23 తులాల బంగారం, రూ.లక్ష చోరీ | - | Sakshi
Sakshi News home page

23 తులాల బంగారం, రూ.లక్ష చోరీ

Published Mon, Mar 3 2025 12:46 AM | Last Updated on Mon, Mar 3 2025 12:44 AM

23 తులాల బంగారం, రూ.లక్ష చోరీ

23 తులాల బంగారం, రూ.లక్ష చోరీ

సీతమ్మధార: ఇంట్లో చొరబడి 23 తులాల బంగా బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు చోరీ ఘటన మధురానగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు మీడియాకు ఆదివారం తెలిపిన వివరాలు.. మధురానగర్‌ జీవీఎంసీ పాఠశాల దరి అనంతమాధవి టవర్స్‌, ఫ్లాట్‌ నెం.102లో మరకాని కృష్ణ(46) కుటుంబంతో కలిసి ఏడేళ్లుగా నివాసం ఉంటున్నారు. కృష్ణ నగరంలోని అశోక్‌ ఆటోమొబైల్స్‌లో పనిచేస్తున్నారు. శనివారం కుటుంబంతో కలిసి కాకినాడలో బంధువుల ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం తిరిగి వచ్చేటప్పటికి ఇంటికి వేసి ఉన్న తాళం కట్‌ చేసి ఉండటాన్ని గమనించారు. దీంతో కంగారుగా ఇంట్లోకి వెళ్లి చూడగా.. బీరువాలో ఉన్న 23 తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ.లక్ష నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో బాధితులు ద్వారకా క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీంతో సంఘటనా స్థలికి చేరుకుని, ఆధారాలు సేకరించారు. సీసీ ఫుటేజ్‌లో నిందితుడిని గుర్తించి, పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement