trainee ips officer
-
ట్రైనీ ఐపీఎస్ అధికారుల సాహసంపై ప్రశంసల జల్లు
సాక్షి,హైదరాబాద్: నగరంలోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్వీపీఎన్పీఏ)లో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్లు సముద్రంలో మునిగిపోతున్న ఓ కుటుంబాన్ని కాపాడి వారి పాలిట ఆపద్భాందవులు అయ్యారు. ఎన్పీఏలోని ట్రైనీ ఐపీఎస్లు అభినవ్ ధీమాన్, అభినయ్ విశ్వకర్మ, భరత్ సోనీ, గౌహర్ హసన్, సువేందు పాత్ర, తెషూ లెందీప్ (భూటాన్ ) అహ్మద్ అబ్దుల్ అజీజ్ (మాల్దీవులు), మహమ్మద్ నజీవ్ (మాల్దీవులు) భారత్యాత్ర కార్యక్రమం కోసం ఇటీవల లక్షద్వీప్ దీవులకు వెళ్లారు. 8 trainees including 5 IPS, 2 from Maldives and one from Bhutan, during their visit to Lakshadweep islands, showed valiant act & rescued a family drowning in the sea. The Academy appreciated the self-less act of bravery true to the sense of uniform to help the people in need pic.twitter.com/1EH7JsQeQ5 — SVPNPA (@svpnpahyd) June 5, 2021 అక్కడ వీరంతా బీచ్లో గడుపుతున్న సమయంలో భారత వైమానిక దళానికి చెందిన ఓ అధికారి కుటుంబం ప్రమాదవశాత్తూ సముద్రంలో మునిగిపోతుండటం చూశారు. వెంటనే ఈ ఎనిమిది మంది సముద్రంలోకి దూకి వారందర్నీ రక్షించారు. విషయం తెలిసిన అకాడమీ వీరి ధైర్య సాహసాలను ఆదివారం ప్రత్యేకంగా అభినందించి మీడియాకు వెల్లడించింది. ట్రైనీ ఐపీఎస్ అధికారుల సాహసంపై నెటిజన్లు ప్రశంసల వెల్లువ కురిపిస్తున్నారు. Kudos to our two gallant officers, Chief Inspector of Police Ahmed Abdul Azeez & Chief Inspector of Police Mohamed Nazim currently undergoing IPS training at the @svpnpahyd, for their bravery in saving a family of 4 including 2 children from a drowning incident in Lakshadeep 1/2 pic.twitter.com/H6JELebO4i — Maldives Police (@PoliceMv) June 5, 2021 చదవండి: నారాయణఖేడ్లో బొలేరో వాహనం బీభత్సం -
'ఐపీఎస్ లు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి'
హైదరాబాద్: పరస్పరం సహకరించుకుంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న మీరు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలని ఐపీఎస్ అధికారులకు హితవు పలికారు. శుక్రవారం హైదరాబాద్ నగర శివారుల్లోని సర్దార్ వల్లభాయ్పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో జరిగిన 66వ బ్యాచ్ ఐపీఎస్ అధికారులు పాసింగ్ ఔట్ పెరేడ్లో రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ... దేశానికి సర్దార్ పటేల్ చేసిన సేవలు మరువలేనివని అన్నారు. పటేల్ జన్మదినాన్ని ఏక్తా దివాస్గా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారని ఈ సందర్బంగా చెప్పారు. 66వ పాసింగ్ ఔట్ పెరేడ్లో128 మంది ఐపీఎస్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో 19 మంది మహిళలు ఉన్నారు. మరో 15 మంది విదేశాలకు చెందిన అధికారులు ఉన్నారు. -
మేడమ్.. నన్ను అరెస్టు చేయండి ప్లీజ్!
-
ఫేస్బుక్ అకౌంట్ పీకేసిన ఐపీఎస్ అధికారిణి
మెరిన్ జోసెఫ్.. ఐపీఎస్ ట్రైనీ. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఆమె పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. ఇంటర్నెట్ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆమె ఫొటోలు, 'మేడమ్.. నన్ను అరెస్టు చేయండి' అంటూ ఆమె కోసం వేడుకోళ్లు. ఒక్క రోజులోనే ఆమెకు 25వేల మంది ఫాలోయర్లు వచ్చేశారు. కొచ్చి నగరానికి కొత్త ఏసీపీగా మెరిన్ జోసెఫ్ వచ్చారంటూ ఒక ఫేస్బుక్ పేజీలో ప్రచురించడంతో మెరిన్ జోసెఫ్ ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. చివరకు ఈ వ్యవహారం మరీ శ్రుతి మించడంతో ఆమె తన ఫేస్బుక్ అకౌంట్ను డీయాక్టివేట్ చేసిపారేశారు. ఫేస్బుక్లో పోస్టులు విపరీతంగా పెరిగిపోవంతో అసలు ముందు ఆమె ఫొటోను ఫేస్బుక్లో ఎవరు పోస్ట్ చేశారోనంటూ కొచ్చి నగర పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. వాస్తవానికి ఆమె కొచ్చి ఏసీపీగా బాధ్యతలే స్వీకరించలేదని, ఎవరో తప్పుడు పోస్ట్ పెట్టడంతో అది కాస్తా విస్తృతంగా ప్రచారం అయ్యిందని కమిషనర్ కేజీ జేమ్స్ తెలిపారు. తప్పుడు సమాచారాన్ని ఇలా పంచినవాళ్లపై అవసరమైతే తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, తానింకా శిక్షణలోనే ఉన్నానని, వచ్చే సంవత్సరం జనవరిలోనే తనకు మొదటి పోస్టింగ్ వస్తుందని, వచ్చినప్పుడు తప్పకుండా మీడియాకు చెబుతానని మెరిన్ జోసెఫ్ అన్నారు. ఈలోపు మాత్రం నిరాధార వదంతులు వ్యాప్తి చేయొద్దని తన అభిమానులకు హితవు పలికారు. -
మేడమ్.. నన్ను అరెస్టు చేయండి ప్లీజ్!
కేరళలో ఇప్పుడంతా మమ్మల్ని అరెస్టు చేయండి ప్లీజ్ అంటూ క్యూ కడుతున్నారు. అయితే వీళ్లెవరూ ఏ స్టేషన్ పడితే ఆ స్టేషన్కు వెళ్లట్లేదు. కేవలం కొచ్చి ఏసీపీ వద్దకు మాత్రమే అరెస్టు చేయాలంటూ వెళ్తున్నారు. ఎందుకంటే.. మెరిన్ జోసెఫ్ అనే ఐపీఎస్ అధికారిణి అక్కడ ఏసీపీగా ఇటీవలే ఛార్జి తీసుకున్నారు. ఇప్పుడు ఆమె ఫొటోను ఫేస్బుక్లో విపరీతంగా షేర్ చేస్తూ.. మమ్మల్ని అరెస్టు చేయండి అంటూ కోరుతున్నారు. మెరిన్ జోసెఫ్ అందంగా కనపడటమే అందుకు కారణం. ఆమె చేతుల్లో అరెస్టు కావడానికి తాము దొంగలుగా మారేందుకు కూడా అభ్యంతరం లేదని కొంతమంది చెబుతున్నారు. ఇదంతా ఎలా మొదలైందంటే... కొచ్చి కొత్త ఏసీపీగా మెరిన్ జోసెఫ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పౌర సమస్యలకు సంబంధించిన ఓ ఫేస్బుక్ పేజీలో ఆమెకు స్వాగతం పలుకుతూ ఫొటో పోస్ట్ చేశారు. కేవలం ఒక్కరోజులోనే ఆ ఫొటోకు ఏకంగా పదివేల లైకులు వచ్చాయి. షేర్లు కూడా చాలా ఎక్కువ వచ్చాయి. వాట్సప్లో కూడా ఈ ఫొటోను విస్తృతంగా షేర్ చేసుకున్నారు. నిక్కీ అనే ఓ కుర్రాడు తాను దోపిడీలు మొదలుపెట్టేస్తానని బహిరంగంగా చెప్పాడు. ''వావ్!! ఇంత అందమైన పోలీసు ఆఫీసర్ కొచ్చిని పాలిస్తుంటే చూడటానికి చాలా సంతోషంగా ఉంది. మీకు అభినందనలు!'' అని పెట్టాడు. తనను అరెస్టు చేయాలంటూ ప్రముఖ నటుడు మోహన్లాల్ ఆమెను అడుగుతున్నట్లుగా ఫొటోషాప్లో మార్ఫింగ్ చేసిన ఫొటో కూడా ఫేస్బుక్లో విస్తృతంగా వ్యాపించింది. ఇప్పుడు అక్కడ లేనే లేరట అయితే.. ఐపీఎస్ శిక్షణ పొందుతున్న మెరిన్ జోసెఫ్ కేవలం రెండు వారాల శిక్షణ కోసం మాత్రమే కొచ్చికి వెళ్లి, అక్కడినుంచి తిరిగి వెళ్లిపోయారు కూడా. ఈ విషయాన్ని డీసీపీ మహ్మద్ రఫీక్ తెలిపారు. 'వై20' పేరిట ఆస్ట్రేలియాకు వెళ్లే యువ బృందానికి కూడా ఆమె ఇటీవల ఎంపికయ్యారు. న్యూఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజిలో బీఏ ఆనర్స్ చదివిన మెరిన్ జోసెఫ్.. 2012లో తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించారు.