West godavari
-
కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ గతి తప్పింది: కొట్టు సత్యనారాయణ
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు కేఎస్ఎన్ కాలనీ వద్ద రూ. 22 కోట్ల 44 లక్షల రూపాయల నిధులతో 30 గ్రామాలకు రోడ్లు నిర్మాణానికి అప్పటి మంత్రి కొట్టు సత్యనారాయణ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అయితే, నిన్న(బుధవారం) రాత్రి సమయంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు జేసీబీతో శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు.ధ్వంసం అయిన శిలాఫలకాన్ని మాజీమంత్రి కొట్టు సత్యనారాయణ. పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా మాట్లాడుతూ.. శిలాఫలకాన్ని జేసీబీతో కూల్చడం హేయమైన చర్య అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ అదుపుతప్పి, అరాచక శక్తులు చెలరేగిపోతున్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? అంటూ ప్రశ్నించారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగులను శిక్షించాలని.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కొట్టు సత్యనారాయణ అన్నారు. -
జనసేన ఎమ్మెల్యే నాయకర్ రౌడీయిజం
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా : రాష్ట్రంలో కూటమి పార్టీ ఎమ్మెల్యేలు పేట్రేగి పోతున్నారు. అధికార మదంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా, నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ రౌడీయిజానికి దిగారు. భీమవరంలో కోర్టు వివాదంలో ఉన్న ఓ ప్రైవేట్ స్థలంలో దాదా గిరి చేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూమి కబ్జా చేసే ప్రయత్నం చేశారు. తన అనుచరులతో యజమానులను బెదిరించారు. జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ రౌడీయిజంతో భయాందోళనకు గురైన బాధితుల్ని పోలీసుల్ని ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అనుచరులే కాదు.. గతంలో ఆ పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులు రెచ్చిపోయారు. మత్య్సకారుల దుకాణాలు కొనసాగాలంటే తమకు రూ.10లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. ఉప్పలంకలో మత్స్యకారుల దుకాణాలను అన్యాయంగా నేలమట్టం చేశారు. అయితే, మత్స్యకారుల జీవనోపాధి కోసం నాలుగేళ్ళ క్రితం ఉప్పలంక వద్ద ఐదు షాపులను అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కట్టించారు. ఆ దుకాణాలపై నానాజీ అనుచరులు కన్ను పడింది. వెంటనే రంగంలోకి దిగిన జనసేన నాయకులు.. అక్కడ దుకాణాలు కొనసాగాలంటే తమకు రూ.10లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. లేనిపక్షంలో దుకాణాలను తొలగిస్తామని హెచ్చరించారు.అనంతరం, ఎమ్మెల్యే నానాజీని బాధితులు కలిసి జరిగిన విషయం చెప్పి తమకు న్యాయం జరగాలని కోరారు. అయినప్పటికీ బాధితులకు న్యాయం జరగకపోగా తీవ్ర అన్యాయమే జరిగింది. దుకాణదారులు మూముళ్లు ఇవ్వలేదన్న కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనే నెపంతో ఆర్ అండ్ బీ అధికారులతో నానాజీ అనుచరులు కుమ్మకయ్యారు. అధికారులు, జనసేన నేతలు అక్కడికి చేరుకుని షాపులను నేలమట్టం చేశారు. -
AP: తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య
సాక్షి, పశ్చిమ గోదావరి: పశ్చిమ గోదావరి జిల్లాలో సర్వీస్ తుపాకీతో కాల్చుకున్ని ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో మృతిచెందిన ఎస్ఐను ఏజీఎస్ మూర్తిగా గుర్తించారు. కాగా, ఇటీవల ఎస్ఐ సస్పెండ్ అయిన కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లాలో తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఏజీఎస్ మూర్తి శుక్రవారం ఉదయం ఆత్తహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. కాగా, ఇటీవల ఏజీఎస్ మూర్తి పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీసు స్టేషన్కు వచ్చిన ఆయన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం, సిబ్బంది 108 వాహనంలో ఎస్ఐ మృతదేహాన్ని తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
Sankranti Special: సంక్రాంతి పిండి వంటలకు ఫిదా
-
కూటమి నేతల హల్చల్.. కోడి పందెం, రికార్డింగ్ డ్యాన్స్..
సాక్షి, కాకినాడ: ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మూడో రోజు యథేచ్ఛగా కోడి పందేలు(Kodi Pandem) కొనసాగుతున్నాయి. సంక్రాంతి సంబరాల పేరిట కూటమి నేతలు నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదే సమయంలో పాఠశాలలను సైతం టీడీపీ నేతలు వదలడం లేదు. స్కూల్స్లో కూడా కోడి పందేలు నిర్వహిస్తున్నారు. దీంతో, స్థానికులు మండిపడుతున్నారు.ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడి పందేలు జోరుగా జరుగుతున్నాయి. కూటమి నేతలే దగ్గరుండి అన్ని కార్యక్రమాలను చూసుకుంటున్నారు. అలాగే, కోడి పందేల బరుల దగ్గర జూదం కోసం స్పెషల్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. అడ్డు అదుపు లేకుండా గుండాట, పేకాట, గ్యాంబ్లింగ్, లోనాబయటా ఆడిపిస్తున్నారు. ఇక, జూద క్రీడలు కూటమి నేతలకు కాసులు కురిపిస్తున్నాయి. పేకాట ఆడేవాళ్లకు దగ్గరుండి మద్యం సరఫరా చేయిస్తున్నారు కూటమి నేతలు.ఇదే సమయంలో కోడి పందేలా కోసం ప్రభుత్వ పాఠశాలలను సైతం కూటమి నేతలు వదిలిపెట్టడం లేదు. తుని రూరల్ వి.కొత్తూరులోని ప్రభుత్వ పాఠశాలలో కోడి పందేలు, జూదాలు నిర్వహించారు. ఇక, కూటమి నేతల ఒత్తిళ్ళతో కోడి పందేల వైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఎక్కడ చూసినా జూదం ఆడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి టీడీపీ, జనసేన నేతలు కోడి పందేలు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. కోడి పందేల బరుల వద్ద బెట్టింగ్ల ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. జూద క్రీడలు, కోడి పందేల కోసం లక్షల్లో బెట్టింగ్ కాస్తున్నారు.ఇదిలా ఉండగా.. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు జనసేనలో కోడి పందేలు చిచ్చురేపాయి. రాజోలులో నడి రోడ్డుపై కోడి పందెం బరుల కోసం జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్పై టీడీపీ, జనసేన నాయకులు ఒత్తిడి తెచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే మాటలను బేఖాతరు చేస్తూ ఇష్టారీతిన బరులు ఏర్పాటు చేసుకున్నారు జనసేన, టీడీపీ నాయకులు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజోలులో విచ్చలవిడిగా కోడి పందేలు, గుండాట, రికార్డింగ్ డ్యాన్స్లు జరిగాయి. పలుచోట్ల రాత్రి సమయంలో కూటమి నేతలే రికార్డింగ్ డ్యాన్స్లను ప్రోత్సహించారు. ఇంతటితో ఆగకుండా కూటమి నేతలు మరింత హల్చల్ చేశారు. ఇటీవలి కాలంలో బౌన్సర్లు ఏర్పాటు సాధారణంగా మారిన నేపథ్యంలో కోడి పందేల బరుల వద్ద బౌన్సర్లను ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ఓ అడుగు ముందుకేసిన నిర్వాహకులు మహిళా బౌన్సర్లను రంగంలోకి దింపారు. -
