world hypertension day
-
ఉప్పు తగ్గించండిరా బాబోయ్! ఏటా 25 లక్షలమందికి ముప్పు
ప్రపంచవ్యాప్తంగా మే 17న వరల్డ్ హైపర్ టెన్షన్ డే జరుపుకుంటారు. హైబీపీ అనేది సెలంట్ కిల్లర్ లాంటిది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రధానంగా ఉప్పువల్లే ముప్పు ఏర్పడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది. ఎక్కువ ఉప్పు వాడకం కారణంగానే ఏటా ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది.ప్రపంచవ్యాప్తంగా ఉప్పు వాడకం అధికం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, గుండెపోటు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్వో హెచ్చరించింది. రోజుకు ఒక టీ స్పూన్ కంటే ఎక్కువ ఉప్పు తింటే రక్తపోటు పెరుగుతుందని తెలిపింది. ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే లక్షల మందిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని కూడా పేర్కొంది.పెద్దలు సగటున రోజుకు 4310 మిల్లీ గ్రాములు (సుమారు 10.78 గ్రాముల ఉప్పుకు సమానం) సోడియం తీసుకుంటున్నారని, ఇది సిఫారసు చేసిన పరిమితి 2000 mg (సుమారు 5 గ్రాముల ఉప్పు) కంటే ఇది రెండింతలు ఎక్కువని డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. దీని వల్ల హృదయ సంబంధ వ్యాధులు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఊబకాయం, బోలు ఎముకల వ్యాధి, మెనియర్స్ వ్యాధి ,మూత్రపిండాల వ్యాధితో సహా వివిధ ఆరోగ్య సమస్యలొస్తాయని తెలిపింది. దీని వల్ల ఏటా 1.89 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది.డైనింగ్ టేబుల్ నుంచి ఉప్పు తీసేయండిప్రాసెస్ చేసిన ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలనీ, తాజా ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని సూచించింది.నకు బదులుగా సుగంధ ద్రవ్యాలు, వన మూలికలను వాడమని సూచించింది. ఉప్పు వాడకాన్ని తగ్గించేందుకు ఖర్చు పెట్టే ప్రతి డాలర్కు ప్రతిగా 12 డాలర్ల విలువైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని డబ్ల్యూహెచ్వో స్పష్టం చేసింది. అంతేకాదు డైనింగ్ టేబుల్ నుండి తొలగించాలంటూ సలహా ఇచ్చింది. కమర్షియల్ సాస్లు, ఫుడ్స్ తగ్గించాలని కూడా కోరింది. ఉప్పు వాడకాన్ని తగ్గించేందుకు ఖర్చు పెట్టే ప్రతి డాలర్కు , బదులుగా 12 డాలర్ల విలువైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వివరించింది. -
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
పతీ ఏడాది మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని జరుపుకుంటారు. రక్తపోటు స్థాయి సాధారణ స్థాయి కంటే పెరగడాన్నే హైపర్టెన్షన్ అంటారు. ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. అధిక రక్తపోటు లేదా హై బీపీను సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది వచ్చిన సంగతి కూడా వ్యక్తులు కనిపెట్టలేకపోవచ్చు. ఈ నేపథ్యంలో హైబీపీ లక్షణాలు, నివారణ మార్గాలను ఒకసారి పరిశీలిద్దాం.వరల్డ్ హైపర్టెన్షన్ డేను 85 జాతీయ రక్తపోటు సంఘాలు లీగ్లతో కూడిన వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్ దీన్ని ప్రారంభించింది. హైపర్టెన్షన్పై అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.హైపర్ టెన్షన్ లక్షణాలుసాధారణంగా హైబీపీ కొన్ని లక్షణాలను చూపిస్తుంది. అయితే రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులకు ఎటువంటి లక్షణాలు కనిపించవు. కానీ హైపర్టెన్షన్తో బాధపడుతున్న వారు స్ట్రోక్, గుండె జబ్బులు , మూత్రపిండాల రుగ్మతలు వంటి ఇతర ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని కూడా ఎదుర్కొంటారు. అధిక ఒత్తిడి రక్తపోటుకు దారితీయవచ్చు.తీవ్రమైన తలనొప్పి, ఛాతి నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడంతల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందివికారం, వాంతులు అస్పష్టమైన దృష్టి లేదా ఇతర దృష్టి మార్పులుఆందోళన, గందరగోళంచెవుల్లో శబ్దాలు, ముక్కు రక్తస్రావం హైపర్ టెన్షన్ చికిత్స ఆహారంలో ఉప్పును బాగా తగ్గించడం శారీరకంగా చురుగా ఉండటంధూమపానం, మద్యపానాన్ని మానేయడంబరువు ఎక్కువగా ఉంటే తగ్గడంజాగ్రత్తలుకూరగాయలు పండ్లు ఎక్కువ తీసుకోవడంగంటల తరబడి కూర్చోకుండా ఉండటంనడక, పరుగు, ఈత, డ్యాన్స్ లేదా బరువులు ఎత్తడం లాంటి వ్యాయామాలువారానికి కనీసం 150 నిమిషాల ఏరోబిక్ యాక్టివిటీ, లేదా వారానికి 75 నిమిషాల నడక ఉండాలి. ప్రతి వారం 2 లేదా అంతకంటే ఎక్కువ రోజులు వ్యాయామాలు చేయండి. తద్వారా ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు ఆరోగ్య నిపుణులు సూచించిన మందులను తీసుకోవాలి. నోట్ : ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. రక్తపోటును ముందుగానే గుర్తిస్తే నియంత్రణ సాధ్యమవుతుంది. -
2 నెలల్లో అందరికీ బీపీ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే రెండు నెలల్లో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్ పరీక్షలు చేస్తామని, ఇందుకు రూ.33కోట్ల నిధులు కేటాయించామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. వరల్డ్ హైపర్ టెన్షన్ డేను పురస్కరించుకొని కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ)సహకారంతో, గ్లీనీగిల్స్ గ్లోబల్ ఆసుపత్రులు 9000 మందిపై చేసిన సర్వే ఫలితాలను హైదరాబాద్లోని తాజ్ డెక్కన్లో ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ... సీఎస్ఐ సర్వే ఫలితాలు కొంత ఆశ్చర్యం, బాధను కల్గిస్తున్నాయన్నారు. కోవిడ్ బారిన పడినవాళ్లలో హైపర్ టెన్షన్ పెరిగినట్టు కనిపిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సమస్యని గుర్తించి 90లక్షల మందికి స్క్రీనింగ్ చేస్తే 13లక్షల మందికి హైపర్ టెన్షన్ ఉన్నట్టు తేలిందని చెప్పారు. నిమ్స్ చేసిన ఓ సర్వే ప్రకారం... కిడ్నీ సమస్యలున్న వారిలో 60 శాతం మందికి హైపర్ టెన్షన్ ఉన్నట్టు వెల్లడైందన్నారు. ఇటీవలి కాలంలో ప్రజలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారనీ, జీవనశైలి మార్పులు కూడా ఈ సమస్యను మరింత పెంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీపీ, షుగర్ను ముందుగా గుర్తించి జాగ్రత్త పడకపోతే ప్రాణాంతకంగా మారతాయని హెచ్చరించారు. బస్తీదవాఖానాలో పరీక్షల సంఖ్య పెంచుతాం.. రాష్ట్రంలో విస్తృతంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్న మంత్రి.. అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్లో తెలంగాణ దేశంలోనే 3 స్థానంలో ఉందని, మరో నాలుగు నెలల్లో మొదటి స్థానంలోకి తీసుకొస్తామని తెలిపారు. నగరంలోని 350 బస్తీ దవాఖానాల ద్వారా ప్రస్తుతం 57 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని, వచ్చే నెల నుంచి ఆ సంఖ్యను 120కి పెంచుతామని తెలిపారు. పరీక్షలతో పాటు ఉచితంగా మందులు ఇస్తున్నామని, అవి వాడుతున్నారో, లేదో తెలుసుకునేందుకు కాల్ సెంటర్నూ అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. పరీక్షల ఫలితాల రిపోర్టులను 24 గంటల్లో మొబైల్ ద్వారా పేషెంట్కు, డాక్టర్లకు పంపిస్తున్నామని వివరించారు. ఆయుష్ ఆధ్వర్యంలో 450 వెల్నెస్ సెంటర్ల ద్వారా ఆరోగ్యం పట్ల శిక్షణ తరగతులు నిర్వహించనున్నామని తెలిపారు. -
గ్రేటర్కు హైపర్ టెన్షన్
గ్రేటర్కు హైపర్‘టెన్షన్’భయం పట్టుకుంది. సెలైంట్గా సిటీ జనుల గుండెలను పట్టి పిండేస్తుంది. మూత్రపిండాల పని తీరును దెబ్బ తీస్తోంది. పక్షవాతంతో పాటు జ్ఞాపకశక్తి సన్నగిల్లుతోంది. మధుమేహం, క్యాన్సర్కు కారణం అవుతోంది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లే ఇందుకు కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేడు వరల్డ్ హైపర్ టెన్షన్ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, సిటీబ్యూరో: ఉరుకులు పరుగుల జీవితం...అతిగా మద్యం సేవించడం..అధిక బరువు...పని ఒత్తిడి...కాలుష్యం...వెరసి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా గ్రేటర్లో 36 శాతం మంది(పెద్దలు)హైపర్ టెన్షన్(హైబీపీ)తో బాధపడుతున్నట్లు జాతీయ కుటుంబ సంక్షేమ, వైద్య ఆరోగ్యశాఖ 2015-16లో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అయితే వీరిలో 90 శాతం మందికి తమకు బీపీ ఉన్నట్లు తెలీకపోగా, తెలిసిన వారిలో పది శాతానికి మించి వైద్యులను సంప్రదించడం లేదు. సాధారణంగా నాలుగు పదుల వయసు పైబడిన వారిలో కన్పించే హైపర్ టెన్షన్ లక్షణాలు ప్రస్తుతం పాతికేళ్లకే బయపడుతున్నాయి. బాధితుల్లో ఎక్కువ శాతం మార్కెటింగ్, ఐటీ అనుబంధ ఉద్యోగు లు కావడం గమనార్హం. సకాలంలో గుర్తించక పోవడం, చికిత్సను నిర్లక్ష్యం చేయడం వల్ల కార్డియో వాస్క్యూలర్(హార్ట్ఎటాక్), మూత్రపిండాల పని తీరు దెబ్బతినడంతో పాటు చిన్న వయసులోనే పక్షవాతంతో కాళ్లు, చేతులు పడిపోవడం, జ్ఞాపకశక్తి సన్నగిల్లి మతిమరుపు రావడం వంటి సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. మారిన జీవన శైలే కారణం.. ఇటీవల అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం మనిషిని కాలు కూడా కదపనీయడం లేదు. కూర్చొన్న చోటు నుంచి కనీ సం లేవకుండానే అన్ని పనులు పూర్తి చేసుకుంటున్నాడు. సెల్ఫోన్ సంభాషణలు, ఇంటర్నెట్ చాటింగ్లు మనిషి జీవనశైలిని పూర్తిగా మార్చేశాయి. ఇంటి ఆహారానికి బదులు హోటళ్లలో రెడీమేడ్గా దొరికే బిర్యానీలు, ఫిజ్జాలు, బర్గర్లు, మద్యం కూడా అధిక బరువుకు కారణమవుతున్నాయి. గ్రేటర్లో రోజు రోజుకు పెరుగుతున్న స్థూలకాయానికి ఇదే కారణమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మధ్య వయస్కులతో పోలిస్తే...యువకుల్లోనే ఈ సమస్య ఎక్కువ ఉంది. ఇదిలా ఉండగా హైపర్టెన్షన్ బాధితుల్లో 40 శాతం మంది గుండెనొప్పితో మృతి చెందుతుండగా, 25 శాతం మంది కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్నారు. మరో 10 శాతం మంది పక్షవాతంతో జీవశ్చవంలా మారుతున్నారు. హైపర్టెన్షన్కు 140/90 రెడ్ సిగ్నల్ మధుమేహం, గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్, పక్షవాతానికి హైపర్టెన్షనే కారణం. ఈ చికిత్సల పేరుతో దేశంలో ఏటా 20 య ుూఎస్ మిలియన్ డాలర్లు ఖర్చు అవుతోంది. బ్లడ్ ప్రజర్ 140/90 ఉంటే హైపర్ టెన్షన్కు రెడ్ సిగ్నల్గా భావించాలి. బీపీ వల్ల తరచూ తలనొప్పి వస్తుంది, కళ్లు బైర్లు కమ్మినట్లు ఉంటాయి. ఛాతి గట్టిగా పట్టేసినట్లు ఉంటుంది. శరీరం ఎంతో అలసిపోయినట్లు అన్పిస్తుంది. చిన్నపనికే చికాకు, పట్టలేని కోపం వస్తుంది. ప్రతి ఒక్కరూ విధిగా బీపీ చెకప్ చేయించుకోవాలి. పని ఒత్తిడి, ఇతర చికాకులకు దూరంగా ఉండాలి. ఆహారంలో ఉప్పు, పచ్చళ్ల వాడకాన్ని తగ్గించాలి. పప్పు, కాయకూరలు ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు 40 నిమిషాలు వ్యాయామం చేయాలి. - డాక్టర్ సి.వెంకట్ ఎస్ రామ్, బీపీ వైద్య నిపుణుడు, డబ్ల్యూహెచ్ఓ, సౌత్ ఏసియా రీజినల్ డైరెక్టర్ -
నేడు వరల్డ్ ’హైపర్టెన్షన్’ డే