Tummala Nageswara
-
పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్ దంపతులు
-
భద్రాచలం చేరుకున్న గవర్నర్ దంపతులు
భద్రాచలం: గవర్నర్ నరసింహన్ దంపతులు గురువారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో భద్రాచలం చేరుకున్నారు. గవర్నర్ దంపతులకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్, ఎస్పీ స్వాగతం పలికారు. మిథిలా స్టేడియంలో వైభవంగా జరగనున్న శ్రీరాముడి మహాపట్టాభిషేకం కార్యక్రమంలో గవర్నర్ దంపతులు పాల్గొననున్నారు. ఇప్పటికే భక్తులు కూడా భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇటు గవర్నర్ దంపతులు, అటు భక్తులు భారీగా వస్తున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. -
తొలి ‘ఎమ్మెల్యే భవనం’ సిద్ధం
⇒ పరకాలలో ముస్తాబైన తొలి భవన సముదాయం ⇒ రేపు ప్రారంభించనున్న మంత్రులు తుమ్మల, చందూలాల్ సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేనివిధంగా నిర్మించతలపెట్టిన నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేలకు కార్యాలయం, నివాస వసతితో కూడిన భవన సముదాయాల పనులు ఊపందుకున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గం కేంద్రంలో రూ.69 లక్షల వ్యయంతో భవన సముదాయం సిద్ధమైంది. మార్చి 2వ తేదీన ఈ భవనాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, చందూలాల్ ప్రారంభించనున్నారు. క్యాంపు కార్యాలయం, నివాసం ఒకే చోట ఉండేలా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేలకు ప్రభుత్వం భవనాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీనివల్ల ఎమ్మెల్యే నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉండట మే కాకుండా, ప్రజలతో తరచూ మమేకమ వడానికి అవకాశం కలుగుతుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ప్రస్తుతం చాలామంది ఎమ్మెల్యేలు హైదరాబాద్లోనే మకాం పెడు తుండటంతో ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. ఎమ్మెల్యేను కలవాలంటే ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి రాజధానికి రావాల్సి వస్తోంది. దీన్ని నివారించటంతో పాటు, ఎమ్మెల్యేకు కూడా వసతిగా ఉండేలా ఈ భవనాల ప్రణాళిక రూపొందించారు. అడ్డంకుల నడుమ ముందుకు.. పేదల కోసం ఉద్దేశించిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లు ముందుకు రాకపో వడంతో ఆ పనులు పడకేసి ఇప్పుడిప్పుడే తిరిగి మొదలవుతున్నాయి. ఎమ్మెల్యేల ఇళ్ల విషయంలో కూడా ప్రారంభంలో స్థలాల కొరత, అనువైన భూములు లేకపోవటం తదితర కారణాలతో కొంత జాప్యం జరిగినా తర్వాత కొన్ని చోట్ల పనులు మొదలయ్యాయి. పరకాలలో గతేడాది ఆగస్టులో ప్రారంభమైన భవన నిర్మాణం యుద్ధప్రాతిపదికన పూర్తయింది. ప్రస్తుతం ఈ ఒక్క భవనం మాత్రమే సిద్ధం కావటంతో దాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలకు భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ భారీ వ్యయంతో కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మిస్తున్నందున ప్రత్యేకంగా వారికి భవనాలు కట్టడమంటే దుబారా చేయటమేనన్న విమర్శలు రావటంతో వెనక్కు తగ్గింది. హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాలు పోను మిగిలిన 104 నియోజవకవర్గాల్లో భవనాలు నిర్మించాలని నిర్ణయించినా 65 చోట్ల మాత్రమే పనులు మొదలయ్యాయి. ‘పరకాల’భవనం ప్రత్యేకతలివీ.. భవనం వైశాల్యం: 4,533 చదరపు అడుగులు నిర్మాణ వ్యయం: రూ.68.92 లక్షలు మొదటి అంతస్తు: సమావేశ మందిరం, ఎమ్మెల్యే కార్యాలయం, వీపీపీ లాంజ్, అతిథులు వేచి ఉండే గదులు, సిబ్బంది గదులు రెండో అంతస్తు: మూడు పడక గదులు, డైనింగ్ హాల్, స్టోర్స్ గది, పూజ గది, వంటగది, డ్రాయింగ్ రూమ్, వరండా. -
రోడ్లకు మరమ్మతులు చేయండి
అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో దెబ్బతిన్న నగర రహదారులను వెంటనే పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మెట్రో రైల్ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో రోడ్లు బాగా దెబ్బతిన్నాయని... వాటి పనులు చేపట్టేందుకు వెంటనే జీహెచ్ఎంసీ, హైద్రాబాద్ మెట్రో రైల్ అధికారులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్య కార్యదర్శి సునీల్శర్మ, ఇఎన్సీలతో ఆయన సమావేశమయ్యారు. ఇటీవల నాబార్డ్ సహకారంతో ప్రభుత్వం చేపట్టిన గ్రామీణ రోడ్ల నిర్మాణ పనులను వేగిరం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఆమోదించిన 2,600 కిలోమీటర్ల జాతీయ రహదారులను కేంద్రానికి అప్పగించేవరకు రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణ బాధ్యతలు చూసుకోవాల్సి ఉంటుందన్నారు. డిసెంబర్ 15-18 వరకు హైటెక్స్లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. దాదాపు 5వేల మంది ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సును సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రమాదాల నివారణ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ పటిష్టత, ట్రాఫిక్ నిబంధనలు తదితర అంశాలపై ఈ సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. -
‘రహదారి’లో అగ్ర పథమే లక్ష్యం
రూ.14 వేల కోట్లతో 26 వేల కి.మీ. రోడ్ల నిర్మాణం: తుమ్మల సాక్షి, హైదరాబాద్: అద్భుతమైన రహదారి వ్యవస్థ ఉన్న రాష్ట్రంగా తెలంగాణను దేశంలో తొలి స్థానంలో నిలపటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 26 వేల కిలోమీటర్ల మేర రోడ్లను తీర్చిదిద్దేందుకు రూ.14 వేల కోట్ల విలువైన పనులను ప్రారంభించబోతున్నామన్నారు. సోమవారం సాయంత్రం ఆయన రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీలు, సీఈలు, జిల్లాల ఎస్ఈలతో సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రంలో రోడ్లను భారీ ఎత్తున అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు తుమ్మల వెల్లడించారు. రాష్ట్రంలో 2,700 కి.మీ.గా ఉన్న జాతీయ రహదారుల నిడివిని మరో 2 వేల కి.మీ. పెంచాలని కేంద్రాన్ని కోరామన్నారు. అందులో తొలుత వెయ్యి కి.మీ. మంజూరు చేయాలంటూ సీఎం కేసీఆర్ లేఖ కూడా రాశారన్నారు. తీవ్ర ట్రాఫిక్ చిక్కులతో సతమతమవుతున్న హైదరాబాద్లో సమస్య పరిష్కారానికి 45 కీలక జంక్షన్లను గుర్తించి వాటిల్లో ఫ్లైఓవర్లు నిర్మించనున్నట్టు తెలిపారు. ఇదే తరహాలో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ లాంటి పెద్ద పట్టణాలను కూడా గుర్తించామన్నారు. తొలుత వరంగల్ ప్రధాన రహదారిని ఆరులేన్లుగా మారుస్తున్నట్టు తుమ్మల తెలిపారు. పొరుగు రాష్ట్రాల సరిహద్దులను అనుసంధానించే క్రమంలో నదులపై నిర్మాణంలో ఉన్న వంతెనలను వేగంగా పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రోడ్లు భవనాలశాఖ వెబ్సైట్ను ప్రారంభించారు. -
భూసేకరణ పూర్తి చేసిస్తే సిద్ధమే
తెలంగాణలో జాతీయరహదారులపై హైవేల సంస్థ చైర్మన్ ఆర్పీ సింగ్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భూసేకరణను పూర్తి చేసి ఉంటే హైవేల నిర్మాణానికి అభ్యంతరం లేదని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చైర్మన్ ఆర్పీసింగ్ స్పష్టం చేశారు. పీపీపీ విధానం అనుమతిస్తామని చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మతో శుక్రవారం సచివాలయంలో ఆర్పీ సింగ్ భేటీ అయ్యారు. ఈ విష యమై రహదారుల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొద్దిరోజుల క్రితం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో భేటీ అయిన నేపథ్యంలో కేంద్ర ఉపరి తల రవాణా శాఖ మంత్రి గడ్కారీ ఆదేశాల మేరకు ఆర్పీసింగ్ సీఎస్ను కలిశారు. ప్రతి పాదిత జాతీయ రహదారులు.. 1. హైదరాబాద్-నర్సాపూర్-మెదక్-ఎల్లారెడ్డి-బాన్సువాడ-బోధన్ 2.హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు వయా మొయినాబాద్-చేవెళ్ల- మన్నెగూడ- పరిగి -కొడంగల్ మీదుగా కర్నాటక సరిహద్దు వరకు, 3. కోదాడ-మిర్యాలగూడ-దేవరకొండ- కల్వకుర్తి- జడ్చర్ల 4. నిర్మల్-జగిత్యాల వయా ఖానాపూర్-మల్లాపూర్-రాయికల్ 5. అశ్వారావుపేట-ఖమ్మం-సూర్యాపేట 6. కరీంనగర్-సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం వరకు హైవే పనులు చేపట్టాలని సీఎస్ కోరారు.