేలా ప్రభుత్వం మాటలు చెప్తోంది. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూటమికి జనం వాతలు పెట్టే పరిస్థితి ఉంది. సీఎం చంద్రబాబు వైసీపి మీద చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు. రాగద్వేషం, పక్షపాతం లేకుండా పరిపాలన చేస్తానని చేసిన ప్రతిజ్ఞ ఏం అయింది. వైఎస్సార్ సీపీ వారికి పనులు చేయొద్దని ఎలా మాట్లాడతారు?, నీ 40 ఏళ్ల అనుభవం ఇదేనా?పోసాని మీద పెట్టిన సెక్షన్లే చంద్రబాబు మీద కూడా పెట్టవచ్చుపోసాని మీద పెట్టిన సెక్షన్లే చంద్రబాబు మీద కూడా పెట్టవచ్చు. చంద్రబాబు వేసిన విషబీజం ఆయన కార్యకర్తలకు నష్టం చేస్తుంది. రేపు అధికారం కోల్పోతే మీవారి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఏం గొప్ప జరిగినా అదేనని చెప్పుకోవటం చంద్రబాబు నైజం. విధ్వంసం అనే చంద్రబాబు స్కూళ్లను జగన్ బాగుచేయటం విధ్వంసంలాగా కనిపిస్తుందా?, వైద్యాన్ని ఇంటి దగ్గరే చేయించటం విధ్వంసమా?, చంద్రబాబు చేసే హేట్ స్పీచ్ వలన విధ్వంసం జరుగుతోంది. పోసాని కృష్ణమురళి మాటల వలన రాష్ట్రంలో గొడవలు జరిగాయని కేసులు పెట్టారు. మరి అవే మాటలు మాట్లాడిన చంద్రబాబు మీద ఎందుకు కేసులు పెట్టటం లేదు? -
జగన్ వస్తే నువ్వు ఎలా పారిపోయావో అందరికీ తెలుసు ..
-
‘ప్రజలకు మేలు జరగాలంటే వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్షహోదా ఇవ్వాల్సిందే’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్ జగన్ అడిగే ప్రధాన ప్రతిపక్ష హోదా ఆయన కోసం కాదని.. అసెంబ్లీలో ప్రజల తరఫున పోరాటం చేయడానికి తగిన సమయం కోసం అడుగుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ను నమ్మడం వల్లే ప్రజలు వారికి పట్టం కట్టారని.. చంద్రబాబు అబద్ధాలు నమ్మడం లేదని పవన్తో పచ్చి అబద్ధాలు మాట్లాడించారంటూ దుయ్యబట్టారు.‘‘ప్రధాన ప్రతిపక్ష హోదా లేదంటున్న పవన్ కళ్యాణ్.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఆయన పోషిస్తాడా..?. ప్రజల తరఫున పోరాటం చేస్తావా..?. నిన్ను శాశ్వతంగా భూస్థాపితం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల నువ్వు చంద్రబాబుకు చెంచాగిరి చేస్తున్నావా..?. నీ వ్యక్తిగత సమస్యలు ఉంటే ఇంట్లో చూసుకో. పవన్, షర్మిలను వినియోగించుకుని చంద్రబాబు గేమ్ ఆడుతున్నాడు. సమర్థమైన చర్చలు ప్రధాన ప్రతిపక్షం లేకుండా ఎలా జరుగుతాయి..?’’ అంటూ సతీష్కుమార్రెడ్డి నిలదీశారు.‘‘మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదంటే ప్రజలు సమర్థించరు. సభ్యత్వం పోతోందంటున్నారు. సోనియాపై పోరాటం చేసిన చరిత్ర జగన్ది. రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే 5.46 లక్షల ఓట్లతో ఆనాడు ఎంపీగా గెలిచిన వైఎస్ జగన్ ముందు మీరు ఫ్లూట్ ఊదుతున్నారా..?. మీరు కోర్టుకు ఇంతవరకూ ఎందుకు అఫిడవిట్ వేయడం లేదు..?. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే జరిగే నష్టం ప్రజలకే. అధికారపక్షంతో పాటు ప్రతిపక్షం ముఖ్యమే. జగన్ చరిష్మా, సామర్థ్యం ఏంటో ఒకసారి తెలుసుకోండి. ఆయన అడుగు బయటపెడితే జనం ప్రభంజనంగా వస్తున్నారు. అనవసరమైన మాటలు మాట్లాడవద్దు.. జన ప్రభంజనంలో కొట్టుకుపోతారు. నువ్వు హామీగా నిలబడ్డ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించు. పవన్ కళ్యాణ్.. ఇప్పటీకైన మేలుకో.. లేదంటే చంద్రబాబు నిన్ను ముంచేస్తాడు. షర్మిల.. మీరు కాంగ్రెస్కు వ్యతిరేకమైన పార్టీలతో పోరాడుతున్నారా? లేక వ్యక్తిగత ఎజెండా అమలు చేస్తున్నావా..?’’ అంటూ సతీష్రెడ్డి దుయ్యబట్టారు. -
నేరస్తులకు సర్కారు దన్ను
