wintersession
-
చలికాలంలో ఎందుకంత నిద్రమత్తు? నిపుణులు చెప్పే సమాధానం ఇదే..
చల్లగా ఉండే శీతాకాలంలో వెచ్చగా దుప్పటి కప్పుకుని మరింతసేపు పడుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది. అటువంటప్పుడు బద్ధకం ఎక్కువై ఉదయాన్నే నిద్ర లేవడం కష్టమవుతుంది. ఇది దినచర్యను ప్రభావితం చేస్తుంది. అయితే చలికాలంలో మనం ఎందుకు ఎక్కువసేపు నిద్రపోతామో మీకు తెలుసా? ఎందుకు ఇలా బద్ధకం ముంచుకొస్తుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? దీనికి కారణం చల్లని వాతావరణమే కారణం అనుకుంటే.. అదొక్కటే సరైన కారణం కాదు.డి విటమిన్ లోపంశీతాకాలంలో రాత్రి సమయం ఎక్కువసేపు ఉంటుంది. పగటి సమయం తక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో సూర్యకాంతి తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. ఫలితంగా బద్ధకంతో పాటు అధిక నిద్ర మొదలవుతుంది. ఇవేకాకుండా శీతాకాలంలో అధిక నిద్రకు అనేక కారణాలున్నాయి.మెలటోనిన్ హార్మోన్ పెరుగుదలశీతాకాలపు రాత్రులలో తగినంతగా నిద్ర పోయిన తరువాత కూడా బద్ధకం ఆవరిస్తుంది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం శీతాకాలంలో శరీరంలో మెలటోనిన్ హార్మోన్ స్థాయి గణనీయంగా పెరుగుతుంది. ఈ మెలటోనిన్ అధిక సమయం నిద్రకు కారణంగా నిలుస్తుంది. మెలటోనిన్ హార్మోన్ అధికంగా పెరగడం వల్ల మన నిద్రలో ఆటంకాలు ఏర్పడతాయి. ఈ కారణంగా కొంతమందికి రోజంతా బద్ధకంగా అనిపిస్తుంది.మెలటోనిన్ హార్మోన్ శరీరంలో సహజంగా ఉత్పత్తి అవుతుంది. దీనివలన నిద్ర వస్తుంది. బయటి కాంతి తగ్గినప్పుడు ఇది నిద్రపోయే సమయం అనే సంకేతాన్ని మెదడుకు అందిస్తుంది. శీతాకాలంలో తక్కువ కాంతి కారణంగా మెలటోనిన్ ప్రభావం చాలాసేపు కొనసాగుతుంది. అందుకే చలికాలంలో ఉదయంపూట అధిక సమయం నిద్రపోతుంటాం.బాడీ టైమ్ టేబుల్ అస్తవ్యస్తంమనిషికి నిద్ర అలవాటు సిర్కాడియన్ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. సిర్కాడియన్ ప్రక్రియ అంటే మన శరీరానికి సంబంధించిన అంతర్గత సమయ పట్టిక. ప్రతి కణం నియమిత తీరులో దాని పనిని అది చేస్తుంటుంది. కొన్ని అంశాలు మన సిర్కాడియన్ను అంటే మన జీవ గడియారాన్ని ప్రభావితం చేస్తాయి. ఇందులో పర్యావరణం, ఉష్ణోగ్రత, సూర్యకాంతి వంటి మొదలైన అంశాలు ఉన్నాయి. మారుతున్న వాతావరణం కూడా సర్కాడియన్ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా మన జీవ గడియారంలో స్వల్ప మార్పులు ప్రారంభమవుతాయి. శీతాకాలంలో నిద్రపోయే సమయాన్ని ఇది ప్రభావితం చేస్తుంది. ఫలితంగా మనకు ఎక్కువసేపు నిద్రపోవాలని అనిపిస్తుంది.శరీరానికి వెచ్చదనాన్ని అందించడంచలి పెరిగినప్పుడు వెచ్చగా ఉండటానికి మనం ఉన్ని దుస్తులను ధరిస్తాం. చాలా చల్లని లేదా చాలా వేడి ఉష్ణోగ్రతలు శరీరంపు సహజ నిద్ర ప్రక్రియకు అంతరాయం కలిగిస్తాయి. వెచ్చదనాన్ని అందించే దుస్తులు నిద్ర ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయి. ఫలితంగా మరింతసేపు నిద్రపోవాలని అనిపిస్తుంది.