ttd member
-
మహిళతో కలసి స్టెప్పులేసిన డొక్కా జగన్నాథం
-
జగన్నాథం.. ఏంటీ పని?
సాక్షి, పి. గన్నవరం: ప్రపంచ ప్రఖ్యాత దేవస్థానంలో సభ్యుడిగా కొనసాగుతూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాల్సిన ఒక నాయకుడు తన స్థాయిని మరచిపోయారు. స్టేజ్ ఎక్కేసరికి సర్వం మర్చిపోయి ఓ మహిళతో కలసి స్టెప్పులేయడం ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు డొక్కా జగన్నాథం (నాధ్ బాబు) చేసిన ఈ పని చూసి అందరూ ముక్కున వేలు వేసుకున్నారు. పి.గన్నవరంలో ఎంపీపీ సంసాని లక్ష్మీగౌరి పెద్దిరాజు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్న ఆయన స్థాయిని మరిచిపోయి స్టెప్పులు వేశారు. వివాహ వేడుకలో ఏర్పాటు చేసిన సినీ ఆర్కెస్ట్రాలో ఓ మహిళతో ఆయన డాన్స్ చేయటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి బోర్డు సభ్యుడిగా ఉంటూ నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి ఈరకంగా ప్రవర్తించడం అందరిని విస్మయానికి గురి చేసింది. పెళ్లిలో ఈయన వేసిన చిందులు కాస్తా సోషల్ మీడియా, వాట్సాప్ల్లోనూ హల్ చల్ చేస్తున్నాయి. టీడీపీలో అందరికీ నీతిసూత్రాలు బోధించే జగన్నాథం స్టేజ్ ఎక్కేసరికి సర్వం మరచి స్టెప్పులు వేయటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : మహిళతో కలసి స్టెప్పులేసిన డొక్కా జగన్నాథం -
పచ్చ పుట్టలో నల్ల త్రాచు
-
నోట్ల రద్దు తర్వాత దొరికిన భారీ సొమ్ము ఇదే!
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో పెద్ద మొత్తంలో దొరికిన సొమ్ము ఇదేనని ఆదాయపన్నుశాఖ వెల్లడించింది. టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్రెడ్డి ఆస్తులకు సంబంధించి ఆదాయపన్నుశాఖ అధికారిక ప్రకటన చేసింది. మొత్తం రూ.142 కోట్ల విలువైన నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ మొత్తం డబ్బు, బంగారం అంతా తనదేనని శేఖర్రెడ్డి చెబుతున్నాడని ఐటీశాఖ పేర్కొంది. ఇదంతా తన ఆస్తులేనని శేఖర్రెడ్డి చెబుతున్నా.. వీటికి సంబంధించి ఎలాంటి లెక్కలు లేవని ఐటీశాఖ నిర్ధారించింది. తమిళనాడులో మొత్తం ఇసుక తవ్వకం లైసెన్స్ శేఖర్రెడ్డికే ఇచ్చినట్లు గుర్తించారు. పట్టుబడిన మొత్తంలో 127 కేజీల బంగారం, పాత కరెన్సీ 96.89కోట్లు ఉండగా, కొత్త రూ.2 వేలనోట్ల కరెన్సీ రూ.9.63కోట్లు ఉంది. బంగారం విలువ దాదాపు 36.29 కోట్లు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. శేఖర్రెడ్డి సహా చెన్నైలోని నలుగురు తెలుగు పారిశ్రామికవేత్తల ఇళ్లపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు గురువారం, శుక్రవారం మెరుపుదాడులు నిర్వహించారు. ఈ నలుగురూ వ్యాపార భాగస్వాములని ఐటీశాఖ తెలిసింది. -
శేఖర్రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు
-
శేఖర్రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు
టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు.. వంద కిలోల బంగారం స్వాధీనం శేఖర్రెడ్డిని నియమించింది చంద్రబాబే.. అన్నాడీఎంకేలో కీలక నేత చెన్నైలో నలుగురు తెలుగు పారిశ్రామికవేత్తల ఇళ్లలో ఐటీ సోదాలు తనిఖీల్లో దొరికిన డబ్బు 90 కోట్లు బంగారం 100 కిలోలు రెండు వేల నోట్లు 70 కోట్లు సాక్షి ప్రతినిధి, చెన్నై: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు జె. శేఖర్రెడ్డి సహా చెన్నైలోని నలుగురు తెలుగు పారిశ్రామికవేత్తల ఇళ్లపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు గురువారం మెరుపుదాడులు నిర్వహించారు. ఈ నలుగురూ వ్యాపార భాగస్వాములని తెలిసింది. మొత్తం రూ.90 కోట్ల నగదు, కడ్డీల రూపంలో ఉన్న 100 కిలోల బంగారం, అనేక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వివిధ రకాల ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్ల విలువ రూ.400 కోట్లుగా లెక్కకట్టినట్లు సమాచారం. పట్టుబడిన రూ.90 కోట్ల నగదులో రూ.70 కోట్లు కొత్త రూ.2వేల నోట్లని తెలిసింది. ప్రేమ్ రెడ్డి అనే వ్యక్తి నగదుకు బంగారు కడ్డీలు మార్పిడి చేస్తున్నట్టు విశ్వసనీయంగా అందిన సమాచారం నేపథ్యంలో.. 