Telangana state samithi paty
-
పొత్తుల తలుపులు మూసుకోలేదు
* సాక్షితో పొత్తులపై టీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు * కాంగ్రెస్.. బీజేపీ.. ఏ పార్టీతోనైనా పొత్తు ఉండొచ్చు * టీఆర్ఎస్ సీనియర్ నేత హరిష్రావు * టీడీపీ-బీజేపీ పొత్తు ప్రయుత్నం అపవిత్రం అమరవీరుల కుటుంబాలను తగిన రీతిలో గౌరవిస్తాం. కచ్చితంగా వాళ్లకు సీట్లు ఇస్తాం. అందులో అనుమానం లేదు. కొన్ని పార్టీలు శవ రాజకీయాలు చేస్తున్నాయి. టీడీపీ నుంచి మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్తో టచ్లో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతామని చెప్తున్నారు. వర్ధెల్లి వెంకటేశ్వర్లు, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)-కాంగ్రెస్ పార్టీల వుధ్య పొత్తుకు తలుపులు వుూసుకుపోలేదు. ఇంకా పొత్తు తలుపులు తెరిచే ఉన్నాయుని అనుకుంటున్నా. దీనిపై టీఆర్ఎస్ పొత్తుల కమిటీ కసరత్తు చేస్తూనే ఉంది...’ అని ఆ పార్టీ అధినేత కేసీఆర్ మేనల్లుడు, ఆ పార్టీ అగ్రనేతల్లో ఒకరైన సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు చెప్పారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల వుధ్య పొత్తు ఉందో లేదో తేల్చి చెప్పకుండానే ఇంకా పొత్తు తలుపులు మూసుకుపోలేదని అంటూనే బీజేపీతో కూడా ఉండే అవకాశాలు లేకపోలేదని నర్మగర్భంగా చెప్పారు. అదే సవుయంలో టీడీ పీతో బీజేపీ పొత్తు ప్రయుత్నాలు చేయుడాన్ని హరీష్రావు తీవ్రంగా తప్పుపట్టారు. మరో పక్క బీజేపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందనే అంశాన్ని ప్రస్తావించి నప్పుడు కొట్టివేయకుండా అన్యాపదేశంగా వుద్దతు తెలిపి రాజకీయు విజ్ఞతను ప్రదర్శించారు. టీఆర్ఎస్తో పొత్తులు కోరుకునే పార్టీలు అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఎప్పుడో సిద్ధం చేశారుు. పొత్తుల ఖరారు కోసమే ఆ జాబితాల్ని బయట పెట్టడం లేదు. పొత్తులపై పార్టీ కమిటీ కసరత్తు ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రావచ్చని హరీష్ పేర్కొన్నారు. ఒంటరి పోరుకు సిద్ధంగా ఉన్నామంటూనే పొత్తుల తలుపులు ఇంకా మూసుకోలేదని టీఆర్ఎస్ కీలక నేత టి.హరీష్రావు అంటున్నారు. కాంగ్రెస్తో పొత్తు అవకాశాలను కొట్టివేయకుండానే బిజేపీతోనూ జత కలిసే అవకాశం లేకపోలేదన్న సంకేతాలు ఇస్తున్నారు. జోగిపేటలో ‘సాక్షి’తో ఆయన తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడారు. హరీష్రావు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... తెలంగాణ పదాన్ని ఉచ్చరించడానికే ఇష్టపడని టీడీపీతో బీజేపీ పొత్తు ప్రయుత్నాలు చేయుడం అపవిత్ర చర్య. పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర బిల్లుకు బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ సహకరించిన తర్వాత ‘పెద్దమ్మ (సోనియా గాంధీ)తో పాటు ఈ చిన్నమ్మ (సుష్మ)ను కూడా గుర్తు పెట్టుకోండి..’