Top Stories
ప్రధాన వార్తలు

సోషల్ మీడియా పోస్టులు వ్యవస్థీకృత నేరమంటే ఎలా?: హైకోర్టు
సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకు ఎలా వస్తాయి? బీఎన్ఎస్ సెక్షన్–111 ప్రకారం ఆర్ధిక నేరాలు, ఒప్పంద హత్యలు, కిడ్నాప్, దోపిడీ, భూ ఆక్రమణలు, మానవ అక్రమ రవాణా, తీవ్ర పర్యవసానాలుండే సైబర్ నేరాలు వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా పోస్టులు ఎలా వ్యవస్థీకృత నేర నిర్వచన పరిధిలోకి వస్తాయి? పరువుకు నష్టం కలిగించేలా పెట్టిన పోస్టులను సైబర్ నేరంతో సమానంగా ఎలా చూడగలం? సోషల్ మీడియా పోస్టులను మెటీరియల్ బెనిఫిట్ (ద్రవ్య సంబంధిత ప్రయోజనం)గా భావించలేం. – పోలీసులను ఉద్దేశించి హైకోర్టు సాక్షి, అమరావతి: సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకు ఎలా వస్తాయని హైకోర్టు పోలీసులను బుధవారం ప్రశ్నించింది. భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్) సెక్షన్–111 ప్రకారం ఆర్ధిక నేరాలు, ఒప్పంద హత్యలు, కిడ్నాప్, దోపిడీ, భూ ఆక్రమణలు, మానవ అక్రమ రవాణా, తీవ్ర పర్యవసానాలుండే సైబర్ నేరాలు వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయని గుర్తు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా పోస్టులు ఎలా వ్యవస్థీకృత నేర నిర్వచన పరిధిలోకి వస్తాయో చెప్పాలంది. పరువుకు నష్టం కలిగించేలా పెట్టిన పోస్టులను సైబర్ నేరంతో సమానంగా ఎలా చూడగలమో చెప్పాలంది. ప్రస్తుత కేసులో నిందితులు ఓ రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, దీన్ని పర్సెప్షనల్ బెనిఫిట్ (అనుభూతి ద్వారా పొందే ప్రయోజనం)గా భావించగలమే తప్ప.. మెటీరియల్ బెనిఫిట్ (ద్రవ్య సంబంధిత ప్రయోజనం)గా భావించలేమంది. సోషల్ మీడియా పోస్టుల ద్వారా పిటిషనర్లు ఏ విధంగా ఆర్ధిక, వస్తు తదితర రూపేణ ప్రయోజనం పొందారో చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేసింది. వీటన్నింటిపైనా స్పష్టతనివ్వాలని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి పోలీసులు వేర్వేరుగా నమోదు చేసిన పలు కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం మాజీ ఇన్చార్జి సజ్జల భార్గవ్రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే వ్యవహారంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ సిరిగిరెడ్డి అర్జున్రెడ్డి కూడా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను జస్టిస్ విజయ్ బుధవారం విచారించారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా పిటిషనర్లు వ్యవస్థీకృత నేరానికి పాల్పడ్డారన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకు ఎలా వస్తాయో చెప్పాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 26కి వాయిదా వేశారు.

ఈ రాశి వారు కాంట్రాక్టులు పొందుతారు.. వ్యాపారాలలో లాభాలు
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.షష్ఠి రా.10.35 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: అనూరాధ రా.7.55 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం: రా.1.57 నుండి 3.40 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.07 నుండి 10.55 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.44 వరకు, అమృతఘడియలు: ఉ.8.32 నుండి 10.20 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 6.09, సూర్యాస్తమయం: 6.07. మేషం.... అనుకోని ప్రయాణాలు. ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరాశ. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు..వృషభం... నూతన ఉద్యోగాలలో చేరతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.మిథునం.... కాంట్రాక్టులు పొందుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుంటారు. నూతన విద్యావకాశాలు.కర్కాటకం... కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు. దైవచింతన.సింహం... కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. నిరుద్యోగుల యత్నాలలో అవాంతరాలు.కన్య...... కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రులతో సఖ్యత. కీలక సమాచారం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా ఉంటాయి.తుల...... వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. ఉద్యోగాలలో మార్పులు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.వృశ్చికం.... ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యవహారాలలో విజయం. కాంట్రాక్టులు లభిస్తాయి. బంధువుల కలయిక. వ్యాపారాభివృద్ధి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. కళాకారులకు పురస్కారాలు.ధనుస్సు.. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ఖర్చులు. పనులు ముందుకు సాగవు.వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. అనారోగ్యం.మకరం.... బంధువుల కలయిక. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.కుంభం... పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల నుంచి సహాయం. పనులు చకచకా సాగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.మీనం.... కష్టపడ్డా ఫలితం అంతగా కనిపించదు. వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా నిరుత్సాహం. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

ఉక్రెయిన్-రష్యా మధ్య ‘మూడు ముక్కలాట’.. మరో కొత్త ట్విస్ట్
వాషింగ్టన్: ఉక్రెయిన్-రష్యా మధ్య కాల్పులు విరమణ ఒప్పందంలో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా పుతిన్ తన ఇష్టానుసారం ఉక్రెయిన్పై మరోసారి దాడులకు పాల్పడ్డారు. దీంతో, అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్కు మరిన్ని వైమానిక రక్షణ పరికరాలను అందంచనున్నట్టు వైట్హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.తాజాగా ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉక్రెయిన్తో కాల్పుల విరమణ ఒప్పందానికి రష్యా అంగీకరించడం లేదు. అందుకే ఉక్రెయిన్ సాయం అందించడానికి అమెరికా సిద్ధంగా ఉంది. ఉక్రెయిన్కు వైమానిక రక్షణ పరికరాలను యూరప్ నుంచి పంపించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. శాంతిని కోరుకుంటున్నామని, 30 రోజులపాటు ఉక్రెయిన్ ఇంధన, మౌలిక వసతులపై దాడులు చేయబోమని సూత్రప్రాయ అంగీకారానికి సిద్ధపడిన రష్యా వెనువెంటనే దాడులకు దిగింది. రష్యా డ్రోన్లు జనావాసాలపై దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్ బుధవారం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో దాదాపు గంటకుపైగా ఫోన్లో మాట్లాడిన కొద్దిగంటలకే రష్యా మళ్లీ తన భీకర దాడులను మొదలుపెట్టడం గమనార్హం. దాడులు ఆపబోమని తాజా ఘటనతో రష్యా చెప్పేసిందని, సమీ పట్టణంలోని ఒక ఆస్పత్రిపై, ప్రజల ఇళ్లపై డ్రోన్ల దాడులు జరిగాయి. మరోవైపు.. మాస్కోనే కాల్పుల విరమణ ఉల్లంఘించిందని కీవ్ ఆరోపిస్తే, ఉక్రెయినే దాడులు చేసిందని రష్యా పేర్కొంది. ఈ దాడులు, ప్రతిదాడులు జరుగుతున్న సమయంలోనే రెండు దేశాలు 175 మంది యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకోవడం గమనార్హం.

దేశంలో ధనిక, పేద ఎమ్మెల్యేలు.. ఇద్దరూ బీజేపీవారే..
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యే, అత్యంత పేద ఎమ్మెల్యే ఇద్దరూ బీజేపీకి చెందినవారే. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ఈ మేరకు వెల్లడించింది. 28 అసెంబ్లీలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4,092 మంది ఎమ్మెల్యేల ఆస్తులను వారి అఫిడవిట్ల ఆధారంగా సంస్థ అధ్యయనం చేసింది. వారి మొత్తం ఆస్తులు మూడు చిన్న రాష్ట్రాల వార్షికబడ్జెట్ను మించిపోవడం విశేషం.ముంబైలోని ఘట్కోపర్ ఈస్ట్ బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా రూ.3,400 కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా నిలిచారు. కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ రూ.1,413 కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. కర్నాటకలో మొత్తం 223 మంది ఎమ్మెల్యేలకు కలిపి రూ.14,179 కోట్ల ఆస్తులుండగా మహారాష్ట్రలోని 286 మంది ఎమ్మెల్యే లదగ్గర రూ.12,424 కోట్ల సంపద ఉంది. మూడు రాష్ట్రాల వార్షిక బడ్జెట్ను మించి... 4,092 మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ.73,348 కోట్లు. ఇది 2023–24లో మేఘాలయ (రూ.22,022 కోట్లు), నాగాలాండ్ (రూ.23,086 కోట్లు), త్రిపుర (రూ.26,892 కోట్లు) రాష్ట్రాల ఉమ్మడి వార్షిక బడ్జెట్ల కంటే ఎక్కువ. ప్రధాన పార్టీల్లో బీజేపీ ఎమ్మెల్యేలకు అత్యధిక ఆస్తులున్నాయి. ఆ పార్టీకి చెందిన 1,653 మంది రూ. 26,270 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. 646 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.17,357 కోట్ల సంపద ఉంది. 134 టీడీపీ ఎమ్మెల్యేల మొత్తం సంపద రూ.9,108 కోట్లు. 59 మంది శివసేన ఎమ్మెల్యేల వద్ద రూ.1,758 కోట్లున్నాయి. నిరుపేద ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ పశ్చిమబెంగాల్లోని ఇండస్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధార అత్యంత పేద ఎమ్మెల్యేగా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ కేవలం రూ.1,700 మాత్రమే. అత్యల్ప ఆస్తులు కలిగిన ఎమ్మెల్యేలున్న రాష్ట్రాలుగా త్రిపుర, మణిపూర్, పుదుచ్చేరి నిలిచాయి. 60 మంది త్రిపుర ఎమ్మెల్యేల మొత్తం ఆస్తులు రూ.90 కోట్లు. మణిపూర్లోని 59 మంది ఎమ్మెల్యేలకు రూ.222 కోట్లు, పుదుచ్చేరిలో 30 మంది ఎమ్మెల్యేలకు రూ.297 కోట్ల ఆస్తులున్నాయి.

ఎల్పీయూ బీటెక్ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీతో ప్లేస్మెంట్
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. యూనివర్సిటీ విద్యార్థుల్లో ఇద్దరు ప్రతిష్ఠాత్మకంగా కోట్ల రూపాయాల వేతన మార్కును అధిగమించి ఉద్యోగాలు సాధించారు. బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీలో రూ.2.5 కోట్ల ప్యాకేజీని సొంతం చేసుకుని రికార్డులను బద్దలు కొట్టారు. ఈ విజయం భారతదేశంలో గ్రాడ్యుయేట్ విద్యార్థికి అత్యధిక ప్యాకేజీని సూచిస్తుంది. ఇది భారత్లోని ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీల్లో ఉన్న రికార్డులను అధిగమించింది. దాంతో టాప్ టైర్ రిక్రూట్మెంట్లో లీడర్గా ఎల్పీయూ స్థానాన్ని మరింత పటిష్టం చేసింది.ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీలో రూ.1.03 కోట్లు (1,18,000 డాలర్లు) ప్యాకేజీ పొందిన ఈసీఈ ఫైనల్ ఇయర్ విద్యార్థి బేతిరెడ్డి నాగవంశీరెడ్డి మరో ఘనత సాధించారు. మొత్తంగా 1,700 మందికి పైగా ఎల్పీయూ విద్యార్థులకు టాప్ ఎంఎన్సీల నుంచి ఆఫర్లు వచ్చాయి. విదార్థులకు రూ .10 ఎల్పీఏ నుంచి రూ.2.5 కోట్ల వరకు ప్యాకేజీలు ఉన్నాయి. వందలాది మంది ఎల్పీయూ విద్యార్థులు అమెరికా, యూకే, ఆస్ట్రేలియాల్లోని ప్రఖ్యాత సంస్థల్లో పనిచేస్తూ రూ.కోటికి పైగా ప్యాకేజీలు పొందుతున్నారు. మరో ఎల్పీయూ గ్రాడ్యుయేట్కు ఐటీ కంపెనీలో రూ.3 కోట్ల ప్యాకేజీ లభించింది. అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేసే ఎల్పీయూ సామర్థ్యం యొక్క బలం, ప్రపంచవ్యాప్త పరిధికి ఇది ఉదాహరణ. పాలో ఆల్టో నెట్వర్క్స్, న్యూటానిక్స్, మైక్రోసాఫ్ట్, సిస్కో, పేపాల్, అమెజాన్ వంటి ప్రతిష్టాత్మక బహుళజాతి కంపెనీల్లో ప్లేస్మెంట్లు పొందిన వివిధ బీటెక్ విద్యార్థులకు మొత్తం 7,361 ఆఫర్లు అందాయి. వీటిలో టాప్ ఎంఎన్సీలు అందించే సగటు ప్యాకేజీ ఏటా రూ.16 లక్షలుగా నమోదైంది. ఇది జాబ్ మార్కెట్లో ఎల్పీయూ గ్రాడ్యుయేట్లకు అధిక డిమాండ్ను నొక్కిచెబుతోంది.గతంలోని ప్లేస్మెంట్ సీజన్ కూడా అంతే ఆకట్టుకుంది. పరిశ్రమ దిగ్గజాలు ఆకర్షణీయమైన పరిహార ప్యాకేజీలను అందిస్తున్నాయి. అత్యధిక వేతనం చెల్లించే కంపెనీల్లో పాలోఆల్టో నెట్వర్క్స్ రూ.54.75 ఎల్పీఏతో అగ్రస్థానంలో నిలవగా, న్యూటానిక్స్ రూ.53 ఎల్పీఏ, మైక్రోసాఫ్ట్ రూ.52.20 ఎల్పీఏతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మొత్తం 1,912 మల్టిపుల్ జాబ్ ఆఫర్లను అందిచగా, 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు, 18 మందికి ఐదుగురికి, ఏడుగురు విద్యార్థులకు ఆరు జాబ్ ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో బీటెక్ విద్యార్థి ఆదిరెడ్డి వాసు అద్భుతమైన ఏడు జాబ్ ఆఫర్లను సాధించి అరుదైన రికార్డును నెలకొల్పాడు.పైన పేర్కొన్న కంపెనీలతో పాటు అమెజాన్ (రూ.48.64 ఎల్పీఏ), ఇన్ట్యూట్ లిమిటెడ్ (రూ.44.92 ఎల్పీఏ), సర్వీస్ నౌ (రూ.42.86 ఎల్పీఏ), సిస్కో (రూ.40.13 ఎల్పీఏ), పేపాల్ (రూ.34.4 ఎల్పీఏ), ఏపీఎన్ఏ (రూ.34 ఎల్పీఏ), కామ్వాల్ట్ (రూ.33.42 ఎల్పీఏ), స్కేలర్ (రూ.33.42 ఎల్పీఏ) వంటి టాప్ రిక్రూటర్లు ఎల్పీయూ విద్యార్థులకు అవకాశం కల్పించారు. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్, అధునాతన సాంకేతితక నిపుణులకు ప్రాధాన్యమిచ్చారు.యాక్సెంచర్, క్యాప్ జెమినీ, టీసీఎస్ వంటి ప్రముఖ కంపెనీలు అతిపెద్ద రిక్రూటర్లలో ఉండటంతో ఎల్పీయూ గ్రాడ్యుయేట్ల సాంకేతిక పరంగా అధిక డిమాండ్ ఏర్పడింది. క్యాప్ జెమినీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్ పోస్టులకు 736 మంది విద్యార్థులను, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు మైండ్ ట్రీ 467 మంది విద్యార్థులను నియమించుకుంది. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ 418 మంది విద్యార్థులను జెన్సీ ఉద్యోగాలకు రిక్రూట్ చేసుకుంది. యాక్సెంచర్ (279 నియామకాలు), టీసీఎస్ (260 నియామకాలు), కేపీఐటీ టెక్నాలజీస్ (229 నియామకాలు), డీఎక్స్సీ టెక్నాలజీ (203 నియామకాలు), ఎంఫసిస్ (94 నియామకాలు)తోపాటు తదితర కంపెనీలు ఎల్పీయూ విదార్థులకు 279 కొలువులు అందించాయి.రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ ఇంజినీరింగ్ విభాగాల్లో అత్యధిక ప్లేస్మెంట్ దక్కింది. పాలోఆల్టో నెట్వర్క్స్, సిలికాన్ ల్యాబ్స్, ట్రైడెంట్ గ్రూప్, న్యూటానిక్స్, ఆటోడెస్క్, అమెజాన్ వంటి పరిశ్రమ దిగ్గజాలు ఈ విభాగాల నుండి భారీగా నియామకాలు చేస్తున్నాయి.పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ), ఎల్పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ మాట్లాడుతూ..‘వేగంగా మారుతున్న ప్రపంచంలో విజయం సాధించేలా విద్యార్థులను సిద్ధం చేయడానికి ఎల్పీయూ కట్టుబడి ఉంది. యూనివర్సిటీ ఆకట్టుకునే ప్లేస్మెంట్ విజయాలు దీన్ని ప్రతిబింబిస్తున్నాయి. విద్యార్థులు ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధిస్తున్నారు. స్థిరంగా కొత్త రికార్డులను నెలకొల్పుతున్నారు. ఎల్పీయూ విద్యాభ్యాసం వాస్తవ-ప్రపంచ పరిశ్రమ విధానాలతో మిళితం చేయడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు అందుతున్నాయి. వృత్తి విజయాలకు విద్యార్థులను సిద్ధం చేయడమే కాకుండా పరిశ్రమకు విలువను జోడించేందుకు, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి అవసరమయ్యే నైపుణ్యాలను అందించేలా విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. ఎడ్యుకేషన్లో వచ్చే రివల్యూషన్ విద్యార్థుల భవిష్యత్తును రూపొందిస్తోంది. వారు అభివృద్ధి చెందడానికి, ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో అగ్రగామిగా నిలిచి మెరుగైన ప్లేస్మెంట్లు సాధించేందుకు ఎల్పీయూ అవకాశాలను సృష్టిస్తోంది’ అని తెలిపారు.2025 బ్యాచ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్పీయూ నెస్ట్ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

