భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీ | Andhra Pradesh government transfers 37 IPS officers | Sakshi

భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీ

Jul 14 2024 4:16 AM | Updated on Jul 14 2024 8:31 AM

Andhra Pradesh government transfers 37 IPS officers

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఏకంగా 37 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ నుంచి డెప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చిన ఎల్‌. సుబ్బారాయుడును తిరుపతి ఎస్పీగా నియమించారు.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నిరోధక టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీగా కూడా ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో చంద్రబాబు ముఖ్య­మంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద సుబ్బారాయుడు ఓఎస్డీగా పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో కేంద్రం ఆయన్ని డెప్యుటేషన్‌పై రాష్ట్రానికి పంపింది. బదిలీ చేసిన వారిలో 28 మందికి ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. మిగిలిన 9 మందిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement