Tpcc meeting
-
బోర్లాపడి బొక్కలు విరిగినా బీఆర్ఎస్కు బుద్ది రాలేదు: రేవంత్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలిసారి పీసీసీ విస్తృతస్థాయి సమావేశం బుధవారం నిర్వహించారు. గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన జరుగిన ఈ సమావేశంలో నూతనంగా నియమితులైన ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రులు, ప్రదేశ్ ఎన్నికల, రాజకీయ వ్యవహారాల కమిటీల సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలకు ఎకరం స్థలం కేటాయించనున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. 6 గ్యారంటీల అమలుకు త్వరలో గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. జోనల్ వ్యవస్థను సమీక్షించేందుకు ఇదిరమ్మ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఎస్సీ కమిషన్ రద్దు చేసి, త్వరలో కొత్త కమిషన్ నియమించనున్నారు. చదవండి: కేడర్ వివాదం కేసు.. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేత రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనను ఖరారు కార్యవర్గ భేటీలో పార్టీ నేతలు 3 తీర్మానాలు ప్రవేశపెట్టారు. జనవరి 8,9 తేదీల్లొ పార్లమెంట్ ఎన్నికలపై ఉమ్మడి జిల్లా నేతలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. 11,12,13 తేదీల్లొ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మంత్రులు, నేతలతో ఎన్నికలపై సమావేశం కానున్నారు. అనంతరం ముఖ్యమంత్రి 14వ తేదీ నుంచి 4 రోజుల పాటు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎంతోపాటు మంత్రి శ్రీధర్ బాబు వెళ్లనున్నారు. ఈ పర్యటన అనంతరం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపట్టనున్నారు సీఎం రేవంత్. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి.. వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత తమదని అన్నారు. బోర్లపడి బొక్కలు విరిగినా బీఆర్ఎస్కు బుద్ది రాలేదని విమర్శించారు. నెల రోజులు గడవకముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాలు విడుదల చేస్తున్నారని మండిపడ్డారు. చెరుకు తోటల్లో పడిన అడవి పందుల్లా తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుందని ధ్వజమెత్తారు రేవంత్. బీఆర్ఎస్ విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని పార్టీ నేతలకు సూచించారు. టార్గెట్ 17 పెట్టుకుని లోక్సభ ఎన్నికల్లో పనిచేయాలని..12కు తగ్గకుండా సీట్లను గెలిపించుకోవాలని తెలిపారు. ఈ నెల 8న 5 జిల్లాలు.. 9న 5 జిల్లాల నేతలతో సమీక్షించనున్నట్లు చెప్పారు . 20 తరువాత క్షేత్ర స్థాయి పర్యటనల్లో పాల్గొంటానని తెలిపారు. ‘బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గినట్టుంది. అందుకే కిషన్ రెడ్డి కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వయిరీ కోరుతున్నారు. ఆనాడు స్వయంగా నేను సీబీఐ ఎంక్వయిరీ కోరినపుడు ఏం చేశారు. దొంగను గజదొంగకు పట్టించాలని కిషన్ రెడ్డి అడుగుతున్నాడు. కాళేశ్వరం అవినీతిపై మేం జ్యుడీషియల్ విచారణ చేసి తీరుతాం. బీజేపీ, బీఆర్ఎస్ తోడు దొంగలు. ఇద్దరూ కలిసే కాళేశ్వరం పేరుతో దోచుకున్నారు. పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం చేశారు’ అని రేవంత్ మండిపడ్డారు. కార్యవర్గ భేటీ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దశాబ్ద కాలం తర్వాత మనకు వచ్చిన గొప్ప అవకాశమని తెలిపారు. అనేక కష్టనష్టాలను భరించి అధికారంలోకి వచ్చామన్నారు. యువత ఎన్నో కలలు కని తెలంగాణ కోసం పోరాటం చేశారని చెప్పారు. ప్రజలకు మనం ఇచ్చిన హామీలపై విశ్వాసంతో కాంగ్రెస్ను గెలిపించారన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన పని చేస్తున్న వారంతా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వంతో రాష్ట్రాన్ని పీల్చి పిప్పిచేశారని భట్టి మండిపడ్డారు. ఒకవైపు రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం కావాలని, మరోవైపు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలిపారు. రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినట్టు ప్రజలు ఫీల్ అవుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఇస్తామన్నారు. ఇతర మంత్రులు మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. తలతాకట్టు పెట్టైనా 6 గ్యారంటీలు అమలు చేస్తాం తెలిపారు. -
కర్ణాటక ఎన్నికలు కాంగ్రెస్కు కీలకం: రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈనెల 7న కులీ కుతుబ్షా మైదానంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ప్రకటించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సూచన మేరకు ఈనెల 8న మంచిర్యాలలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం గాంధీభవన్లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అదానీ అక్రమాలపై కాంగ్రెస్తోపాటు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న పోరాటంపై అణచివేత తదితర అంశాలపై చర్చించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఏప్రిల్ నెలలో జై భారత్ సత్యాగ్రహ కార్యక్రమాలపై సమీక్షించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో టీ కాంగ్రెస్ నేతల ప్రచారంపై చర్చించారు. రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. కర్ణాటక ఎన్నికలు కాంగ్రెస్కు కీలకమని, అక్కడ అధికారంలోకి వస్తే తెలంగాణలోనూ వచ్చినట్లేనని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 10వ తేదీ నుంచి 25 వరకు తిరిగి తన పాదయాత్ర మొదలవుతుందని రేవంత్రెడ్డి తెలిపారు. గజ్వేల్లో లక్షమందితో నిరుద్యోగ నిరసన సభ ఉంటుందని చెప్పారు. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మిగిలిన 4 అసెంబ్లీ స్థానాలతో పాటు మెదక్ పార్లమెంట్ పరిధిలో పాదయాత్ర చేయనున్నట్టు తెలిపారు. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లే నేతల వివరాలు ఇవ్వాలని, ఏప్రిల్ 25 నుంచి మే 6 వరకు కర్ణాటకలో ప్రచారానికి హాజరు కావాలని నాయకులను కోరారు. ప్రజా గాయకుడు గద్దర్ ఆదివారం గాంధీభవన్కు వచ్చి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని కలిశారు. కర్ణాటక ప్రచారానికి తాను కూడా వస్తానని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ని చేస్తేనే పేపర్ లీకేజీ కేసు విచారణ సాఫీగా సాగుతుందని, లేకపోతే లేదని చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ కమిటీని కూడా రద్దు చేయాలని, పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ వ్యవహారాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. టీఎస్పీఎస్సీ తీగ లాగితే.. ప్రగతి భవన్ లింక్ బయటపడిందని అన్నారు. కాంగ్రెస్ ఫిర్యాదుతోనే ఈ పేపర్ లీక్పై ఈడీ కేసు నమోదు చేసిందని తెలిపారు. -
ఏం చేద్దాం... ఎలా వెళ్దాం?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ రద్దు అవుతుందని, డిసెంబర్లో ఎన్నికలు వస్తాయనే సంకేతాలతో టీపీసీసీ ముఖ్యులు మరోమారు భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం జాంబాగ్లోని మాజీ మంత్రి ముఖేశ్గౌడ్ నివాసంలో సమావేశమై రాజకీయ పరిణామాలను బట్టి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. సమావేశంలో భాగంగా గురువారం కేసీఆర్ తీసుకునే నిర్ణయం వెలువడిన అనంతరం తాము ఏం చేయాలనే దానిపై చర్చించినట్టు తెలుస్తోంది. సీఎం ఏ నిర్ణయం తీసుకున్నా తాము ఎన్నికలకు సిద్ధమైపోవాలని, కార్యక్రమాలను ముమ్మరం చేయాలని నిర్ణయించినట్టు సమావేశంలో పాల్గొన్న సీనియర్ నేత ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం, శ్రీనివాస కృష్ణన్, మధుయాష్కీ, దామోదర రాజనర్సింహ, డీకే.అరుణ, శ్రీధర్బాబు, రేవంత్రెడ్డి, కార్తీక్రెడ్డి, పటోళ్ల శశిధర్రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, భిక్షపతియాదవ్, విష్ణు, విక్రంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. డీఎస్ను ఆహ్వానిస్తాం: రాజనర్సింహ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్లోకి వస్తే ఆహ్వానిస్తామని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడుతూ డీఎస్ రాకను తాము స్వాగతిస్తామని, అయితే పదవులు, సీట్ల విషయం పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. తమ పార్టీని ఎవరూ విడచివెళ్లరని, అన్నీ ఊహాగానాలేనన్నారు. తెలుగుదేశం ఓ రాజకీయ పార్టీ అని, మరో రాజకీయ పార్టీగా దానితో కలసి వెళ్లడంలో తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. ఏదైనా పొత్తుల విషయం హైకమాండ్ చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. -
పాల్వాయి సంచలన వ్యాఖ్యలు!
హైదరాబాద్: గాంధీ భవన్లోని టీపీసీసీ కార్యాలయంలో జరిగిన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్వాయి మాట్లాడారు. పార్టీ సీనియర్లు కొందరు క్రమశిక్షణ పాటించడం లేదని, హద్దులు దాటుతున్నారని పాల్వాయి ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని హైకమాండ్ నేత ఏకే ఆంటోనికి కూడా చెప్పానన్నారు. ఒక్క నల్లగొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలే ఇలా గీత దాటి వ్యవహరిస్తున్నారని చెప్పారు. వీరిని పార్టీకి చెందిన వారే ఎవరో కొందరు ప్రోత్సహిస్తున్నారని అభిప్రాయపడ్డారు. పార్టీ గీత దాటుతున్న నేతలను కట్టడి చేయాల్సిన బాధ్యత దిగ్విజయ్సింగ్దే నని పేర్కొన్నారు. కాగా, ఈ భేటీకి ఏడుగురు సభ్యులు డుమ్మాకొట్టడం చర్చనీయాంశమైంది. రాపోలు ఆనంద్భాస్కర్, ఎంఏ ఖాన్, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ మంత్రులు దామోదర్ రెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్య సమన్వయ కమిటీ భేటీకి గైర్హాజరయ్యారు. -
'అనాలోచిత నిర్ణయం.. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం'
హైదరాబాద్: నోట్ల రద్దు చర్య మోదీ అనాలోచిత నిర్ణయమని, దీని వలన దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని టీసీసీసీ అధ్యక్షడు ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. శనివారం గాంధీభవన్లో నిర్వహించిన టీపీసీసీ సమావేశంలో.. నోట్ల రద్దు విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఉత్తమ్కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణను ఉత్తమ్కుమార్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. జనవరి రెండో తేదీన జిల్లా కేంద్రాల్లో ప్రెస్మీట్లు, 5,6,7వ తేదీల్లో కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే జనవరి 9న మహిళలతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 11వ తేదీన ఏఐసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో భారీ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
నేడు టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీ
-
రసాభాసాగా టీపీసీసీ విస్తృస్ధాయి సమావేశం