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో నేరం రుజువై జైలుశిక్ష అనుభవిస్తున్న రాగిపిండి సుధాకర్రెడ్డిని తానే విడిపించానని పులివెందుల టీడీపీ అభ్యర్థి ఎస్వీ సతీష్రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు నేరగాళ్లకు అండగా నిలుస్తున్నారని స్పష్టమవుతోంది. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే. చట్టంలో ఉన్న అవకాశాలను వాడుకుని పాలకపక్షానికి చెందిన వారికి మాత్రమే క్షమాభిక్ష పెట్టడం, టీడీపీ నేతలు, వారి అనుచరులపై ఉన్న కేసులను ఎత్తివేయడం వంటి అడ్డుగోలు పనులకు చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడడం లేదు. టీడీపీ నేతలకే క్షమాభిక్ష జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీడీపీ ప్రజాప్రతినిధుల అనుచరులను క్షమాభిక్ష పేరుతో జైళ్ల నుంచి బయటకు తీసుకొస్తున్నారు. పలు నేరాలు నిరూపణ కావడంతో కోర్టులు విధించిన శిక్షాకాలం పూర్తికాకుండానే టీడీపీకి చెందిన వారికే క్షమాభిక్ష ప్రసాదిస్తున్నారు. ఘనతంత్ర దినోత్సవం పేరుతో 49 మందికి క్షమాభిక్ష పెడుతూ 2018 జూన్ 8న చంద్రబాబు ప్రభుత్వం జీవో నెం.75 జారీ చేసింది. వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో ముద్దాయి రాగిపిండి సుధాకర్రెడ్డితోపాటు మరో 48 మందిని ఇలా క్షమాభిక్ష పేరుతో జైలు నుంచి విడుదల చేసారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా మరో 32 మందిని విడుదల చేయాలని కొద్ది రోజుల క్రితం టీడీపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. వాస్తవానికి వృద్ధాప్యం, మహిళలు, సత్ప్రవర్తన వంటి కారణాలతో క్షమాభిక్ష పెట్టినట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ వారిలో వృద్ధులు ఇద్దరు మాత్రమే ఉండగా, నలుగురు మాత్రమే మహిళలు ఉన్నారు. మిగిలిన వారంతా 33 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయస్సు కలిగినవారే. టీడీపీకి అనుకూలంగా ఉండే వారిని గుర్తించి ఎన్నికల వేళ విడుదల చేసేలా క్షమాభిక్ష అవకాశాన్ని వాడుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచారణలో ఉన్న కేసుల ఉపసంహరణ తెలుగుదేశం పార్టీ నేతలపై ఉన్న పాత కేసులు ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 160కి పైగా జీవోలను జారీ చేసింది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రజా జీవనానికి భంగం కలిగించడం తదితర సెక్షన్ల కింద గతంలో టీడీపీ నాయకులపై నమోదైన కేసులను ప్రభుత్వం ఎత్తేసింది. పోలీస్ రికార్డుల్లో మగ్గుతున్న వాటిని, కోర్టు విచారణలో ఉన్న కేసులను సైతం ఉపసంహరించుకునేలా జీవోలు జారీ చేయడం గమనార్హం. చంద్రబాబు అధికారం చేపట్టిన తొలి ఏడాది నుంచే టీడీపీ నేతలపై కేసులకు చెల్లుచీటి రాయడం మొదలైంది. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిపై మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కింజరాపు అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలపై కేసులను ఎత్తివేశారు. టీడీపీ నేతలపై కేసుల వివరాలు - మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మరికొందరిపై ఇబ్రహీంపట్నం, విజయవాడ పటమట, భవానీపురం, గన్నవరం పోలీస్ స్టేషన్లలో నమోదైన ఐదు కేసులను ఎత్తివేస్తూ 2015 జూన్ 4న జీవో నెంబర్ 647ను ప్రభుత్వం జారీ చేసింది. - మంత్రి కొల్లు రవీంద్రపై రాబర్డ్సన్పేట పోలీస్ స్టేషన్, ఇనకుదురు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను ఎత్తివేస్తూ 2017 మే 3న జీవోలు నం.361, 362, 363 జారీ చేశారు. - అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మరికొందరిపై నరసరావుపేట–1 పోలీస్స్టేషన్లో నమోదైన కేసుల్లో విచారణ నుంచి మినహాయిస్తూ 2016 సెప్టెంబర్ 9న జీవో 664 జారీ చేశారు. - ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిపై ఉన్న కేసును ఉపసంహరించుకుంటూ కోర్టుకు నివేధించాలని 2017 మార్చి 10న జీవో 192ను ప్రభుత్వం జారీ చేసింది. ఆయనపై ఉన్న మరో కేసు విచారణ నుంచి తప్పిస్తూ 2016 సెప్టెంబర్ 14న జీవో నం.681 ఇచ్చారు. - శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మరో 33మందిపై రావులపాలెం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు విచారణ నుంచి మినహాయిస్తూ 2016 ఫిబ్రవరి 27న ప్రభుత్వం జీవో జారీ చేసింది. - కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు విచారణ నుంచి మంత్రి అచ్చెన్నాయుడు మరో ఆరుగురిని మినహాయిస్తూ ప్రభుత్వం 2015 జూన్ 23న జీవో 704 జారీ చేసింది. - మంత్రి గంటా శ్రీనివాసరావుపై అనకాపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన ప్రభుత్వ ఆస్తుల ద్వంసం కేసు విచారణ నుంచి తప్పిస్తూ ప్రభుత్వం 2016 మార్చి 4న జీవో 143 జారీ చేసింది. - ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి మరో 20 మందిపై ఉన్న ఆస్తుల ధ్వంసం కేసును ఉపసంహరించుకుంటూ 2017 మే 9న ప్రభుత్వం జీవో 379 ఇచ్చింది. - మంత్రి నక్కా ఆనందబాబు మరో నలుగురిపై వేమూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును ఎత్తివేస్తూ 2017 ఫిబ్రవరి 7న జీవో 97 జారీ చేశారు. - ముఖ్యమంత్రి వియ్యంకుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మరో 15 మందిని ఓ కేసు విచారణ నుంచి మినహాయిస్తూ 2016 సెప్టెంబర్ 14న ప్రభుత్వం జీవో 679 జారీ చేసింది. - తూర్పుగోదావరి జిల్లా అమలాపురం టీడీపీ ఎమ్మెల్యే ఎ.ఆనందరావు మరో ఏడుగురుపై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసును ఎత్తివేస్తూ 2017ది మార్చి 28న జీవో 261 జారీ చేశారు. - ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ వివేకానంద, మరో 21 మందిని ఓ కేసు విచారణ నుంచి తప్పిస్తూ 2016 ఏప్రిల్ 21న జీవో 278 జారీ చేశారు. - అనంతపురం జిల్లాలో నమోదైన కేసుల్లో అప్పటి ఎమ్మెల్యేలు నాగం జనార్దన్రెడ్డి, యర్రబెల్లి దయాకర్రావు, రంగనాయకులు, బీసీ గోవిందప్ప, మెట్టు గోవిందరెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, హరీశ్వర్రెడ్డి, బాబు రమేష్, పడాల అరుణ, లలిత కమారి, అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్సీలు నారాయణరావు, వై.రాజేంద్రప్రసాద్, మసాల పద్మజ, చిన్నరాజప్పలతోపాటు మరో నలుగురిని విచారణ నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం 2016 డిసెంబర్ 29న జీవో 907 జారీ చేసింది. -
అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం
కడప సెవెన్ రోడ్స్ : తమ ప్రభుత్వం జిల్లాను పట్టించుకోవడం లేదనేదాంట్లో నిజంలేదని, అన్ని విధాలా జిల్లాను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్కుమార్రెడ్డి పేర్కొన్నారు. డిప్యూటీ చైర్మన్ హోదాలో తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయనకు శుక్రవారం నగరంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం ఆయన స్టేట్ గెస్ట్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో సెయిల్ ఆధ్వర్యాన స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కడపలో డిఫెన్స్ రీసెర్చి డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఒక యూనిట్ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. జిల్లాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఖనిజాధార పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామమన్నారు. ముంపువాసులకు కేవలం రూ. 13 కోట్లు పరిహారంగా చెల్లిస్తే గండికోట రిజర్వాయర్ను నీటితో నింపవచ్చన్నారు. కానీ, గత ప్రభుత్వం ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిం చిందని తెలిపారు. అలాగే పీబీసీ, మైలవరానికి రావాల్సిన నీటి విడుదల కోసం కృషి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్కు లభించే 45 టీఎంసీల నీటిని రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందని వివరించారు. రెండు, మూడు నెలల్లో రైతుల రుణమాఫీ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. రాజ్యాంగపరమైన వ్యవహారాల్లో పార్టీలకతీతంగా తాను పనిచేస్తానని, మిగిలిన సమయంలో సాధారణ టీడీపీ కార్యకర్తగా వ్యవహారిస్తానన్నారు. కొన్ని కులాలను విస్మరిస్తున్నామన్న వాదన కూడా పసలేనిదని ఆయన కొట్టిపారేశారు. సమావేశంలో టీడీపీ నాయకులు శ్రీనివాసులురెడ్డి, లక్ష్మిరెడ్డి, పీరయ్య, జిలానీబాషా, మహిళా నాయకురాలు కుసుమకుమారి పాల్గొన్నారు.