Wildcard
-
బిగ్బాస్ కంటెస్టెంట్గా యాంకర్ ప్రదీప్
బిగ్బాస్ సీజన్ 2కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వ్యాఖ్యాత నేచురల్ స్టార్ నాని శని, ఆది వారాల్లో చెబుతున్న పిట్టకథలు, హౌస్మేట్స్తో జరుపుతున్న సంభాషణలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నాని ముందుగా చెప్పినట్టుగానే ఏమైనా జరగవచ్చు అన్నది నిజమే అనిపిస్తోంది. బిగ్బాస్ హౌజ్లో ఎలిమినేషన్తో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా కొత్త సెలబ్రిటీల ఎంట్రీ ఉండటంతో బిగ్ బాస్ హౌస్కి రాబోతున్న కంటెస్టెంట్ ఎవరన్నదానిపై సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సీజన్ వన్లో వైల్డ్కార్డు ద్వారా దీక్షా పంత్, నవదీప్లు హౌజ్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా బిగ్ బాస్ హౌజ్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హీరోయిన్ హెబ్బా పాటేల్ వస్తుందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యాంకర్ ప్రదీప్ మాచిరాజు బిగ్బాస్ హౌస్కి లగేజ్తో సహా దిగిన ఓ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ప్రదీప్ను చూసిన కంటెస్టెంట్లంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రదీప్ రాగానే అందరూ హత్తుకుని అతనికి ఆహ్వానం పలికారు. ప్రదీప్ నువ్వు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండవులే.. వారం రోజుల్లో పంపించేస్తాం అని ఆటపట్టించగా.. రాగానే మొదలు పెట్టారా అని ప్రదీప్ సమాధానం ఇచ్చారు. మీ వాడిని మీలో ఒడిని కాబట్టి మీలాగ ఇక్కడికి ఖాళీ చేతులతో రాదలచుకోలేదని చెప్పి, ఒక్కొక్కరి గురించి చెబుతుండగా.. కంటెస్టెంట్లు అందరూ కంటతడి పెట్టుకున్నారు. పోను పోను నేను పోకుండా ఉండటానికే ప్రయత్నం చేస్తానని ప్రదీప్ పేర్కొన్నారు. అయితే 16 మందితో మొదలైన బిగ్ బాస్ షో ను ఇప్పటికే ఐదు మంది (సంజన, నూతన్ నాయుడు, కిరిటీ, శ్యామల, భానుశ్రీ) హౌజ్ నుంచి ఎలిమినేట్ కాగా, ప్రస్తుతం 12 మంది ఉన్నారు. ప్రదీప్ హౌజ్లో ఎన్ని రోజులు ఉంటారో వేచిచూడాల్సిందే. అయితే ఆయన గెస్ట్గా మాత్రమే హౌజ్లోకి వచ్చారని తెలుస్తోంది. . @impradeepmachi makes a Grand Entry to the Bigg House 😉#BiggBossTelugu2 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/mXZVXMnjCl — STAR MAA (@StarMaa) July 19, 2018 -
బిగ్బాస్ ఎంట్రీపై హీరోయిన్ క్లారిటీ
బిగ్బాస్ సీజన్ 2కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నట్టు తెలుస్తోంది. హోస్ట్ నాని శని, ఆది వారాల్లో బెబుతున్న పిట్టకథలు, హౌస్మేట్స్తో జరుపుతున్న సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముందుగా చెప్పినట్టుగానే ఏమైనా జరగవచ్చు అనేలా ఉంది హౌస్లో పరిస్థితి. సీజన్ వన్లో వైల్డ్కార్డు ద్వారా దీక్షా పంత్, నవదీప్లు హౌజ్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గతంలో మాదిరి ఈసారి ప్రముఖ హీరోయిన్, కుమారి 21 ఎఫ్ ఫేమ్ హెబ్బా పటేల్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై హెబ్బా స్పందించారు. దీనిపై ఆమె ఓ జాతీయ దినపత్రికతో మాట్లాడారు. తను ఏ రియాలిటీ షోలో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. తనకు అటువంటి ఆలోచన లేదని.. తనను దీనిపై ఎవరు సంప్రదించలేదని పేర్కొన్నారు. ఇలాంటి వార్తలు విన్నప్పుడు ఆశ్చర్యమేస్తుందన్నారు. ప్రస్తుతం తను చేయాల్సిన సినిమాలతో బిజీగా ఉన్నానని హెబ్బా తెలిపారు. ఇక బిగ్బాస్ హౌస్ విషయానికి వస్తే ఇప్పటివరకు సంజన, నూతన నాయుడు, కిరిటీ దామరాజు, యాంకర్ శ్యామల, భాను ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వారం ఎలిమినేషన్కు సామ్రాట్, తేజస్వీ, రోల్రైడా, దీప్తి, తనీష్లు నామినేట్ అయ్యారు. సోమవారం జరిగిన ఎపిసోడ్లో కామన్మ్యాన్ గణేశ్ కంటతడి పెట్టడం ఆసక్తికరంగా మారింది. -
మేరీకోమ్కు నిరాశ
రియో అవకాశం లేదన్న ఐబా న్యూఢిల్లీ: వైల్డ్కార్డ్ ద్వారా ఒలింపిక్స్కు వెళ్లాలనుకున్న భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్కు నిరాశ ఎదురయింది. నిబంధనల ప్రకారం ఆమెకు వైల్డ్కార్డ్ వచ్చే అవకాశం లేదని అంతర్జాతీయ సమాఖ్య నియమించిన అడ్హక్ కమిటీ చైర్మన్ కిషన్ నర్సి తెలిపారు. ‘గత రెండు ఒలింపిక్స్లో ఏ దేశం నుంచైనా ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువమంది బాక్సర్లు క్రీడల్లో పాల్గొంటే ఆ దేశానికి వైల్డ్కార్డ్ ఇవ్వరు. ఐఓసీ నిబంధనలు అలా ఉన్నాయి. కాబట్టి మేరీకోమ్కు అవకాశం లేదు’ అని ఆయన చెప్పారు.