అని విజ్ఞప్తి చేశారు. కానీ, బీజేపీ నాయకులు ఆమెను గుర్తు పెట్టుకోకుండా తెలంగాణ ద్రోహి చంద్రబాబును నమ్ముకుని నష్టపోయే దారిలో వెళ్తున్నారు. ఇది బీజేపీకి తీరనినష్టం. తెలంగాణ పదాన్నే నిషేధించిన చంద్రబాబుకు తెలంగాణ ప్రజలు ఎట్లా ఓట్లు వేస్తారు? పొత్తు వల్లే ఓడిపోయామన్నారు... బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే 2004లో ఓడిపోయామని చంద్రబాబు అప్పట్లో చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం పెద్ద తప్పేనని చెంపలు వేసుకున్నారు. నరేంద్ర మోడి ప్రధానమంత్రి పదవికే పనికిరాడని తేల్చేశారు. ఇప్పుడు అదే మోడీ తో కాళ్లబేరానికి సిద్ధపడుతున్నారు. తెలంగాణ టీడీపీ నాయకులే చంద్రబాబు బొమ్మను పక్కనబెట్టి ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. ఈ స్థితిలో చంద్రబాబు బొమ్మ పెట్టుకుని బీజేపీ తెలంగాణలో ఏమని ఓట్లు అడుగుతుంది? ఈ పార్టీల పొత్తు కుదిరితే టీఆర్ఎస్కు ఎలాంటి నష్టం జరగదు. తెలంగాణ కోసం ఉద్యమాలు చేసింది టీఆర్ఎస్ వూత్రమే! జనం టీఆర్ఎస్ వెంటే ఉంటారు. పొత్తులకు సంబంధించి కాంగ్రెస్తో ఉన్నంత దూరమే బీజేపీతో కూడా ఉంది. ఏ పార్టీతోనైనా పొత్తు ఉండవచ్చు. అధికారానికి చేరువగా టీఆర్ఎస్ ఎన్నికల బరిలో టీఆర్ఎస్ ఒంటరిగానే నిలవాలని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు తలుపులు పూర్తిగా వుూసుకున్నాయుని చెప్పలేను. తెలంగాణ రాష్ర్టంలో టీఆర్ఎస్సే అతిపెద్ద పార్టీ కాబోతోంది. ఏ సర్వే చూసినా టీఆర్ఎస్కు 55 నుంచి 60 సీట్లు రానున్నాయుని చెబుతున్నారుు. ఎన్నికల నాటికి ఇంకా పెరుగుతాయుని అంచనా. అధికారానికి కొద్ది దూరంలో ఆగిపోతే ఆగిపోతాం. అధికార పగ్గాలు అందుకోడానికి పదో, పదిహేనో సీట్లు అవసరమైతే టీఆర్ఎస్కు మద్దతిచ్చే స్నేహపూర్వక పార్టీల సహకారం తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కూడా టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుంది. రాష్ట్రంలో మాకు సహకరించే పార్టీకి కేంద్రంలో మేం కూడా సహకరిస్తాం. నిజానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు కూడా టీఆర్ఎస్తో పొత్తులు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. వివేక్ది స్వయంకృతం... ఎంపీ జి.వివేక్ టీఆర్ఎస్ను వీడాలన్న నిర్ణయం స్వయంకృతాపరాధం. ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారో నాకు తెలియదు. ఆయన వెళ్లిపోయినందుకు ఏమాత్రం బాధలేదు. కానీ ఎస్టాబ్లిష్ అయిన ఒక టీవీ ఛానల్ దూరమవుతుందని బాధపడ్డాం. పెద్దపల్లి పార్లమెంటు సీటు సహజంగానే టీఆర్ఎస్ది. అక్కడ సర్వే చేయిస్తే 72% టీఆర్ఎస్కు అనుకూలంగా ఉంది. ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ను ఇక్కడి నుంచి నిలబెట్టే ఆలోచనలో ఉన్నాం. ఆయున గతంలో మేడా రం ఎమ్మెల్యేగా కూడా చేశారు. ఈశ్వర్ బంపర్ మెజార్టీతో గెలుస్తారు. మెదక్, గజ్వేల్ల నుంచి కేసీఆర్ పోటీ.. కేసీఆర్ మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకే ఎక్కువ అవకాశాలున్నాయి. మా నివేదికల ప్రకారం టీఆర్ఎస్ నర్సాపూర్, పటాన్చెరు నియోజకవర్గాల్లో కొద్దిగా బలహీన ంగా ఉంది. కేసీఆర్ మెదక్ ఎంపీగా పోటీచేస్తే దాని పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి తిరుగుండదు. గజ్వేల్ అసెంబ్లీ టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి ప్రతాపరెడ్డి టీఆర్ఎస్లోకి వస్తే గజ్వేల్ సీటు ఆయనకే ఇద్దామని అనుకున్నాం. కేసీఆర్ మాట్లాడారు, నేను కూడా మాట్లాడా. ఎందుకో ప్రతాపరెడ్డి వెనుకాడారు. వీటన్నింటినీ బేరీజు వేశాక కేసీఆరే గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి కూడా బరిలో దిగనున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు మండలంలో చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థ కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. ఈ కారణంగా టీడీపీకి గజ్వేల్ కీలకం. అందుకే ఇక్కడ టీడీపీ కోట్ల రూపాయుల్ని ఖర్చు చేస్తోంది. రైతులకు హెరిటేజ్ బర్రెలు ఇస్తోంది. డబ్బులు ఇస్తోంది. గజ్వేల్ కోసం టీడీపీ ఎన్నో విషప్రయత్నాలు చేస్తోంది. అరుునా ఇక్కడ టీఆర్ఎస్దే పైచేరుు. గత పాలనపై చంద్రబాబు పెదవి విప్పరేం? చంద్రబాబు ఆల్ ఫ్రీ మాటలు చెప్తున్నారు. చంద్రబాబుకు సవాల్ చేస్తున్నా. తొమ్మిదేళ్ల తన పాలనను తిరిగి తెస్తానని చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లగలరా? టీడీపీ వూటలు వింటుంటే నమ్మించి తెలంగాణ ప్రజల గొంతు కోసేట్టట్టుంది. తెలంగాణ ప్రజలు బలంగా కోరుకుంటున్న అంశాలను టీడీపీ ఎందుకు ప్రస్తావించడం లేదు. తెలంగాణను ముంచే పోలవరం డిజైన్ మార్చమని మేం మొదటి నుంచి చెప్తున్నాం. చంద్రబాబు దీనిపై పెదవి కూడా విప్పడం లేదు. విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశాల గురించి ప్రస్తావన కూడా చంద్రబాబు చేయుకపోవడాన్ని బట్టే ఆయునకు తెలంగాణపై ఎంత ప్రేవు ఉందో అర్ధం చేసుకోవచ్చు. శవరాజకీయూలు తగదు తెలంగాణ కోసం ఉద్యమించిన అన్ని వర్గాల వారితోబాటు అమరవీరుల కుటుంబాలను తగిన రీతిలో గౌరవిస్తాం. కచ్చితంగా వాళ్లకు సీట్లు ఇస్తాం. అందులో అనుమానం లేదు. కొన్ని పార్టీలు శవ రాజకీయాలు చేస్తున్నాయి. అమర వీరుల త్యాగాలను రాజకీయం చేస్తున్నాయి. తవు తల్లిదండ్రులు ఎమ్మెల్యేలు కావాలని వారు ప్రాణత్యాగం చేయలేదు. వాళ్లు బంగారు తెలంగాణ కోరుకున్నారు. నవతరానికి బంగారు బాటలు వేయాలకున్నారు. తెలంగాణ పార్టీ అమరుల త్యాగాలను, వాళ్ల కుటుంబాలను ఎప్పుడూ మరిచిపోదు. వారికి అండగా నిలబడుతాం. దక్షిణ తెలంగాణలోనూ పార్టీ బలంగానే ఉంది.. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో టీఆర్ఎస్ బలంగా లేదన్నది దుష్ర్పచారమే. అన్ని జిల్లాల్లో మాకు బలమైన క్యాడర్ ఉంది. పాలమూరులో కనీసం 11 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటాం. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో సగం సీట్లు మాకే వస్తాయి. ఖమ్మం జిల్లాలో కూడా జలగం వెంకట్రావ్ చేరాక టీఆర్ఎస్ బాగా పుంజుకుంది. పార్టీ బలహీనంగా ఉందనే ప్రశ్నే లేదు. టీడీపీ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్తో టచ్లో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతామని చెప్తున్నారు. ఉద్యమ కారులకు, విద్యార్ధులకు, అమర వీరుల కుటుంబాలకు సీట్లు ఇవ్వాలనే ఆలోచనతోనే వారిని పార్టీలోకి తీసుకోవడం లేదు. టీఆర్ఎస్కే జేఏసీ వుద్దతు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఏకైక రాజకీయు పార్టీ టీఆర్ఎస్. త్యాగాలు చేసింది. కష్టాల కోర్చింది. తెలంగాణ సాధనలో జేఏసీ ప్రధాన భూమిక పోషించింది. అరుుతే జేఏసీ వుద్దతు వూత్రం టీఆర్ఎస్కే ఉంటుంది. -
టీఆర్ఎస్తో పొత్తు నష్టం !
-
టీఆర్ఎస్తో పొత్తు నష్టం !
దిగ్విజయ్కు టీ-కాంగ్రెస్ నేతల నివేదన.. కాంగ్రెస్ ఇన్చార్జ్ సమక్షంలో టీపీసీసీ ఎన్నికల సంఘం భేటీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్కు సానుకూల వాతావరణం ఉందని, ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తులు అవసరం లేదని ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్జి దిగ్విజయ్సింగ్కు స్పష్టంచేశారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా సీపీఐ, న్యూడెమొక్రసీలతో పాటు తెలంగాణ పోరాటంలో ముందున్న అన్ని జేఏసీలను కలుపుకొని వెళ్లటం మంచిదని సూచించారు. టీఆర్ఎస్తో పొత్తులకు వెళ్తే ఎక్కువ స్థానాలు వదులుకోవలసి వస్తుందని, ఎక్కువమందికి అవకాశాలు రాక అసంతృప్తికి దారితీస్తుందని పేర్కొన్నారు. గురువారం రాష్ట్రానికి వచ్చిన దిగ్విజయ్ సమక్షంలో తెలంగాణ పీసీసీ ఎన్నికల సంఘం సమావేశం జరిగింది. కేంద్రమంత్రి జైపాల్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్కుమార్రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్బాబు, షబ్బీర్ అలీ, మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, కేంద్రమంత్రి బలరాంనాయక్ తదతరులు హాజరయ్యారు. సమావేశంలో ప్రధానంగా పొత్తులపైనే చర్చ సాగింది. పొత్తుల గురించి ఇప్పుడు చర్చవద్దని మరో మూడు రోజులు ఉంటాను కనుక తరువాత మాట్లాడదామని దిగ్విజయ్ ఆ అంశాన్ని పక్కనపెట్టే ప్రయత్నం చేశారు. అయినా పలువురు నేతలు పొత్తులపై తమ అభిప్రాయాలు వినాల్సిందేనని పట్టుపట్టారు. మెజారిటీ నేతలు టీఆర్ఎస్తో పొత్తులను వ్యతిరేకించారు. కాంగ్రెస్, సోనియాగాంధీ వల్లనే తెలంగాణ సాధ్యమైందన్న అభిప్రాయం ప్రజల్లో ఉన్నందున టీఆర్ఎస్తో పొత్తులు లేకుండా వెళ్లడమే మంచిదన్నారు. టీఆర్ఎస్ కన్నా తెలంగాణ కోసం స్వచ్ఛందంగా పోరాడిన విద్యార్థి, ఉద్యోగ, టీచ ర్స్, అడ్వొకేట్ ఇలా అన్ని జేఏసీల వారికి అవకాశమివ్వటం మంచిదని సూచించారు. సీపీఐ, న్యూడెమొక్రసీ వంటి పార్టీలను కలుపుకొని వెళ్లవచ్చని, తెలంగాణలో మైనారిటీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక ఎంఐఎంతో అవగాహన కుదుర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. పొత్తులపై టీఆర్ఎస్ ప్రతిపాదనలు ఇస్తే అదీ కాంగ్రెస్కు నష్టం లేకుండా ఉంటేనే పరిశీలనకు తీసుకోవాలని, లేనిపక్షంలో సొంత పార్టీ వారికి అన్యాయం జరుగుతుందని వి.