visit to India
-
వాహ్.. తాజ్!
న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటనలో సోమవారం బిజీబిజీగా గడిపారు. భార్య జీనెట్ రూబియో, భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్తో కలిసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని ప్రఖ్యాత కట్టడం తాజ్మహల్ను, రాజస్తాన్ రాజధాని జైపూర్లోని అంబర్ కోటను సందర్శించారు. తాజ్మహల్ సందర్శన అద్భుతమైన అనుభవమని మార్కో రూబియో కొనియాడారు. ‘‘ప్రపంచంలోని గొప్ప ప్రేమ సౌధాలలో ఒకటైన తాజ్మహల్ను సందర్శించడానికి మాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు’’అంటూ సందర్శకుల పుస్తకంలో రాశారు. అమెరికాలో వెచ్చని వాతావరణం ఉంటే మియామీలో జన్మించిన రూబియో నిండు వేసవిలో ఆగ్రాలోని మండుటెండకు పెద్దగా చలించనట్లే కనిపించారు. అయితే, ఫొటోలకు పోజులిచ్చే ముందు ఆయన తన నెక్ టైని తీసివేశారు. తాజ్మహల్ సందర్శన అనంతరం ప్రత్యేక విమానంలో జైపూర్కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు రాజస్తానీ పద్ధతిలో సంప్రదాయ స్వాగతం లభించింది. 16వ శతాబ్దంలో నిర్మించిన ప్రాచీన అంబర్ కోటను ఆసక్తిగా తిలకించారు. అక్కడి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమానికి హాజరయ్యారు. జానపద నృత్యాలతో కళాకారులు అలరించారు. నేడు క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం మార్కో రూబియో మంగళవారం ఢిల్లీలో ‘క్వాడ్’విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొంటారు. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి ఆ్రస్టేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు హాజరు కాబోతున్నారు. ‘క్వాడ్’లో భారత్, ఆమెరికా, ఆ్రస్టేలి యా, జపాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. పశ్చిమాసియా సంక్షోభం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత, ఇండో–పసిఫిక్లో భద్రత వంటి కీలక అంశాలపై క్వాడ్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అరుదైన ఖనిజాలు, టెక్నాలజీ సహా కీలక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి చేపట్టాల్సిన చర్యలపై విదేశాంగ మంత్రులు చర్చించబోతున్నారు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ కోసం క్వాడ్ దార్శనికత ఈ చర్చల్లో ప్రధానాంశంగా ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ సంకేతాలిచ్చింది. అలాగే ఈ ఏడాది చివర్లో భారత్లో జరగనున్న క్వాడ్ శిఖరాగ్ర సమావేశానికి మంగళవారం నాటి సమావేశంలో విస్తృత ఎజెండాను నిర్ధారించే అవకాశం ఉంది. క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సు గత ఏడాది అమెరికా రాజధాని వాషింగ్టన్లో జరిగింది. తాజ్ చరిత్ర తెలిసి ఉంటే ఫొటో దిగే వారు కాదేమోఅమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సోమవారం ఆగ్రాలో తాజ్మహల్ను సందర్శించడం పట్ల హైదరాబాద్లోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం స్పందించింది. ‘‘రూబియోకు తాజ్మహల్ చరిత్ర తెలిసి ఉంటే ఆయన ఆ స్మారక చిహ్నం వద్ద ఫొటోకు పోజు ఇచ్చి ఉండేవారు కాదు’’అని తేల్చిచెప్పింది. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ‘‘మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఇరానియన్ భార్యపై ఉన్న ప్రేమతో, ఇరానియన్ వాస్తుశిల్పుల మేధస్సుతో తాజ్మహల్ను నిర్మించారు. మరోవైపు అమెరికా ప్రభుత్వం నేడు ఇతర నాగరికతలను అవమానిస్తూ, ఇరానియన్ నాగరికతను తుడిచిపెట్టేస్తామని బెదిరిస్తోంది’’అని ఆరోపించింది. తాజ్మహల్ ఎదుట భార్యతో పాటు రూబియో దిగిన ఫొటోను ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం షేర్ చేసింది. షాజహాన్ భార్య ముంతాజ్ మహల్ 1593లో ఆగ్రాలో జన్మించారు. ఆమె అసలు పేరు అర్జుమంద్ బాను బేగం. ఆమె తండ్రి అబ్దుల్ హసన్ అసఫ్ ఖాన్ ఒక పర్షియన్(ఇరాన్) రాజకుటుంబానికి చెందిన వ్యక్తి అని చరిత్ర చెబుతోంది. -
కలిసి పనిచేద్దాం!
