world tourism
-
ఎంత ఖర్చయినా ఓకే.. ప్రపంచాన్ని చుట్టేద్దాం!
సాక్షి, అమరావతి: ప్రపంచ పర్యాటక రంగ పునర్నిర్మాణంలో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. విదేశీ గమ్యస్థానాలను అన్వేషించడంలో ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువ ఉత్సాహం కనబరుస్తున్నారు. ఎంత ఖర్చయినా.. ప్రపంచాన్ని చుట్టేసేందుకు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. దీంతో భారత పర్యాటకులను ఆకర్షించడానికి ప్రపంచ దేశాలు ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. వీసా లేకుండానే తమ దేశాల్లో పర్యటించే సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి. ఖర్చుకు వెనుకాడట్లేదు..కరోనా అనంతర పరిస్థితుల్లో భారతీయుల ఆలోచనల్లో మార్పు వచ్చిందని అంతర్జాతీయ టూరిస్ట్ ట్రావెల్స్ సంస్థలు చెబుతున్నాయి. విదేశాల్లో పర్యటించేందుకు.. కొత్త అనుభూతి పొందేందుకు భారతీయులు ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడట్లేదని పేర్కొంటున్నాయి. భారత పర్యాటకుడు ఒక్కో అంతర్జాతీయ పర్యటనకు సగటున రూ.2 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపాయి. ఈ ఖర్చు క్రమంగా పెరుగుతోందని వెల్లడించాయి.కాగా, 2023లో 2.82 లక్షల మంది విదేశాలకు ప్రయాణించడం ద్వారా రూ.2.60 లక్షల కోట్లు ఖర్చు చేశారని వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ తెలిపింది. దేశంలో అవుట్బౌండ్ ట్రావెల్ మార్కెట్లో గణనీయమైన పెరుగుదల నమోదవుతోందని.. 2034 నాటికి రూ.4.78 లక్షల కోట్లకు పైగా పెరుగుతుందని అంచనా వేస్తోంది. అలాగే భవిష్యత్లో అవుట్ బౌండ్ పర్యాటకులు 8 కోట్లకు చేరుకుంటారని.. ముఖ్యంగా ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం దేశాలకు ప్రాధాన్యం పెరుగుతుందని భావిస్తోంది. ఇది భారత పర్యాటకుల విలాసవంతమైన జీవనశైలి అభివృద్ధిని సూచిస్తోందని, పెరుగుతున్న ఆదాయ మార్గాలు కూడా సరిహద్దుల దాటి ప్రయాణాలు చేసేలా ప్రోత్సహిస్తున్నాయని అభిప్రాయపడింది.మెరుగైన ఆతిథ్యం..భారత పర్యాటకులను ఆకర్షించేందుకు వివిధ దేశాలు ప్రత్యేక ప్రణాళికలు వేస్తున్నాయి. థాయిలాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా వంటి దేశాలు ఎంట్రీ ప్రోటోకాల్లను సరళీకృతం చేశాయి. యూఏఈ, టర్కీ తదితర దేశాలు భారతదేశంలో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు చేసుకుంటున్నాయి. అలాగే పలు దేశాలు అంతరాయం లేని కనెక్టివిటీ, అవాంతరాలు లేని వీసా ప్రక్రియలను అందజేస్తున్నాయి. యూరప్, ఉత్తర అమెరికాకు వీసాల కోసం ఎక్కువ నిరీక్షించాల్సి రావడంతో.. భారత పర్యాటకులు ఎక్కువగా మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాలకు తరలి వెళ్తున్నారు.అలాగే భారత పర్యాటకుల కోసం హాస్పిటాలిటీ దిగ్గజ సంస్థలు కూడా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలోనే అకార్, హిల్టన్, ఐహెచ్జీ వంటి హాస్పిటాలిటీ సంస్థలు తమ చైన్లను ప్రధాన నగరాల నుంచి టైర్ 2, 3 పట్టణాల్లోనూ ఏర్పాటు చేస్తున్నాయి. విమానయాన సంస్థలు కూడా దేశీయ, అంతర్జాతీయ సామర్థ్యాలను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. -
ప్రపంచ పర్యాటకం కళకళ
2024 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా జనం పర్యాటనల్లో మునిగిపోయారని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ పర్యాటక సంస్థ(యూఎన్డబ్ల్యూటీఓ) ప్రకటించింది. గత ఏడాది ఏకంగా 140 కోట్ల మంది జనం పర్యటనల్లో బిజీగా మారారని యూఎన్డబ్ల్యూటీఓ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. 2019 డిసెంబర్లో మొదలైన కోవిడ్ సంక్షోభం దెబ్బకు కుదేలైన ప్రపంచ పర్యాటకం మళ్లీ నాలుగేళ్ల తర్వాత 99 శాతం పుంజుకోవడం విశేషం. 2014 ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఏకంగా రూ.172 లక్షల కోట్లు ఖర్చుచేశారని తేలింది. ప్రపంచవ్యాప్తంగా సగటున ఒక్కో పర్యాటకుడు గత ఏడాది మొత్తంలో పర్యాటకం కోసం దాదాపు రూ.86,000 ఖర్చుచేశాసినట్లు స్పష్టమైంది. ఎక్కువ ఎక్కడికి వెళ్లారు? గణాంకాల ప్రకారంచూస్తే అత్యధికంగా 74.7 కోట్ల మంది జనం యూరప్ దేశాల్లో పర్యటించారు. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ జెండా ఎగరేసి యుద్ధంలో మునిగిపోవడంతో పర్యాటకులు ఉక్రెయిన్, రష్యా వాటి సమీప దేశాల రీజియన్లో సందర్శనలపై ఆసక్తి కనబరచలేదు. దేశాలవారీగా చూస్తే ఫ్రాన్స్కు అత్యధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. ఫ్రాన్స్ పర్యాటక బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం గత ఏడాది ఆ దేశానికి 10 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు. ఆ తర్వాత స్పెయిన్లో 9.8 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు. ‘‘అత్యధిక సందర్శకులతో ఫ్రాన్స్ చరిత్ర సృష్టించింది. 2024 సమ్మర్ ఒలింపిక్స్, పారిస్లో ప్రఖ్యాత నోట్రే డేమ్ క్యాథడ్రల్ చర్చి పునఃప్రారంభం, రెండో ప్రపంచయుద్ధంలో నార్మాండీపై దాడుల ఘటనకు 80 ఏళ్లు పూర్తవడంతో జరిగిన కార్యక్రమాలను చూసేందుకు ఏడాది పొడవునా భారీగా జనం తరలివచ్చారు’’అని ఫ్రాన్స్ అభిప్రాయపడింది. ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో 31.6 కోట్ల మంది పర్యటించారు. స్పెయిన్లో విభిన్న పరిస్థితి ‘‘మా ప్రాంతానికి రండిబాబు. పర్యటించి ఇక్కడి వ్యాపారాన్ని పెంచండి’’అనే రాష్ట్రాలు, దేశాలనే మనం చూశాం. అందుకు భిన్నంగా స్పెయిన్ వ్యవహరించినా మళ్లీ అదే దేశానికి జనం వరసకట్టడం గమనార్హం. సెవిల్లే సిటీలోని ప్లాజా డీ ఎస్పానా వంటి ప్రాంతాలు పర్యాటకులతో కిక్కిరిసి పోవడంతో అక్కడి స్థానిక యంత్రాంగం అక్కడ ఎవరు పర్యటించినా చార్జీలు వసూలుచేస్తామని హెచ్చరించింది. 1929 నిర్మించిన అక్కడి ప్రాంతంలో జనం, వ్యాపారాలు పెరిగిపోయి వీధివ్యాపారుల ఆక్రమణలు అధికమై, పాత కట్టడాలు దెబ్బతింటున్నాయని నగర మేయర్ జోస్ లూయిజ్ శాంజ్ చెప్పారు. ఇటలీలో వెనీస్, ఫ్లోరెన్స్ నగరాల్లో బృంద పర్యాటకాలపై నిషేధం, రాత్రిళ్లు బీచ్లలో ఈతకొట్టడంపై నిషేధాజ్ఞలున్నాసరే ఆ దేశంలో పర్యాటకం గతంతో పోలిస్తే 23 శాతం పెరిగింది.ఆశ్చర్యపరిచిన చిన్న దేశాలు భారత్తో పోలిస్తే అధిక మండే ఎండలుంటే ఖతార్లో అత్యధిక మంది సందర్శకులు వచ్చారు. అక్కడ గతంతో పోలిస్తే పర్యాటకుల సంఖ్య 137 శాతం పెరగడం విశేషం. గత ఏడాది అత్యుత్తమ ఎయిర్లైన్స్గా ఖతార్ ఎయిర్లైన్స్ నిలిచింది. దోహాలోని హమాద్ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్ట్ కిరీటాన్ని సాధించింది. ఫ్రాన్స్, స్పెయిన్ సరిహద్దుల్లోని అత్యంత చిన్న దేశం ఆండోర్రాలోనూ పర్యాటకుల రద్దీ పెరిగింది. డొమెనికన్ రిపబ్లిక్, కువైట్, అల్బేనియా, ఎల్ సాల్వడార్ వంటి చిన్న దేశాలకూ పెద్ద సంఖ్యలో సందర్శకులు క్యూ కట్టడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్లో.. & స్టడీ
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ట్రెండ్ మారుతోంది. ఉరుకుల పరుగుల ప్రయాణాలకు బదులు స్థిర అన్వేషణల వైపు గమ్యం సాగుతోంది. స్థానిక సంస్కృతి, ఆచార వ్యవహారాలను సంపూర్ణంగా అర్థం చేసుకునేలా ‘స్లో ట్రావెల్’పేరుతో పర్యాటక ఉద్యమం ఊపందుకుంటోంది. స్లో ట్రావెల్లో పర్యాటక ప్రదేశాల పరిమాణం కంటే.. అందులోని నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గజిబిజి జీవితాలను పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసుకుని ప్రకృతి ఒడిలో మునిగిపోయేలా ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 2025 సంవత్సరం ‘స్లో ట్రావెల్’ఇయర్గా మారుతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.రైళ్లకు జై కొడుతున్నారు2024లో 81శాతం మంది విశ్రాంతి కోసం, రోజువారీ ఒత్తిళ్ల నుంచి బయట పడేందుకు స్లో వెకేషన్లకు వెళ్లినట్టు ‘ట్రావెల్ అండ్ టూర్ వరల్డ్’పేర్కొంది. ఇందులో మూడొంతుల మంది సాంస్కృతిక, చారిత్రక అన్వేషణ, వారసత్వ ప్రదేశాల సందర్శనలకు విలువ ఇస్తున్నట్టు గుర్తించింది. స్లో ట్రావెల్లో భాగంగా అధిక శాతం మంది రైలు ప్రయాణాలకు జైకొడుతున్నట్టు తేలింది. సుదూర గమ్యస్థానాలకు విమాన, కారు ప్రయాణాలకు ఖర్చుతో కూడుకోవడం, ఒక్కోసారి రిమోట్ గమ్యస్థానాలను చేరుకోలేకపోవడంతో రైలు మార్గాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా యువత సైక్లింగ్, బైక్ రైడ్లలో