హనుమంతరావు, పొంగులేటి సుధాకర్రెడ్డి తదితరులు స్పష్టంచేశారు. అయితే.. దీనిపై దిగ్విజయ్ స్పష్టత ఇవ్వకుండా రేపో, ఎల్లుండో పొత్తులపై చెప్తామని వారితో పేర్కొన్నారు. పొత్తులపై అందరితో చర్చించాక పార్టీ భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. అభ్యర్థులపై జిల్లా కమిటీల నివేదికలు పక్కనపెట్టాలి పార్టీ తరఫున అభ్యర్థుల ఎంపిక వ్యవహారంపై కూడా అనేకమంది దిగ్విజయ్కు వినతిపత్రాలు ఇచ్చారు. అభ్యర్థుల ఎంపిక కు సంబంధించి జిల్లా కాంగ్రెస్ కమిటీలు ఇచ్చిన నివేదికలు తప్పులు తడకగా ఉన్నాయని కమిటీ సభ్యులు నిరసన వ్యక్తపరిచారు. అసమర్థులను, తమకు సన్నిహితులు అనుకొనే వారి పేర్లు చేర్చారని, ఆ నివేదికలను పరిగణనలోకి తీసుకోరాదని సూచించారు. అయితే.. అభ్యర్థుల ఎంపిక తానుచేయనని, నివేదికలు, వినతిపత్రాలు తీసుకొని పార్టీ అధిష్టానానికి, కేంద్ర ఎన్నికల స్క్రీనింగ్ కమిటీకి అప్పగించటం వరకే తన బాధ్యత అని దిగ్విజయ్ వివరించారు. 22న రాష్ట్ర ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సమావేశం అవుతుందని, ఈ కమిటీ చర్చించాక వయలార్ రవి నేతృత్వంలోని జాతీయ స్క్రీనింగ్ కమిటీకి నివేదిస్తుందన్నారు. జాతీయ కమిటీ 28న భేటీ అయి తుది జాబితా ప్రకటిస్తుందని తెలిపారు. ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేయాలి... కాంగ్రెస్లోని సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీలందరికీ టిక్కెట్లు ఖరారుచేయాలని పలువురు నేతలు పేర్కొన్నారు. కొంతమంది దీనికి అభ్యంతరం తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరును అంచనావేయాలని, తెలంగాణ ఉద్యమంలో వారి భాగస్వామ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాకనే టిక్కెట్లు ఇవ్వాలని చెప్పారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చి అప్పటికప్పుడే టిక్కెట్లు పొందాలని ప్రయత్నిస్తున్న వారికి అవకాశం ఇవ్వరాదని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. ఖమ్మం లోక్సభ స్థానాన్ని స్థానికులకే కేటాయించాలని ఆ జిల్లాకు చెందిన నేతలు స్పష్టంచేశారు. సీఎం అభ్యర్థిని ముందే ప్రకటించాలి... దళితులు, బలహీన వర్గాలకు పార్టీ పెద్దపీట వేయటంతో తెలంగాణలో అత్యధిక శాతమున్న ఆ వర్గాల నుంచి మద్దతు లభిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణకు సీఎం అభ్యర్థిని కూడా ముందుగా ప్రకటిస్తే ఎక్కువ ఫలితాలు ఉంటాయని దానం నాగేందర్ తదితరులు సూచించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా హైదరాబాద్లోని సిట్టింగ్ స్థానాలన్నిటినీ గెలిపించుకొనే బాధ్యత తనదేనని పేర్కొన్నారు. యువతకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీచందర్ దిగ్విజయ్ను కోరారు. మహిళలకు 20 నుంచి 30 శాతం స్థానాలు వచ్చేలా చూడాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత కోరారు. రెండు చోట్ల సోనియా సభలు... తెలంగాణను ఏర్పాటు చేసినందుకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సమావేశం తీర్మానం చేసింది. ఈ సందర్భంగా సోనియాగాంధీని ఆహ్వానించి భారీ బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించారు. రేణుకపై పొన్నం ఫైర్: సమావేశంలో ఎంపీ రేణుకాచౌదరిపై మరో ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆమెను ఇక్కడి కమిటీలో వేయడం తెలంగాణకే అవమానకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఆమె అనేక ప్రకటనలు చేసి అవమానించారని, ఉద్యమకారులపై కేసులు పెట్టించి వే ధించారని ఆమెను తెలంగాణ వ్యక్తిగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించారు. ఖమ్మం నుంచి పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ పోటీ చేయాలని కొంతమంది అడిగితే.. ఆయన పుట్టిన స్థలం ఎక్కడని రేణుక తన అనుయాయులతో ప్రశ్నలు వేయించారని దుయ్యబట్టారు. ఆమెను కమిటీ నుంచి తప్పిం చాలని పట్టుపట్టారు. దిగ్విజయ్ కలుగచేసుకుంటూ వివాదాలు వద్దని, అన్ని విషయాలూ తనకు తెలుసని సర్దిచెప్పారు. గాంధీభవన్కు వచ్చిన మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి, అల్లుఅరవింద్ వియ్యంకుడు కంచర్ల శేఖర్రెడ్డిల మధ్య వివాదం చోటుచేసుకుంది. చిర ంజీవి అండచూసుకొని రెచ్చిపోవద్దని మల్రెడ్డి అనటంతో నీకేం బలముందని శేఖర్రెడ్డి ప్రశ్నించారు. జైపాల్, షబ్బీర్ నివాసాలకు దిగ్విజయ్ హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్ మధ్యాహ్నం కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి నివాసానికి వెళ్లి దాదాపు గంటసేపు ఉన్నారు. తాజా పరిస్థితులపై చర్చించారు. సాయంత్రం షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లారు. ఇదిలాఉంటే.. సీమాంధ్ర ఎన్నికల కమిటీలో ఎంపీ సుబ్బరామిరెడ్డిని నియమిస్తున్నట్లు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి గురువారం ప్రకటించారు. -
గులాబీ గూటికి ఎమ్మెల్యే నగేశ్
నేడు టీడీపీకి రాజీనామా ఇచ్చోడ, న్యూస్లైన్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరుతున్నట్లు బోథ్ ఎమ్మెల్యే గోడం నగేశ్ ప్రకటించారు. హైదరాబాద్ నుంచి బుధవారం నేరుగా బోథ్ మండలంలోని తన స్వగ్రామమైన జాతర్ల గ్రామానికి చేరుకుని నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమాలోచనలు జరిపారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం, ఆయన విధానాలు నచ్చకనే గురువారం టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలు కూడా ఒత్తిడి తెవడంతో టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. రెండు రోజుల్లో టీఅర్ఎస్ అధినేత కేసీఆర్ను కలుస్తానని తెలిపారు. ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా పోటీచేసే విషయన్ని కేసీఆర్ను కలిసి తర్వాత ప్రకటిస్తానని ఆయన తెలిపారు. టీడీపీ హయాంలో గొడం నగేశ్ ఒక పర్యాయం మంత్రిగా, రాష్ట్ర జీసీసీ చైర్మన్గా, రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.