Uttar Pradesh assembly seats
-
యూపీ అసెంబ్లీలో 485 స్థానాలు!
లక్నో: ఉత్తరప్రదేశ్ శాసనసభలో మొత్తం 485 స్థానాలు ఉన్నాయట. అదేంటి ఉన్నది 403 స్థానాలే కదా. అదంతే.. వివాదాస్పద మంత్రి ఆజంఖాన్ లెక్కల ప్రకారం యూపీ అసెంబ్లీలో 485 సీట్లు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై తనదైన శైలిలో స్పందించిన ఆయన ఈ లెక్కలు చెప్పారు. సమాజ్ వాదీ పార్టీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా చేశారు. తమ పార్టీకి 380 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. బీఎస్పీకి 80 సీట్లు, బీజేపీకి 25 స్థానాలు దక్కుతాయని అంచనా కట్టారు. ఈ అంకెలు అన్నీ కలుపుకుంటే 485. కానీ శాసనసభలో ఉన్నది 403 సీట్లే. మిగతా సీట్లు ఎక్కడున్నాయో ఆజంఖాన్ కే తెలియాలి. ఎన్నికల ఫలితాల తర్వాత బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటారా అని ప్రశ్నించగా అలాంటి పరిస్థితి రాదని, తమకు 380 సీట్లు వస్తాయని పేర్కొన్నారు. కచ్చితంగా ఎక్కువ స్థానాలు వస్తాయని, తనపై నమ్మకం ఉంచాలని అన్నారు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
‘మా శవాల మీదనుంచి నీ కారు పోనియ్’
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీకి సొంతగూటి నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సీట్ల కేటాయింపు విషయంలో తారతమ్యాలు ఏర్పడి అసంతృప్తులు రోడ్లెక్కుతున్నాయి. తమకు సీట్లు కేటాయించలేదని ఇద్దరు బీజేపీ నేతలు రోడ్డుకు అడ్డంగా పడుకున్నారు. బీజీపీ రాష్ట్ర చీఫ్ కేపీ మౌర్యా కారుకు అడ్డంగా పడుకొని తమ మద్దతుదారుల సహాయంతో రోడ్డు దిగ్భందించారు. మా శవాల మీద నుంచి మీ కారును పోనివ్వండి అంటూ నినాదాలు చేశారు. దాదాపు గంటపాటు వారు నిరసన ఆందోళనకు దిగారు. ఉత్తరప్రదేశ్లోని 403 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటి వరకు 370మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. అయితే, అందులో తమకు సీటు దక్కలేదని సుందర్ లాల్ దీక్షిత్, రాంబాబు ద్వివేది అనే పార్టీకి చెందిన వ్యక్తులు తీవ్ర అసంతృప్తి చెందారు. ఇక తమకు సీటు దక్కదని భావించి పార్టీ కార్యాలయం దగ్గర్లోనే రోడ్డుపై బీజేపీ రాష్ట్ర చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య వెళుతుండగా ఆయన కారుకు అడ్డంగా పడుకున్నారు. ‘మా శవాల మీదనుంచి మీరు కానిపోనివ్వండి అంటూ గట్టిగా అరిచారు. దీంతో మీడియా కెమెరాలన్నీ కూడా వారివైపే తిరిగాయి.