ఎంజాయ్ చేద్దామని గోవా వెళ్లి.. శవమై తిరిగొచ్చిన ఏపీ యువకుడు
గోవా: న్యూఇయర్లో విషాదం చోటు చేసుకుంది. గోవాలో ఏపీ టూరిస్ట్ హత్యకు గురి కావడం సంచలనంగా మారింది. మంగళవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఫుడ్ ఆర్డర్ విషయంలో టూరిస్ట్లకు గోవా బీచ్లోని ఓ రెస్టారెంట్ సిబ్బందికి వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో ఏపీకి చెందిన బొల్లా రవితేజ హత్యకు గురయ్యాడు. మృతుడు పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లికి చెందిన బొల్లా రవితేజగా గోవా పోలీసులు గుర్తించారు. ఈ దుర్ఘటనలో నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు గోవా డీఐజీ వర్షా శర్మ తెలిపారు.బీచ్ షాక్ యజమాని బీచ్ షాక్ యజమాని అగ్నెల్ సిల్వేరా,అతడి కుమారుడు షుబర్ట్ సిల్వేరియాతో పాటు సిబ్బంది అనిల్ బిస్టా, సమల్ సునర్లను అరెస్ట్ చేసినట్లు డీఐజీ వెల్లడించారు. గోవాలోని ప్రముఖ కలంగుట్ బీచ్లో మరీనా బీచ్ షాక్ అనే రెస్టారెంట్ ఉంది. నిన్న రాత్రి ఒంటి గంటకు ఆ రెస్టారెంట్కు అర్థరాత్రి వచ్చిన రవితేజ, అతని స్నేహితుడు హైదరాబాద్కు చెందిన స్పందన్ బొల్లు ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. అయితే బీచ్ షాక్ రెస్టారెంట్ యజమాని సిల్వేరా.. రవితేజ, అతని స్నేహితుడి నుంచి ఉన్న ధర కంటే ఎక్కువ మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఉన్న బిల్లుపై ఎక్కువ మొత్తం ఇవ్వాలంటే సాధ్యం కాదని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో రెస్టారెంట్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి రవితేజపై దాడి చేశాడు. అలా ఫుడ్ ఆర్డర్ ఇవ్వడంలో చోటు చేసుకున్న వివాదం హింసాత్మకంగా మారింది. నిందితులు టూరిస్ట్ తేజపై వెదురు కర్రలతో తలపై మోదారు. ఆపై శరీర భాగాలపై దాడి చేశారు. తీవ్ర గాయాలతో, నిందితులు కొట్టిన దెబ్బలకు తాళలేక బాధితుడు తేజ మరణించినట్లు పేర్కొన్నారు.కాగా, గోవాలో గత కొద్ది రోజుల్లో ముగ్గురు టూరిస్ట్లు మరణించారు. అంతకుముందు నవంబర్లో ఢిల్లీ టూరిస్ట్ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్లో మరణించాడు. క్రిస్మస్ రోజు మహరాష్ట్రకు చెందిన టూరిస్ట్ బోట్ బోల్తా పడి మరణించాడు. -
డెడ్ బాడీ పార్శిల్ కేసులో వీడిన మిస్టరీ.. వారే నిందితులు
సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా: ఉండి మండలం యండగండి గ్రామంలో మృతదేహం పార్శిల్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో శ్రీధర్ వర్మ, అతడి రెండో భార్య రేవతి, ప్రియురాలు సుష్మ పాత్ర ఉన్నట్లు పోలీసులు తేల్చారు. మృతదేహం ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తును పోలీసులు ప్రారంభించారు. రంగరాజు కుమార్తెలు తులసి, రేవతి మధ్య ముందు నుంచే గొడవలు ఉన్నాయి.రేవతికి 2016లో శ్రీధర్ వర్మతో వివాహం జరిగింది. తులసిని భర్త వదిలేయడంతో పుట్టింట్లో ఉంటోంది. రంగరాజుకి రెండున్నర ఎకరాల పొలం, బంగారం ఉన్నాయి. రంగరాజు ఆస్తి కోసం కుట్ర పన్నిన వర్మ.. తులసి అవసరాన్ని అవకాశంగా మార్చుకుని ఈ కుట్రలో ఇరికించాలని ప్రయత్నించాడు. క్షత్రియ సేవా సమితి పేరిట తులసి ఇంటి నిర్మాణానికి సహకరిస్తున్నట్లు వర్మ, రేవతి డ్రామా ఆడారు.ఇదీ చదవండి: డామిట్.. పారని ‘పార్శిల్’ పాచిక (క్రైమ్ స్టోరీ)ప్లాన్ ప్రకారం సెప్టెంబర్ నెలలో తులసికి పెయింట్స్, టైల్స్ పంపించారు. మూడో పార్శిల్గా డెడ్బాడీ పంపారు. ఒంటరిగా ఉంటున్న పర్లయ్యను హత్య చేసి ఆ డెడ్ బాడీని పార్శిల్గా పంపారు. డెడ్ బాడీ వచ్చినప్పుడు రంగరాజు, ఆయన భార్య, శ్రీధర్ వర్మ, తులసి, రేవతి ఉన్నారు. డెడ్ బాడీ పార్శిల్ బాక్స్లో కోటి 35 లక్షల ఇవ్వాలని లేఖ పెట్టారు. ఎవరికీ తెలియకుండా డెడ్ బాడీ సముద్రంలో పడేస్తానని డబ్బు ఇవ్వాలంటూ శ్రీధర్ వర్మ తులసిని, కుటుంబ సభ్యులను నమ్మించాడు.పోలీసులకు సమాచారం అందడంతో కారులో పరారయ్యాడు. పర్లయ్యను నైలాన్ తాడుతో గొంతు బిగించి శ్రీధర్ వర్మ చంపాడు. పర్లయ్య కంటే ముందు వేరే వ్యక్తి ని చంపడానికి ప్రయత్నించాడు. ప్రధానంగా ఈ కేసులో శ్రీధర్ వర్మ, రెండో భార్య రేవతి, మూడో భార్య సుష్మ అరెస్ట్ చేసినట్లు ఎస్పీ నయీం అస్మీ తెలిపారు.ఇదీ చదవండి: డెడ్ బాడీ పార్శిల్ కేసు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు -
డెడ్ బాడీ పార్శిల్ కేసు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలో డెడ్ బాడీ పార్శిల్ కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. పోలీసులకే ఈ కేసు పెను సవాలుగా మారింది. ఒకరిని హత్య చేయాలని భావించిన శ్రీధర్ వర్మ.. రెండు శవ పేటికలను ఎందుకు తయారు చేయించాడు? శ్రీధర్ వర్మ టార్గెట్ మరొకరు ఉన్నారా? కేవలం తులసిని బెదిరించడానికే ఇంత స్కెచ్ వేశాడా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి..పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో డెడ్బాడీ పార్సిల్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో అనుమానితుడు శ్రీధర్వర్మను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. విచారణ జరుగుతున్నకొద్దీ నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. సాగి తులసి ఇంటికే డెడ్బాడీని శ్రీధర్వర్మ ఎందుకు పార్శిల్ చేశాడన్నదానిపై క్లారిటీ వస్తోంది.తన వదిన ఆస్తిని కాజేసేందుకే ఈ స్కెచ్ వేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. జులై నుంచే ఈ కుట్రకు ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. తొలుత ఓ సామాజిక సేవా సంస్థ ద్వారా తులసి ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని అందిస్తున్నట్లు కథ నడిపించాడు. తులసికి శవాలంటే భయమన్న విషయం తెలుసుకున్న శ్రీధర్వర్మ.. ఆమెను భయటపెట్టేందుకు డెడ్బాడీని పంపించినట్టు సమాచారం. వదిన తులసిని భయపెట్టాలంటే.. డెడ్బాడీ కావాలి. మృతదేహమంటే.. అదేదో అంగట్లో దొరికే వస్తువు కాదు. అందుకే అమాయకుడైన బర్రె పర్లయ్యను టార్గెట్ చేశాడు శ్రీధర్వర్మ. ఈ నెల 17న హత్య చేసి ఉంటే 19 వరకు మృతదేహాన్ని ఎక్కడ దాచారు? అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. శ్రీధర్ వర్మకు గతంలోనే నేరచరిత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. శ్రీధర్ వర్మకు మూడు పేర్లు, ముగ్గురు భార్యలు ఉన్నట్లు తెలిసింది. శ్రీధర్ వర్మ రెండో భార్య అక్క అయిన సాగి తులసితో ఆస్తి గొడవలు నడుస్తున్నాయని.. ఈ క్రమంలో ఆమెను బెదరించడానికి పక్కా స్కెచ్తో పర్లయ్యను హత్య చేసి డెడ్బాడీని పార్శిల్లో పంపించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది.పర్లయ్యను హత్య విషయంలోనూ శ్రీధర్వర్మ ముందుగానే పెద్ద ప్లానే వేసుకున్నాడు. ఇందులో భాగంగా రెండు శవపేటికలను తయారు చేయించాడు. రోజు వారీ కూలీలైన పర్లయ్య, రాజు ఇద్దరికి పని ఇప్పిస్తానంటూ తీసుకెళ్లాడు. ముందుగా అనుకున్న ప్రకారం ఇద్దరిలో ఒకరిని చంపి పార్శిల్ చేయాలని భావించాడు. అయితే రాజుకు కుటుంబసభ్యులు ఉన్నందును అతడిని చంపితే గొడవలు అవుతాయని భావించిన శ్రీధర్ వర్మ.. పర్లయ్యను చంపాలని నిర్ణయించుకున్నాడు. పర్లయ్యకు కుటుంబసభ్యుల ఉన్నా వారు పట్టించుకోరని భావించిన శ్రీధర్.. అనుకున్న ప్రకారం పర్లయ్యను హతమార్చాడు.బర్రె పర్లయ్య హత్య అంతా శ్రీధర్వర్మ మూడో భార్య ఇంట్లోనే జరిగినట్లు తెలుస్తోంది. పర్లయ్యను హత్య చేసి ఆపై అప్పటికే తాను ముందే సిద్ధం చేసిపెట్టుకున్న శవపేటికలో మృతదేహాన్ని ఉంచాడు. అయితే ఈ మొత్తం వ్యహారంలో శ్రీధర్ వర్మ మూడో భార్య ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నెల 17న బర్రె వర్లయ్యను హత్య చేసేందుకు శ్రీధర్ వర్మ పక్కా ప్రణాళికతో చెక్క పెట్టెను సిద్ధం చేసుకున్నాడు. మద్యం తాగించి అనంతరం ఉండి మండలం వాండ్రం గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి హత్య చేశాడు. మృతదేహాన్ని చెక్కపెట్టెలో పార్శిల్ చేయడానికి గాంధీనగర్ తీసుకువెళుతుండగా వర్షం కురవడంతో, కారు ముందుకు వెళ్లే అవకాశం లేకపోయింది. దీంతో శవాన్ని కారులోనే ఉంచి, మరొక పెట్టెను కైకలూరు నుంచికొని తెచ్చాడు. అనంతరం మృత దేహాన్ని గణపవరం మండలం సాగిపాడు వద్దకు పెట్టెలో తీసుకువెళ్లి మూడో భార్య సుష్మ సాయంతో ఆటోడ్రైవర్కు అప్పగించి తులసికి డోర్ డెలివరీ చేశారు.ఇప్పటి వరకు అనుమానాస్పద కేసుగా విచారణ చేసిన పోలీసులు దీనిని హత్య కేసుగా మార్పు చేశారు. తులసికి చెందిన ఆస్తిని కాజేయడం కోసమే శ్రీధర్ వర్మ, అతడి రెండో భార్య రేవతి పన్నాగం పన్నారని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. శ్రీధర్ వర్మ రెండో భార్య రేవతి భీమవరంలోని పలు నగల దుకాణాల్లో బంగారం తాకట్టు పెట్టి, మరికొంత విక్రయించినట్లు తెలియడంతో మూడు బంగారం దుకాణాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. గాంధీనగర్లో మొదటి భార్య ఇంట్లో క్షుద్రపూజలకు సంబంధించిన కొన్ని వస్తువులు, పుస్తకాలు పోలీసులకు దొరికినట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా మల్లంపూడిలో శ్రీధర్ వర్మ తల్లిదండ్రులను, ఆయన ముగ్గురు భార్యలు, పిల్లలు, యండగండికి చెందిన ముదునూరి రంగరాజు, అతడి భార్య హైమావతి, సాగి తులసిలను పోలీసులు వేర్వేరుగా పలు ప్రదేశాల్లో విచారిస్తున్నారు. ఒకట్రెండ్రోజుల్లో వివరాలు పూర్తిగా వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ నయీం అస్మి అంటున్నారు.ఇదీ చదవండి: కామారెడ్డి మిస్టరీ డెత్స్ కేసులో కొత్త కోణాలు.. జరిగింది ఇదేనా?మరోవైపు అమాయకుడైన బర్రె పర్లయ్యను.. శ్రీధర్వర్మ హతమార్చడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. వివాదరహితుడిగా ఉన్న పర్లయ్యను ఇంత దారుణంగా హత్య చేయడంతో వారు తట్టుకోలేకపోతున్నారు. అమాయకుడిని అన్యాయంగా చంపేశారని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే మూడో భార్య ఇంట్లో మరో శవపేటికను కూడా పోలీసులు గుర్తించారు. అసలు ఇంకో శవపేటికను శ్రీధర్ వర్మ ఎందుకు తీసుకువచ్చాడనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అలాగే శ్రీధర్వర్మ ఇంట్లో పోలీసులు సెర్చ్ చేయగా చేతబడి చేసే సామాగ్రి కూడా లభించడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అసలు శ్రీధర్ వర్మ వృత్తి ఏంటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా తులసిని ఆస్తి కోసం బెదిరించడానికి ఎలాంటి సంబంధం లేని పర్లయ్యను ఎందుకు హత్య చేశాడు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే ఒకరిని హత్య చేయాలని భావించిన శ్రీధర్ వర్మ.. రెండు శవ పేటికలను ఎందుకు తయారు చేయించాడు? శ్రీధర్ వర్మ టార్గెట్ మరొకరు ఉన్నారా? కేవలం తులసిని బెదిరించడానికే ఇంత స్కెచ్ వేశాడా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పోలీసుల విచారణకు శ్రీధర్ వర్మ సహకరించడం లేదని.. పోలీసులు వేస్తున్న ప్రశ్నలకు శ్రీధర్ వర్మ సరైన సమాధానాలు చెప్పడం లేదని తెలుస్తోంది. మొత్తానికి డెడ్ బాడీ పార్శిల్ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు.. ఇందులో ఎవరెవరు ఉన్నారనే దానిపై లోతుగా విచారణ చేస్తున్నారు. -
పార్శిల్లో మృతదేహం కేసులో పురోగతి
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో పార్శిల్లో మృతదేహం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. గత గురువారం తులసికి చెక్క పెట్టెలో ఓ పార్శిల్ వచి్చంది. విద్యుత్ సామాన్లనుకుని దానిని తెరచి చూడగా దానిలో గుర్తు తెలియని మృతదేహం ఉంది. రూ.1.30 కోట్లు ఇవ్వకుంటే ఇబ్బంది పడతారని హెచ్చరిస్తూ ఆ పెట్టెకు ఓ లెటర్ కూడా అంటించి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న తులసి మరిది(సోదరి భర్త) శ్రీధరవర్మ అలియాస్ సిద్ధార్థవర్మ ఫొటోను, నేరం జరిగాక అతడు ప్రయాణించిన ఎరుపు రంగు కారు ఫొటోలను జిల్లా పోలీసు శాఖ సోమవారం విడుదల చేసింది. ఎవరైనా నిందితుడిని గానీ, కారునుగానీ గుర్తిస్తే జిల్లా పోలీసు శాఖ వారికి సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో పోలీసులు కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో ఉన్న నిందితుడు శ్రీధరవర్మను, మరో మహిళను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అలాగే పార్శిల్లో వచ్చిన మృతదేహం పశి్చమగోదావరి జిల్లా కాళ్ల మండలం గాం«దీనగర్కు చెందిన బర్రే పర్లయ్యదిగా గుర్తించారు. పర్లయ్య చనిపోవడానికి రెండు రోజుల ముందు శ్రీధరవర్మ దగ్గరకు పనికోసం వెళ్లినట్టు చెబుతున్నారు. -
అబ్రకదబ్ర లోనూ ఆమె ముద్ర
‘నీపై నీకు నమ్మకం ఉంటే అద్భుతం సాధ్యం అవుతుంది’ అనే మాట మెజిషియన్ లక్ష్మికి తెలియనిదేమీ కాదు. ఆ నమ్మకం వల్లే గానం నుంచి ఇంద్రజాలం వరకు ఎన్నో విద్యల్లో ప్రావీణ్యం సాధించింది ‘ఆహా!’ అనిపిస్తుంది...అయిదు అంగుళాల పదునైన మేకును సుత్తితో ముక్కు లోనికి పంపుతూ లక్ష్మి చేసే సాహసం చూసి ప్రేక్షకుల ఒళ్లు గగుర్పొడుస్తుంది. అటూ ఇటూ కదులుతూ చేతిలోని గొడుగును ఆడిస్తూ ఒకదాని తరువాత ఒకటి చొప్పున అలవోకగా 30 కు పైగా గొడుగులు, స్వింగ్ఫ్లవర్స్ తీయడం చూస్తే ఔరా అనిపిస్తుంది. నంబర్స్తో మెంటలిజం మ్యాజిక్ చేసి అవాక్కు చేయడమే కాదు, వస్తువుల్ని మాయం చేయడం, పుట్టించడం, మనిషిని రెండు భాగాలు చేసినట్టు భ్రమింప చేయడం... ఇలా ఆమె చేసే ఇంద్రజాలం ప్రేక్షకులని కట్టిపడేస్తుంది.ఇంద్రజాలంతోనే కాదు తన గానంతో కూడా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది లక్ష్మి. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన దండ లక్ష్మీప్రసన్నదేవి భర్త రాము సింగర్, డ్యాన్సర్, మిమిక్రీ ఆర్టిస్టు, మెజీషియ¯Œ , ఎంటర్టైనర్గా సుపరిచితుడు. భర్తతోపాటు ఎన్నో ప్రాంతాలకు వెళుతుండేది లక్ష్మి. అలా వెళ్లడం ద్వారా వివిధ కళా రూపాలకు ప్రేక్షకుల నుంచి వచ్చే అపురూప స్పందనను ప్రత్యక్షంగా చూసే అవకాశం వచ్చింది.రెండేళ్ల క్రితం భర్తతో కలిసి కేరళలో జరిగిన మ్యాజిక్పోటీలకు వెళ్లింది లక్ష్మి. ఆపోటీలలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క మహిళ కూడా లేకపోవడం గమనించింది. మహిళలు కనిపించని ఆ లోటే తనను మ్యాజిక్పై ఆసక్తి పెంచుకునేలా చేసింది. ‘నేను మ్యాజిక్ నేర్చుకోవాలనుకుంటున్నాను’ తన మనసులో మాటను భర్తకు చెప్పింది.అతడు ఎగతాళిగా నవ్వి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదోగానీ ‘భేషుగ్గా నేర్చుకోవచ్చు’ అనడమే కాదు ఇల్లే పాఠశాలగా ఇంద్రజాల విద్య నేర్పడం మొదలుపెట్టాడు. భర్త నుంచి మ్యాజిక్ ట్రిక్స్ నేర్చుకున్న లక్ష్మి చేసిన మొదటి మ్యాజిక్ షోకు మంచి స్పందన వచ్చింది. తనమీద తనకు నమ్మకం వచ్చింది.ఇక అప్పటి నుంచి ‘మ్యాజిక్’ తని ఇంటి పేరుగా మారింది. బర్త్డే పార్టీల నుంచి మ్యారేజ్ వరకు రకరకాల ఫంక్షన్లలో ఇప్పటివరకు వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చింది. గుంటూరులో జరిగిన ‘అమరావతి మ్యాజిక్ ఫెస్టివల్’ రాష్ట్రస్థాయిపోటీల్లో ప్రథమ బహుమతిని గెలుచుకుంది. తాజ్ మ్యాజిక్ సొసైటీ ఆగ్రాలో నిర్వహించిన జాతీయస్థాయిపోటీల్లో ద్వితీయ బహుమతి గెలుచుకుంది.దేశవ్యాప్తంగా మేకు మ్యాజిక్ చేస్తున్న ఏడుగురు మెజిషీయన్లలో ఏకైక మహిళను తానే అంటుంది లక్ష్మి. పాటలు పాడటంలో నైపుణ్యాన్ని సాధించిన లక్ష్మి యాంకర్గా, సింగర్గా వెయ్యికి పైగా షోలు చేసింది. ‘ఇంకా ఎన్నో కళలు నేర్చుకోవాలని ఉంది. దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇవ్వాలని ఉంది’ అంటుంది లక్ష్మీప్రసన్నదేవి.ఆ చప్పట్లు చాలు...ప్రేక్షకులలో ఒకరిగా ఎంతోమంది కళాకారుల ప్రదర్శనలను చూసి చప్పట్లు కొట్టాను. ఇప్పుడు నేను ప్రదర్శన చేస్తుంటే అలాంటి చప్పట్లు వినడం అపురూపంగా ఉంది. లక్షలు, కోట్లు అక్కర్లేదు. ఆ చప్పట్లు చాలు కళాకారుడిలో నిత్య ఉత్సాహం నింపడానికి. కళకు ప్రాంతం, జెండర్ అనే తేడా తెలియదు. కళాకారులలో ఏ కొంచెం ప్రతిభ ఉన్నా ప్రపంచం సొంతం చేసుకుంటుంది. గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేను ‘ఇప్పుడు ఇవన్నీ ఎందుకు!’ అనుకోలేదు. ‘నేను ఎందుకు నేర్చుకోకూడదు’ అని మాత్రమే అనుకున్నాను. అలా అనుకోవడం వల్లే మెజీషియన్గా, సింగర్గా, యాంకర్గా నాకంటూ ఎంతో కొంత గుర్తింపు వచ్చింది. మరిన్ని కళలు నేర్చుకొని, దేశవ్యాప్తంగా మరిన్ని ప్రదర్శనలు ఇవ్వాలనుకుంటున్నాను.– దండ లక్ష్మీప్రసన్నదేవి – పెనుపోతుల విజయ్కుమార్, సాక్షి, భీమవరం ఫొటోలు: బడేటి తిరుపతి వెంకటేశ్వరరావు -
టీడీపీని మేమే ఓడిస్తాం.. జనసేన నేతల వార్నింగ్
సాక్షి, ఏలూరు జిల్లా: చింతలపూడిలో టీడీపీ-జనసేన పార్టీలో ముసలం పుట్టింది. జంగారెడ్డిగూడెంలో జరిగిన చింతలపూడి నియోజకవర్గం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే తీరుపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిపించిన టీడీపీని తామే ఓడిస్తామంటూ మాజీ డీసీసీబి చైర్మన్ కరాటం రాంబాబు హెచ్చరించారు.టీడీపీ నేతలు జనసేన పార్టీ పట్ల వివక్ష చూపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఒకలా ఎన్నికల అనంతరం మరోలా టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని నేతలు వాపోయారు. అన్ని గ్రామాల్లో.. జనసేన పార్టీకి, కేడర్కు సరైన ప్రాధాన్యత లభించడం లేదని సమావేశంలో ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. సమస్యలు త్వరగా పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి ఖాయం అని జనసేన శ్రేణులు అంటున్నాయి. వెంటిలేటర్ మీద ఉన్న టీడీపీ పార్టీని బతికించింది జనసేన పార్టీ అని గుర్తు పెట్టుకోవాలంటూ టీడీపీ నేతలకు వార్నింగ్లు ఇస్తున్నారు. -
