
కనుల పండువగా ‘లంకా దహనం’
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో మూడు రోజులుగా సాగుతున్న ఉగాది ఉత్సవాలు మంగళవారం నాటి లంకాదహనం కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. దాదాపు రెండు గంటల పాటు సాగిన లంకాదహనం వేడుకను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మంగళవారం సాయంత్రం ఆంజనేయస్వామి ఉత్సవమూర్తిని ఒంటె వాహనంపై కొలువదీర్చి ఆలయం నుంచి అనుబంధ దేవాలయమైన కాశీవిశ్వేశ్వరాలయం వరకూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ ఆలయం ఈఓ కె.వాణి, సిబ్బంది ఆధ్వర్యంలో కాశీవిశ్వేశ్వరుడికి పూజలు నిర్వహించిన అనంతరం ఆంజనేయస్వామి పల్లకీని ప్రాంగణంలో కొలువు దీర్చి వేదగోష్టి నిర్వహించారు. అనంతరం అయ్యప్ప క్రాకర్స్ సౌజన్యంతో సమకూర్చిన టపాసులతో దాదాపు రెండు గంటలపాటు లంకా దహనం వేడుకగా సాగింది.

కనుల పండువగా ‘లంకా దహనం’