న్యూఢిల్లీ: ప్రపంచ సౌభాగ్యం, శాంతి కోసం ఇకపైనా కలిసికట్టుగా పని చేయాలని భారత్, అమెరికా నిర్ణయించుకున్నాయి. ఇరుదేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఎప్పటిలాగే కొనసాగుతున్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శనివారం ఢిల్లీలో మోదీతో సమావేశమయ్యారు. పశ్చిమాసియా పరిణామాలను మోదీకి వివరించారు. రక్షణ, వ్యూహాత్మక సాంకేతికతలు, వ్యాపారం, వాణిజ్యం, ఇంధన భద్రత వంటి కీలక రంగాల్లో భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సహకారంపై వారిద్దరూ చర్చించుకున్నారు. రూబియో శనివారం ఢిల్లీకి చేరుకున్న కొద్దిసేపటికే మోదీతో భేటీ అయ్యారు. నాలుగు రోజులపాటు భారత్లో పర్యటించబోతున్నారు. గత ఏడాది కాలం నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను పునఃసమీక్షించే ప్రయత్నంగా రూబియో పర్యటనను నిపుణులు పరిగణిస్తున్నారు. రూబియోను కలవడం ఆనందంగా ఉందంటూ మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. భారత్–అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో నిరంతర పురోగతి, ప్రాంతీయ, ప్రపంచ శాంతి భద్రతకు సంబంధించిన అంశాలపై తాము చర్చించామని వెల్లడించారు. రెండు దేశాలు నిరంతరం సన్నిహితంగా కలిసి పనిచేస్తూనే ఉంటాయన్నారు. వాణిజ్య, రక్షణ సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి, కీలకమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై సహకారాన్ని వేగవంతం చేయడానికి మోదీ, రూబియో అంగీకరించారని అమెరికా విదేశాంగ శాఖ తెలియజేసింది. భారత్ అత్యంత ముఖ్యమైన భాగస్వామి భారత్, అమెరికాలు అనేక రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతి గురించి రూబియో ప్రధాని మోదీకి వివరించారని భారత ప్రభుత్వవర్గాలు తెలిపాయి. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు భారత్ నిరంతరం మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారని పేర్కొన్నాయి. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సంఘర్షణలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మరోసారి పిలుపునిచ్చారని స్పష్టంచేశాయి. మోదీ, రూబియో మధ్య ఫలవంతమైన సమావేశం జరిగిందని భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. భారత్ తమకు అత్యంత ము ఖ్యమైన భాగస్వామి అని రూబియో తేల్చిచెప్పారు. మోదీతో భేటీ అనంతరం అమెరికా ఎంబసీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు రాబోయే రో జుల్లో ఇరుపక్షాలు కొన్ని కీలక ప్రకటనలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయని తెలిపారు. ఇండో–పసిఫిక్ విషయంలో వాషింగ్టన్ విధానానికి భారతదేశం ‘ఒక మూలస్తంభం’అని అభివరి్ణంచారు.