సోలోగా స్లో ట్రావెల్కు వెళ్తున్నారు. ఇటీవల కాలం నదీ అందాలను ఆస్వాదించేందకు క్రూయిజ్ల ప్రయాణాలను ఎంపికలు పెరిగాయి. అహ్మదాబాద్.. అగ్రస్థానంభారతదేశంలో అహ్మదా బాద్ నగరం సుదీర్ఘ సందర్శనలలో పాల్గొనే వారికి అగ్ర ఎంపికగా ఉద్భవించింది. గోవా, అయోధ్య తరువాత ఈ ప్రాంతంలో ఎక్కువగా గడిపేందుకు ప్రసిద్ధి చెందింది. విదేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులు ముఖ్యంగా ఆసియాలో థాయ్లాండ్లోని ఖావో లాక్, జపాన్లోని టోక్యో, దక్షిణ కొరియాలోని సియో ల్, మలేషియాలోని పెర్హెన్షియన్ దీవులు, వియత్నాంలోని హోచిమిన్ సిటీకి ఎక్కువగా ఆకర్షితులవుతున్నట్టు డిజిటల్ ట్రావెల్ ప్లాట్ఫామ్ అగోడా ప్రకటించింది.భారత్లో 10% వృద్ధి అంచనానిత్యం పని జీవితంలో ఒత్తిళ్లు తారస్థాయికి చేరుకోవడంతో సెలవులు తీసుకోవడం గతంతో పోలిస్తే విలువైనది మారింది. ఆఫ్బీచ్ వెకేషన్లు, కొత్త అన్వేషణల గమ్యస్థానాలకు ప్రయాణించడం మానసిక చికిత్సగా భావిస్తున్నారు. 2025లో అత్యధికులు ‘స్లో ట్రావెల్’కు జైకొడుతున్నారు. ఇది 2025లో 10 శాతం వార్షిక వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతుందని ట్రావెల్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. చాలామంది పర్యాటకులు గమ్యస్థానాలను పూర్తిగా అస్వాదించలేకపోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎక్కువ ప్రదేశాలను చుట్టిరావడం కంటే స్థానిక సంస్కృతిలో లీనమవ్వడం, మరింత అర్థవంతంగా ప్రయాణాన్ని మార్చుకోవడమే ప్రధాన ఉద్దేశంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రజలు నిత్యం పిల్లలను పెంచడం, ఆఫీస్ సమావేశాలు, కుటుంబ కార్యక్రమాలంటూ బిజీ షెడ్యూల్లో మునిగిపోతున్నారు. ఇలాంటి తరుణంలో మానసిక విశ్రాంతి, ఆహ్లాదాన్ని పొందేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కొత్త ఆహారాన్ని రుచి చూడటం, కొత్త దృశ్యాలను కళ్లతో బంధిస్తూ విశ్రాంతిని పొందే ప్రదేశాలను కోరుకుంటున్నట్టు ట్రావెల్ సంస్థలు చెబుతున్నాయి. -
ప్రపంచం చూపు.. పాకశాస్త్రం వైపు..
సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేధ (ఏఐ) సహా యావత్ ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు పాకశాస్త్ర ప్రావీణ్యుల కోసం వెతుకుతోంది. వివిధ దేశాల ఆహార అలవాట్లు, వారికి ఆతిథ్యం ఇచ్చే విధానంపై నెటిజన్లు ఇంటర్నెట్ను జల్లెడ పడుతున్నారు. ప్రపంచ పర్యాటకం శరవేగంగా విస్తరిస్తుండటం, విభిన్నమైన ఫుడ్ను రుచి చూసేందుకు వారు ఇష్టపడుతుండటమే దీనికి కారణం. భారత్ సహా ప్రపంచ దేశాల పర్యాటకుల్లో 75 శాతం మంది తమ టూర్లలో ఆహారాన్ని కూడా ముఖ్యమైన అంశంగా భావిస్తున్నారు. ఏ దేశం వెళ్తున్నాం? అక్కడ దొరికే ఫుడ్ ఏమిటి? ఏయే వెరైటీలు దొరుకుతాయి? అనే అంశాలను ఇంటర్నెట్లో వెతుకుతున్నారు.దీనితో పాకశాస్త్రంలో చేయితిరిగిన వంటగాళ్లకు డిమాండ్ పెరిగింది. వరల్డ్ టూరిజంలో ఫుడ్ టెక్నాలజీ నిపుణుల అవసరం వచ్చే నాలుగేళ్లలో కనీసం మూడు రెట్లు పెరుగుతుందని అంచనా. 2023లో భారత్ పర్యాటక మార్కెట్ విలువ 23 బిలియన్ డాలర్లు ఉంది. ఇది 2033 నాటికి 182.5 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఫ్యూచర్ మార్కెట్ సంస్థ అంచనా వేసింది. ప్రపంచ పర్యాటక వెబ్సైట్ అగోడా, మరికొన్ని ట్రావెల్ సంస్థలు చేసిన పలు అధ్యయనాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అధ్యయనంలో భాగంగా.. భారత్, థాయిలాండ్, లావోస్, టర్కీతోపాటు మరికొన్ని దేశాల ప్రయాణికులను ఆహారం విషయమై ప్రశ్నించారు.నిపుణులకు భలే గిరాకీ..ఒక అంచనా ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో ఫుడ్ టెక్నాలజీ నిపుణులు 5 లక్షల వరకూ ఉంటారు. వారిలో చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చినవారు కూడా ఉన్నారు. నైపుణ్యాన్ని, మార్కెట్ను బట్టి వారికి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకూ వేతనాలు అందుతున్నాయి. 2033 నాటికి ఈ వేతనాలు కనీసం మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని అగోడా అధ్యయనం చెబుతోంది. పర్యాటకులు అనేక అంశాలతో కూడిన ఆహారాన్ని అడుగుతున్నారని.. రకరకాల న్యూట్రిషన్లు, ఆయిల్ లేకపోవడం, కొన్నిరకాల పదార్థాలు లేకుండా ఉండటం వంటి కోరుతున్నారని పేర్కొంటోంది.అందుకు అనుగుణంగా ఆహారాన్ని సిద్ధం చేస్తూనే.. రుచిలో, ఇతర అంశాల్లో తేడా రాకుండా చూసుకునే నిపుణులైన వంటగాళ్లకు డిమాండ్ పెరుగుతోందని తెలిపింది. అదే సమయంలో వివిధ దేశాలకు చెందిన వంటలను సిద్ధం చేయగలిగినవారికి ప్రాధాన్యం ఉంటోందని వెల్లడించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల సిలబస్ మారుతోందని తెలిపింది. అంతేకాదు.. మన దేశం నుంచి ఫుడ్ టెక్నాలజీ నిపుణులను వివిధ దేశాలకు పంపి అక్కడి ప్రత్యేకతలపై ఇంటర్న్షిప్ అందించాలనేది భారత టూరిజం, ఫుడ్ టెక్నాలజీల విభాగం ఆలోచన. తెలంగాణలో ఇప్పటికే 50కిపైగా ఫుడ్ టెక్నాలజీ కాలేజీలు ఉన్నాయి. అవన్నీ తగిన విధంగా సిలబస్ మార్పులకు సిద్ధమవుతున్నాయి.తెలంగాణ వారసత్వ వంటలపై ఆసక్తివారసత్వ వంటలకు గిరాకీ పెరిగింది. ఏఐ టెక్నాలజీ విస్తృతమయ్యాక ఈ తరహా అవగాహన పెరుగుతోంది. తెలంగాణ వంటల గురించి చాలా మంది వాకబు చేస్తున్నారు. – రాజీవ్ కాలే, హాలిడేస్ సంస్థ ప్రెసిడెంట్హైదరాబాదీ బిర్యానీకి యమ గిరాకీ..వరల్డ్ టూరిస్టులు ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ అంటే బాగా ఇష్టపడుతున్నారు. మారుతున్న అలవాట్లకు అనుగుణంగా దీని తయారీలోనూ మార్పులు కోరుతున్నారు. చాలా మంది బిర్యానీ కోసమే హైదరాబాద్ను ప్రయాణ జాబితాలో చేరుస్తున్నారు. – నందకుమార్, కార్పొరేట్ టూర్స్ సంస్థ ప్రెసిడెంట్ఏ అధ్యయనం ఏం చెబుతోంది?