అబద్ధాల కాంపిటీషన్లో బాబుతో పోటీపడలేకపోయాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు వేధింపులు మనల్ని ఏమీ చేయలేవని అన్నారు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈ వేధింపులు, కేసులు మనకు తాత్కాలికం మాత్రమేనని తెలిపారు.ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. దేవుడు అన్ని విషయాలు చూస్తున్నాడు అనేందుకు తిరుమల లడ్డూ వివాదం ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. బాబుకు దేవుడే మొట్టికాయలు వేశాడు..లడ్డూ విషయంలో విష ప్రచారం చేశారని, వారి ఎల్లోమీడియాను అడ్డంపెట్టుకుని గోబెల్స్ ప్రచారాలు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టిస్తారని, ఆ అబద్ధాన్ని మార్కెటింగ్ చేసి అమ్మేయగల సమర్థులని విమర్శలు గుప్పించారు. అయినా లడ్డూ వ్యవహారంలో గట్టిగా నిలబడి ప్రజలకు వాస్తవాలు వివరించగలిగామని తెలిపారు. చివరకు చంద్రబాబుకు దేవుడే మొట్టికాయలు వేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.విచ్చలవిడిగా జూదం, క్లబ్బులుపశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జడ్పీటీసీలు, నాయకులతో వైఎస్ జగన్ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి సాగుతోందని ధ్వజమెత్తారు. ప్రతి గ్రామంలో, నియోజకవర్గాల్లో జూదం, క్లబ్బులు నడుస్తున్నాయని మండిపడ్డారు. ఇసుక, మద్యంల్లో స్కాంలు నడుస్తున్నాయని, స్టాక్యార్డుల్లో పెట్టిన ఇసుక మాయం అయిపోయిందని విమర్శలు గుప్పించారు. మొత్తం స్టాకుయార్డుల్లో నిల్వలను లూటీ చేశారన్న ఆయన.. ఇప్పుడు ఇసుక ఎక్కడ దొరకడం లేదని తెలిపారు. వైఎస్సార్సీపీ పాలనలో ఇసుక ధర కన్నా ఇప్పుడు ధర చాలా ఎక్కువ ఉందన్నారు.మద్యం షాపుల నుంచి ఎమ్మెల్యేలకు వాటాలు..‘ప.గో. జిల్లాకు చెందిన నాయకులే చెప్తున్నారు. వైయస్సార్సీపీ హయాంలో టన్నుకు రూ. 550లు అయితే, ఇప్పుడు రూ.1375కు అమ్ముతున్నారని చెప్తున్నారు. మన హయాంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఎవరి జేబుల్లోకి డబ్బు పోతోంది. అధికార పార్టీకి చెందిన నాయకులకే మద్యం షాపులు కట్టబెడుతున్నారు. ఈ షాపులనుంచి ఎమ్మెల్యేలకు వాటాలు, ఆపై వాళ్లకు వాటాలు. గ్రామ, గ్రామాన బెల్డు షాపులు వస్తున్నాయి.మనం చేసిన మంచి ఎక్కడికీ పోలేదుఐదేళ్ల పరిపాలనా కాలంలో మనం చేసిన మంచి ఎక్కడికీ పోలేదు. ఆ మంచి ఇంకా బతికే ఉంది. జగన్ మంచే చేశాడు.. చెడు చేయలేదన్న మాటే ప్రతిచోటా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో అబద్ధాల కాంపిటీషన్లో చంద్రబాబుతో పోటీపడలేకపోయాం. చంద్రబాబు చెప్పినట్టుగా జగన్ చెప్పలేకపోయాడు. చంద్రబాబులా జగన్కూడా హామీలు ఇవ్వాలన్నట్టుగా చాలామంది ఎదురుచూశారు. కాినీ, ఇవాళ పరిస్థితులను మీరంతా చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు కనీసం బడ్జెట్కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితి ఉంది. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత, విలువలు లేకపోతే ప్రజల్లో చులకన అవుతాం. మనం ఎప్పుడూ తలెత్తుకునేలా రాజకీయాలు చేశాం. ఇకపై కూడా తలెత్తుకునే రాజకీయాలు చేస్తాం.ప.గో.జిల్లా జడ్పీ ఛైర్మన్ పార్టీ మారినా, జడ్పీటీసీలు కలిసికట్టుగా నిలబడ్డారు. వారి పోరాట స్ఫూర్తికి అభినందనలు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత మీరు చూపారు. జడ్పీటీసీలు అందరికీ కృతజ్ఞతలు. మీ వ్యక్తిత్వం చాలామందికి ఆదర్శనీయంగా నిలిచింది. ఎప్పుడూ చీకటి మాత్రమే ఉండదు, వెలుగు తప్పకుండా వస్తుంది. ప్రజల తరఫున పోరాటాలు చేయండి, ప్రజల పక్షాన నిలబడండి. ఇందులో వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు’ అని తెలిపారు వైఎస్ జగన్. -
మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నారంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ‘‘బడ్జెట్ ప్రవేశపెడితే ఏ స్కీమ్కు ఎంత ఇస్తున్నారు, ఇచ్చిన హామీలకు దేనికెంత కేటాయింపులో చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పకపోతే ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అందుకనే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కాలయాపన చేస్తున్నారు’’ అని వైఎస్ జగన్ దుయ్యబట్టారు. ప్రజలు.. తేడాను గమనిస్తున్నారు.. ‘‘గతంలో ప్రతి ఏడాది మనం సంక్షేమ క్యాలెండర్ విడుదల చేశాం. ఏ పథకానికి ఎంతో బడ్జెట్ కేటాయింపుల్లో స్పష్టంగా చెప్పాం. క్యాలెండర్ ప్రకారం వాటిని విడుదల చేసి అండగా ఉండేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనకూ, టీడీపీ పాలనకూ మధ్య తేడాను ప్రజలు గమనించారు. రెండు ప్రభుత్వాల్లో ఎవరికి ఏం మంచి జరిగిందన్నదానిపై ప్రతి కుటుంబంలోనూ చర్చ జరుగుతోంది’’ అని వైఎస్ జగన్ వివరించారు.చంద్రబాబు అబద్ధాలు.. మోసాలుగా మారుతున్నాయి‘‘చంద్రబాబు అబద్ధాలు.. ఇప్పుడు మోసాలుగా మారుతున్నాయి. చంద్రబాబు మోసాలపై రోజురోజుకూ ప్రజల ఆగ్రహం పెరుగుతోంది. జగన్ పలావు పెడితే.. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నారు. బిర్యానీ లేదుకదా.. ఉన్న పలావు పోయింది. సూపర్ సిక్సూ లేదు సూపర్ సెవెనూ లేదు. విద్యాదీవెన లేదు.. వసతి దీవెనా.. లేదు. ఇంగ్లీషు మీడియం చదువులూ దెబ్బతిన్నాయి, టోఫెలూ పోయింది. గోరుముద్ద కూడా పోయింది. ప్రజారోగ్య రంగం తీవ్రంగా దెబ్బతింది. ఆరోగ్యశ్రీ అటకెక్కింది. వ్యవసాయం, పెట్టుబడి సాయం కూడా పోయిందిచంద్రబాబు సర్కార్లో ప్రతీదీ స్కామే....ఉచిత ఇన్సూరెన్స్ ఆచూకీ లేదు. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోతున్నాయి. డోర్ డెలివరీ గాలికి ఎగిరిపోయింది. ఇప్పటికే లక్షన్నర పెన్షన్లు కట్. నాయుకుల దగ్గరకు వెళ్తే కాని పెన్షన్ రాని పరిస్థితి. పేరుకు ఇసుక ఉచితం అన్నారు.. కాని వైఎస్సార్సీపీ హయాంలో కన్నా, ఇప్పుడు ఇసుక రేటు అధికంగా ఉంది. మన హయాంలో ఇసుక సరసమైన ధరకే దొరికేది, ప్రభుత్వానికీ ఆదాయం కూడా వచ్చేది. వైఎస్సార్సీపీ హయాంలో నిల్వలు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఇసుక దొరకడం లేదు, రేట్లు కూడా అధికంగా ఉన్నాయి. ప్రభుత్వానికి ఇప్పుడు ఒక్కపైసా కూడా రావడం లేదు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మద్య నియంత్రణకు పెద్ద పీట వేశాం. అమ్మకాలను గణనీయంగా నియంత్రణలో ఉంచాం. ఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎక్కువ లిక్కర్ అమ్మాలి అన్న ధోరణితో వెళ్తోంది. ఇలా ప్రతీదీ స్కామే.ఇదీ చదవండి: పౌర సేవలకు జగన్ సై.. మద్యం ఏరులకు బాబు సై సై!!కేసులకు భయపడొద్దు....రాష్ట్రంలో ఎక్కడిపడితే అక్కడ క్లబ్బులు నడుస్తున్నాయి. మట్కా లాంటి వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయి. ఇది తప్పు అని ప్రజలు ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. కేవలం నాలుగు నెలల కాలంలో రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయాయి. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఓపికతో ముందుకు సాగాలి. ప్రజలకు అండగా ఉండాలి. ప్రజల తరఫున పోరాటాల్లో భాగస్వాములు కావాలి. కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. గొంతు నొక్కడానికి, అణచివేయాలన్న ధోరణితో కేసులు పెడుతున్నారు. వీటికి భయపడాల్సిన అవసరం లేదు’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: నాలుగు నెలల్లోనే.. అన్నింటా విఫలం: వైఎస్ జగన్అన్యాయమైన పరిపాలన సాగుతోంది..‘‘నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. నన్ను హింసించినట్టుగా ఎవ్వరినీకూడా చేసి ఉండరు. అయినా ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగాం. కేసులు పెట్టడం మినహా వీళ్లు చేయగలిగింది ఏమీ లేదు. రెడ్బుక్ ఏదైనా పెద్ద విషయమా? అదేదో గొప్ప పని అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇలా అయితే ప్రతి ఒక్కరూ ఒక బుక్ రాసుకుంటారు. న్యాయం, ధర్మం అనేవి ఉండాలి. అన్యాయమైన పరిపాలన ఇవాళ కొనసాగుతోంది. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే’’ అని వైఎస్ జగన్ చెప్పారు. -
ఏలూరుపాడులో రఘురామకృష్ణంరాజు దౌర్జన్యం
సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరుపాడులో టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు దౌర్జన్యానికి దిగారు. అంబ్కేదర్ ఫ్లెక్సీని రఘురామకృష్ణంరాజు చించేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత సంఘాలు ఫ్లెక్సీని ఏర్పాటు చేయగా, రఘురామకృష్ణంరాజు తన అనుచరులతో వచ్చి చించేశారు. దీంతో రఘురామకృష్ణంరాజు తీరును వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.జగ్గయ్యపేటలో జనసేన, టీడీపీల మధ్య ఫ్లెక్సీ వార్ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జనసేన, టీడీపీల మధ్య ఫ్లెక్సీ వివాదం రచ్చరచ్చగా మారింది. పాత మున్సిపల్ సెంటర్లో జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఫ్లెక్సీల్లో జగ్గయ్యపేట టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఫోటో లేకపోవడంతో టీడీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు.ఇదీ చదవండి: ఆ చర్చల సారాంశం చెప్పలేను: విశాఖ స్టీల్ప్లాంట్ సీఎండీ -
వారణాసిలో ఏపీకి చెందిన అన్నదమ్ముల బలవన్మరణం
వారణాసి/ఏలూరు: ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక సెల్ఫీ వీడియోలు తీసి ఆత్మహత్య చేసుకోవడంతో విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఏలూరు జిల్లా ఉంగటూరులోని నారాయణపురానికి చెందిన అన్న దమ్ములు వినోద్, లక్ష్మీనారాయణలు రియల్ ఎస్టేట్,ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండేవారు. వ్యాపార నిర్వహణకు స్నేహితులు, స్థానికుల వద్ద అప్పులు చేశారు.అయితే వ్యాపారంలో నష్టాలు రావడం, తమ డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడంతో అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు .అనంతరం ఏపీ నుంచి వారణాసికి వెళ్లారు. అక్కడ ఆంధ్రా ఆశ్రమంలో గదిని అద్దెకు తీసుకుని.. అందులోనే ఉంటున్నారు.ఇదీ చదవండి : ప్రశ్నార్ధకంగా విశాఖ ఉక్కు పరిశ్రమఈ తరుణంలో వ్యాపారంలో నష్టాలు, అప్పులు ఇచ్చిన వారిని నుంచి ఒత్తిడి పెరిగిపోతుందని, తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియో తీశారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు. సెల్ఫీ వీడియోపై సమాచారం అందుకున్న వారాణాసి పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అన్నదమ్ములిద్దరు ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించారు. అన్నదమ్ముల మృతిపై ఏపీలోని వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
AP: భయం గుప్పిట్లో కొల్లేరు
సాక్షి,విజయవాడ: కొల్లేరు వాసులు భయం గుప్పిట్లో ఉన్నారు.కొల్లేరు పరివాహక ప్రాంతంలోని చిన్న అడ్లగడ్డ వద్ద రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. బుడమేరు నుంచి కొల్లేరుకు లింకుండడంతో కొల్లేరుకు నీటి ప్రవాహం ప్రస్తుతం భారీగా వస్తోంది.బుడమేరులో రెండో గండిని పూడ్చివేశారు. మూడో గండిని పూడ్చేందుకు అప్రోచ్రోడ్డును నిర్మిస్తున్నారు. మూడో గండిని పూడ్చివేస్తే విజయవాడకు ముంపు ముప్పు తప్పనుందని చెబుతున్నారు. అయితే కొల్లేరుకు వరద పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. -
పాలకొల్లు రైల్వే స్టేషన్ దగ్గర విషాదం.. ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
సాక్షి, పశ్చిమగోదావరి: పాలకొల్లు రైల్వే స్టేషన్ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేయగా, యువకుడు మృతిచెందాడు. రైలు వచ్చే సమయానికి యువతిని పక్కకు నెట్టి యువకుడు సూసైడ్కు పాల్పడ్డాడు. పెద్దలు వీరి వివాహానికి అంగీకరించకపోవడమే కారణమని సమాచారం.ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందగా, ప్రియురాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.మృతుడుది గణపవరం కాగా, ప్రియురాలు ఎస్ కొండేపాడు గ్రామానికి చెందిన అమ్మాయిగా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అల్లు అర్జున్పై నోరుపారేసుకున్న జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి
సాక్షి,పశ్చిమ గోదావరి : స్టార్ హీరో అల్లు అర్జున్పై తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నోరు పారేసుకున్నారు. అల్లు అర్జున్ ఏమైనా పుడింగా? నాకు కేవలం మెగా ఫ్యాన్స్ ఉన్నారని మాత్రమే తెలుసు తప్ప అల్లు అర్జున్కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారని తెలియదు’ అని వ్యంగ్యంగా మాట్లాడారు.‘తనకు ఫ్యాన్స్ ఉన్నారని అల్లు అర్జున్ ఊహించుకుంటున్నారు. తన స్థాయి మరచి మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కేవలం హీరో చిరంజీవి వల్లే అల్లు అర్జున్ను మెగా అభిమానులు హీరోగా గుర్తించారు’ అని తెలిపారు. ‘అల్లు అర్జున్ తానేదో పుడింగి లాగా ఫీల్ అయి.. ఇష్టం అయితే వస్తా.. లేదంటే లేదు అంటే.. ఇక్కడా బతిమాలాడే వాళ్లు ఎవరూ లేరు. అల్లు అర్జున్ ప్రచారానికి వస్తే ఎంత.. రాకపోతే ఎంత. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలిచింది తండ్రి అల్లు అరవింద్ ఎంపీగా నిలబడితే గెలిపించలేని అల్లు అర్జున్.. ఇప్పుడు ఇతరులపై విమర్శలు చేయడం ఏంటి? అని అల్లు అర్జున్ను మరింత రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. -
బ్యాటరీ మింగేసిన చిన్నారి
పశ్చిమగోదావరి: ఆడుకునే బొమ్మలో ఉండే చిన్న బ్యాటరీని పొరపాటున 11 నెలల పాప మింగేసింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగింది. ఈ విషయాన్ని గుర్తించిన చిన్నారి తల్లి.. వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు చిన్నారిని పరీక్షించి విజయవాడకు తీసుకెళ్లాలని రిఫర్ చేశారు. దీంతో హుటాహుటిన అంబులెన్స్లో విజయవాడలోని ఆయుష్ హాస్పిటల్కు తీసుకువెళ్లారు.డాక్టర్లు చిన్నారి పొట్టను ఎక్స్రే తీసి పరిశీలించారు. కడుపు, ఛాతి మధ్య భాగంలో బ్యాటరీ ఇరుక్కున్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఆపరేషన్ అవసరం లేకుండానే వైద్యులు ఎండోస్కోపీ ద్వారా చిన్నారి పొట్టలోని బ్యాటరీని బయటకు తీశారు. ఘటన జరిగిన వెంటనే తల్లిదండ్రులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు వెల్లడించారు. -
ఈవీఎంల ట్యాంపరింగ్ అనుమానాలున్నాయ్: కారుమూరి
సాక్షి, పశ్చిమగోదావరి: అన్ని వర్గాలకు మంచి జరిగేలా వైఎస్ జగన్ పాలన చేశారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ గెలవాలని కష్టపడ్డ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.‘‘మంచి కంటే చెడు ఈజీగా ప్రచారం అవుతుంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ని భూతంలా చూపించి దుష్ప్రచారం చేశారు. జగన్ మీ ఆస్తులు తాకట్టు పెట్టేస్తాడంటూ నమ్మించారు. ఇన్ని లక్షలమందికి అన్ని హక్కులతో స్థలాలు ఇచ్చిన జగన్.. మీ ఆస్తులు ఎందుకు లాక్కుంటారు?. ప్రజలు, రైతులకు మంచి జరగాలని తపన పడ్డ మనిషి వైఎస్ జగన్. ఈవీఎంలపై రాష్ట్రమంతటా చర్చలు జరుగుతున్నాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని మాకు అనుమానం ఉంది’’ అని కారుమూరి చెప్పారు.భీమవరంలో ఈవీఎంలను ప్రైవేట్ కారులో తరలిస్తుంటే పట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఒక నియోజకవర్గంలో లక్ష ఎనభై వేల ఓట్లు పొలైతే ముప్పై వేలు అధికంగా కనబడ్డాయి. ఈవీఎంలు ఏదో తేడా జరిగిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటాం’’ అని కారుమూరి పేర్కొన్నారు. -
AP: చికెన్ తెగ తినేశారు
సార్వత్రిక పోరు సందర్భంగా ఉమ్మడి జిల్లాలో చికెన్ విక్రయాలు రెట్టింపు స్థాయిలో జరిగాయి. నోటిఫికేషన్కు ముందు నుంచే విందు భోజనాల హడావిడి మొదలైంది. ఓట్ల పండుగలో నాన్వేజ్ వంటకాలెన్ని వడ్డించినా చికెన్దే సింహ భాగమైంది. రికార్డు స్థాయిలో బ్రాయిలర్ కోళ్ల అమ్మకాలు జరగ్గా, గత నెల రోజుల్లో మాంసాహార ప్రియులు రూ.435 కోట్లు విలువైన చికెన్ను లొట్టలేసుకుంటూ లాగించేశారు. సాక్షి, భీమవరం: ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విందు భోజనాలకు అధిక ప్రాధాన్యమిస్తారు. చుట్టూ ఉన్న కేడర్ను కాపాడుకునేందుకు ఆశావాహుల ఇంట నోటిఫికేషన్కు ముందు నుంచే ఈ సందడి మొదలవుతుంది. ఎన్నికల సమీపించే కొద్ది వివిధ సంఘాల వారికి విందులు ఏర్పాటు చేస్తుంటారు. ఈ క్రమంలో గత నెల రోజులోగా జిల్లాలోని ఏ నియోజకవర్గంలో చూసినా ఆతీ్మయ కలయికల పేరిట రాజకీయ విందులే. అభ్యర్థులు తమ ఎన్నికల కార్యాలయాల వద్ద ప్రతి రోజు కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేస్తూ వచ్చారు. నామినేషన్లు, ప్రచార కార్యక్రమాల్లో కేడర్ కోసం ప్రత్యేక విందులు వడ్డించారు. మరో పక్క మండల, నియోజకవర్గ స్థాయిలో వివిధ సామాజిక వర్గాలు, ఆటో, తోపుడుబండ్లు యూనియన్లు, వివిధ వర్తక సంఘాలతో పాటు ఎక్కువగా ప్రజల్లో ఉండే పీఎంపీలు, పాస్టర్లు, డ్వాక్రా సంఘాల లీడర్లు తదితర వర్గాల వారికి పోటాపోటీగా ఆతీ్మయ సమ్మేళనాలు నిర్వహించారు. వారి కోసం ఏర్పాటు చేసిన విందు భోజనాల్లో చేప, రొయ్య వంటకాలు చేసినా మాంసాహార ప్రియులు ఎక్కువగా ఇష్టపడే చికెన్కే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. గరిష్ట స్థాయి విక్రయాలు సాధారణంగా ఉమ్మడి జిల్లాలో రోజుకు 2.5 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరుగుతుంటాయి. ఆదివారం, పండగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలుంటాయి. ఎన్నికల సంగ్రామం నేపథ్యంలో గత నెల రోజులుగా రాజకీయ పారీ్టల నేతల నుంచి హోల్సేల్ వ్యాపారులకు రోజూ వందల కిలోల చికెన్ ఆర్డర్లు వచ్చాయి. గత నెల 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా అంతకు వారం పది రోజుల ముందు నుంచి చికెన్ ఆర్డర్లు రావడం మొదలైందని వ్యాపారులు అంటున్నారు. నామినేషన్లు, ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆర్డర్ల జోరు మరింత పెరిగిందంటున్నారు. రోజువారి అమ్మకాలతో పోలిస్తే సగటున గత నెల