
Breadcrumb
అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ
Published Mon, Jul 4 2022 8:33 AM | Last Updated on Thu, Jul 7 2022 7:04 AM

Live Updates
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన
ముగిసిన ప్రధాని మోదీ ఏపీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసింది. బహిరంగ సభలో ప్రసంగం అనంతరం ప్రధాని మోదీ ప్రత్యేక హెలికాప్టర్లో గన్నవరం ఎయిర్పోర్టుకు బయలుదేరారు. అక్కడ నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకోనున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ప్రధానమంత్రికి సీఎం జగన్ వీడ్కోలు పలికారు. అదే సమయంలో ప్రధానికి సీఎం విజ్ఞాపన పత్రం అందించారు.
ఆదివాసీ సంగ్రహాలయాలు ఏర్పాటు చేస్తాం: ప్రధాని
స్వతంత్ర పోరాటంలో ఆదివాసీల త్యాగాలను స్మరిస్తూ ఆదివాసీ సంగ్రహాలయాలు, లంబసింగిలో అల్లూరి మెమోరియల్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ అన్నారు. దేశం కోసం బలిదానం చేసిన వారి కలను సాకారం చేయాలన్నారు. అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రధాని అన్నారు. మొగల్లులోని ధ్యాన మందిరం, చింతపల్లి పీఎస్ను అభివృద్ధి చేస్తామన్నారు. వన సంపదపై ఆదివాసులకే హక్కు కల్పిస్తున్నామన్నారు.
వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. ప్రధాని మోదీ
వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తయ్యింది. ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేశారని ప్రధాని మోదీ అన్నారు. అల్లూరి సీతారామరాజు ఆదివాసుల శౌర్యానికి ప్రతీక. అల్లూరి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. అల్లూరి తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు. మనదే రాజ్యం నినాదంతో ప్రజలను ఏకతాటిపైకి తెచ్చారు. అల్లూరి చిన్న వయస్సులోనే ఆంగ్లేయులపై తిరగబడ్డారన్నారు. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి గొప్ప ఉద్యమకారుడన్నారు. దేశాభివృద్ధికి యువత ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి: ప్రధాని మోదీ
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి అని.. ఇలాంటి పుణ్యభూమికి రావడం సంతోషంగా ఉందన్నారు. అజాదీకా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న వేళ.. అల్లూరి 125వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి అని ప్రధాని కొనియాడారు. యావత్ దేశానికి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి అన్నారు.
అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ
భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
దేశం స్వాతంత్య్రం కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించారు
అల్లూరి ఒక మహా అగ్ని కణం: సీఎం జగన్
ఒక మనిషిని.. ఇంకొక మనిషి.. ఒక జాతిని మరొక జాతి.. ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని స్వాతంత్ర్య సమరయోధులు ఆకాంక్షించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించారన్నారు. అల్లూరి ఒక మహా అగ్ని కణం.. ఆయన తెలుగు గడ్డపై పుట్టడం గర్వకారణమని సీఎం జగన్ అన్నారు.
అల్లూరి జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని, గవర్నర్, సీఎం

ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటిస్తున్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ, గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాని మోదీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్కరించారు. ఆయనకు శాలువ కప్పి.. విల్లంబు, బాణం బహుకరించారు. అల్లూరి కుటుంబ సభ్యులు, వారసులను ప్రధాని సత్కరించారు. సభా వేదిక నుంచే వర్చువల్ విధానం ద్వారా భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు.
భీమవరం చేరుకున్న ప్రధాని, గవర్నర్, సీఎం
ప్రధాని మోదీ, గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ భీమవరం చేరుకున్నారు. ఏఎస్ఆర్ పార్కులో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. అనంతరం భీమవరం సమీపంలోని పెదఅమిరంలో బహిరంగ సభా వేదికకు మోదీ చేరుకుంటారు.
భీమవరం బయలుదేరిన ప్రధాని, గవర్నర్, సీఎం
గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ప్రధాని మోదీ బయలుదేరారు. ప్రధానితో పాటు గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం బయలుదేరారు.
ప్రధానికి స్వాగతం పలికిన గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్
గన్నవరం ఎయిర్పోర్ట్కు ప్రధాని మోదీ చేరుకున్నారు. ప్రధానికి గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఒకే హెలికాప్టర్లో ప్రధాని, గవర్నర్, సీఎం భీమవరం వెళ్లనున్నారు.
గన్నవరం ఎయిర్పోర్టుకు గవర్నర్, సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. వారిరువురు దేశ ప్రధాని నరేంద్ర మోదీకి గన్నవరం ఎయిర్పోర్టులో స్వాగతం పలకనున్నారు.
