Vedang Raina
-
ఎవరికీ ప్రపోజ్ చేయలేదన్న ఖుషీ కపూర్.. 'రైనా' సంగతేంటి..?
అలనాటి నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ (Khushi Kapoor) నటించిన కొత్త సినిమా 'లవ్యాపా' (Loveyapa). బాలీవుడ్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఇందులో ఆమీర్ఖాన్ తనయుడు జునైద్ ఖాన్తో జంటగా ఆమె నటించారు. యూత్ను ఆకట్టుకునే ప్రేమకథలా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం 'లవ్ టుడే'కు రీమేక్గా 'లవ్యాపా' సినిమా రానుంది. అయితే, తాజాగా ప్రమోషన్స్లో భాగంగా ఖుషీ కపూర్ తన వ్యక్తిగత జీవితం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.ఇంటర్యూలో భాగంగా ఇప్పటి వరకు ఎవరినైనా ప్రేమించారా..? ప్రపోజ్ చేశారా..? అని ఖుషీ కపూర్ను అడగ్గా.. ఆమె ఇలా చెప్పారు. తాను ఇప్పటి వరకు ఎవరికీ ప్రపోజ్ చేయలేదని షాకింక్ ఆన్సర్ ఇచ్చారు. కానీ, తనకు ఎవరైనా ప్రపోజ్ చేస్తే అందుకు సంబంధించిన ఒక ఫోటోను తీసుకోవాలని ఉందని ఆమె పేర్కొన్నారు. బాలీవుడ్ సినిమా 'ది ఆర్చిస్'లో నటించిన తన కో స్టార్ వేదాంగ్ రైనాతో ఖుషి ప్రేమలో ఉన్నారని చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వారిద్దరూ కూడా జంటగా పలు ప్రదేశాల్లో కెమెరాల కంట కూడా పడ్డారు. ఇలాంటి సమయంలో తాను ఎవరికీ ప్రపోజ్ చేయలేదు అని ఖుషీ చెప్పడంతో నెట్టింట ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బహూశా బ్రేకప్ ఏమైనా చెప్పారా..? అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.2023లో విడుదలైన 'ది ఆర్చిస్' సినిమాతో ఖుషీ కపూర్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఈ చిత్రం డైరెక్ట్గా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాలో తనకు జోడీగా నటించిన వేదాంగ్ రైనాతో ఆమె ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.అక్కతో పోటీ లేదు..కెరీర్ పరంగా జాన్వీకపూర్తో తాను పోటీ పడలేనని ఖుషీ కపూరు చెప్పారు. నిజం చెప్పాలంటే అలాంటి ఆలోచన తమ ఇద్దరిలోనూ లేదని ఆమె పేర్కొన్నారు. తాము పోటీ పడుతున్నట్లు ఎవరైనా అనుకుంటే అదొక వింతే అని ఖుషీ తెలిపారు. ఒకవేళ తామిద్దరం కలిసే ఏదైనా సినిమా చేస్తే తప్పకుండా ఎక్కువ మార్కులు జాన్వీ అక్కకే పడుతాయని ఆమె అన్నారు. ఆమె చాలా బాగా నటిస్తుంది. స్క్రీన్పై అక్క నటన చూస్తే చాలా ఆనందం కలుగుతుందని ఆమె తెలిపారు. 'నేను ఏదైనా చిత్రంలో బాగా నటిస్తే అక్క చాలా సంతోషిస్తుంది. చాలా బాగా చేశావ్ అంటుంది. అప్పుడు కూడా అదంతా తన విజయంగా ఆమె భావిస్తుంది.' అని అన్నారు. -
ఓటీటీలో 'జిగ్రా' స్ట్రీమింగ్.. అధికారిక ప్రకటన
ఆలియా భట్ భారీ యాక్షన్ మూవీ జిగ్రా ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఆలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 11న హిందీతో పాటు తెలుగులో కూడా విడుదలైంది. అయితే, ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం ఈ చిత్రం అందుకోలేకపోయింది. ఈ సినిమాలో సత్య పాత్రలో ఆలియా భారీ యాక్షన్ సీన్స్లో మెప్పించినప్పటికీ కథలో పెద్దగా బలం లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద భారీగా నష్టాలను మిగిల్చింది. ఆలియా భట్ తమ్ముడి పాత్రలో వేదాంగ్ అద్భుతంగా నటించారు.అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్తో వాసన్ బాల దర్శకత్వంలో రూపొందిన జిగ్రా సినిమాను కరణ్ జోహార్, అపూర్వా మెహతా, ఆలియా భట్, షాహిన్ భట్, సోమెన్ మిశ్రా నిర్మించారు. అయితే, జిగ్రా ఓటీటీలో విడుదల కానున్నట్లు చాలారోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. అయితే, డిసెంబర్ 6న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. హిందీతో పాటు దక్షిణాది భాషలు అన్నింటిలోనూ విడుదల కానుంది.