60 మంది ఐటీ అధికారుల బృందం గురువారం ఉదయం ఏకకాలంలో ఎనిమిది చోట్ల దాడులు ప్రారంభించింది. చెన్నై టీ నగర్ బజుల్లా రోడ్డులోని శేఖర్రెడ్డి ఇంటిపైనా అలాగే ప్రేమ్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, కిరణ్రెడ్డి అనే మరో ఇద్దరి ఇళ్లపైనా దాడులు నిర్వహిం చారు. వేలూరు, కాట్పాడిలోని శేఖర్రెడ్డి నివాసాల్లో సోదాలు చేశారు. కాట్పాడి గాంధీనగర్లోని రెండు ఇళ్లకు తాళాలు వేసి ఉండడంతో ఐటీ అదనపు కమిషనర్ మురుగానంద భూపతి ఆధ్వర్యంలో గేటు తాళాలను సెక్యూరిటీ గార్డు ద్వారా తెరిపించి ఇళ్లను సీజ్ చేశారు. ఒక్కొక్కటి కిలో బరువు కలిగిన వంద కడ్డీలను చూసి అధికారులే అవాక్కైనట్టు తెలిసింది. శేఖర్రెడ్డి సహా నలుగురినీ ఐటీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇంత మొత్తంలో కొత్త కరెన్సీ ఎక్కడి నుంచి ఎలా వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు. బ్యాంకు అధికారులు ఎవరైనా సహకరించారా అనే కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. ఐటీ అధికారులు మాత్రం ఇప్పటివlరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. శేఖర్రెడ్డిని నియమించింది బాబే తెలుగు వ్యాపారవేత్తల నివాసాల్లో ఆదాయపన్ను శాఖ సోదాలు సంచలనం సృష్టించాయి. శేఖర్రెడ్డి తల్లిదండ్రులు జగన్నాథరెడ్డి, నీలవేణిలు వేలూరు జిల్లా కాట్పాడి సమీపం తొండన్తులసి గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవించేవారు. శేఖర్రెడ్డి చెన్నైలో ప్రైవేటు పబ్లికేషన్ను ప్రారంభించి చాలాకాలం క్రితమే ఇక్కడ స్థిరపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక శేఖర్రెడ్డిని టీటీడీ సభ్యుడిగా నియమించారు. ఈయన తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఇసుక, గనుల వ్యాపారాలు చేస్తున్నారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టు పనులు కూడా చేపట్టినట్టు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ లోకి సులువుగా వెళ్లగలిగే అతికొద్ది మందిలో శేఖర్రెడ్డి ఒకరని రాజకీయ వర్గాలు వెల్లడించాయి. అయితే జయలలిత మరణించిన నాలుగోరోజే ఆయన ఇంటిపై ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశమయ్యింది. గురువారం రాత్రి పొద్దు పోయేవరకు సోదాలు కొనసాగాయి. కాట్పాడిలోని శేఖర్ రెడ్డి ఇళ్లు -
అన్నాడీఎంకే నేత ఇంట్లో 100 కిలోల బంగారం
-
అన్నాడీఎంకే నేత ఇంట్లో 100 కిలోల బంగారం
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో తెలుగు వ్యాపారవేత్తల నివాసాల్లో ఆదాయపన్ను శాఖ సోదాలు సంచలనం రేపాయి. ముగ్గురు తెలుగు వ్యాపారవేత్తలు శేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ రెడ్డి ఇళ్లలో 60 మంది ఐటీ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. వేలూరు, కాట్పాడిలోని నివాసాల్లో సోదాలు చేశారు. 100 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వీరి ముగ్గురిని అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం విలువ 130 కోట్ల రూపాయలుగా తేల్చారు. కడ్డీల రూపంలో బయటపడిన బంగారం నిల్వలు చూసి అధికారులు అవాక్కయ్యారు. టీటీడీ సభ్యుడిగా ఉన్న శేఖర్ రెడ్డి.. తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఇసుక, గనుల వ్యాపారాలు చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ లోకి సులువుగా వెళ్లగలిగే అతికొద్ది మందిలో శేఖర్ రెడ్డి ఒకరని రాజకీయ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక శేఖర్ రెడ్డిని టీటీడీ సభ్యుడిగా నియమించారు. శేఖర్ రెడ్డి తమిళనాడులో వెయ్యి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేపట్టినట్టు తెలుస్తోంది. -
టీటీడీ సభ్యుడిగా వీరయ్య ప్రమాణస్వీకారం
సాక్షి, తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలోని గరుడాళ్వారు సన్నిధిలో ఆయన చేత తిరుమల జేఈవో కేఎస్. శ్రీనివాసరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ర ంగనాయక మండపంలో ఆయన్ను వేద పండితులు ఆశీర్వదించారు. చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, జేఈవో శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాటాడుతూ టీటీడీ సభ్యుడు కావడం పూర్వజన్మ సుకృతమన్నారు. సామాన్య భక్తులకు సేవ చేసేందుకు కృషి చేస్తానన్నారు. తెలుగు రాష్ట్రాలతో కూడిన కొత్త ధర్మకర్తల మండలిలో తనకు అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.