మోదీకి అమెరికా ఆహ్వానం త్వరలో అమెరికా పర్యటించాలని, వైట్హౌస్ను సందర్శించాలని కోరుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరపున మార్కో రూబియో ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. ఈ విషయం అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలియజేశారు. మోదీతో భేటీ సందర్భంగా ఈ ఆహ్వానం అందించారని చెప్పారు. డొనాల్డ్ ట్రంప్కు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయాలని రూబియోను మోదీ కోరారని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ఒక ప్రకటనలో పేర్కొంది. ట్రంప్తో సంభాషణ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారని వెల్లడించింది.కోల్కతాలో మదర్ హౌస్ను సందర్శించిన రూబియో నాలుగు రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చిన మార్కో రూబియో తొలుత కోల్కతాలో అడుగుపెట్టారు. సెర్గియో గోర్ ఆయనకు స్వాగతం పలికారు. అమెరికా విదేశాంగ మంత్రి ఒకరు కోల్కతాలో పర్యటించడం 14 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. చివరిసారిగా 2012 మే నెలలో అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఇక్కడ పర్యటించారు. మార్కో రూబియో కోల్కతాలో ప్రఖ్యాత మదర్ హౌస్ను సందర్శించారు. ఇది భారత రత్న మదర్ థెరిసా స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ ప్రదాన కార్యాలయం. మదర్ హౌస్ అధికారులతో రూబియో మాట్లాడారు. అనంతరం నిర్మల శిశు భవన్ కూడా సందర్శించారు. ఇది మిషనరీస్ ఆఫ్ చారిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న పిల్లల సంరక్షణ కేంద్రం. రూబియో ఈ నెల 26వ తేదీ వరకు భారత్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ‘క్వాడ్’దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరవుతారు. ఢిల్లీతోపాటు ఆగ్రా, జైపూర్లో పర్యటిస్తారు. -
భారత్లో వ్యాపారంపై ఈఎఫ్టీఏ ఇన్వెస్టర్ల దృష్టి
న్యూఢిల్లీ: భారత్లో వ్యాపారావకాశాలను అందిపుచ్చుకోవడంపై విదేశీ ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది. నాలుగు యూరోపియన్ దేశాల కూటమి ఈఎఫ్టీఏ నుంచి 100 మంది, ఇజ్రాయెల్కి చెందిన 200 మంది ఇన్వెస్టర్లు వచ్చే వారం భారత్ను సందర్శించనున్నారు. ఫిబ్రవరి 10 నుంచి మూడు రోజుల పాటు వారు పర్యటించనున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. టెక్నాలజీ, తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయడంపై ఆసక్తి గల పెద్ద కంపెనీలు వస్తున్నట్లు వివరించారు. 2024లో ఈఎఫ్టీఏ, భారత్ వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈఎఫ్టీఏలో ఐస్ల్యాండ్, నార్వే, లీష్టెన్స్టెయిన్, స్విట్జర్లాండ్ సభ్యదేశాలుగా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్లో చేరడానికి ఇష్టపడని దేశాలు ఏర్పాటు చేసుకున్న ఈ కూటమి.. వచ్చే 15 ఏళ్ల వ్యవధిలో భారత్లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు హామీనిచ్చింది. దానికి ప్రతిగా స్విస్ వాచీలు, చాక్లెట్లు, కట్.. పాలిష్డ్ డైమండ్లు తదితర ఉత్పత్తులపై సుంకాలను తగ్గించేందుకు భారత్ అంగీకరించింది. ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ ఒప్పందం అమల్లోకి రానుంది. 