కోల్'కథ' ఎంతవరకు!
ఏ జట్టయినా విజయవంతమైన కూర్పును కొనసాగించాలనుకుంటుంది... కానీ కోల్కతా నైట్రైడర్స్ మాత్రం అందుకు విభిన్నమైన ప్రణాళికలతో అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది. దశాబ్దకాలం తర్వాత తమ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించిన కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ను వేలానికి వదిలేసుకున్న నైట్రైడర్స్... ఓ మామూలు ఆటగాడి కోసం భారీగా ఖర్చు పెట్టింది. జాతీయ జట్టుకు దూరమైన సీనియర్ ప్లేయర్ అజింక్య రహానేకు పిలిచి మరీ జట్టు పగ్గాలు అప్పగించింది. అయితే ఎన్ని మార్చినా కోర్ గ్రూప్ను మాత్రం కదల్చని కోల్కతా... డిఫెండింగ్ చాంపియన్గా టైటిల్ నిలబెట్టుకునేందుకు సై అంటోంది! ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మాత్రమే ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండేళ్లు చాంపియన్గా నిలిచాయి. నైట్రైడర్స్ ఈసారి తమ గెలుపు ‘కథ’ను ఎంతవరకు తీసుకెళ్తుందనేది ఆసక్తికరం కానుంది! –సాక్షి క్రీడావిభాగం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ చెరో ఐదుసార్లు ట్రోఫీ చేజిక్కించుకోగా... ఆ తర్వాత అత్యధికంగా కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) మూడుసార్లు విజేతగా నిలిచింది. 2012, 2014, 2024లో కేకేఆర్ ట్రోఫీ హస్తగతం చేసుకుంది. గతేడాది ఐపీఎల్ వేలంలో ‘కోర్ గ్రూప్’ను తిరిగి కొనసాగించిన ఫ్రాంచైజీ... జట్టుకు మూడోసారి కప్పు అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఆ్రస్టేలియా స్టార్ పేసర్ స్టార్క్ను మాత్రం వదిలేసుకుంది. పేస్ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కోసం ఏకంగా రూ. 23 కోట్ల 75 లక్షలు ఖర్చు చేసి ఆశ్చర్యపరిచిన యాజమాన్యం... కోటిన్నర ప్రాథమిక ధరతో కొనుగోలు చేసుకున్న సీనియర్ బ్యాటర్ అజింక్య రహానేకు అనూహ్యంగా కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. వేలంలో ఒక్కో జట్టు అత్యధికంగా 25 మందిని ఎంపిక చేసుకునే అవకాశం ఉండగా... కేకేఆర్ 21 మందినే తీసుకుంది. సిక్సర్ల వీరుడు రింకూ సింగ్కు రూ. 13 కోట్లు... ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి, వెస్టిండీస్ టి20 స్పెషలిస్ట్లు రసెల్, నరైన్లకు రూ. 12 కోట్లు చొప్పున అందించి అట్టిపెట్టుకున్న ఫ్రాంచైజీ... హర్షిత్ రాణా, రమణ్దీప్లను రూ. 4 కోట్లతో కొనసాగించింది. ఆరుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉంటే దాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంది. నరైన్పై భారీ అంచనాలు... సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రకాంత్ పండిత్ కేకేఆర్కు కోచ్గా వ్యవహరిస్తుండగా... గతేడాది జట్టుకు మెంటార్గా ఉన్న గౌతమ్ గంభీర్ ... టైటిల్ గెలిచిన అనంతరం టీమిండియా హెడ్ కోచ్గా వెళ్లిపోయాడు. ఇప్పుడతడి స్థానంలో విండీస్ మాజీ ఆటగాడు డ్వేన్ బ్రావో మెంటార్గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ముంబై, చెన్నై జట్లు మాత్రమే వరుసగా రెండు సీజన్లు విజేతగా నిలిచాయి. ఇప్పుడు కోల్కతా ముందు అలాంటి అరుదైన అవకాశం మూడోసారి ఉంది. వెస్టిండీస్ స్పిన్ ఆల్రౌండర్ నరైన్ను ఓపెనర్గా దింపి మెరుగైన ఫలితాలు రాబట్టిన కేకేఆర్ ఈసారి కూడా అదే ప్లాన్ అనుసరిస్తుందనడంలో సందేహం లేదు. అంతర్జాతీయ క్రికెట్కు ఎప్పుడో వీడ్కోలు పలికిన నరైన్... కేకేఆర్ తరఫున అటు స్పిన్నర్గా ఇటు ఓపెనర్గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. గత సీజన్లో 488పరుగులు, 17 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. గుర్బాజ్, నరైన్ ఇన్నింగ్స్ ఆరంభించడం ఖాయమే కాగా... అజింక్య రహానే, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, రసెల్, రమణ్దీప్ సింగ్ మిడిలార్డర్లో బ్యాటింగ్కు రానున్నారు. బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి, నరైన్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా కీలకం కానున్నారు. రహానే రాణించేనా? డిఫెండింగ్ చాంపియన్గా మరింత బాధ్యతగా ఉండాల్సిన కేకేఆర్... తన నిర్ణయాలతో ఆశ్చర్యపరిచింది. కప్పు అందించిన కెపె్టన్ను వదిలేసుకోవడం... తుదిజట్టులో ఉంటాడో లేదో నమ్మకంగా చెప్పలేని ఆటగాడికి జట్టు పగ్గాలు అప్పగించడం... వెరసి సీజన్ ఆరంభానికి ముందే వార్తల్లో నిలిచింది. ఫామ్లేమికి తోడు వయసు మీదపడుతున్న కారణంగా భారత జట్టుకు దూరమైన రహానే మరి కేకేఆర్ను ఎలా నడిపిస్తాడో చూడాలి. వెంకటేశ్ అయ్యర్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా... ఆస్థాన ఆటగాళ్లు రసెల్, నరైన్ కేకేఆర్కు ప్రధాన బలంకానున్నారు. బౌలింగ్, బ్యాటింగ్లో ఈ ఇద్దరు జట్టుకు చేకూర్చే విలువ మాటల్లో చెప్పలేనిది. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన కనబర్చిన వరుణ్ చక్రవర్తిపై భారీ అంచనాలు ఉన్నాయి. నోర్జే, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, రావ్మన్ పావెల్, వైభవ్ అరోరాతో పేస్ విభాగం బలంగానే ఉన్నా... వీరు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారో చూడాలి. విదేశీ ఆటగాళ్ల కోటాలో నరైన్, రసెల్, గుర్బాజ్ తుది జట్టులో ఉండటం పక్కా కాగా... నాలుగో ప్లేయర్గా నోర్జే, మొయిన్ అలీలలో ఒకరికి అవకాశం దక్కొచ్చు. కోల్కతా నైట్రైడర్స్ జట్టు: రహానే (కెప్టెన్), రింకూ సింగ్, డికాక్, గుర్బాజ్, రఘువంశీ, పావెల్, మనీశ్ పాండే, లవ్నిత్ సిసోడియా, వెంకటేశ్ అయ్యర్, అనుకూల్ రాయ్, మొయిన్ అలీ, రమణ్దీప్, రసెల్, నోర్జే, వైభవ్, మయాంక్ మార్కండే, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, నరైన్, వరుణ్, చేతన్ సకారియా. అంచనా: డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతున్న కేకేఆర్పై భారీ అంచనాలు ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్లో నాణ్యమైన ప్లేయర్లు ఉన్న కోల్కతా... స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శిస్తే ఫైనల్కు చేరడం పెద్ద కష్టం కాదు. రహానే జట్టును ఎలా నడిపిస్తాడనేది కీలకం.

వచ్చే నెలలోనే కొత్త సారథి..!
సాక్షి, న్యూఢిల్లీ: కాషాయ దళానికి కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ వచ్చే నెలలో కొలిక్కి రానుంది. పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన వెంటనే ఖరారు చేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి చివరికే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావించినా వివిధ రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో వచ్చే నెల రెండో వారంలోగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రాంతం, అనుభవం, విధేయతల అనుగుణంగా పలువురు సీనియర్ నేతల పేర్లపై చర్చ జరుగుతుండగా, దక్షిణాది రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని భావిస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. భిన్న ప్రాతిపదికలు.. జాతీయ అధ్యక్షుడి ఎంపికలో ప్రధానంగా నాలుగు అంశాల ప్రాతిపదికన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రాంతం, విధేయత, అనుభవంతో పాటు కొత్తగా మహిళను నియమించే అంశం తెరపైకి వచి్చంది. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకే, దక్షిణాది రాష్ట్రాలకు ఈసారి అవకాశం ఇవ్వాలన్న చర్చ జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి అధ్యక్షుడి రేసులో కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. 45 ఏళ్లుగా పార్టీలో ఉన్న అనుభవం, యువమోర్చా నుంచి పార్టీలో పనిచేసిన అనుభవం ఆయనకు అనుకూలంగా మారుతోంది. దక్షిణాది నుంచి గతంలో బంగారు లక్ష్మణ్, జానా కృష్ణమూర్తి, వెంకయ్య నాయుడు అధ్యక్షులుగా సేవలందించారు. ఇప్పటివరకు పార్టీ మహిళా అధ్యక్షురాలు లేనందున ఈసారి మహిళా అధ్యక్ష కోణంలోనూ చర్చ జరుగుతోంది. ఇందులో తమిళనాడుకు చెందిన కీలక నేత వనతి శ్రీనివాసన్ పేరు ముందు వరుసలో ఉంది. వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు మహిళల మద్దతు కూడగట్టేందుకు ఈమె ఎంపిక కలిసొస్తుందన్నది పార్టీ అంచనా. బీజేపీ ప్రభుత్వం ఇటీవలే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడంతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా మహిళను ఎంపిక చేసింది. అదే వరుసలో మహిళను జాతీయ అధ్యక్షురాలిగా నియమిస్తారనే చర్చ జరుగుతోంది. విధేయత, పార్టీలో పనిచేసిన అనుభవం ఆధారంగా చూస్తే భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు నేతలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షాలకు సన్నిహితులు. పైగా యూపీ, మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల విజయాల్లో కీలక పాత్ర పోషించారు. వ్యూహాలు రచించడంలో దిట్టలైన వీరిద్దరిలో ఒకరి ఎంపిక జరిగితే అది కచ్చితంగా మోదీ, షాల సూచన మేరకే జరిగిందనే చెప్పాల్సి ఉంటుంది. ఇక ఆర్ఎస్ఎస్ మద్దతున్న నేతలుగా మాజీ ముఖ్యమంత్రులు, ప్రస్తుత ముఖ్యమంత్రులైన మనోహర్లాల్ ఖట్టర్, శివరాజ్సింగ్ చౌహాన్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరికి ఆర్ఎస్ఎస్ నుంచి పూర్తిగా మద్దతున్నా, కేంద్రంలో వీరికున్న ప్రాధాన్యం దృష్ట్యా అధ్యక్ష ఎంపికలో వీరిని పరిగణనలోకి తీసుకుంటారా? లేదా? తేలాల్సి ఉంది.