మారుతున్న ఆహార అలవాట్లు, పర్యాట కుల ప్రాధాన్యతలపై పలు సంస్థలు విభిన్న కోణాల్లో అధ్యయనాలు చేశాయి. ఆయా దేశాల్లో ఆర్థిక బలోపేతానికి ఫుడ్ టూరిజం దోహదపడుతోందని.. సంస్కృతి, సంప్రదాయాల మేళవింపు పెరుగు తోందని గుర్తించాయి. పలు ప్రధాన అధ్యయనాలను పరిశీలిస్తే..ప్రపంచవ్యాప్తంగా 95శాతం మంది ప్రయాణికులు సెలవుల్లో ప్రయాణించేందుకు, ఈ క్రమంలో తమను ఫుడ్ టూరిస్టులుగా చెప్పుకొనేందుకు ఇష్టపడుతున్నారు. మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుందని తెలుసుకునేందుకు కన్సల్టెన్సీలను కూడా సంప్రదిస్తున్నారు. – యూఎస్ ఆధారిత హాలిడే పోర్టల్ జెర్సీ ఐలాండ్ హాలిడేస్ప్రయా ణికుల్లో 53% మంది విదేశీ ప్రయా ణాలు, పర్యటనల్లో సరికొత్త ఆహారాన్ని కోరుకుంటున్నారు. కొత్త ప్రదేశాలను చూసి ఏవిధంగా ఎంజాయ్ చేస్తున్నారో.. తమ దేశంలో లేని కొత్త ఫుడ్ను తీసుకుని అదే తరహాలో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నారు. – ఫుడ్ ట్రావెల్ అసోసియేషన్ నివేదిక86శాతం మంది భారత్, శ్రీలంక, మాల్దీవులు, ఇండోనేషియా ప్రయాణికులు స్థానిక వంటకాలను ఇష్టపడుతున్నారు. 78శాతం మంది ప్రజలు ఐకానిక్ వంటకాల వెనుక ఉన్న చరిత్ర, వారసత్వాన్ని అర్థం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. – బుకింగ్ డాట్ కామ్ నివేదిక -
'మరో రేసుకు చైనా సై'
బీజింగ్: చైనా ఓ బృహత్తర కార్యక్రమానికి తెరతీసింది. ప్రపంచంలోనే అత్యధిక పర్యాటకులను ఆకర్షించే దేశంగా రూపొందడానికి ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని తలపెట్టింది. అలసటలో ఉన్నవారికి సేద తీరాలనే ఆలోచన రాగానే టక్కున తమ దేశమే గుర్తుకు వచ్చేలా తన రూపాన్ని మార్చాలని చూస్తోంది. 2020లో వరల్డ్ లైజర్ కాంగ్రెస్ను తమ దేశంలోని పింగూ జిల్లాలో నిర్వహించనున్నట్లు బీజింగ్ పర్యాటక అభివృద్ధిశాఖ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమానికి ప్రపంచదేశాల నుంచి యూనివర్సిటీలు, అకాడమిక్ సంస్థలు, ఎంటర్ప్రైజెస్ సంస్థలకు చెందిన ఉన్నతస్థాయి ప్రముఖులను 1000మందిని ఆహ్వానించాలని నిర్ణయించుకుంది. ఇందులో సేదతీరేందుకు అవసరమైన 16 రకాల ఉల్లాసభరితమైన కార్యక్రమాలు ఏర్పాటుచేయనుంది. వారి ద్వారా విస్తృత ప్రచారం జరిగి ప్రముఖ సేద తీరే ప్రాంతంగా చైనా అని అందరికీ తెలుస్తుందని వారి ఆలోచన. ఇప్పటికే అన్ని రంగాల్లో దూసుకెళుతున్న చైనాలో సహజ సిద్ధంగానే చక్కటి ప్రకృతి వనరులు కలవు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల్లోని అన్ని దేశాల్లో తమ వస్తువులను కుమ్మరిస్తున్న ఆ దేశం తాజాగా.. పర్యాటక దేశంగాను దూసుకెళ్లాలనుకుంటోంది.