ఇంకా చి‘క్కె’న్‌! | - | Sakshi
Sakshi News home page

ఇంకా చి‘క్కె’న్‌!

Published Mon, Mar 10 2025 10:57 AM | Last Updated on Mon, Mar 10 2025 10:52 AM

ఇంకా

ఇంకా చి‘క్కె’న్‌!

అనకాపల్లిటౌన్‌: బర్ట్‌ప్లూ సోకి కోళ్లు చనిపోతున్నాయని అపోహతో ఇంకా కొంత మంది చికెన్‌ తినడానికి జంకుతున్నారు. చికెన్‌ 80 డిగ్రీలు వేడి తో వండుకొని తింటే ఎటువంటి ప్రమాదం ఉండదని నిపుణులు అవగాహన కల్పిస్తున్నా ప్రజలు భయపడుతున్నారు. మటన్‌, చేపలు ధరలు అధికంగా ఉన్నా వాటి వైపే అధిక శాతం ప్రజలు మెగ్గుచూపుతున్నారు. చికెన్‌ ధరలు వాస్తవంగా శనివారం కంటే ఆదివారం ఎక్కువగా ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా భారీగా ధర తగ్గినా చికెన్‌ విక్రయాలు అంతతమాత్రంగానే ఉన్నాయి. జిల్లాలో శనివారం కేజి విత్‌ స్కిన్‌ 180 ఉండగా ఆదివారం 160, స్కిన్‌ లెస్‌ 190 నుంచి 170 రూపాయలకు తగ్గింది. మార్కెట్‌లో సేల్స్‌ పెంచుకోవడానికి కొందరు ఇంకో పదిరూపాయిలు తగ్గించి 160 రూపాయలకు అమ్మకాలు చేపట్టారు. అయినా అమ్మకాలు అంతంతమాత్రంగానే జరిగాయి. అవగాహన సదస్సులు, చికెన్‌ మేళాలు నిర్వహిస్తున్నా చికెన్‌ కొనడానికి వెనకడుగు వేస్తుండడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
ఇంకా చి‘క్కె’న్‌! 1
1/1

ఇంకా చి‘క్కె’న్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement