తల్లిదండ్రుల చెంతకు బాలుడు | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల చెంతకు బాలుడు

Mar 27 2025 12:39 AM | Updated on Mar 27 2025 12:35 AM

హర్షతేజను అప్పగిస్తున్న పోలీసులు

మాకవరపాలెం: కనిపించకుండా పోయిన బాలుడిని పోలీసులు తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. గాజువాకకు చెందిన హర్షతేజ (14) తామరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. చదువుపై విరక్తితో ఈ నెల 22న పాఠశాల నుంచి ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు, స్కూల్‌ యాజమాన్యం మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నర్సీపట్నం రూరల్‌ సీఐ రేవతమ్మ ఆదేశాలతో పోలీసులు మూడు టీంలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. విశాఖలోని ఆర్కే బీచ్‌లో బుధవారం హర్షతేజను పట్టుకుని తల్లిదండ్రులకు అప్పటించినట్టు ఎస్‌ఐ దామోదర్‌నాయుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement