Yukta Mookhey
-
యుక్తాముఖి కేసులో మధ్యవర్తిని నియమించిన బాంబే కోర్టు
ముంబై: మాజీ మిస్ వరల్డ్ యుక్తా ముఖి, ఆమెకు దూరంగా ఉంటున్న భర్త ప్రిన్స్ తులిల మధ్య వైవాహిక వివాదాన్ని పరిష్కరించేందుకు బాంబే హైకోర్టు సోమవారం ఓ మధ్యవర్తిని నియమించింది.ఈ మేరకు సీనియర్ అడ్వకేట్ రాజీవ్ పాటిల్ సమక్షంలో మంగళవారం చర్చలు జరుగుతాయని తులి తరఫు న్యాయవాది ఫిజి ఫ్రెడరిక్ తెలిపారు. తులి అసహజ శృంగారం చేస్తున్నారని, ఆయన కుటుంబ సభ్యులు గృహ హింసకు పాల్పడుతున్నారని గత ఏడాది జూన్లో పోలీసులకు యుక్తాముఖి ఫిర్యాదు చేసింది. ఆ వెంటనే తులి కుటుంబ సభ్యులు ముందస్తు బెయిల్ కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయించడంతో బెయిల్ మంజూరు అయ్యింది. ఈ కేసును న్యాయవాదులతో కలిసి సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆదేశించింది. వారిద్దరి మధ్య మద్యవర్తిగా రాజీవ్ పాటిల్ను నియమించింది. -
ముందస్తు బెయిల్ కోసం యుక్తాముఖి భర్త పిటిషన్
ముంబై : గృహహింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మిస్ వరల్డ్ యుక్తాముఖి భర్త ప్రిన్స్ తులి ముందస్తు బెయిల్ కోసం ముంబై హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం విచారణకు రానున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను గత ఆగస్టు 31న సెషన్స్ కోర్టు తిరస్కరించింది. అయితే అతడు అరెస్టు కాకుండా రక్షణ కల్పించింది. వేధింపుల కేసులో అరెస్టు చేయకుండా దిగువకోర్టు తన భర్త ప్రిన్స్ తులికి రక్షణ కల్పించడాన్ని సవాల్ చేస్తూ బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ యుక్తాముఖి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కాగా, తులికి ముందస్తు అరెస్టు బెయిల్ ఇచ్చిన సెషన్స్ కోర్టునే ఆశ్రయించాలని యుక్తాముఖికి హైకోర్టు సూచించింది. తనను అసహజ శృంగారంలో పాల్గొనాలని తన భర్త హింసిస్తున్నాడని యుక్తాముఖి గత జూలై లో పోలీసులకు ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే. -
బాంబే హైకోర్టును ఆశ్రయించిన యుక్తాముఖి
వేధింపుల కేసులో అరెస్టు చేయకుండా దిగువకోర్టు తన భర్త ప్రిన్స్తులికి రక్షణ కల్పించడాన్ని సవాల్ చేస్తూ బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ యుక్తాముఖి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తులి తనను వేధించడంతోపాటు అసహజ శృంగారం కోసం బలవంతం చేశాడంటూ ఆమె గత నెల మూడున ఫిర్యాదు చేయడం తెలిసిందే. దీంతో న్యాయమూర్తి ఆర్పీ సొండూర్ బల్డోటా తులికి నోటీసులు జారీ చేశారు. దీనిపై ఈ నెల 23న విచారణ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కేసులో అరెస్టు కాకుండా తమకు రక్షణ కల్పించాలంటూ తులి, అతని తండ్రి బచత్తర్సింగ్, తల్లి హరీందర్ కౌర్, తోబుట్టువులు మన్మీత్ కౌర్, చందన్ కౌర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ అనంతరం సెషన్స్ కోర్టు ఈ నెల 31 వరకు బెయిల్ మంజూరు చేసింది. అయితే విచారణ కోసం పోలీసుల ఎదుట హాజరు కావాలని తులిని ఆదేశించింది. వీరిద్దరికి 2008లో వివాహమయింది.