24 బిలియన్ డాలర్ల వాణిజ్యం.. ఈఎఫ్టీఏ–భారత్ మధ్య 2022–23లో ద్వైపాక్షిక వాణిజ్యం 18.65 బిలియన్ డాలర్లుగా ఉండగా 2023–24 నాటికి 24 బిలియన్ డాలర్లకు చేరింది. భారత్కు స్విట్జర్లాండ్ అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా, ఇన్వెస్టరుగా ఉంటోంది. తర్వాత స్థానంలో నార్వే ఉంది. 2000 ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబర్ మధ్య కాలంలో స్విట్జర్లాండ్ నుంచి 10.72 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. వచ్చే 15 ఏళ్లలో 100 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తామని హామీ ఇచి్చన ఈఎఫ్టీఏ బ్లాక్ .. ఇందులో 50 బిలియన్ డాలర్లను ఒప్పందం అమల్లోకి వచి్చన 10 ఏళ్ల వ్యవధిలో పెట్టుబడులు పెట్టనుంది. మిగతా మొత్తాన్ని అయిదేళ్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ పెట్టుబడులతో భారత్లో 10 లక్షల పైచిలుకు ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందనే అంచనాలు నెలకొన్నాయి. -
భారత్, శ్రీలంకల మధ్య విజన్ డాక్యుమెంట్
న్యూఢిల్లీ: భారత్లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఇరువురు నేతల మధ్య విస్తృత స్థాయిలో చర్చలు జరిగాక ఆర్థిక భాగస్వామ్య విస్తరణకు ఒక విజన్ డాక్యుమెంట్ను ఆమోదించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఒక పత్రికా ప్రకటనని విడుదల చేశారు. గత ఏడాది శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయి ఉన్నప్పుడు భారత్ ఒక స్నేహితుడిలా ఆదుకుందని, ఇరు దేశాల మధ్య భద్రత, అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నందున అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. శ్రీలంకతో ఆర్థిక భాగస్వామ్యం పెంపొందించుకోవడానికి విజన్ డాక్యుమెంట్ను ఆమోదించడంతో పాటు పర్యాటకం, వాణిజ్యం, విద్యుత్, ఉన్నత విద్య, నైపుణ్యాల అభివృద్ధి, అనుసంధానం వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. నావికా బలగం, వైమానిక దళం, ఇంధనం, ప్రజల మధ్య అనుసంధానం వంటివి కూడా బలోపేతం చేసే దిశగా ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయి. మరోవైపు శ్రీలంకలో తమిళుల ఆకాంక్షలను తీర్చడానికి సహకరించాలని ప్రధాని మోదీ విక్రమ్ సింఘేను కోరారు. మత్స్యకారుల అంశంలో మానవీయ కోణంలో ఆలోచిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
Garath Wynn Owen: హైదరాబాద్ తిండి తెగ నచ్చేసింది!
ఇంటికొచ్చిన అతిథి ఇష్టాయిష్టాలు తెలుసుకోవడం... నచ్చిన వంట వండి పెట్టడం... భారతీయులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు! మరి.. మన దేశానికో కొత్త అతిథి వస్తే...? వారికేమిష్టమో కూడా తెలుసుకోవాలి కదా... అందుకే.. ‘ఫ్యామిలీ’ గారెత్ ఓవెన్ కు హలో చెప్పింది! ఎవరీయన అనుకునేరు... నిత్యం మీటింగ్లు, చర్చల్లో బిజిబిజీగా గడిపే బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఈయన! చిరంజీవి పెట్టిన ఆవకాయ అన్నం రుచినీ.. మిర్చిబజ్జీలు, హైదరాబాద్ బిర్యానీ వెరైటీలనూ నెమరేసుకున్న ఆయన ఇంకా ఏమన్నారంటే.... సమోసా, బోండాలు నచ్చేశాయి ‘‘హైదరాబాద్ వచ్చి