నవ్వించడానికి చేసిన సినిమా ఇది
‘‘మా కథకి పర్ఫెక్ట్ టైటిల్ ‘పెళ్లి కాని ప్రసాద్’. ఈ పేరు డైరెక్టర్ అభిలాష్ ఫిక్స్ చేశారు. ఆ టైటిల్ వెయిట్ని కాపాడేలా మా సినిమా ఉంటుంది. వినోదం చాలా అద్భుతంగా కుదిరింది. ప్రమోషన్స్కి వెళ్లినప్పుడు ఇప్పటికే కొంతమంది నన్ను ‘పెళ్లి కాని ప్రసాద్’ అని పిలుస్తున్నారు. అందరూ అలా పిలిస్తే మా సినిమా ప్రేక్షకులకు బాగా చేరువ అయినట్టే. అంతకంటే ఆనందం ఏముంటుంది’’ అని సప్తగిరి తెలిపారు. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వంలో సప్తగిరి, ప్రియాంకా శర్మ జోడీగా నటించిన చిత్రం ‘పెళ్లి కాని ప్రసాద్’. చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పణలో కేవై బాబు, భానుప్రకాశ్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల నిర్మించారు. నిర్మాత ‘దిల్’ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై రేపు (శుక్రవారం) ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సప్తగిరి మాట్లాడుతూ– ‘‘వెంకటేశ్గారి కెరీర్లో ఐకానిక్ క్యారెక్టర్ పెళ్లి కాని ప్రసాద్ (‘మల్లీశ్వరి’ చిత్రంలో). ఆయన పాత్రతో నా పాత్రని ఏ మాత్రంపోల్చుకోను. మా సినిమా ట్రైలర్ వెంకటేశ్గారు విడుదల చేసి.. ‘కంటెంట్ చాలా పాజిటివ్గా ఉంది.. సినిమా హిట్ సాధించాలి’ అని ఆశీర్వదించారు. మా సినిమాకి సపోర్ట్ చేసిన హీరోలు ప్రభాస్, వెంకటేశ్, దర్శకులు మారుతి, అనిల్ రావిపూడి, నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్ గార్లకు కృతజ్ఞతలు. ఈ మూవీలో ఎలాంటి సందేశం లేదు.. ప్రేక్షకులను నవ్వించడానికి చేసిన సినిమా. ఫైనల్ ఔట్పుట్ చూశాక మా నిర్మాతలూ సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్, నేపథ్య సంగీతం బాగుంటుంది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొన్ని సినిమాలు చేస్తున్నాను. హీరోగా కూడా కొన్ని కథలు విన్నాను’’ అని చె΄్పారు.

ఏం అమ్మి తీరస్తారు సామీ.. అప్పులన్నీ..?
సెంద్రబాబునాయుడు ఓ పక్కన కుర్సీ యెక్కిన కాణ్నించీ యెడాపెడా అప్పులు జేస్తానే వుండారు గదా..! అప్పు పుట్టించడాన్ని గూడా ఏదో యెవరెస్టు యెక్కిన మాదిర్తో టముకు యేసుకుంటా.. పోటోలకు పోజులిస్తావుంటారు గదా..! కానీ ‘యేంది సామీ.. రాజదాని కడతండావు సరే.. ఇన్నేసి డబ్బులు గుమ్మరిస్తండావేంది’ అని అడిగినామే అనుకో.. ‘ఓరి పిచ్చోడా యిది సెల్ఫ సస్టయినబుల్ ప్రోజెక్టురా.. అంటా వుంటాడు. అదేందో పలకడానికే నాకు నోరు తిరగడం లేదుగానీ.. ‘అంటే యేందిరా సామీ’ అని యింకో సావాసగాణ్ని అడిగినా. యేం జెప్పినాడో తెలుసునా...‘‘వోరి యెర్రోడా.. మన యెసుట్లోకి మనమే బియ్యం సంపాయించాల.. మన డప్పు మనమే గొట్టుకోవాల.. యిట్టాగానే.. ఆ అమరావతి గూడా దాన్ని కట్టడానికి కావాల్సిన డబ్బులంతా అదే సంపాదించుకుంటాదంట’’ అని జెప్పినాడు.యేడరా సామీ.. యాబయి వేల కోట్ల రూపాయలు ఇప్పుటికే అప్పులు తెస్తిరి.. తీరా జూడబోతే యిప్పుడు కట్టబొయ్యే కతలన్నీ కలిపి నలబై వేల కోట్ల కూడా లేకపాయె.. కొండంత అప్పులు దెచ్చినారు గదా.. యెట్టా తీర్చబోతారు అని కలవరం పుట్టింది నాకు. మా మినిస్టరు నారాయణ మాటలు యింటే మాత్రం సమ్మగా అనిపిస్తండాయి.. కలవరం మొత్తం మాయమైపోతాందంటే నమ్మాల! యింతకీ ఆయనేం అంటండారో తెలుసునా?యీ అప్పులతో ఇప్పునడు మొదులు బెడుతున్న బిల్డింగులు అన్నీ కట్టేయంగా యింకా నాలుగువేల యెకరాలు మిగల్తాయంట.. సిటీ మొత్తం దూందాంగా అయిపోయుంటాది గాబట్టి.. అప్పుడు బూముల రేట్లు ఆకాసెంలో వుంటాయంట. ఆ యేళకి గవుర్మెంటు కాడ నాలుగువేల యెకరాల బూమి వుంటాదంట.. దాన్నంతా అమ్మితే.. ఈ అప్పులు యేపాటివి.. వుఫ్ మని వూది పారేస్తాను గదా.. అంటాండారు. మాట యిన్నప్పుడు సమ్మగానే వుంటంది గానీ.. తలుసుకున్నప్పుడు మాత్రం గుబులు గుబులుగానే వుంటాండాది సామీ.. యిన్నేసి అప్పులు తెచ్చి గుప్పెడు బిల్డింగులు గట్టంగానే అమరావతి సిటీ మొత్తం పూర్తయిపోయినట్టేనా? ఇల్లలికితే పండగ అయిపోతందా? యిదిగూడా అట్నే గదా అని నా బయ్యిం.తీరా ఈ యాబైవేల కోట్లు తగలేసి ఏదో ఓ కాడికి పనులు అయినాయని అనుకున్నాక.. యిప్పుటిదాకా అయిందంతా.. కాయితం మీద గుర్రం బొమ్మ గీసినట్టే.. ఈ బొమ్మ పెకారం మంచి గ్రానైటు రాయిని దెచ్చి బొమ్మని చెక్కాల అని.. బొమ్మను చెక్కినాక, అయ్యో బొమ్మ నల్లగా ఉండాది గదా.. దీనికి బంగారం తాపడం జేయిస్తే బెమ్మాండంగా వుంటాది అనీ.. యిట్టా రకరకాల మాటలు జెప్తా.. అరలచ్చ కోట్లు నగరానికి యింకో లచ్చన్నర కోట్లు తగలెయ్యాల్సిందే.. అని కొత్త పాటలు పాడకుండానే వుంటారా? అనేది అనుమానంగా వుండాది సామీ..!యినుకుంటా వుండారా? ఒక్కో రోడ్డు యెయ్యాలంటే కిలోమీటరుకి యాబై మూడు కోట్ల రూపాయిలా..? నోట్లేమయినా అచ్చేస్తండామా సామీ..! ఈ దేసెంలో ఎంత పెద్ద రాచబాట యేసినా.. సెంట్రలు గవుర్మెంటోల్లు కిలోమీటరుకి 20 కోట్ల దుడ్లు పెడితే చానా జాస్తి అంటాండారే.. మనోళ్లేమైనా కొండల్ని పగలదీసి యేస్తండారా.. ఆకాసానికి అద్దాల నిచ్చెనేసి ఆ పైన రోడ్డేస్తండారా.. యేం జేస్తండారని.. కిలోమీటరుకి అన్నేసి కోట్లు తగలేస్తండారో వొక యితరణ వుండాల గదా? యిట్టా తగలేస్తే యింకో అరలచ్చ కోట్లు అప్పులు దెచ్చినా ఆరతి కర్పూరం అయిపోకుండా వుంటాయా అని నాకు బయం సామీ!యెనకటికి ఇద్దరు సావాసగాళ్లు వున్నారంట. వొకడు ‘తిందాం తిందాం’ అంటే.. ‘ఏం చేసి తిందాం’ అని రెండోవాడు అన్నాట్ట. ‘అప్పుజేసి తిందాం’ అంటే.. ‘అప్పెట్ట తీర్చాల’ అన్నాట్ట. ‘అప్పుజేద్దాం.. వూరొదిలి పారిపోదాం’ అన్నాట్ట మొదటి పెద్దమనిషి. ఆ మాదిర్తో జనం గుండెల మీద బండరాయి పడకుండా వుండాలంటే ఈ అప్పులకి యీడ పుల్ స్టాపు పెడతాండాం అని ఓ మాట జెప్పండి సామీ. లేపోతే అయ్యన్నీ తీర్చడానికి అమరావతిలోనూ అడుగు బూమీ మిగలదు.. మా బోటోళ్ల బతుకులన్నింటినీ వుడ్డగా అమ్మేస్తే తప్ప ఆ అప్పు తీరదు. కొంచిం దయపెట్టండి... ఎం.రాజేశ్వరి

ఆన్లైన్ గేమింగ్.. జూమింగ్
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ హద్దే లేదన్నట్టుగా శరవేగంగా విస్తరిస్తోంది. రియల్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్ వింజోగేమ్స్, ఐఈఐసీ సంయుక్త అంచనా ప్రకారం.. 2024లో ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ విలువ 3.7 బిలియన్ డాలర్లుగా ఉంటే (సుమారు రూ.32,000 కోట్లు).. 2029 నాటికి 9.1 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.80,000 కోట్లు) వృద్ధి చెందనుంది. ముఖ్యంగా 86 శాతం వాటాతో రియల్ మనీ గేమ్స్ (ఆర్ఎంజీ) విభాగం ఈ మార్కెట్ను శాసించనుంది. శాన్ఫ్రాన్సిస్కోలో గేమ్ డెవలపర్ల సదస్సులో భాగంగా ఈ సంయుక్త నివేదికను వింజోగేమ్స్, ఐఈఐసీ విడుదల చేశాయి. ‘‘భారత్లో ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ అసాధారణ వృద్ధి పథంలో కొనసాగుతోంది. 2029 నాటికి 9.1 బిలియన్ డాలర్ల మార్కెట్తో.. ఇన్వెస్టర్లకు 63 బిలియన్ డాలర్ల విలువైన అవకాశాలను అందించనుంది. టెక్నాలజీ పరమైన ఆవిష్కరణలు, మేధో సంపత్తి హక్కులు (ఐపీ), యూజర్లతో అనుసంధానం (ఎంగేజ్మెంట్) ద్వారా గేమింగ్కు భారత్ను బలమైన కేంద్రంగా (పవర్హౌస్) మార్చేందుకు వింజో కట్టుబడి ఉంది’’అని వింజో సహ వ్యవస్థాపకుడు పవన్ నంద తెలిపారు. 59 కోట్ల యూజర్లు.. ఈ నివేదికలోని సమాచారం ప్రకారం చూస్తే దేశంలో 59.1 కోట్ల మంది గేమర్స్ ఉన్నారు. అంతర్జాతీయంగా ఉన్న గేమర్లలో 20 శాతం ఇక్కడే ఉన్నారు. 11.2 బిలియన్ మొబైల్ గేమ్ యాప్ డౌన్లు నమోదయ్యాయి. 1,900 గేమింగ్ కంపెనీలతో ఈ రంగం సుమారుగా 1.3 లక్షల మంది నిపుణులకు ఉపాధి కల్పిస్తోంది. ఈ రంగం 3 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) ఆకర్షించడం గమనార్హం. ప్రస్తుతం రూ.32 వేల కోట్ల ఆన్లైన్ గేమింగ్ మార్కెట్లో రియల్ మనీ గేమ్స్ (ఆర్ఎంజీ) వాటా 85.7 శాతంగా ఉంటే, 2029 నాటికి రూ.80 వేల కోట్ల మార్కెట్లోనూ 80 శాతం వాటా కలిగి ఉంటుందని ఈ నివేదిక పేర్కొంది. నాన్ రియల్ మనీ గేమ్స్ మార్కెట్ వాటా ఇదే కాలంలో 14.3 శాతం నుంచి 20 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. దేశంలో ఏకైక లిస్టెడ్ గేమింగ్ సంస్థ నజారా టెక్నాలజీస్ అంతర్జాతీయంగా లిస్టెడ్ గేమింగ్ కంపెనీల్లో అధిక ప్రీమియం వ్యాల్యుయేషన్ను సొంతం చేసుకున్నట్టు తెలిపింది. ‘‘ప్రస్తుత ఆన్లైన్ గేమింగ్ రంగం మార్కెట్కు (32వేల కోట్లు) నజారా మాదిరే విలువను ఆపాదించినట్టయితే.. అప్పుడు ఇతర గేమింగ్ కంపెనీల ఐపీవోల రూపంలో ఇన్వెస్టర్లకు 26 బిలియన్ డాలర్ల విలువ సమకూరనుంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకుతోడు, బలపడుతున్న గేమ్ డెవలపర్ ఎకోసిస్టమ్, సానుకూల నియంత్రణ వాతావరణంతో 2034 నాటికి ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ పరిమాణం 60 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. 20 లక్షల ఉపాధి అవకాశాలను తెచ్చిపెడుతుంది’’అని వివరించింది.
27న ఉప సర్పంచ్ ఎన్నికలు
నవ్వించడానికి చేసిన సినిమా ఇది
డిజిటల్ లావాదేవీలతో పాటు..ఆర్థిక మోసాలు పెరుగుతున్నాయి
వచ్చే నెలలోనే కొత్త సారథి..!
విరామం అంటూనే విరుచుకుపడింది
పేరు ఏదైతేనేం... అంతా అణచివేతే!
‘యువిక’.. భావి శాస్త్రవేత్తలకు వేదిక
అన్నదాన క్షేత్రంలో అరాచక పర్వం!
నిను వీడని ‘నాగు’ను నేను!
ఫ్రీ బస్సు ‘బాబూ’
Sunita Williams: ఆ తొమ్మిది నెలలు ఎలాంటి ఆహారం తీసుకున్నారంటే..?
భూమి మీదకు సునితా విలియమ్స్
సునీతా విలియమ్స్ ఫ్యామిలీ గురించి తెలుసా?
‘‘నాన్నా చంపొద్దు.. ప్లీజ్’’
బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత పారితోషికమా?
ఈ రాశి వారికి కుటుంబంలో శుభకార్యాలు.. ఆస్తి ఒప్పందాలు
చైతూతో ప్రేమకథ అలా మొదలైంది.. రివీల్ చేసిన శోభిత ధూళిపాల
'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?
SSMB29 ఒడిశా షెడ్యూల్ పూర్తి.. ఫొటోలు వైరల్
క్లోజ్ అవుతున్న పోస్టాఫీస్ స్కీమ్..
27న ఉప సర్పంచ్ ఎన్నికలు
నవ్వించడానికి చేసిన సినిమా ఇది
డిజిటల్ లావాదేవీలతో పాటు..ఆర్థిక మోసాలు పెరుగుతున్నాయి
వచ్చే నెలలోనే కొత్త సారథి..!
విరామం అంటూనే విరుచుకుపడింది
పేరు ఏదైతేనేం... అంతా అణచివేతే!
‘యువిక’.. భావి శాస్త్రవేత్తలకు వేదిక
అన్నదాన క్షేత్రంలో అరాచక పర్వం!
నిను వీడని ‘నాగు’ను నేను!
ఫ్రీ బస్సు ‘బాబూ’
Sunita Williams: ఆ తొమ్మిది నెలలు ఎలాంటి ఆహారం తీసుకున్నారంటే..?
భూమి మీదకు సునితా విలియమ్స్
సునీతా విలియమ్స్ ఫ్యామిలీ గురించి తెలుసా?
‘‘నాన్నా చంపొద్దు.. ప్లీజ్’’
బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత పారితోషికమా?
ఈ రాశి వారికి కుటుంబంలో శుభకార్యాలు.. ఆస్తి ఒప్పందాలు
చైతూతో ప్రేమకథ అలా మొదలైంది.. రివీల్ చేసిన శోభిత ధూళిపాల
'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?
SSMB29 ఒడిశా షెడ్యూల్ పూర్తి.. ఫొటోలు వైరల్
క్లోజ్ అవుతున్న పోస్టాఫీస్ స్కీమ్..
సినిమా