బేగంపేట నుంచి గన్నవరం బయలుదేరిన ప్రధాని
ప్రధాని మోదీ బేగంపేట నుంచి గన్నవరం బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఎంఐ–17 ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెళతారు. 11 గంటలకు ఏఎస్ఆర్ పార్కులో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
బేగంపేట ఎయిర్పోర్ట్కు బయలుదేరిన ప్రధాని మోదీ
ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ బయలుదేరారు. హైదరాబాద్ రాజ్భవన్ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని.. అక్కడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
ప్రధాని మోదీని సత్కరించనున్న సీఎం జగన్
అల్లూరి కుటుంబ సభ్యులు, వారసులతో ప్రధాని, సీఎం ప్రత్యేకంగా మాట్లాడి వారి కుటుంబ సభ్యుల్లో ఇద్దరిని ప్రధాని సత్కరిస్తారు. తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం సభా వేదిక నుంచే వర్చువల్ విధానం ద్వారా భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళి అర్పిస్తారు. తరువాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీని సత్కరిస్తారు.
భీమవరంలో సర్వం సిద్ధం
ప్రధాని మోదీ పర్యటనకు భీమవరం ముస్తాబైంది. అల్లూరి జయంతి వేడుకలకు ప్రధానితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, సినీ నటుడు చిరంజీవితో పాటు ప్రముఖులు హాజరుకానున్నారు.
ప్రధానికి స్వాగతం పలకనున్న సీఎం, గవర్నర్
రాష్ట్ర పర్యటనకు వచ్చే ప్రధాని మోదీకి గన్నవరం ఎయిర్పోర్టులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ స్వాగతం పలుకుతారని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో ఏర్పాట్లను కృష్ణా జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా ఆదివారం పరిశీలించారు. విమానాశ్రయాన్ని ఎస్పీజీ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు.
ప్రత్యేక హెలికాప్టర్లో..
గన్నవరం విమానాశ్రయం నుంచి ఎంఐ–17 ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెళతారు. 11 గంటలకు ఏఎస్ఆర్ పార్కులో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం భీమవరం సమీపంలోని పెదఅమిరంలో బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు. బహిరంగ సభ అనంతరం 12.20 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో గన్నవరం ఎయిర్పోర్టుకు బయలుదేరతారు. 1.10 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి 3.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారని బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయం వెల్లడించింది.
ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఏపీ పర్యటనకు రానున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని సాంస్కతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగే అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రధాని మోదీ సోమవారం బేగంపేట ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి ఉదయం 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
Related News By Category
Related News By Tags
-
Chiranjeevi: అల్లూరి ఖ్యాతి ప్రపంచమంతా వ్యాప్తి
సాక్షి, భీమవరం: మన్యం వీరుడు, త్యాగధనుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించడంతో అల్లూరి ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుందని కే...
-
CM YS Jagan: తరతరాలకు స్ఫూర్తిదాత
అగ్నికణం.. అల్లూరి లక్షల మంది త్యాగాల ఫలితమే నేటి మన స్వతంత్ర భారతదేశం. అలాంటి త్యాగమూర్తుల్లో మన గడ్డమీద, ఈ రాష్ట్రం మట్టి నుంచి అనేక అగ్ని కణాలు పుట్టాయి. వారు ఎంచుకున్న మార్గాలు వేరైనా లక్ష్యం మాత...
-
భారత్ను ఆపేదెవరు!
అల్లూరి సీతారామరాజు భారతదేశ సంస్కృతి, పరాక్రమం, ఆదర్శాలు, విలువలకు ప్రతీక. ఆదివాసీల హక్కులు, దేశ ప్రజల స్వేచ్ఛ కోసం చిరుప్రాయంలోనే తన జీవితాన్ని దేశమాతకు అర్పించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవ...
-
స్వాతంత్ర్య సమరయోధుడి కుమార్తెకు పాదాభివందనం చేసిన మోదీ!
సాక్షి పశ్చిమగోదావరి జిల్లా: స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆంధ్రప్రద...
-
AP: మోదీ పర్యటనలో నల్లబెలూన్ల కలకలం.. కాంగ్రెస్ నేతలు అరెస్ట్
సాక్షి, కృష్ణా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భీమవరం పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ప్రధాని హెలికాప్టర్ భీమవరం వెళ్తుండగా హెలికాప్టర్కు అతి సమీపంల...
Comments
Please login to add a commentAdd a comment