రెండు నెలలే అయ్యింది. కానీ.. ఉదయాన్నే ఫ్యామిలీతో కలిసి నడక సాగిస్తూంటా. నేనో భోజనప్రియుడిని. థాయ్లాండ్లో రెడ్ కర్రీ తదితర స్ట్రీట్ఫుడ్ను కూడా బాగా ఎంజాయ్ చేశా. హైదరాబాద్ ఫుడ్ కూడా బాగా నచ్చేసింది. ముఖ్యంగా చెప్పాల్సింది బోండాల గురించి! పిల్లలు వాటిని డోనట్లని పిలుస్తున్నారు. సమోసాలు, మిర్చిబజ్జీలూ రుచి చూశా. బోర్ కొట్టినప్పుడల్లా మసాలా చాయ్లు లాగించేస్తున్నా. ఇక హైదరాబాదీ బిర్యానీల్లో ఉన్న వెరైటీకి ఇప్పటికే ఫిదా అయిపోయా’’ ఆంధ్ర కారం పరీక్ష పెట్టింది ‘‘ఈమధ్యే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రితో భోంచేస్తున్నా. రకరకాల వంటలు వడ్డించారు. బ్రిటిష్ వాడిని, నా శరీరం అన్నింటినీ బాగానే తట్టుకుంటుందని అనుకున్నా కానీ, అక్కడ వడ్డించిన ఓ వంటకం నిజంగానే నాకు పరీక్ష పెట్టింది. కొంచెం రుచి చూడగానే అర్థమైపోయింది. అది మన తాహతుకు మించి మరీ కారంగా ఉందీ అని. అక్కడితో ఆపేశా. ఏమాటకామాట చెప్పుకోవాలి. మంత్రితో సమావేశం, విందూ రెండూ తృప్తినిచ్చాయి’’ హైదరాబాదీ హడావుడి బాగుంది ‘‘రోజంతా హడావుడిగా ఉండే నగరం తెగనచ్చేసింది. స్ట్రీట్ఫుడ్ కోసం లేదా వాకింగ్కు వెళ్లినప్పుడు ఒకచోట నిలబడి చుట్టూ జరుగుతున్న హడావుడిని గమనిస్తూ ఉండిపోవడం చాలా ఇష్టం. కొన్ని రోజుల క్రితం చార్మినార్కు వెళ్లా. ఓల్డ్సిటీలోనూ తిరిగా... వెస్ట్ మిడ్ల్యాండ్ మేయర్తో కలిసి వెళ్లా అక్కడికి! అబ్బో.. ఎంత కళకళలాడుతుంటుందో అక్కడ. భలే బాగుంటుంది. ఇంకో మూడేళ్లు ఇక్కడే ఉంటాను కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాలన్నీ తిరగాలి.’’ చిరంజీవి ఆవకాయ అన్నం వడ్డించారు ‘‘సినిమాలు, సంగీతం, నాట్యం వంటివి ఇష్టమైనప్పటికీ హైదరాబాద్లో ఇంకా వాటిని పెద్దగా ఆస్వాదించలేదు. కాకపోతే... ఈ మధ్యే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని కలిశా. ఆయన నాకు స్వయంగా వడ్డించారు కూడా. అందులో ఆవకాయ బాగా నచ్చింది. నాలుగు గంటలపాటు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నిజం చెప్పాలంటే అతిపెద్ద టాలీవుడ్ స్టార్తో గడిపానని అస్సలు అనిపించలేదు’’ నా సైకిల్ వచ్చేస్తోంది ‘‘కోవిడ్ నేర్పిన అతిపెద్ద పాఠం శారీరక వ్యాయామాన్ని అస్సలు మరచిపోవద్దూ అని. నాకూ శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడం అంటే ఇష్టం కూడా. హైదరాబాద్లో బోలెడన్ని సైక్లింగ్ గ్రూపులు ఉన్నట్లు తెలిసింది. ఈ నెలాఖరులోగా నా సైకిల్ కూడా లండన్ నుంచి వస్తోంది. ఆ తరువాత నేనూ హైదరాబాద్ రోడ్లపై సైకిల్లో తిరిగేస్తా. హుస్సేన్ సాగర్ చుట్టూ రౌండ్లు కొట్టేస్తా. ఫిట్నెస్ కోసం నేను చేసే ఇంకో పని పంచింగ్ బ్యాగ్తో బాక్సింగ్ చేయడం! నిరాశా, నిస్పృహలను వదిలించుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది ఇది’’ పిల్లలూ కలిసిపోయారు ‘‘నాకు పదకొండేళ్ల అలిసియా, తొమ్మిదేళ్ల థామస్లు ఉన్నారు. ఇక్రిశాట్లో ఉన్న స్కూల్లో చేరారు. ఈ ఏడాది కొంచెం ఆలస్యంగానే స్కూలుకెళ్లారు కానీ.. వెళ్లిన వెంటనే పిల్లలతో కలిసిపోయారు. ఉదయాన్నే ఏడు గంటలకల్లా వాళ్లను స్కూల్కు వదిలేస్తూంటాం. కొంచెం దూరమే కానీ.. అక్కడి వాతావరణం బాగా నచ్చింది.’’ -
భారత్ లో శ్రీలంక ప్రధానమంత్రి
-
భారత్ లో శ్రీలంక ప్రధానమంత్రి
న్యూఢిల్లీ: శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘే మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఇరు దేశాల దైపాక్షిక సంబంధాలపై ఆయన చర్చించనున్నారు. ఆపరేషన్ సర్జికల్ అనంతరం సింఘే భారత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. సార్క్ సమ్మిట్ ఈనెలలో పాకిస్థాన్ లో జరుగనుంది. ఉడీ ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ ల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్ లు భారత్ కు మద్దతుగా సార్క్ కు హాజరుకారాదని నిర్ణయించుకున్నాయి. భారత్ ప్రాతినిథ్యం లేకుండా సార్క్ సమావేశం సాధ్యం కాదని విక్రమ సింఘే పేర్కొన్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్గరీ, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కూడా విక్రమ సింఘే సమావేశమవనున్నారు. ఆయన గురువారం ఇండియన్ ఎకనామిక్ ఫోరం సమావేశాన్ని ప్రారంభించిన అనంతరం కొలంబోకు పయనమవుతారు. -
ప్రాన్స్ అధ్యక్షుడి పర్యటనపై బెదిరింపులు
బెంగళూరు: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండె భారత పర్యటనను వ్యతిరేకిస్తూ బెదిరింపు లేఖ రావడం ఉద్రిక్తతను రాజేసింది. గుర్తు తెలియని దుండగలు ఈ హెచ్చరికలు జారీ చేశారు. బెంగళూరులోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయానికి బెదిరింపు లేఖ వచ్చినట్టు గురువారం అధికార వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. గణతంత్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కావడాన్ని దుండగులు వ్యతిరేకించారు. దీంతో అసలే ఉగ్రదాడులతో బెంబేలెత్తిపోతున్న అధికారుల్లో మరింత ఆందోళన మొదలైంది. తాజా హెచ్చరికలపై నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. హోలండే పూర్తి భద్రత కోసం ఫ్రాన్స్ డైరక్టరేట్ జనరల్తో సంప్రదింపులు జరుపుతున్నారు. అటు పఠాన్ కోట్ ఉగ్రదాడి, ఉగ్రవాదులు జనవరి 26న దేశ రాజధానిలో దాడి చేయనున్నారనే వార్తల నేపథ్యంలో పదివేల మంది పారామిలిటరీ సిబ్బందిసహా మొత్తం 80వేల మంది పోలీసు బలగాలతో ఇప్పటికే పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. జనవరి 26న జరగబోయే గణతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండే హాజరు కానున్నారు. గత ఏడాది నవంబరు నెలలో ప్రధాని మోడీ ఫ్రాన్స్ వెళ్లినప్పుడు రిపబ్లిక్ వేడుకలకు హాజరు కావాలని హోలండేను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే పారిస్ ఉగ్రదాడి, ఎమర్జెన్సీ నేపథ్యంలో జీ20 సదస్సుకు కూడా హోలండే హాజరు కాలేదు. తాజా హెచ్చరికలతో హోలండే రిపబ్లిక్ డే వేడుకలకు హాజరవుతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాగా గత ఏడాది రిపబ్లిక డే వేడకులకు అమెరికా అధ్యక్షుడు ఒమాబా దంపతులు ముఖ్యంగా అతిధులుగా హాజరయ్యారు.