మంచు లక్ష్మి నిర్మాతగా సైకలాజికల్ థ్రిల్లర్.. మోహన్ బాబు లుక్ రివీల్
టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈరోజు ఆయన పుట్టిన రోజు కావడంతో మరో మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు. దక్ష అనే మెడికల్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో మోహన్ బాబు నటిస్తున్నారు. ఈ సినిమాకు వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు.ఈ సినిమాను మంచు ఎంటర్ టైన్మెంట్, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు లక్ష్మీ ప్రసన్న, మార్కో స్టార్ సిద్ధిక్, సముద్రఖని, విశ్వంత్, చిత్రా శుక్లా, మహేష్, వీరేన్ తంబిదొరై ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ వేసవి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.Happy Birthday Dear Legend! Back with another banger, #Daksha The Deadly Conspiracy. Proud to be a producer alongside you. 🧿❤️ pic.twitter.com/AV09pC3wLs— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 19, 2025

రాబిన్హుడ్తో మల్లారెడ్డి.. అదిదా సర్ప్రైజ్ అంటోన్న మల్లన్న!
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం రాబిన్హుడ్. ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కించారు. భీష్మ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా నటించారు. ఈ మూవీ ద్వారా వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.ప్రస్తుతం రాబిన్హుడ్ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో చిత్రబృందం ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని మల్లా రెడ్డి మెడికల్ సైన్సెస్ కాలేజీలో మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మల్లా రెడ్డి కూడా హాజరయ్యారు. ఇంకేముంది మల్లన్న తన టాలెంట్ను మరోసారి ప్రదర్శించారు. వేదికపై నితిన్తో కలిసి స్టెప్పులు వేశారు. రాబిన్హుడ్ మూవీలోని అదిదా సర్ప్రైజ్ అంటూ సాగే ఐటమ్ సాంగ్కు డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ మల్లన్నా మజాకా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. రాబిన్హుడ్ చిత్రం ఉగాది కానుకగా ఈనెల 28న థియేటర్లలో సందడి చేయనుంది.Moment of the day 💥💥💥#MallaReddy Garu and @actor_nithiin dance to the trending #AdhiDhaSurprisu songduring team #Robinhood's visit to Malla Reddy Institute of Medical Sciences ❤🔥❤🔥GRAND RELEASE WORLDWIDE ON MARCH 28th.@actor_nithiin @sreeleela14 @VenkyKudumula… pic.twitter.com/oqq8l3HZh2— Mythri Movie Makers (@MythriOfficial) March 19, 2025

మంచు విష్ణు కన్నప్ప మూవీ.. మహదేవ శాస్త్రి గ్లింప్స్ చూశారా?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీని ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్తో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని పలువురు అగ్రతారల ఫస్ట్ లుక్ పోస్టర్లను ఆడియన్స్కు పరిచయం చేశారు. ఈ మూవీలో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.(ఇది చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?)అయితే ఈ చిత్రంలో మోహన్ బాబు మహదేవ శాస్త్రి పాత్రలో అభిమానులను అలరించనున్నారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు కావడంతో ప్రత్యేక గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు. మహదేవ శాస్త్రి పాత్రను పరిచయం చేసే సాంగ్ను గ్లింప్స్ రూపంలో రిలీజ్ చేశారు. ఈ పాటను ఓకేసారి ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆడియన్స్కు పరిచయం చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

రూ.100 కోట్లతో నాగార్జున 100వ సినిమా.. డైరెక్టర్ ఎవరంటే?
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్.. ఈ నలుగురిని టాలీవుడ్కి నాలుగు స్తంభాలు అంటారు. ప్రస్తుతం టాలీవుడ్లో అత్యధిక సినిమాలలో హీరోలుగా నటించింది వీరే. చిరంజీవి ఇప్పటికే 156 చిత్రాలకు పైగా నటించగా.. బాలకృష్ణ కూడా సెంచరీ పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు నాగార్జున(Nagarjuna) తన 100వ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే హీరోగా 99 చిత్రాల్లో నటించిన నాగ్.. తన సెంచరీ మూవీ కోసం ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు.నాగ్ సోలో హీరోగా నటించిన చివరి చిత్రం 'నా సామి రంగ'. ఇది గతేడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజైంది. ఆ తర్వాత సోలో సినిమా ఇంత వరకూ ప్రకటించలేదు. ఇప్పుడు తన బెంచ్ మార్క్ సినిమా కోసం అదిరిపోయే ప్లాన్ వేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కింగ్ నాగ్ నటించబోయే 100వ సినిమాని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మార్చేందుకు స్కెచ్ వేస్తున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోందిప్రస్తుతం నాగార్జున ‘కుబేర’, ‘కూలీ’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇవి పూర్తయిన తర్వాత 100వ సినిమా ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. తాజా వార్తల ప్రకారం, ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. కార్తీక్ గతంలో తమిళంలో ‘నితం ఓరువానం" చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ సినిమా తెలుగులో 'ఆకాశం' పేరుతో డబ్ అయ్యింది. ఇక్కడ ఆశించిన స్థాయిలో ఆ చిత్రం ఆడలేదు కానీ దర్శకుడు కథను తెరపై చూపించిన విధానం నాగ్కి బాగా నచ్చిందట. వెంటనే అతన్ని పిలిపించి..వందో చిత్రం బాధ్యతలు అప్పజెప్పాడట.తన 100వ విజువల్ వండర్గా, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని నాగ్ కోరుకుంటున్నట్లు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నిన్న మొన్నటి వరకు నాగార్జున వందో చిత్రానికి పూరి జగన్నాధ్, బెజవాడ ప్రసన్న కుమార్, తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా, నవీన్ పేర్లు గట్టిగా వినిపించాయి.. అయితే, తాజా సమాచారం ప్రకారం కార్తీక్తోనే ఈ ప్రాజెక్ట్ ఖరారైనట్లు కనిపిస్తోంది. షూటింగ్ ఈ ఏడాది చివరలో లేదా 2026 ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. నాగ్ అభిమానులకు ఆకట్టుకునేలా ఓ సూపర్ స్టోరీని రెడీ చేశాడట కార్తీక్. రూ. 100 కోట్ల భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్ లో నాగ్ సెంచరీ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

రూ.4 కోట్ల 75 లక్షలు!
ముంబై: భారత క్రికెట్ జట్టు లెగ్స్పిన్నర్ యుజువేంద్ర చహల్, ధనశ్రీ వర్మ మధ్య వివాహ బంధం అధికారికంగా ముగింపు దశకు వచ్చింది. వీరిద్దరు చాలా కాలంగా దూరంగానే ఉంటున్నా ఈ ఏడాది ఫిబ్రవరి 5న తమ విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారు. కానీ హిందూ వివాహ చట్టం ప్రకారం సర్దుబాటు కోసం ప్రయత్నించేందుకు వీలుగా కనీసం ఆరు నెలల సమయం ఇస్తారు. దీనినే ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’గా చెబుతారు.అయితే తాము రెండున్నరేళ్లకు పైగా విడిగానే ఉంటున్నామని, పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతున్నాం కాబట్టి ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ను తొలగించి వెంటనే విడాకులు మంజూరు చేయాలని చహల్, ధనశ్రీ కోరారు. ఈ విజ్ఞప్తిని ఫ్యామిలీ కోర్టు కొట్టేయడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఐపీఎల్ కారణంగా తాను కనీసం మూడు నెలలు అందుబాటులో ఉండలేనని కూడా చహల్ వెల్లడించాడు. దీనిపై స్పందించిన హైకోర్టు...ఈ నిబంధన నుంచి వీరిద్దరికి సడలింపు ఇవ్వాలని ఆదేశించడంతో పాటు విడాకులకు సంబంధించి గురువారమే తుది తీర్పు ఇవ్వాలని కూడా సూచించింది. మరోవైపు విడాకుల ప్రక్రియను ముగించే క్రమంలో ధనశ్రీకి చహల్ రూ. 4 కోట్ల 75 లక్షలు భరణం రూపంలో చెల్లించనున్నాడు.ఇందులో అతను ఇప్పటికే రూ. 2 కోట్ల 37 లక్షలు ఇచ్చేశాడు. యూట్యూబర్, కొరియాగ్రాఫర్ ధనశ్రీ వర్మతో చహల్కు డిసెంబర్, 2020లో పెళ్లి జరగ్గా... 18 నెలల తర్వాత జూన్ 2022 నుంచి వీరిద్దరు విడిగానే ఉంటున్నారు.

‘అక్షర్తో పోలిస్తే అతడికి కాస్త కష్టమే.. కోహ్లి సూపర్స్టార్డమ్తో పోటీ’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో ఐదు జట్లకు కొత్త కెప్టెన్లు వచ్చారు. లక్నో సూపర్ జెయింట్స్కు రిషభ్ పంత్ (Rishabh Pant), పంజాబ్ కింగ్స్కు శ్రేయస్ అయ్యర్, ఢిల్లీ క్యాపిటల్స్కు అక్షర్ పటేల్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు రజత్ పాటిదార్, కోల్కతా నైట్ రైడర్స్కు అజింక్య రహానే సారథ్యం వహించనున్నారు.అయితే, వీరిలో రజత్ (Rajat Patidar), అక్షర్లకు ఐపీఎల్లో కెప్టెన్గా పనిచేసిన అనుభవం లేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఈ ఇద్దరు కఠిన సవాళ్లు ఎదుర్కోబోతున్నారని టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. అయితే, వీరిద్దరిలో రజత్తో పోలిస్తే అక్షర్పై ఒత్తిడి కాస్త తక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.కోహ్లి సూపర్స్టార్డమ్తోనూ పోటీఇందుకు గల కారణాన్ని వెల్లడిస్తూ.. ‘‘అక్షర్ పటేల్, రజత్ పాటిదార్లను పోల్చి చూస్తే అక్షర్కు కాస్త వెసలుబాటు ఉంటుంది. జట్టు, సారథ్య బాధ్యతలు తీసుకోవడం కొత్తే అయినా.. కొంతమంది పాతవాళ్లు కూడా ఉండటం అక్షర్కు సానుకూలాంశం.రజత్కు కూడా జట్టులో కొంతమంది ఆటగాళ్లతో గతంలో ఆడిన అనుభవం ఉంది. కానీ.. అతడు మిగతా విషయాలతో పాటు.. విరాట్ కోహ్లి సూపర్స్టార్డమ్తోనూ పోటీ పడాల్సి ఉంటుంది. అతడిపై కోహ్లి ప్రభావం కచ్చితంగా ఉంటుంది. కెప్టెన్సీ నైపుణ్యాలు మెరగుపరచుకునే క్రమంలో ఒక్కోసారి కోహ్లిపైనే ఆధారపడాల్సి ఉంటుంది.కోహ్లి నీడలో కాకుండా.. అయితే, నాకు తెలిసి రజత్కు ఆర్సీబీ మేనేజ్మెంట్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఉంటుందనిపిస్తోంది. కోహ్లి నీడలో కాకుండా.. రజత్ తన మార్కు చూపిస్తే బాగుంటుంది. ఏదేమైనా ఈసారి ఆర్సీబీ, కోల్కతా, ఢిల్లీ జట్లు తమ కొత్త కెప్టెన్లతో ఎలాంటి ఫలితాలు సాధిస్తాయో చూడాలని ఆతురతగా ఉంది.ముఖ్యంగా రజత్పైనే ఎక్కువ మంది దృష్టి సారిస్తారు అనడంలో సందేహం లేదు. ఆర్సీబీకి ఉన్న క్రేజ్ అలాంటిది. ఈ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు.. కాబట్టి రజత్ ఆ రాతను మారుస్తాడో లేదో చూడాలి. దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్ జట్టుకు విజయాలు అందించిన ఘనత అతడికి ఉంది. అయితే, ఐపీఎల్లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయడం అంత సులువేమీ కాదు’’ అని రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22న కోల్కతా- బెంగళూరు మధ్య మ్యాచ్తో మొదలుకానుంది.ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టువిరాట్ కోహ్లి, రజత్ పటిదార్, యశ్ దయాళ్, జోష్ హాజల్వుడ్, ఫిల్ సాల్ట్,జితేశ్ శర్మ, భువనేశ్వర్ కుమార్, లియామ్ లివింగ్స్టోన్, రసిక్ ధార్, కృనాల్ పాండ్యా , టిమ్ డేవిజ్, జాకబ్ బెథెల్, సుయాశ్ శర్మ, దేవ్దత్ పడిక్కల్, తుషార, రొమరియో షెఫర్డ్, లుంగి ఎంగిడి, స్వప్నిల్ సింగ్, మనోజ్, మోహిత్ రాఠి, అభినందన్, స్వస్తిక్ చికార.చదవండి: ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టం: హార్దిక్ పాండ్యా

‘రేపు మీ బౌలింగ్ను చితక్కొడతాను చూడు!.. అన్నంత పని చేశాడు’
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)పై ఒకప్పటి సహచర ఆటగాడు, అతడి స్నేహితుడు అమన్ ఖాన్ (Aman Khan) ప్రశంసలు కురిపించాడు. అయ్యర్లో ఆత్మవిశ్వాసం మెండు అని.. ఓ మ్యాచ్లో చెప్పి మరీ తమ జట్టు బౌలింగ్ను చితక్కొట్టాడని గుర్తు చేసుకున్నాడు. ప్రత్యర్థి ఎవరన్న అంశంతో సంబంధం లేకుండా దూకుడుగా ముందుకు సాగుతాడని కొనియాడాడు.పునరాగమనంలో సూపర్ హిట్కాగా గాయం సాకు చూపి రంజీ మ్యాచ్ ఆడకుండా తప్పించుకున్నాడన్న ఆరోపణలతో శ్రేయస్ అయ్యర్ గతేడాది సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. జాతీయ జట్టుకు దూరమైన అతడు.. కఠిన శ్రమకోర్చి దేశవాళీ క్రికెట్లో తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు.ముంబై తరఫున బరిలోకి దిగి రంజీ (ఫస్ట్ క్లాస్), విజయ్ హజారే ట్రోఫీ (వన్డే), సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (టీ20)లలో విధ్వంసకర ఇన్నింగ్స్తో పరుగుల సునామీ సృష్టించాడు. ఈ క్రమంలో తిరిగి జాతీయ జట్టుకు ఎంపికైన శ్రేయస్ అయ్యర్.. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లోనూ అదరగొట్టాడు.దుబాయ్ వేదికగా జరిగిన ఈ వన్డే టోర్నమెంట్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన అయ్యర్.. టీమిండియా చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 243 పరుగులు సాధించి భారత్ తరఫున టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 మెగా వేలంలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ భారీ ధర పలికిన విషయం తెలిసిందే.రూ. 26.75 కోట్లుపంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 26.75 కోట్లకు శ్రేయస్ అయ్యర్ను కొనుగోలు చేసి.. కెప్టెన్గా నియమించింది. గతేడాది కోల్కతా నైట్ రైడర్స్ను చాంపియన్గా నిలిపిన అతడిని ఈసారి తమ సొంతం చేసుకుని పగ్గాలు అప్పగించింది. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ గురించి కోల్కతా మాజీ ఆల్రౌండర్ అమన్ ఖాన్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.రేపు మీ బౌలింగ్ను చితక్కొడుతాను చూడు‘‘విజయ్ హజారే మ్యాచ్కు ముందు.. నేను, శ్రేయస్ డిన్నర్కు వెళ్లాం. ప్రత్యర్థులుగా పోటీ పడటం గురించి చర్చిస్తూ సరదాగా గడిపాము. శ్రేయస్ ముంబైకి ఆడుతుంటే.. నేను పాండిచ్చేరికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరుసటి రోజు మ్యాచ్ గురించి చెబుతూ.. ‘రేపు మీ బౌలింగ్ను చితక్కొడుతాను చూడు’ అన్నాడు.పదహారు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతోఅన్నట్లుగానే సెంచరీ చేశాడు. కేవలం 133 బంతుల్లోనే 137 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగతా ముంబై బ్యాటర్లంతా పరుగులు రాబట్టేందుకు ఆపసోపాలు పడుతున్న వేళ శ్రేయస్ అయ్యర్ మాత్రం ముందు రోజు రాత్రి నాకేం చెప్పాడో అది చేసి చూపించాడు’’ అని అమన్ ఖాన్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు.కాగా గతేడాది విజయ్ హజారే మ్యాచ్లో భాగంగా పాండిచ్చేరితో తలపడ్డ ముంబై.. 82 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన వేళ శ్రేయస్ బ్యాట్ ఝులిపించాడు. పదహారు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో శతక్కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2022స సీజన్లో శ్రేయస్ కెప్టెన్సీలో కేకేఆర్ తరఫున అమన్ ఖాన్ ఆడాడు. తాము తప్పకుండా టైటిల్ గెలుస్తామని అతడు తరచూ చెప్పేవాడని.. అన్నట్లుగానే 2024లో కోల్కతాను చాంపియన్గా నిలిపాడని అమన్ ఖాన్ గుర్తు చేసుకున్నాడు. ఆటగాళ్లపై అరవడం, మైదానంలో దూకుడుగా కనిపించడం శ్రేయస్ శైలి కాదని.. కూల్గానే తను అనుకున్న ఫలితం రాబట్టడంలో అతడు దిట్ట అని ప్రశంసించాడు.చదవండి: ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టం: హార్దిక్ పాండ్యా

విధ్వంసకర వీరులు.. పంత్కు పగ్గాలు.. లక్నో ఫైనల్ చేరుతుందా?
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో 2022లో అరంగేట్రం చేసింది. వరుసగా రెండు (2022, 2023) సీజన్లలో మూడో స్థానంలో నిలిచి.. ప్లే ఆఫ్స్ చేరింది. అయితే, గతేడాది మాత్రం లక్నోకు ఎదురు దెబ్బతగిలింది. తొలిసారిగా ఐపీఎల్లో లీగ్ దశ నుంచే నిష్క్రమించింది. ఏడు విజయాలు, ఏడు పరాజయాలతో 14 పాయింట్లతో ఏడవ స్థానంతో ముగించింది.ఈ నేపథ్యంలో 2025 సీజన్ కోసం జట్టులో భారీ మార్పులు చేపట్టింది. ఐపీఎల్ మెగా వేలం ఇందుకు అనువుగా ఉపయోగించుకుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏసీఏ-విడిసిఏ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ మార్చి 24 (గురువారం)న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ తో లక్నో సూపర్ జెయింట్స్ తన ఐపీఎల్ టైటిల్ వేట ప్రారంభిస్తుంది.భారీ మార్పులతో కొత్త సీజన్లోకి ప్రారంభంలో నికోలస్ పూరన్ (Nicholas Pooran), రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, ఆయుష్ బదోని, మోసిన్ ఖాన్ వంటి ఆటగాళ్ళని రెటైన్ చేసుకుంది. అయితే అనూహ్యంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul)ను తప్పించాలని నిర్ణయించింది. రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరాడు. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant)ను రూ. 27 కోట్ల భారీ బిడ్తో కొనుగోలుచేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో నే అత్యంత ఖరీదైన ఒప్పందంగా రికార్డ్ నెలకొల్పింది.ఇంకా వేలంలో డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రామ్ మరియు మిచెల్ మార్ష్ వంటి విదేశీ ఆటగాళ్ల ను జట్టులో చేర్చుకుంది. వీరు కాక అవేష్ ఖాన్, అబ్దుల్ సమద్, ఆర్యన్ జుయల్, ఆకాష్ దీప్ వంటి వారిని కూడా తీసుకున్నారు. విధ్వంసకర ఆటగాళ్లు.. ఫైనల్ చేరేనా?రిషబ్ పంత్తో పటు విధ్వంసకర ఆటగాళ్లుగా పేరుపొందిన మాథ్యూ బ్రీట్జ్కే, నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్ వంటి ఆటగాళ్లు ఉన్నందున లక్నో జట్టు బ్యాటింగ్ ఫైర్ పవర్ పూర్తి స్థాయిలో ఉందని చెప్పవచ్చు.ఇంకా ఆల్ రౌండర్లు మిచెల్ మార్ష్, షాబాజ్ అహ్మద్ జట్టు కు సమతుల్యతను తెస్తారు. అవేష్ ఖాన్, మోసిన్ ఖాన్, రవి బిష్ణోయ్ నేతృత్వంలోని బౌలింగ్ యూనిట్ ఏ బ్యాటింగ్ లైనప్నైనా కూల్చివేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ భారీ మార్పులు తర్వాత ఇప్పుడు రిషబ్ పంత్ నాయకత్వంలో ఐపీఎల్ ఫైనల్కి చేరాలని లక్నో ఆశిస్తోంది.గంభీర్ వెళ్లిపోయిన తర్వాతఅలాగే, 2024 సీజన్ ప్రారంభంలో మెంటార్ గౌతమ్ గంభీర్ జట్టును విడిచిపెట్టి కోల్కతాలో చేరాడు. గంభీర్ రెండు సీజన్ లలో లక్నో జట్టుకు మెంటార్ గా పనిచేసాడు. ఇప్పుడు అతడి స్థానంలో దక్షిణాఫ్రికా లెజెండ్ లాన్స్ క్లూసెనర్ను అసిస్టెంట్ కోచ్గా చేర్చుకోవడం ద్వారా కోచింగ్ సిబ్బందిని బలోపేతం చేసింది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ జస్టిన్ లాంగర్ నాయకత్వంలో క్లూసెనర్ నైపుణ్యం ఉండటంతో, లక్నో చివరి అడ్డంకులను అధిగమించి రాబోయే సీజన్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.లక్నో సూపర్ జెయింట్స్ జట్టు లో ప్రధాన ఆటగాళ్లురిషబ్ పంత్లక్నో సూపర్ జెయింట్స్ బిడ్డింగ్ పోరులో విజయం సాధించి, రిషబ్ పంత్ను రూ. 27 కోట్లకు దక్కించుకుంది. ఈ చారిత్రాత్మక బిడ్లో గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి, పంత్ను టోర్నమెంట్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిపింది. పంత్ చేరికతో లక్నో వ్యూహం, స్వరూపం పూర్తిగా మారే అవకాశముంది.నికోలస్ పూరన్ఈ వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ తన అసాధారణ ప్రతిభ తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. అందుకే లక్నో ఈ ఆటగాడ్ని వేలానికి ముందే రెటైన్ చేసుకుంది. 76 ఐపీఎల్ మ్యాచ్ లలో పూరన్ 160 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో 1,769 పరుగులు చేశాడు, తొమ్మిది అర్ధ సెంచరీలు కూడా సాధించాడు. అతని అపార సామర్థ్యం కారణంగా జట్టులో కీలకమైన ఆటగాడనడంలో సందేహం లేదు.డేవిడ్ మిల్లర్మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే డేవిడ్ మిల్లర్ ఇప్పటికే మ్యాచ్ విన్నర్గా నిరూపించుకున్నాడు. డేవిడ్ మిల్లర్ 130 ఐపీఎల్ మ్యాచ్ లలో 13 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీతో దాదాపు 140 స్ట్రైక్ రేట్ తో 2,924 పరుగులు చేశాడు.మయాంక్ యాదవ్మయాంక్ యాదవ్ బౌలింగ్లో లక్నోకి కీలకమైన ఆటగాడిగా ఉండే అవకాశముంది. లక్నో రూ. 11 కోట్లకు మయాంక్ యాదవ్ ను కొనుగోలు చేసింది. వేగం, వైవిధ్యం మయాంక్ సొత్తు. కొత్త బంతితో పాటు డెత్ బౌలింగ్లో కూడా మయాంక్ బాగా రాణించగలనని ఇప్పటికే నిరూపించాడు.ఆయుష్ బదోనిలక్నో జట్టుతో చేరినప్పటి నుంచి ఆయుష్ బదోని తన క్రికెట్ కెరీర్లో భారీ పురోగతి సాధించాడు. 25 ఏళ్ల ఈ స్టైలిష్ బ్యాటర్ 2022 సీజన్లో రెండు మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడటం ద్వారా ఫ్రాంచైజీపై తనదైన ముద్ర వేశాడు. అయితే, టోర్నమెంట్ కొనసాగే కొద్దీ అతని ఫామ్ క్షీణించింది. కొద్దిగా నిలకడ తగ్గినప్పటికీ లక్నో అతన్ని రెటైన్ చేయాలని నిర్ణయించింది.లక్నో సూపర్ జెయింట్స్ జట్టులక్నో సూపర్ జెయింట్స్ జట్టునికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మొసిన్ ఖాన్, ఆయుష్ బదోని, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, అవేష్ ఖాన్, అబ్దుల్ సమద్, ఆర్యన్ జుయల్, ఆకాష్ దీప్, హిమ్మత్ సింగ్, ఎం. సిద్ధార్థ్, దిగ్వేష్ సింగ్, ప్రిన్స్ యాదవ్, యువరాజ్ చౌదరి, రాజవర్ధన్ హంగర్గేకర్, షెహబాజ్ అహ్మద్, షమార్ జోసెఫ్, అర్షిన్ కులకర్ణి, మాథ్యూ బ్రీట్జ్కే. చదవండి: ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టం: హార్దిక్ పాండ్యా Never give up the superpower 👊 pic.twitter.com/NtahEerR2x— Lucknow Super Giants (@LucknowIPL) March 19, 2025
బిజినెస్

స్టాక్ మార్కెట్లు.. హ్యాట్రిక్..
భారతీయ బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు వరుసగా మూడో సెషన్లో లాభాలతో ముగిశాయి. బుధవారం ఇంట్రాడేలో 75,568.38 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 147.79 పాయింట్లు (0.20 శాతం) పెరిగి 75,449.05 వద్ద స్థిరపడింది.అలాగే నిఫ్టీ 73.30 పాయింట్లు (0.32 శాతం) పెరిగి 22,907.60 వద్ద ముగిసింది. బుధవారం ఈ సూచీ 22,940.70 నుంచి 22,807.95 శ్రేణిలో ట్రేడ్ అయింది.శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు 3.91 శాతం వరకు లాభపడ్డాయి. నిఫ్టీ 50లో టెక్ మహీంద్రా, బ్రిటానియా, టీసీఎస్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా షేర్లు 2.32 శాతం వరకు నష్టపోయాయి.నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఐటీ మినహా ఎన్ఎస్ఈలోని అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి.