అతిగా ఆహారం తీసుకోవడంచలికాలంలో చాలామంది అతిగా ఆహారాన్ని తీసుకుంటారు. ఇది జీర్ణ వ్యవస్థ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ఫలితంగా బద్దకంగా అనిపించి, మరింత సేపు నిద్రపోతుంటాం. శీతాకాలంలో వెచ్చదనం కోసం చాలామంది నాన్ వెజ్ తింటుంటారు. ఈ నాన్వెజ్ను జీర్ణం చేసుకునేందుకు జీర్ణవ్యవస్థ ఇబ్బంది పడుతుంది. చలికాలంలో అధికంగా తినడం పలు అనారోగ్యం సమస్యలకు దారితీస్తుంది.అధిక నిద్రను ఎలా నివారించాలి?చలికాలంలో వ్యాయామం చేయకపోవడం, వేపుడు పదార్థాలు తినడం, అస్తవ్యస్తమైన జీవనశైలి, బలహీనమైన రోగనిరోధక శక్తి, జలుబు, ఫ్లూ వంటివి కూడా అధిక నిద్రకు కారణమవుతాయని వైద్యులు చెబుతున్నారు. అధిక నిద్రను నివారించడానికి పగటిపూట వీలైనంత ఎక్కువ సమయం సూర్యరశ్మిలో ఉండే ప్రయత్నం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. పగటిపూట నిద్రపోకుండా ఉండటానికి నిత్యం బిజీగా ఉండేందుకు ప్రయత్నించాలని వైద్యులు చెబుతున్నారు.చలికాలంలో రాత్రి భోజనంలో అధికంగా తినడం మానుకోవాలని, ఆకు కూరలు, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవద్దని చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు నీరు తాగితే, ఉదయం నిద్ర లేవడం సులభం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. రోజూ ఒకే సమయంలో నిద్రపోవడం- మేల్కొనడం వల్ల శరీర గడియారం క్రమపద్ధతికి అలవాటు పడుతుంది. నిద్రలేచిన వెంటనే స్నానం చేయండి. ఇది మీ శరీర ఉష్ణోగ్రతను నియంత్రిచడంతో పాటు చురుకుదనాన్ని అందిస్తుంది. ఇది కూడా చదవండి: Year Ender 2024: అత్యంత ప్రజాదరణపొందిన వెడ్డింగ్ డెస్టినేషన్స్ -
సీతాఫల్.. వెరైటీస్ ఫుల్
ఈ సీజన్లో సీతాఫలం రుచి చూడని వాళ్లు అరుదేనేమో... పండ్లలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమృతం లాంటి రుచిని కోల్పోకుండా అందించే ఏకైక ఫలంగా సీతాఫలాన్ని చెప్పుకోవచ్చు. దాదాపు అందరికీ అందుబాటు ధరల్లోనే ఉండే ఈ ఫలం.. ఇప్పుడు నగర మార్కెట్లో సందడి చేస్తోంది. మరోవైపు ఈ సీజన్లో సీతాఫలాన్ని ఆధారం చేసుకుని రుచులను వడ్డించే రెస్టారెంట్స్, ఐస్క్రీమ్ పార్లర్స్ సైతం నగర వాసులకు వెరైటీలను అందించేందుకు సిద్ధమైపోతున్నాయి. కాదే ఫలమూ తినడానికి అనర్హం అన్నట్టే.. కాదే ఫలమూ మేళవింపునకు అనర్హం అంటున్నారు నగరంలోని చెఫ్స్. సీతాకాలంలో విరివిగా లభ్యమయ్యేది సీతాఫలం. ఇది తీపి, క్రీము గుజ్జుతో కూడిన ఉష్ణమండల ఫలం ఇది. ఈ పండులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నందున గణనీయమైన పోషక విలువలను కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. జీర్ణక్రియను సైతం మెరుగుపరుస్తుంది. అయితే మ్యాంగో సీజన్లో మామిడి పండ్లను వంటకాలలో విరివిగా జత చేసే నగర నలభీములు.. సీతాఫలంతోనూ పలు రకాల వంటకాలు తయారు చేస్తూ నోరూరించడం ఆహార ప్రియులకు సుపరిచితమే.