Unofficial leave
-
అనధికారిక సెలవులో 200 మందికిపైగా వైద్యులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వందలాది మంది వైద్యులు అనధికారిక సెలవుల్లో కొనసాగుతున్నారు. మరీ ముఖ్యంగా వైద్యవిధాన పరిషత్, బోధనాసుపత్రుల్లో కలిపి సుమారు 200 మంది స్పెషలిస్టు వైద్యులు గత కొన్నేళ్లుగా విధులకు హాజరు కానట్టు ఆరోగ్యశాఖ పరిశీలనలో తేలింది. చాలామందిపై ఇప్పటికే శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది. కొంతమంది ఏళ్లతరబడి విధులకు రాకుండా ఉండటం, ఏదో కారణం చూపి మళ్లీ చేరడం, కొద్ది రోజులు పనిచేసి మళ్లీ సెలవులో వెళ్లడం.. ఇదీ రివాజు. ముఖ్యంగా సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు ఎక్కువ మంది సెలవులో ఉన్నట్టు తేలింది. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 26 మంది వైద్యులు రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాలం సెలవులో ఉన్నట్టు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఎలాంటి కారణాలు లేకుండా, సమాచారమూ ఇవ్వకుండా ఏడాదిపాటు విధులకు హాజరుకాని ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ఓవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల అవసరం ఎక్కువగా ఉంది. రోజుకు వందల్లో రోగులు వసూ్తంటారు. ఈ పరిస్థితుల్లో తమను ఎవరూ తీసెయ్యలేరన్న ధీమాతో చాలామంది కనీస సమాచారం లేకుండానే అనధికారికంగా విధులకు హాజరు కావడంలేదు. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ను వివరణ కోరగా.. ఎంతమంది అనధికారిక సెలవులో ఉన్నారన్నది తమ దృష్టికి రాలేదుగానీ, అలా అనధికారిక సెలవులో ఉన్న వారిపై శాఖాపరంగా తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. చదవండి: హైడ్రామా: చంద్రబాబు ‘కపట’ దీక్ష మాజీ మంత్రి దేవినేని ఉమాకు షాక్ -
అనధికారిక సెలవు పెట్టిన వైద్యుల తొలగింపు
-ముఖ్యమంత్రి పేషీ నుంచి వైద్య శాఖకు ఆదేశాలు -బోధనాసుపత్రులకు సర్క్యులర్ జారీ చేసిన డీఎంఈ హైదరాబాద్ : అనధికారికంగా సెలవుపెట్టి నెలల తరబడి డ్యూటీలకు రాకుండా ఉండే వైద్యులను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి పేషీ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏడాదిపాటు సెలవులో ఉన్న వైద్యులను ఒక్కరిని కూడా ఇకపై ఉద్యోగంలో ఉంచాల్సిన అవసరం లేదని తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే నర్సింగ్హోంలలో పనిచేస్తున్నారని, ప్రైవేటు క్లినిక్లు నడుపుతున్నారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో విచారణ జరిపించి 600 మందికి వైద్యులకు చార్జ్మెమోలు జారీచేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో వైద్యుల్లో కలకలం మొదలైంది. ముఖ్యమంత్రి పేషీ నుంచి వచ్చిన ఆదేశాలతో వైద్య విద్యాశాఖలో తొలి కసరత్తు మొదలైంది. మంత్రి పదే పదే వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఒత్తిళ్లు తెస్తున్న నేపథ్యంలో సోమవారం వైద్య విద్యాసంచాలకుల కార్యాలయం నుంచి అన్ని బోధనాసుపత్రులకు, వైద్య కళాశాలలకు సర్క్యులర్ జారీ అయింది. ఇప్పటి వరకూ అనధికారిక సెలవులో ఉన్న వైద్యుల జాబితా ఇవ్వాలని, వారిని తక్షణమే తొలగించేందుకు చర్యలు చేపడతామని సర్క్యులర్లో పేర్కొన్నట్టు తెలిసింది. కాగా పునర్విభజనలో కమల్నాథన్ కమిటీకి ఆప్షన్లు ఇవ్వని వారిని కూడా ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తాజా లెక్కల ప్రకారం 30 మందికి పైగా గత ఏడాదిగా అనధికారిక సెలవులో ఉన్నారని, వారిని తొలగించే అవకాశాలున్నట్టు సమాచారం. అలాంటి వైద్యులు ఏమైనా వినతులు ఇచ్చినా వాటిని పరిగణనలోకి తీసుకోకూడదని కూడా సర్కారు ఆదేశించినట్టు తెలిసింది. రెండు మూడు రోజుల్లో వైద్యవిధానపరిషత్, డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ విభాగాల నుంచి కూడా వైద్యులపై చర్యలకు ఆదేశాలు వెళ్లనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.