ఆశా వర్కర్లకు చేదోడుగా ఏఐ
దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య సంరక్షణ అవసరాలు తీర్చడం నిత్యం సవాలుగా మారుతోంది. గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు (ఆశా కార్యకర్తలు) మాతా శిశు ఆరోగ్యానికి జీవనాధారంగా నిలుస్తున్నారు. అపారమైన అంకితభావంతో ఉన్న ఈ ఫ్రంట్లైన్ హెల్త్కేర్ వర్కర్లు ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సమర్థంగా నిధులు నిర్వర్తిస్తున్నారు. నవజాత శిశువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వాధ్వానీ ఏఐ అభివృద్ధి చేసిన ‘శిశు మాపన్’ను వినియోగిస్తూ సమర్థవంతమైన సేవలందిస్తున్నారు.శిశువుల ఆరోగ్య పర్యవేక్షణశిశు మాపన్ అనేది నవజాత శిశువుల ఆంత్రోపోమెట్రిక్ కొలతలు(ఎత్తు-నిలబడినప్పుడు కుర్చునప్పుడు, బరువు, బాడీ మాస్ ఇండెక్స్, నడుము చుట్టుకొలత..)ను రికార్డ్ చేయడంలో ఆశా వర్కర్లకు సహాయపడటానికి రూపొందించిన అత్యాధునిక పరిష్కారంగా ఉంది. ఈ కొలతలు పిల్లల ఆరోగ్యం, సంరక్షణకు కీలకమైన సూచికలుగా ఉంటాయి. సాంప్రదాయకంగా ఈ కొలతలను సేకరించడానికి ప్రత్యేక శిక్షణ, పరికరాలు అవసరం అవుతాయి. కానీ దీనివల్ల సేకరించే డేటాలో కచ్చితత్వం లోపిస్తుంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం పెరగడంతో ‘శిశు మాపన్’ ద్వారా ఈ సవాళ్లను అధిగమించే ప్రయత్నం చేశారు.ఎలా పని చేస్తుందంటే..ఆశా వర్కర్లు బేసిక్ స్మార్ట్ఫోన్ను ఉపయోగించి నవజాత శిశువుకు చెందిన చిన్న వీడియోను రికార్డ్ చేస్తారు. రియల్ టైమ్లో కచ్చితమైన కొలతలను అందించడానికి ఇందులోని ఏఐ వీడియోను ప్రాసెస్ చేస్తుంది. బేసిక్ కెమెరా సామర్థ్యాలతో పాత స్మార్ట్ఫోన్లలోనూ పనిచేసేలా ఈ యాప్ను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇది భారతదేశం గృహ ఆధారిత నవజాత శిశు సంరక్షణ (హెచ్బీఎన్సీ) కార్యక్రమానికి అనుసందానం అయి ఉంటుంది. దాంతో ఆరోగ్య కార్యకర్తలు నిరంతరాయంగా శిశువు సంరక్షణ చర్యలు ట్రాక్ చేసేందుకు వీలవుతుంది.శిశు మాపన్ మొబైల్ అప్లికేషన్లో ఆశా వర్కర్లు కచ్చితమైన, స్థిరమైన కొలతలను రికార్డ్ చేస్తున్నారు. ఏఐ ఆధారిత టూల్ శిశువుల నుంచి వెంటనే ఫీడ్ బ్యాక్ను అందిస్తుంది. సంభావ్య ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది. అందుకు సంబంధించిన మెడికేషన్ కోసం ప్రాథమికంగా తోడ్పడుతుంది. ఈ ప్రక్రియల క్రమబద్ధీకరణ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా నవజాత శిశువులు, వారి కుటుంబాలకు అందించే ఆరోగ్య సేవల నాణ్యతను కూడా పెంచుతుంది.ఆశా వర్కర్లకు సాధికారతశిశు మాపన్ యాప్ను సమర్థవంతంగా ఉపయోగించడానికి 450 మంది ఆశా వర్కర్లకు శిక్షణ ఇచ్చిన దాద్రా నగర్ హవేలీ, డామన్-డయ్యూ వంటి ప్రాంతాల్లో దీని ప్రభావం గణనీయంగా మారిందని నిర్వాహకులు తెలిపారు. ఈ శిక్షణ ఆశావర్కర్లకు వారి దినచర్యలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే ఆత్మవిశ్వాసాన్ని అందించింది. ఈ ఏఐ ఆధారిత టూల్ను తమ పనిలో అనుసంధానించడం ద్వారా నవజాత శిశువుల సంరక్షణలో మెరుగైన ఫలితాలను అందించడానికి ఆశావర్కర్లు సన్నద్ధమయ్యారు.ఇదీ చదవండి: దాచుకోవాల్సిన డబ్బులు.. వాడేసుకుంటున్నారు!ఏఐలో నిత్యం వస్తున్న ఆవిష్కరణలు విభిన్న రంగాల్లో కీలక మార్పులు తీసుకొస్తున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మారుమూల ప్రాంతాల్లోని సమస్యలకు పరిష్కారాలు అందుతున్నాయి. దాంతోపాటు పనులు సులువుగా, కచ్చితత్వంతో పూర్తయ్యే వెసులుబాటు ఉంటుంది. ఏఐ కేవలం టెక్ నిపుణులకు మాత్రమే అందుబాటులో ఉంటుందనే అపోహలకు దూరంగా, స్మార్ట్ పరికరాలపై కొంత అవగాహన ఉన్న సామాన్యులకు కూడా చేరువవుతోంది. ఈ విభాగంలో మరిన్ని ఆవిష్కరణలు వచ్చి, మరింత మందికి సర్వీసులు అందించేలా కంపెనీలు, వ్యవస్థలు కృష్టి చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భారత్ ఏఐ మిషన్ పార్లమెంట్తో ఒప్పందం
భారత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీలో స్వావలంబన దిశగా భారతఏఐ మిషన్ భారత పార్లమెంటుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. చాట్ జీపీటీని పోలిన లార్జ్ ల్యాంగ్వేజీ మోడల్ (ఎల్ఎల్ఎం)తో సహా స్వదేశీ కృత్రిమ మేధ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి పార్లమెంటు విస్తృతమైన బహుభాషా డేటాసెట్లను ఉపయోగించుకోవాలని ఈ సహకారం లక్ష్యంగా పెట్టుకుంది. స్వదేశీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలను సృష్టించే అవసరాలను నొక్కి చెబుతూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ‘రైసినా డైలాగ్ 2025’ సందర్భంగా ఈమేరకు వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ‘ఇండియా ఏఐ మిషన్ దేశం ప్రత్యేక అవసరాలను తీర్చే ఏఐ సామర్థ్యాలను నిర్మించడంపై దృష్టి సారించింది. ఓపెన్ ఏఐ వంటి గ్లోబల్ సంస్థల నుంచి ఓపెన్ సోర్స్ టెక్నాలజీల వాడకం దీర్ఘకాలంలో నిలకడగా ఉండకపోవచ్చు. సొంత దేశీయ ఎల్ఎల్ఎంను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే పార్లమెంటుతో భాగస్వామ్యం డేటా సెట్లకు అవకాశం కల్పిస్తుంది. ఇది కృత్రిమ మేధ నమూనాలకు శిక్షణ ఇవ్వడానికి కీలకమైన వనరుగా పనిచేస్తుంది. దూరదర్శన్, ఆలిండియా రేడియో వంటి సంస్థల నుంచి అదనపు డేటాసెట్లు ఈ చొరవకు మరింత తోడ్పాడు అందుతుంది’ అని చెప్పారు.లాభాపేక్షలేని సంస్థ నుంచి లాభాపేక్ష సంస్థగా ఓపెన్ఏఐని మార్చడంపై ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిబంధనలను అతిక్రమించి లాభాపేక్ష సంస్థగా మారితే ఓపెన్ఏఐ తన పేరును కూడా మార్చుకోవాలని వైష్ణవ్ పేర్కొన్నారు. దేశంలో సొంత జీపీయూ (గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్) చిప్ను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యమని, దీనిపై ప్రభుత్వం ఇప్పటికే పరిశ్రమతో కలిసి పనిచేయడం ప్రారంభించిందని మంత్రి చెప్పారు. స్వదేశీ జీపీయూ సామర్థ్యాన్ని సాధించేందుకు పట్టే కాలపరిమితి గురించి అడిగినప్పుడు వైష్ణవ్ మాట్లాడుతూ మూడు నుంచి ఐదేళ్లలో సహేతుకమైన మంచి సామర్థ్యాన్ని పొందడానికి వీలైన జీపీయూ సాధిస్తామన్నారు.ఇదీ చదవండి: ఫస్ట్టైమ్ బంగారం ధర ఎంతకు చేరిందంటే..ఇండో-యూఎస్ వెంచర్ పార్ట్నర్స్ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ పార్ట్నర్ వినోద్ ధామ్ మాట్లాడుతూ జీపీయూ అభివృద్ధికి మంత్రి ఇచ్చిన గడువు చాలా సహేతుకంగా ఉందన్నారు. భారత్ తన సొంత ఏఐ మోడల్ను నిర్మించుకోవడానికి ఓపెన్ఏఐ వంటి ఓపెన్సోర్స్ మోడల్స్ను ఉపయోగించుకోవాలని, కానీ రహస్య కార్యకలాపాలకు పాశ్చాత్య ఏఐ నమూనాలను ఉపయోగించరాదని ఆయన అన్నారు. భవిష్యత్తులో కంప్యూటింగ్ అవసరాలు పెరుగుతాయని చెప్పారు. అందుకోసం జీపీయూ వృద్ధి చెందాల్సి ఉందని తెలిపారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ తరహా ఫండింగ్ను ఈ విభాగంలో ప్రవేశపెట్టాలని సూచించారు. వచ్చే 2-3 ఏళ్ల పాటు ఏఐకు ఇదే తరహా నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు.

ఫస్ట్టైమ్ బంగారం ధర ఎంతకు చేరిందంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర బుధవారం జీవితకాల గరిష్టాలను చేరింది. సమీప భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.82,900 (22 క్యారెట్స్), రూ.90,440 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.400, రూ.440 పెరిగింది.ఇదీ చదవండి: స్టార్లింక్ సర్వీసులపై స్పెక్ట్రమ్ ఫీజు?చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.440 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.82,900 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.90,440 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.400 పెరిగి రూ.83,050కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.440 పెరిగి రూ.90,590 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే బుధవారం వెండి ధర(Silver Prices)ల్లోనూ మార్పులు కనిపించాయి. నిన్నటి ధరలతో పోలిస్తే వెండి కేజీపై ఏకంగా రూ.1,000 పెరిగి రూ.1,14,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఫ్యామిలీ

Sai Divesh Chowdary : అమెరికాలో హైదరాబాద్ కుర్రాడికి రూ. 3 కోట్ల ప్యాకేజీ
హైదరాబాదీ కుర్రోడు బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ప్రపంచ ప్రఖ్యాత చిప్ తయారీ సంస్థ ఎన్విడియాలో భారీ వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించాడు. ఒకటీ రెండు కాదు ఏకంగా 3 కోట్ల రూపాయలం ప్యాకేజీతో ఉద్యోగాన్ని సంపాదించాడు. హైదరాబాద్(Hyderabad)లోని ఎల్బీనగర్ చిత్రా లేఅవుట్కు చెందిన గుడె సాయి దివేశ్ చౌదరి (Gude Sai Divesh Chowdary) కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. చిప్మేకర్ ఎన్విడియాలో ఉద్యోగం సాధించిన సాయిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. పట్టుదలకు, మారుపేరుగా నిలిచి, ఆత్మవిశ్వాసంతో ఉన్నత చదువు చదివిన సాయి దివేశ్ తనలాంటి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. దివేశ్ తండ్రి కృష్ణ మోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. తల్లి రమాదేవి పబ్లిక్ స్కూల్లో టీచర్గా పదేళ్ల పాటు పనిచేశారు. చిన్నప్పటినుంచీ చదువులో అద్భుత ప్రతిభ కనబరిచేవాడు సాయి దివేశ్. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు హైదరాబాద్లోని రమాదేవి పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు.ఇంటర్లో అత్యుత్తమ స్కోర్ సాధించి, ఎన్ఐటీ కురుక్షేత్రలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఈ సమయంలోనే న్యూటానిక్స్ కంపెనీలో రూ.40లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. అయితే ఉన్నత చదువు చదవాలనే లక్ష్యంతో లాస్ఏంజెల్స్లోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో క్లౌడ్, ఏఐ టెక్నాలజీలో ఎంఎస్ పూర్తి చేశాడు. ఎన్విడియా కంపెనీలో డెవలప్మెంట్ ఇంజీనీర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కేవలం చదువు మాత్రమే కాదు క్రీడలు, పలు పోటీ పరీక్షల్లో ఎపుడూ ముందుండేడట. అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం పొందిన దివేశ్, ప్రస్తుతం ఏఐ ఆధారిత యాప్ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాడు. విశేషమైన ప్రతిభతో, ప్రపంచ టెక్నాలజీ రంగంలో దివేశ్ సత్తా చాటుకోవాలంటూ నెటిజన్లు శుభాకాంక్షలందించారు.కాగా 2025లో టాప్ ఏఐ చిప్ తయారీ కంపెనీల్లో టాప్లో ఉందీ కంపెనీ 530.7 బిలియన్ల డాలర్ల మార్కెట్ క్యాప్తోప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీగా అవతరించింది ఎన్విడియా. ఇది A100 ,H100 వంటి శక్తివంతమైన GPUలకు ప్రసిద్ధి చెందింది. ఏఐ సృష్టిస్తున్న విప్తవాన్ని దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించింది. వివిధ అప్లికేషన్లలో AI మోడళ్లకు శిక్షణ ఇవ్వడం , అమలు చేయడం కోసం వీటిని వినియోగిస్తారు.

స్ప్రే డ్రైడ్ అవొకాడో పౌడర్..!
అవొకాడో పండులో పౌష్టిక విలువలతో పాటు ఔషధ విలువలు కూడా మెండుగా ఉన్నాయి. ఇది సీజనల్ ఫ్రూట్. కొద్ది నెలలే అందుబాటులో ఉంటుంది. ఏడాది పొడవునా అందుబాటులో ఉండదు కాబట్టి, పొడిగా మార్చి పెట్టుకుంటే.. ఏడాదంతా వాడుకోవచ్చు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టీకల్చరల్ రీసెర్చ్ పండ్ల పరిశోధనా విభాగం అధిపతి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా. జి. కరుణాకరన్, తదితర శాస్త్రవేత్తలు అవొకాడోపై విస్తృత పరిశోధన చేస్తున్నారు. ఐఐహెచ్ఆర్ అవొకాడో పండును ప్రీసెసింగ్ చేసి స్ప్రే డ్రయ్యింగ్ పద్ధతిలో పొడిగా మార్చే సాంకేతికతను రూపివదించింది. అత్యంత నాణ్యమైన అవొకాడో పొడిని ఉత్పత్తి చేయటం ఈ సాంకేతికత ద్వారా సాధ్యమవుతుంది. గది సాధారణ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేస్తే ఈ పొడి మూడు నెలల పాటు నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది. అవొకాడో పండును ఏడాది పొడవునా నిల్వ చేయటం కష్టం. అయితే, ఈ పొడిని నిల్వ చేయటం, రవాణా చేయటం సులభం. ఈ ఉత్పత్తికి మన దేశంలో, విదేశాల్లో కూడా మంచి గిరాకీ ఉంది. రూపాయి పెట్టుబడి పెడితే 1.78 రూపాయల ఆదాయాన్ని పొందటానికి స్ప్రే డ్రయ్యింగ్ సాంకేతికత ఉపయోగపడుతుందని ఐఐహెచ్ఆర్ చెబుతోంది. ఆసక్తి గల ఆహార పరిశ్రమదారులు ఐఐహెచ్ఆర్కు నిర్దేశిత ఫీజు చెల్లించి ఈ సాంకేతికతను పొంది అవొకాడో పొడిని తయారు చేసి అనేక ఉత్పత్తుల్లో వాడుకోవచ్చు లేదా దేశ విదేశాల్లో విక్రయించుకోవచ్చు. ఇతర వివరాలకు.. ఐఐహెచ్ఆర్ వెబ్సైట్ చూడండి. (చదవండి: ఆహారమే ఆరోగ్యం! ఇంటి పంటలే సోపానం!!)

ఆహారమే ఆరోగ్యం! ఇంటి పంటలే సోపానం!!
ఇంటిని పచ్చని పంటలు, మొక్కలతో నందన వనంగా మార్చిన విశ్రాంత ప్రధానోపాధ్యాయిని ఆహారమే ఆరోగ్యం అనే సూత్రాన్ని నమ్మి.. ఇంటినే ఆరోగ్యదాయక పంటలు, మొక్కలతో నందన వనంగా మార్చారు మచిలీపట్నానికి చెందిన ఓ విశ్రాంత ప్రధానోపాధ్యాయుని. ఆమే ఎండీ ముంతాజ్బేగం.కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని హైనీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయునిగా 2019లో ముంతాజ్బేగం ఉద్యోగ విరమణ చేశారు. సేంద్రియ ఇంటిపంటల సాగు ద్వారా ఆరోగ్యకరమైన సమాజానికి దోహదం చేస్తుందని ఆమె ఆచరణాత్మకంగా చాటి చెబుతున్నారు. తాను మొదట ఆచరించి, తర్వాత ఇతరులకు చెప్పాలన్నా వ్యక్తిత్వం ఆమెది. ఇంటి నుంచి వచ్చే చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేస్తూ మొక్కలకు వేసి పెంచుతూ అధిక ఫలసాయాన్ని పొందుతున్నారు. మునగాకు, బెల్లం కలిపి నీళ్లలో నానబెట్టి మొక్కలకు పోయటం.. పొగాకును నీళ్లలో వేసి రెండు, మూడు రోజులు నానబెట్టి మొక్కల వేర్లకు వేస్తే మట్టి ద్వారా వచ్చే తెగుళ్లు నివారించవచ్చని ఆమె తెలిపారు. పెసలు, మినుము, ఉలవలు, బార్లీ, నువ్వులు నానబెట్టి గ్రైండ్ చేసి నీళ్లలో కలిపి మొక్క వేళలో వేస్తే, మంచి దిగుబడి వస్తుందని ఆమె చెబుతున్నారు. ఈ విధంగా చేస్తే మొక్కలకు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందన్నారు. ఆరోగ్యదాయకంగా పెంచుకున్న కూరగాయలు, పండ్లు తింటే ప్రాణాంతక వ్యాధుల బారి నుంచి కూడా తప్పించుకోవచ్చని ఆమె ఘంటాపధంగా చెబుతున్నారు. సేంద్రియ ఇంటిపంటలు ఆరోగ్యకరమైన సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు.మానసిక, శారీరక ఆరోగ్యంముంతాజ్ ఇంటి ఆవరణలో, మిద్దెపై ఎన్నో రకాల కూరగాయలు, పండ్ల మొక్కలను సేంద్రియ పద్ధతుల్లో పెంచుతూ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవటంతో పాటు ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. మొక్కలను సంరక్షిస్తే మానసిక, శారీరక ఆరోగ్యం పొందవచ్చునని ఆమె చెబుతున్నారు. మామిడి, జామ, అరటి, డ్రాగన్, చెర్రీ, వాటర్ యాపిల్, నేరేడు, అంజూర, ఫ్యాషనఫ్రూట్, పీ నట్ బటర్, బొప్పాయి పండ్ల మొక్కలతో పాటు ΄పాలకూర, చుక్కకూర, ఆకుకూరల మొక్కలతోపాటు వంగ, టమాట, అలసంద, మునగ, అరటి, మల్బరీ ఆకులతోపాటు వంద రకాల క్రోటస్ను ఆమె తమ ఇంటి ఆవరణలో, మేడపైన పెంచుతున్నారు. మొక్కలే ప్రాణం.. ఇంటిపంటల ధ్యానం!మొక్కలే ప్రాణంగా ప్రతి రోజు నా దినచర్య ఉంటుంది. రోజు మూడు, మూడున్నర గంటలు వీటి సంరక్షణ కోసం వెచ్చిస్తుంటాను. మొక్కలను సంరక్షిస్తే సమాజం ఆరోగ్యం బాగుంటుందని, భవిష్యత్తు మన చేతిలోనే ఉందనేది అందరికీ తెలియజేయాలనేదే నా తపన. ముఖ్యంగా కూరగాయలు, పండ్ల తొక్కలు, ఇతర సేంద్రియ చెత్తను మునిసి΄ాలిటీ వారికి ఇవ్వకుండా, ఇంటిపట్టునే కం΄ోస్టు ఎరువుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. నర్సరీ నుంచే పిల్లలకు మొక్కలను పెంచటంపై అవగాహన కల్పిస్తే మంచి భవిష్యత్తు సమాజాన్ని సృష్టించుకోవచ్చు. – ఎండీ ముంతాజ్ బేగం, ఇంటి పంటల సాగుదారు, విశ్రాంత ప్రధానోపాధ్యాయిని, మచిలీపట్నం – అంబటి శేషుబాబు, సాక్షి, చిలకలపూడి (మచిలీపట్నం). (చదవండి: ఎదురు లేని వెదురు)

ఎదురు లేని వెదురు
వెదురు.. గ్రీన్ గోల్డ్.. అవును! ఈ విషయంలో మీకేమైనా సందేహం ఉందా? అయితే.. శివాజీ రాజ్పుట్ అనే అద్భుత ఆదర్శ వెదురు రైతు విశేష కృషి గురించి తెలుసుకోవాల్సిందే. మహారాష్ట్రలోని ధూలే జిల్లాకు చెందిన శివాజీ 25 ఎకరాల్లో వెదురును చాలా ఏళ్ల నుంచి సాగు చేస్తూ ప్రతి ఏటా రూ. 25 లక్షలను సునాయాసంగా ఆర్జిస్తున్నారు. తనకున్న 50 ఎకరాల పొలంలో పాతిక ఎకరాల్లో 16 రకాల వెదురు తోటను పెంచుతున్నారు. మిగతా 25 ఎకరాలను ఇతర రైతులకు కౌలుకు ఇచ్చారు.వెదురు సాగులో కొద్దిపాటి యాజమాన్య చర్యలు తప్ప చీకూ చింతల్లేవు, పెద్దగా కష్టపడాల్సిందేమీ ఉండదు. ఏటేటా నిక్కచ్చిగా ఆదాయం తీసుకోవటమే అంటున్నారు శివాజీ. వెదరు సాగు ద్వారా పర్యావరణానికి బోలెడంత మేలు చేస్తున్న ఈ ఆదర్శ రైతు ఉద్యమ స్ఫూర్తితో బంజరు, ప్రభుత్వ భూముల్లో విరివిగా మొక్కలు నాటటం ద్వారా పర్యావరణానికి మరెంతో మేలు చేస్తున్నారు. ఆయన నాటిన 7 లక్షల చెట్లు ఆయన హరిత స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తూ ఆయనకు 30కి పైగా పర్యావరణ పరిరక్షణ పురస్కారాల పంట పండించాయి! ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర, యుఎస్ఎ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వంటి పురస్కారాలు ఆయనకు లభించాయి. పెద్ద కమతాల్లో వెదురు సేద్యానికి సంబంధించి శివాజీ రాజ్పుట్ అనుభవాలు రైతులకు మార్గదర్శకంగా నిలుస్తాయి.శివాజీ రాజ్పుట్ వయసు 60 ఏళ్లు. వినూత్న రీతిలో వెదరును సాగు చేయటం ద్వారా, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయటం ద్వారా ఆయన తన జీవితాన్ని ఆకుపచ్చగా మార్చుకోవటమే కాదు ఇతరుల జీవితాలను కూడా ఆకుపచ్చగా మార్చుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు పాతికేళ్లుగా విశేష కృషి చేస్తున్న శివాజీ గత ఆరేళ్లుగా వెదురు తోటను సాగు చేస్తున్నారు. వాతావరణ ప్రతికూలతలను తట్టుకొనేలా వ్యవసాయాన్ని కొనసాగించటంలో, పర్యావరణ పరిరక్షణ కృషిలో, గ్రామీణాభివృద్ధి రంగంలో మహారాష్ట్రలో ఇప్పుడాయన ఒక మేరు పర్వతం అంటే అతిశయోక్తి కాదు. ఆయన చేస్తున్న కృషి భూతాపోన్నతిని తగ్గించడానికి ఎంతగానో దోహదపడుతోంది.వెదురు సాగుకు శ్రీకారం..రాజ్పుట్ గతంలో అందరు రైతుల మాదిరిగానే ఒకటో రెండో సీజనల్ పంటలను రసాయనిక వ్యవసాయ పద్ధతిలో పండించే వారు. అయితే, భారీ వర్షాలు, పెను గాలులు, కరువు వంటి విపరీత ప్రతికూల వాతావరణ పరిస్థితుల మూలంగా అనిశ్చితిలో కొట్టుమిట్టాడేవారు. ‘భారీ వర్షాలు, పెను గాలులు, కరువు వంటి విపత్తులు వచ్చిపడినప్పుడు సాధారణ పంటలు సాగు చేస్తున్నప్పుడు ఒక్కోసారి పంట పూర్తిగా చేజారిపోయేది. కానీ, వెదురు తోట అలాకాదు. నాటిన ఒక సంవత్సరం తర్వాత నుంచి ఆదాయం వస్తూనే ఉంటుంది. ఏటేటా నిరంతరం పెట్టుబడుల అవసరమే ఉండదు..’అంటారు శివాజీ. సాధారణ పంటల సాగును చుట్టుముట్టిన అనిశ్చితే తనను నిశ్చింతనిచ్చే వెదరు సాగువైపు ఆకర్షించిందంటారాయన. ఆయనకు 50 ఎకరాల భూమి ఉంది. 25 ఎకరాలను కౌలుకు ఇచ్చి, 25 ఎకరాల్లో వెదురు నాటారు. ఈ నిర్ణయమే తన వ్యవసాయాన్ని మేలి మలుపు తిప్పింది. ‘వెదురు సాగులో విపరీత వాతావరణ పరిస్థితుల్లోనూ ఆందోళన చెందాల్సిందేమీ ఉండదు.వెదురు మొక్కలు వేరూనుకొనే వరకు మొదటి ఏడాది కొంచె జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత పెద్ద పని గానీ, పెట్టుబడి గానీ అవసరం ఉండదు. మొదటి ఏడాది తర్వాత నేను పెద్దగా పెట్టిన ఖర్చేమీ లుదు. కానీ, ఏటా ఎకరానికి రూ. లక్ష ఆదాయం వస్తోంది. వెదురు తోట ద్వారా నాకు ఏటేటా రూ. 25 లక్షల ఆదాయం వస్తోంది..’ అంటారు శివాజీ గర్వంగా!వెదురు: ఆకుపచ్చని బంగారంవెదరుకు ఆకుపచ్చని బంగారం అని పేరు. ఈ తోట సాగులో అంత ఆదాయం ఉంది కాబట్టే ఆ పేరొచ్చింది. ‘ఈ భూగోళం మీద అతి త్వరగా పెరిగే చెట్టు వెదురు! పర్యావరణానికి ఇది చేసే మేలు మరేఇతర చెట్టూ చెయ్యలేదు. ఇది 24 గంటల్లో 47.6 అంగుళాల ఎత్తు పెరుగుతుంది. ఇతర చెట్ల కన్నా 35% ఎక్కువ కార్బన్ డయాక్సయిడ్ను పీల్చుకొని 30% అదనంగా ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. భూతాపోన్నతిని ఎదుర్కొనే కృషిలో ఇందుకే వెదురు అతికీలకంగా మారింది’ అని వివరించారు శివాజీ. బహుళ ప్రయోజనకారి కావటం అనే మరో కారణం వల్ల కూడా వెదురు సాగు విస్తృతంగా వ్యాపిస్తోంది. రాజ్పుట్ తన తోటలో 19 రకాల వెదురును సాగు చేస్తున్నారు. ఒక్కో రకం వెదురు ఒక్కో పనికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అగరొత్తుల ఉత్పత్తి ఉపయోగపడేది ఒకటైతే, బొగ్గు తయారీకి మరొకటి, బయోమాస్ ఇంధనం ఉత్పత్తికి మరొకటి.. ఇలా ఒక్కో రకం ఒక్కో పనికి ఎక్కువగా పనికొస్తాయి. ‘వెదురు బొంగులు, ఆకులు పెల్లెట్లు తయారు చేస్తారు.పౌడర్లు బయోమాస్ ఇంధన ఉత్పత్తికి వాడుతారు. ఈ ఉత్పత్తులు పర్యావరణ హితమైనవి. సాధారణ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా వాడదగినవి అంటారు శివాజీ. వెదురును సాగు చేయటం దగ్గరే ఆయన ఆగిపోవటం లేదు. వెదురు బొంగులతో ఫర్నీచర్ను, అగరొత్తులను కూడా తానే తయారు చేయాలన్నది ఆయన సంకల్పం. సుస్థిర జీవనోపాధిని అందించగలిగిన వెదురు సాగు ప్రయోజనాల గురించి ఆయన ఇతర రైతులను చైతన్యవంతం చేస్తున్నారు. ‘136 రకాల వెదురు వంగడాలు ఉన్నాయి. వాటిల్లో 19 రకాలను నేను సాగు చేస్తున్నా. ప్రతి రకానికి ప్రత్యేక లక్షణాలు, ఉపయోగాలు ఉన్నాయి. రకాన్ని బట్టి వెదురు బొంగుల బలం, బరువు ఆధారపడి ఉంటాయి. మన అవసరాన్ని బట్టి ఏ రకాలు కావాలో ఎంపిక చేసుకొని నాటుకోవటం ఉత్తమం’ అనేది ఆయన సూచన.ఆచరణాత్మకంగా ఉండే ఆయన సూచనలు ఇతర రైతులను అనుసరించేలా చేస్తున్నాయి. మహరాష్ట్ర ప్రభుత్వం నుంచ వనశ్రీ పురస్కారంతో పాటు ఇందిరా ప్రియదర్శిన వృక్షమిత్ర అవార్డు వంటి మొత్తం 30 వరకు అవార్డులు ఆయనను వరించాయి. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటినిపొదుపుగా వాడుకోవటం వీలుకావటంతో పాటు వెదురు మొక్కలు ఏపుగా పెరగానికి కూడా ఇది ఉపయోగపడిందంటారాయన.వనశ్రీ ఆక్సిజన్ పార్కువనశ్రీ ఆక్సిజన్ పార్క్ను రాజ్పుట్ మూడేళ్ల క్రితం నిర్మించారు. చనిపోయిన తమ ప్రియతముల గౌరవార్థం ఇటువంటి వనశ్రీ ఆక్సిజన్ పార్కులు ్రపారంభించాలని ఆయన పిలుపునిచ్చారు. ‘నా ప్రియతముల పుట్టిన రోజున మొక్కలు నాటుతున్నా. ఇతరులను కూడా ఇదే కోరుతున్నా’ అన్నారాయన. వెదురు సాగు భవిష్యత్తు తరాల బాగు కోసం, బంగారు భవిష్యత్తు కోసం మనం ఇప్పుడు పెట్టే తెలివైన పెట్టుబడే అంటారాయన. ఇతర రైతులకు ప్రేరణరాజ్పుట్ వెదురు తోట విజయగాథతో ప్రేరణ పొందిన రైతులు పలువురు ఆయనను అనుసరిస్తున్నారు. ధులే జిల్లాలోని షిర్పూర్ తాలూకాలో ఆయన సూచనల ప్రకారం 250 ఎకరాలకు వెదురు తోటలు విస్తరించాయి. పేపరు ఉత్పత్తికి వెదురు ఉపయోగపడుతుంది. స్థానికులకు, గ్రామీణ జనసముదాయాలకు వెదరు సాగు చక్కటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదంటారాయన. భూమిని పర్యావరణానికి అనుగుణంగా వినియోగించడాన్ని ్రపోత్సహించదలిస్తే వెదురును విస్తృతంగా సాగు చేయించాలని సూచిస్తున్న రాజ్పుట్ వెదురు భవిష్యత్తు చాలా మెరుగ్గా ఉంటుందన్నారు. ఆయన 7 లక్షలకు పైగా ఇతరత్రా మొక్కలు నాటించటం వల్ల ఆ ప్రాంతంలో జీవవైవిధ్యం పెరిగింది. భూగర్భ జలమట్టం పూర్వస్థితికి పెరిగింది. వర్షానికి మట్టి కొట్టుకుపోవటం తగ్గింది. వన్య్రపాణులకు ఆవాసాలు పెరిగాయి.
ఫొటోలు
National View all

టోల్ చార్జీలు తగ్గించేందుకు చర్యలు: నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై వసూలు చేసే టోల్ చార్జీల్లో విని

వచ్చే నెలలోనే కొత్త సారథి..!
సాక్షి, న్యూఢిల్లీ: కాషాయ దళానికి కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్ర

బిల్గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆరోగ్యం, వ్యవసాయం, విద్యారంగాల్లో సాంకేత

పెద్దలను కాదని ఆమెతో ప్రేమ పెళ్లి.. అతడి పరిచయంతో సీన్ రివర్స్..
లక్నో: ఆమెను ఎంతో ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకోవడమే అతడి ప్రాణ

భారత్ను విమర్శించి తప్పుచేశా: శశిథరూర్
తిరువనంతపురం: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరోసారి ఆసక్తికర కామ
National View all

దేశంలో ధనిక, పేద ఎమ్మెల్యేలు.. ఇద్దరూ బీజేపీవారే..
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యే, అత్యంత పేద ఎమ్మె

రోజుకు రూ. 5 వేలు ఇస్తేనే వస్తా..!
యశవంతపుర: భార్య వేధిస్తోందని ఆత్మహత్య చేసుకున్న భర్తల గురిం

శంభు సరిహద్దులో ఉద్రిక్తత.. రైతులను ఖాళీ చేయించిన పోలీసులు
న్యూఢిల్లీ: కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)తో పాటు ఇతర డిమాండ్లను నెరవేర్చాలంటూ ప

‘మీరు సమాధుల్లో దాక్కున్నా తవ్వితీస్తాం’
ముంబై: నాగ్ పూర్ లో జరిగిన హింసకు కారణమైన వారిని ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్

తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీం కోర్టులో కీలక పరిణామం
సాక్షి,ఢిల్లీ : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హ
International View all

ఉక్రెయిన్-రష్యా మధ్య ‘మూడు ముక్కలాట’.. మరో కొత్త ట్విస్ట్
వాషింగ్టన్: ఉక్రెయిన్-రష్యా మధ్య కాల్పులు విరమణ ఒప్పందంలో

విరామం అంటూనే విరుచుకుపడింది
కీవ్: అగ్రరాజ్యం అమెరికా ప్రోద్బలంతో కాల్పుల విరమణకు దాదాపు

భారత్లో ట్రంప్ కంపెనీ.. తొలి ఆఫీస్ ఎక్కడంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు చెందిన వ్యాపార సమ్మేళనం ట్రంప్ ఆర్గనైజేషన్ భారతదేశ వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట

Trump: న్యాయవ్యవస్థను బేఖాతరు చేయబోతున్నారా?
అమెరికా న్యాయవ్యవస్థ కంటే తమకు అసాధారణ అధికారాలు దఖలుపడ్డాయనే భావన డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంలో గూడుకట్టుకుపోయిందనే వార

అమెరికాలో మరో విమాన ప్రమాదం.. 12 మంది దుర్మరణం
ఆరేలియో మార్టినెజ్: అమెరికాలోని హోండురాస్(
International View all

Zelensky: ట్రంప్తోనే తేల్చుకుంటా.. ఏం సమాధానం వస్తుందో?
కీవ్: రష్

Putin: ఎవరి మాటా వినని సీతయ్య!
మాస్కో: ప్రపంచ అధినేతల్లో..

ఖగోళ యుద్ధంలో శనిదే ఘన విజయం
‘చంద్ర సైన్యం’ (మూన్స్ ఆర్మీ) సంఖ్యాపరంగా రారాజు శనిని కొట్టే గ్రహం ఇక దరిదా

సునీత లానే అంతరిక్షంలో చిక్కుకుపోయిన ‘హీరో’
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్(

Sunita Williams: సునీతా విలియమ్స్ను స్వాగతించిన డాల్ఫిన్లు
వాషింగ్టన్: అమెరికన్ వ్యోమగాములు సునీతా విలియమ్స్(
NRI View all

సుదీక్ష అదృశ్యం : తల్లిదండ్రుల షాకింగ్ రిక్వెస్ట్!
భారత సంతతికి చెందిన అమెరికా విద్యార్థిని సుదీక్ష కోణంకి అదృశ్యం కేసులో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

తిరుమలేశుడికి నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రిక
అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయం చేయాలనే సంకల్పంతో

ఏయూ హాస్టల్కి నాట్స్ ఆధ్వర్యంలో ఉచిత మంచాలు
ఆంధ్ర యూనివర్సీటీలో విద్యార్ధుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో, ఆంధ్ర

పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా

Garimella Balakrishna Prasad అస్తమయంపై నాట్స్ సంతాపం
అన్నమయ్య కీర్తనల గానం ద్వారా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్
NRI View all

Updates: విజయవంతంగా భూమ్మీదకు సునీత అండ్ కో
అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ల్యాండైన సునీతా విలియమ్స్ అండ్ కో

నాట్స్ తెలుగు సంబరాలు సినీ ప్రముఖులకు ఆహ్వానం
అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ బృందం పలువురు సిన

ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది.

USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్లో ఏం జరిగింది?
వర్జీనియా: అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీ
క్రైమ్

నా భర్తతోనే వివాహేతర సంబంధం పెట్టుకుంటావా బుజ్జమ్మ..!
నారాయణపేట రూరల్: తన భర్తతో మరో మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానంతో రాయితో మోది హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జలాల్పూర్ గ్రామానికి చెందిన బుజ్జమ్మ అలియాస్ వెంకటమ్మ(36)కు 15 ఏళ్ల క్రి తం కర్ణాటక రాష్ట్రం నస్లైకి చెందిన రాజుతో వివాహమైంది. పెళ్లయిన రెండేళ్లకే భర్త నుంచి విడిపోయి తల్లి వారింట్లో ఉంటోంది. జీవనోపాధి కోసం పల్లె ప్రకృతి వనంలో మొక్కలకు నీళ్లు పోసే పనిచేస్తుండేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మొగులప్పతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఇరువురి ప్రవర్తనపై అను మానం వచ్చిన మొగులప్ప భార్య లక్ష్మి గతంలో పలుమార్లు బుజ్జమ్మతో గొడవ పడింది. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి సర్దిచెప్పారు. అయినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఇరువురి మధ్య ఎన్నోసార్లు గొడవలు, దాడులు జరిగాయి. ఈ క్రమంలో మంగళవారం నర్సరీలో పనిచేస్తున్న బుజ్జమ్మ దగ్గరకు లక్ష్మి ఆవేశంగా వెళ్లింది. ఇది గమనించిన బుజ్జమ్మ తనపై దాడి చేయడానికి వస్తుందని ఉపాధి హామీ మేటికి ఫోన్ ద్వారా సమాచారం అందించి, నర్సరీ గేటుకు తాళం వేసుకుంది. అయినప్పటికీ లక్ష్మి ముళ్లపొదలను దాటు కుంటూ లోపలికి వెళ్లి రాయితో బలంగా బుజ్జమ్మ తలపై మోదడంతో రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న సీఐ శివకుమార్, ఎస్ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై బుజ్జమ్మ సోదరుడు నందిపాటి రామచంద్రప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అందొచ్చిన కొడుకు అమ్మ మందులకోసం వెళ్లి.. ఆగం!
వలేటివారిపాలెం: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతిచెందిన ఘటన మండలంలోని పోకూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ వద్ద వే బ్రిడ్జి సమీపంలో 167–బీ జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని శింగమనేనిపల్లి గ్రామానికి చెందిన బాశం వెంకటేశ్వర్లు – మాధవి దంపతుల కుమారుడు బాశం దినేష్ (25) వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. అంతేకాకుండా తల్లిదండ్రుల వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉన్నాడు. బడేవారిపాళెం నుంచి పొలం అరక దున్నే కూలీని తీసుకురావాలని తండ్రి వెంకటేశ్వర్లు కుమారుడికి చెప్పాడు. దీంతో తన బుల్లెట్పై బయలుదేరిన దినేష్కు ఊరు దాటగానే తండ్రి ఫోన్ చేసి అమ్మకి ఆరోగ్యం బాగోలేదు.. ముందు పోకూరు వెళ్లి మందులు తీసుకొని అక్కడి నుంచి బడేవారిపాళెం వెళ్లమని చెప్పాడు. దినేష్ మందులు తీసుకుని బడేవారిపాళెం వెళ్తున్నాడు. హైవేపై ముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా కందుకూరు వైపు వస్తు న్న ఆటోను ఢీకొట్టాడు. రోడ్డుపై పడిపోయిన దినేష్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై మరిడి నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూ రు ఏరియా వైద్యశాలకు తరలించారు. అప్పటి వరకు గ్రామంలో ఉత్సాహంగా తిరిగిన దినేష్ మృతితో శింగమనేనిపల్లిలో విషాదం నెలకొంది. వెంకటేశ్వర్లుకు ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం. మరో ఆరునెలల్లో దినేష్ అక్కకు వివాహం చేయాల్సి ఉంది. అన్ని తానై చూసుకుంటున్న యువకుడి మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

లవ్వర్ పిలుస్తోందంటూ.. యువకుని హత్య
నెల్లూరు(క్రైమ్): రౌడీషీటర్ చింటూ హత్య కేసులో పరారీలో ఉన్న ఆరుగురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు వేదాయపాళెం పోలీస్స్టేషన్లో నగర డీఎస్పీ పి.సింధుప్రియ, స్థానిక ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసులురెడ్డితో కలిసి హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుల వివరాలను వెల్లడించారు. పాత వేదాయపాళేనికి చెందిన అరవభూమి సుజన్ కృష్ణారెడ్డి అలియాస్ చింటూ (28) రౌడీషీటర్. అతడిపై వివిధ పోలీస్స్టేషన్లలో కేసులున్నాయి. చింటూకు ఇందిరాగాంధీనగర్కు చెందిన కృష్ణసాయి అలియాస్ కిట్టు స్నేహితుడు. వీరి మధ్య విభేదాలున్నాయి. చింటూ గతంలో కిట్టు ఇంటికి వెళ్లి గొడవపడి చంపుతానని అందరిముందు బెదిరించాడు. అవమానంగా భావించిన కిట్టు ఈ విషయాన్ని తన స్నేహితులైన కొత్తూరు రామకోటయ్యనగర్కు చెందిన కరిముల్లా, ఇందిరాగాంధీనగర్కు చెందిన షేక్ మహ్మద్బాబా, వెంగళరావ్నగర్కు చెందిన జి.పవన్, ఫ్రాన్సిన్ అనిక్రాజ్ అలియాస్ అనిక్రాజ్, మనుబోలు మండలం కోదండరామపురానికి చెందిన కె.సాయితేజకు జరిగిన విషయాన్ని చెప్పాడు. అందరూ కలిసి చింటూ హత్యకు పథక రచన చేశారు.మాట్లాడాలని పిలిచి..చింటూ ఇందిరాగాంధీనగర్లోని ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. ఆమెను కొందరు ఇబ్బందులు పెడుతుండగా ఆ విషయమై మాట్లాడదామని కిట్టు ఈనెల 14వ తేదీ రాత్రి చింటూను ఇందిరాగాంధీనగర్ రెండో వీధికి పిలిచాడు. అక్కడే కాపుకాసిన నిందితులు చింటూ రాగానే కత్తులతో విచక్షణారహితంగా నరికి హత్య చేసి పరారయ్యారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసులురెడ్డి కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా నిందితులను గుర్తించారు. మంగళవారం వెంగళరావ్నగర్లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితులపై త్వరలో రౌడీషీట్లు తెరుస్తామని డీఎస్పీ చెప్పారు.

వాడు దీపును చంపాడు.. మాకు అప్పగించండి
అనకాపల్లి, సాక్షి: జిల్లాలోని కశింకోట మండలం బయ్యవరంలో మర్డర్ మిస్టరీ వీడింది. ఓ ట్రాన్స్జెండర్ను ప్రియుడే అతికిరాతకంగా హతమార్చిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆగ్రహంతో ఊగిపోతున్న హిజ్రాలు పీఎస్ వద్ద ఆందోళనకు దిగారు. తమ స్నేహితురాలిని ముక్కలు చేసిన నిందితుడిని అప్పగించాలంటూనాందోళన చేపట్టారు.దీపు అనే ట్రాన్స్జెండర్ను ఆమె ప్రియుడు బన్నీ దారుణంగా హతమార్చాడు. ఆ శరీర భాగాలను వేరు చేసి బెడ్షీట్లో చుట్టి జాతీయ రహదారి పక్కన పడేశాడు. ఈ ఘోరం స్థానికంగా కలకలం రేపింది. శరీర భాగాలను సేకరించిన పోలీసులు.. చివరకు మృతదేహం నాగులపల్లికి చెందిన దిలీప్ అలియాస్ దీపు అనే హిజ్రాగా గుర్తించారు. అనంతరం ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. బన్నీతో రీకన్స్ట్రక్షన్ చేయిస్తున్న పోలీసులు.. హత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. వాడిని అప్పగించండితమ స్నేహితురాలిని అతికిరాతకంగా చంపిన హంతకుడిని తమకు అప్పగించాలంటూ హిజ్రాలు పీఎస్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వాళ్లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.అయ్యో.. పాపంకశింకోట మండలం బయ్యవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై రెండు మందుల మధ్య ఖాళీ స్థలం దొరికిన ఒక మూటలో మొల దిగువ భాగం కాళ్లు, ఒక చేయి ఉన్నాయి.. మంగళవారం ఉదయం స్థానికులు అందించిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మూట విప్పి.. ఆ దృశ్యాన్ని చూసి హతాశులయ్యారు. సుమారు 30 ఏళ్ల వయసు.. చేతికి గాజులు.. కాలికి మట్టెలు.. ఉండడంతో ఆమె వివాహిత అని తొలుత అంతా పొరపడ్డారు. అయితే విచారణలో ఆమె దీపు అనే ట్రాన్స్జెండర్గా తేలింది. 8 ప్రత్యేక బృందాల ఏర్పాటు ఈ హత్య కేసును ఛేదించడానికి 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. అనకాపల్లి ఎస్పీ సెలవులో ఉండటంతో.. విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. సంఘటన స్థలాన్ని, ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచిన శరీర భాగాలను కూడా ఆయన పరిశీలించారు. అనకాపల్లిలో మహిళ దారుణ హత్య