ఆరోగ్యానికి మేలు.. ఉపవాసం సమయంలో ప్రత్యేక ట్రీట్గా కూడా దీనిని వడ్డిస్తారు. రబ్దీ పాలలోని కాల్షియం ప్రొటీన్ కంటెంట్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది, దీనికి బాదం, పిస్తాలను గారి్న‹Ùగా ఉపయోగిస్తారు. కాబట్టి అవసరమైన కొవ్వు, ఆమ్లాలు, విటమిన్–ఈ లను ఇవి అందిస్తాయి. ఒక లీటరు పాలు, పావు కిలో బెల్లం, అర టీస్పూన్ యాలకుల పొడి, సీతాఫలం గుజ్జు ఒక కప్పుతో చేసిన ఈ రబ్దీని కూల్గా సర్వ్ చేసుకోవచ్చు. మరెన్నో రుచులు.. ఇవే కాకుండా పలు రెస్టారెంట్స్లో కస్టర్డ్ యాపిల్ ఖీర్, కుల్పీ తదితరాలను కూడా తయారు చేస్తున్నారు. కస్టర్డ్ యాపిల్తో ఫుడింగ్ కూడా చేస్తున్నారు. ఫిర్ని అనే నార్త్ ఇండియన్ డిజర్ట్ కూడా దీన్ని జోడిస్తున్నారు. కస్టర్డ్ యాపిల్ పల్ప్ను వేడి వేడి జిలేబీ తదితర స్వీట్స్పై దీన్ని జతచేసి సర్వ్ చేయడం కూడా కొన్ని రెస్టారెంట్స్లో పరిపాటిగా మారింది.స్వీట్ విత్ ఫ్రూట్.. రబ్దీ అనేది భారతీయ వంటకాల్లో ఒక క్లాసిక్ డెజర్ట్, ఇది చాలా కాలం నుంచి వండి వడ్డిస్తున్నారు. సంప్రదాయ పండుగలు లేదా ప్రత్యేక సందర్భాల్లో, విందు వినోదాల చిహ్నంగా దీనిని వడ్డిస్తారు. రబ్దీకి సీతాఫలాన్ని జోడించడం వల్ల ప్రత్యేకమైన రుచిని మాత్రమే కాకుండా మరిన్ని బలవర్ధకాలు సంతరించుకుని ఉత్తమ పోషకాహారంగా మారుతోంది. పండుకు సహజంగా ఉండే తీపి దీనికి చక్కెర అతిగా జత చేయాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది, వంటకాన్ని ఆరోగ్యకరమైనదిగా చేస్తుంది. ఈ సీజన్లో వచ్చే కర్వా చౌత్, దీపావళి తదితర పండుగల సమయాల్లో కుటుంబ సమేతంగా ఆస్వాదించేందుకు ఈ డెజర్ట్ బాగా వినియోగిస్తారు. ఐస్క్రీమ్స్ షురూ.. నగరంలో పలు ఐస్క్రీమ్ పార్లర్స్ ఈ సీజన్లో సీతాఫల్ ఐస్క్రీమ్స్ విక్రయాలకు పేరొందాయి. సీజనల్ పండ్లతో చేసిన ఐస్క్రీమ్స్ను అందించడంలో పేరొందిన నేచురల్స్లో ఇప్పటికే సీతాఫల్ ఐస్క్రీమ్స్ అందుబాటులోకి వచ్చాయి. అదే విధంగా క్రీమ్స్టోన్ తదితర పేరున్న పార్లర్స్లోనూ ఇవి అందిస్తున్నారు.. ఇక పాతబస్తీలో అచ్చమైన ఆర్గానిక్ ఐస్క్రీమ్స్కు దశాబ్దాల నాటి నుంచి కేరాఫ్గా ఉన్న ఫేమస్ ఐస్క్రీమ్స్ కూడా సీతాఫల్ హిమ క్రీముల్ని అందిస్తోంది. నగరంలోని అబిడ్స్లో ఉన్న నార్సింగ్ భేల్పురి జ్యూస్ సెంటర్ సైతం ఈ వంటకాలకు పేరొందింది. సీతాఫల్ మలాయ్ పేరుతో ఈ ఫుడ్ అవుట్లెట్ అందించే సీజనల్ రుచి ఫుడ్ లవర్స్కి చిరపరిచితమే. ఇలా అనేక రకాలుగా సిటీలోని సీతాఫల ప్రియుల్ని రారమ్మని ఆహా్వనించేందుకు ఓ వైపు రుచిని మరోవైపు ఆరోగ్య ఫలాన్ని అందించేందుకు రెస్టారెంట్స్, ఐస్క్రీమ్ పార్లర్స్, కేఫ్స్ పోటీపడుతున్నాయ్. -
సభా పర్వం : రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
-
విద్యుత్ కోతలతో అల్లాడుతున్న బ్రిటన్...7 రోజులు కరెంట్ లేకుండా....
యూకేలో శీతకాలం వస్తే చాలు ఏడు రోజుల వరకు విపరీతమైన కరెంట్ కోతలు ఉంటాయి. ఈ విషయమే యూకే ప్రభుత్వం, కౌన్సిల్లు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నడంలో సహాయపడే ప్రత్యామ్నాయాలు గురించి అన్వేషిస్తోంది. వాస్తవానికి బ్రిటన్లో చలికాలంలో ఒక్కోసారి దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోయి పరిస్థితి మరింత ఘోరంగా ఉంటే మాత్రం ఈ కరెంటు కోతలు తప్పనిసరి. దీన్ని 2021లో జాతీయ గ్రిడ్లో పెద్ద సాంకేతిక లోపం ఏర్పడినప్పటి నుంచి ప్రోగ్రామ్ 'యారో' పేరుతో ఇలా శీతకాలంలో ఈ విద్యుత్ కోతలను విధించడం అమలు చేశారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా అన్ని రంగాల్లో కరెంట్ కోతలు విధిస్తారు. దీని వల్ల 60% విద్యుత్ డిమాండ్ సుమారు 7 రోజుల వరకు ఉంటుంది. ఇళ్లు, వ్యాపారాలకు అడపదడప కరెంట్ యాక్సిస్ ఉంటుంది. ఈ సమయంలో అనలాగ్ ఎఫ్ఎంలు పనిచేస్తాయి. ఈ ప్లాన్ అత్యంత దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రంగా ఉన్నప్పుడూ మాత్రమే అమలు చేస్తామని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఐతే వారం రోజుల్లో తిరిగి విద్యుత్ను యథావిధిగా పునరుద్ధరిస్తామని తెలిపింది. అందుకే ఆ పరిస్థితికి అనుగుణంగానే పరిశ్రమలు, వ్యాపార సంస్థలు ముందస్తు ప్రణాళికలతో సిద్ధమవుతాయని చెబుతోంది బ్రిటన్. (చదవండి: పుతిన్ ఆరోగ్యంపై మళ్లీ.. ఇంజెక్షన్లతో నల్లగా మారిన చేతులు) -
ఢిల్లీని వణికిస్తున్న చలి
న్యూఢిల్లీ: ఉత్తరభారతం చలి దుప్పటి కప్పుకుంది. ఢిల్లీపై తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. దీంతో నూతన సంవత్సరం తొలిరోజున రాజధానిలో 1.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గత పదిహేనేళ్లలో ఇదే కనిష్ఠం కావడం విశేషం. అంతకుముందు 2006లో 0.2 డిగ్రీలు, 1935లో మైనస్ 0.6 డిగ్రీల ఉష్ణోగ్రత(ఆల్టైమ్ కనిష్ఠం) ఢిల్లీలో నమోదయింది. గతేడాది జనవరిలో 2.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగత్ర ఢిల్లీలో నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది. చలిపులి కారణంగా ఉదయం 6గంటల సమయంలో దట్టమైన పొగమంచు నగరాన్ని కమ్ముకుంది. దీంతో కనీసం మీటర్ దూరంలో వస్తువులు కూడా కనిపించకపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. గత గురువారం ఢిల్లీలో 3.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. జనవరి 2 నుంచి 6 వరకు మధ్యధరా ప్రాంతం నుంచి వీచే గాలుల(వెస్టర్న్ డిస్ట్రబెన్సెస్) కారణంగా ఉత్తర భారతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కాస్త పెరగవచ్చని ఐఎండీ అధిపతి కులదీప్ శ్రీవాస్తవ చెప్పారు. -
‘వేసవిలో సమావేశాలు బాగా జరిపిస్తాం’
న్యూఢిల్లీ: ఎలాంటి ఫలితాలను ఇవ్వకుండానే మొత్తానికి శీతాకాల సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. దాదాపు నెల రోజులపాటు జరిగిన సమావేశాల్లో లోక్ సభ కేవలం 17.04శాతం మాత్రమే పనిచేయగా.. రాజ్యసభ 20.61శాతం నడిచిందని కేంద్ర మంత్రి అనంత కుమార్ చెప్పారు. లోక్ సభలో నాలుగు, రాజ్యసభలో ఒక బిల్లుకు ఆమోదం అయినట్లు ఆయన చెప్పారు. విపక్షాల కారణంగానే సభలు నడవలేదని ఆయన అన్నారు. వేసవికాలంలో జరిగే పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేలా చూసుకుంటామని హామీ ఇచ్చారు.