జిగ్రా కోసం సుమారు రూ. 90 కోట్లు ఖర్చు చేశారు నిర్మాతలు. అయితే, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 30 కోట్ల లోపే కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. జిగ్రాతో రూ. 60 కోట్లకు పైగానే నిర్మాతలు నష్టపోయినట్లు సమాచారం. జిగ్రా తర్వాత మరో రెండు సినిమాల్లో అలియా భట్ నటిస్తుంది. అల్ఫా, లవ్ అండ్ వార్ ప్రాజెక్ట్లలో ఆమె భాగం కానుంది. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న 'అలియా భట్' యాక్షన్ మూవీ
ఆలియా భట్ భారీ యాక్షన్ మూవీ జిగ్రా ఓటీటీలోకి రానుంది. ఆలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 11న హిందీతో పాటు తెలుగులో కూడా విడుదలైంది. ఇందులో సత్య పాత్రలో ఆలియా భారీ యాక్షన్ సీన్స్లో దుమ్మురేపింది. అంకుర్ పాత్రలో వేదాంగ్ అద్భుతంగా నటించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఈ చిత్రం మెప్పించలేదు.అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్తో వాసన్ బాల దర్శకత్వంలో రూపొందిన జిగ్రా సినిమాను కరణ్ జోహార్, అపూర్వా మెహతా, ఆలియా భట్, షాహిన్ భట్, సోమెన్ మిశ్రా నిర్మించారు. అయితే, జిగ్రా ఓటీటీలో విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. డిసెంబర్ 6న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కథనాలు వస్తున్నాయి. హిందీతో పాటు దక్షిణాది భాషలు అన్నింటిలోనూ విడుదల కానుంది.జిగ్రా కోసం సుమారు రూ. 90 కోట్లు ఖర్చు చేశారు నిర్మాతలు. అయితే, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 30 కోట్ల లోపే కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. జిగ్రాతో రూ. 60 కోట్లకు పైగానే నిర్మాతలు నష్టపోయినట్లు సమాచారం. జిగ్రా తర్వాత మరో రెండు సినిమాల్లో అలియా భట్ నటిస్తుంది. అల్ఫా, లవ్ అండ్ వార్ ప్రాజెక్ట్లలో ఆమె భాగం కానుంది. -
షారుఖ్ ఖాన్ కుమార్తెపై యంగ్ హీరో ఇంట్రెస్టెంగ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ముద్దుల తనయ, నటి సుహానా ఖాన్పై యంగ్ హీరో వేదాంగ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె మేకప్ వేసుకోవడానికి చాలా సమయం తీసుకుంటుందని, షూటింగ్ సమయంలో ఆమె టీమ్ అంతరాయం కలిగించేదని చెప్పారు. ఆయన కీలకపాత్రలో నటించిన తాజా చిత్రం ‘జిగ్రా’. ఆలియా బట్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా వేదాంగ్ రైనా మీడియాతో ముచ్చటించారు. (చదవండి: రానాకి ఇంతకంటే బెటర్ ప్రశంస ఉండదేమో?)ఈ సందర్భంగా తొలి సినిమా కోస్టార్ సుహానా ఖాన్పై ఎప్పుడైనా కోపం వచ్చిందా అని విలేకరి ప్రశ్నించాడు. దీనిపై వేదాంగ్ స్పందిస్తూ.. ‘సుహానా చాలా మంచి అమ్మాయి. అందరితో కలిసిసోతుంది. కోపం వచ్చేలా ఆమె ప్రవర్తించదు. కానీ ఒక విషయంలో మాత్రం నాకు కొంచెం చిరాకుగా అనిపించేంది. ఆమె రెడీ కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. షూటింగ్ సమయంలో మేమంతా రెడీ అయి ఆమె కోసం ఎదురు చూసేవాళ్లం. దాదాపు గంట లేట్గా సెట్పైకి వచ్చేది. (చదవండి: పెళ్లి గురించి అమితాబ్ ప్రశ్న.. జునైద్ ఖాన్ ఆన్సర్కు తండ్రి షాక్)షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ‘జుట్టు బాలేదు..మేకప్ సరిగా లేదు’అంటూ ఆమె టీమ్ మధ్యలో అంతరాయం కలిగించేంది. దాని వల్ల మా బృందం అంతా ఇబ్బంది పడింది. ఇందులో సుహానాది తప్పులేదు. ఆమె పాత్ర అలా డిజైన్ చేశారు. అందుకే మేకప్కి ఎక్కువ సమయం తీసుకునేది’అని వేదాంగ్ చెప్పారు.