రోజులుగా రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరిగాయని వారు తెలిపారు. మునుపెన్నడూ ఇంత భారీస్థాయిలో వరుసగా అమ్మకాలు జరిగింది లేదంటున్నారు. కోళ్లు సిద్ధంగా.. ధర నిలకడగా ఉమ్మడి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, పాలకొల్లు, పెనుగొండ, నరసాపురం తదితర ప్రాంతాల్లోని ఫాంలలో ఏడు లక్షలకు పైగా కోళ్ల పెంపకం చేస్తున్నారు. బ్రాయిలర్ కోడి వేసవిలో 40 రోజులకు, శీతాకాలంలో మేత ఎక్కువగా తీసుకోవడం వలన 35 రోజుల్లోనే రెండు కేజీలు వరకు బరువు పెరిగి వినియోగానికి వస్తుంటాయి. సాధారణంగా వేసవిలో ఎండల తీవ్రతకు కోళ్లు ఎక్కువగా మృత్యువాత పడుతుంటాయి. వేసవి తాపం నుంచి వాటికి ఉపశమనం కలిగించేందుకు షెడ్లపై వాటర్ స్ప్రింక్లర్లు, ఫ్యాన్లు తదితర వాటి ఏర్పాటుతో నిర్వహణ ఖర్చు తడిసిమోపెడవుతుంది. వేడి చేస్తుందన్న భావనతో చికెన్ వినియోగం తక్కువగా ఉండటం వలన డిమాండ్ లేక ధర పతనమవుతుంది. ఆయా కారణాలతో నష్టాలు చవిచూడాల్సి వస్తుందని వేసవిలో కొత్త బ్యాచ్లు తక్కువగా వేస్తుంటారు. అయితే ఈసారి ఎన్నికల సీజన్ కావడం వ్యాపారం బాగుంటుందని ముందే ఊహించి కొత్త బ్యాచ్లు సిద్ధం చేయడం వారికి కలిసొచ్చింది. వేసవిలో కిలో రూ.220 నుంచి రూ.250 మధ్య పలికే చికెన్ ధర ఈసారి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రూ.280 నుంచి రూ.300 మధ్య నిలకడగా ఉందని హోల్సేల్ వర్గాలు అంటున్నాయి. సగటున కిలో రూ.290 చొప్పున సాధారణ అమ్మకాలు మేరకు రోజుకు రూ.7.25 కోట్ల చొప్పున నెలకు రూ. 217.5 కోట్ల అమ్మకాలు జరుగుతాయని అంచనా. అయితే నెల రోజులుగా ఎన్నికల నేపథ్యంలో రెట్టింపు స్థాయిలో జరిగిన అమ్మకాల మేరకు జిల్లాలో రికార్డు స్థాయిలో రూ.435 కోట్లు మేర చికెన్ను మాంసాహారప్రియులు లాగించేశారంటున్నారు. -
AP: ఓటు వేసిన 102 ఏళ్ల వృద్ధురాలు
పాలకోడేరు: ఓటు ఎంత విలువైనదో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. పశ్చిమ గోదావరి జిల్లా, పాలకోడేరు మండలం, కుముదవల్లి గ్రామంలో 102 ఏళ్ల శతాధిక వృద్ధురాలు వి.లక్ష్మీ నరసమ్మ శనివారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బంది ఆమె ఇంటికి వెళ్లి ఓటు వేయించారు. వయో వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించి హోం ఓటింగ్ రెండోరోజైన శనివారం కూడా కొనసాగింది. గొల్లలకోడేరు, మోగల్లు, కోరుకొల్లు, గరగపర్రు గ్రామాల్లోని వారంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
‘ఉండి’ టికెట్ రగడ.. భీమవరంలో ఉద్రిక్తత
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: ఉండి నియోజకవర్గంలో అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయి. భీమవరం పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రామరాజు సీటుపై తెలుగుదేశం నాయకులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే రామరాజు కార్యాలయం వద్ద నుంచి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటి వరకు భారీ ర్యాలీ చేపట్టిన టీడీపీ నాయకులు.. సీతారామలక్ష్మి ఇంటిని ముట్టడించారు. ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే సీటు మంతెన రామరాజుకే ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. సెట్టింగ్ సీటును రఘురామకృష్ణంరాజుకు కేటాయిస్తున్నట్లు తెలియడంతో రామరాజు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో టీడీపీ సంకట స్థితిలో పడింది. మాజీ ఎమ్మెల్యే శివరామరాజు టికెట్ ఆశించి భంగపడి రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. టికెట్ దక్కించుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఆనందం పట్టుమని పది రోజులు కూడా నిలవలేదు. ఇప్పుడు రామరాజును కాదని ఎంపీ రఘురామకృష్ణరాజుకు టికెట్ కేటాయించారన్న సమాచారంతో ఆ నియోజకవర్గ టీడీపీలో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వం అధికారికంగా ప్రకటించకపోయినా తీవ్రస్థాయిలో అసమ్మతి స్వరం వినిపిస్తోంది. అందరూ సహకరిస్తే ఇండిపెండెంట్గా తాను బరిలో ఉంటానని మరోవైపు రామరాజు చెబుతున్నారు. పదిహేను రోజుల నుంచి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా నరసాపురం ఎంపీ టికెట్ ఆశించి కూటమి చేతిలో భంగపడ్డ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్ హామీ రావడంతో రామరాజు వర్గం తేరుకోలేకపోతోంది. చంద్రబాబు నుంచి రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వంపై పరోక్ష సంకేతాలు ఇవ్వడంతో రామరాజు వర్గం ఐదు రోజులుగా వివిధ రకాలుగా నిరసనలు వ్యక్తం చేసి తీవ్రస్థాయిలో పార్టీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలో రామరాజుకు ఎలాంటి హామీ రాకపోవడంతో కంటితడి కూడా పెట్టారు. ఆయన వర్గీయులు బుధవారం నుంచి ఆమరణదీక్ష ప్రారంభించారు. -
‘ఉండి’ టీడీపీ టికెట్: ఎమ్మెల్యే రామరాజు కంటతడి
సాక్షి,పశ్చిమగోదావరి: తన నియోజకవర్గం నుంచి వేరొకరికి టీడీపీ టికెట్ ఇస్తున్నారని ఉండి ఎమ్మెల్యే రామరాజు కంటతడి పెట్టారు. మంగళవారం(ఏప్రిల్9) కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం అనంతరం రామరాజు మీడియాతో మాట్లాడారు. ‘నా నియోజకవర్గం నుంచి వేరొకరికి టికెట్ కేటాయించేందుకు సిద్ధమయ్యారు. కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటా. వారే నా కుటుంబ సభ్యులు..వారు చెప్పినట్టు చెస్తా. రాజకీయాల నుంచి విరమించుకోవడంపై ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తా’ అని రామరాజు చెప్పారు. ‘ఉండి’ సీటుపై టీడీపీ శ్రేణుల్లో అయోమయం ఉండి నుంచి కాకుండా ఎమ్మెల్యే రామరాజుకు మరో చోట టీడీపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. సీటు మార్పు ఉంటుందనే అనుమానంతో రామరాజు వర్గం ఆందోళనకు ఆందోళనకు దిగింది. రామరాజు సీటు మార్చొద్దంటూ కార్యకర్తలు నిరసన తెలిపారు. కాగా, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున రఘురామకృష్ణం రాజు పోటీచేస్తారని ఇటీవల పాలకొల్లు ప్రచారంలో చంద్రబాబు ప్రకటించడంతో రామరాజు వర్గంలో టెన్షన్ మొదలైంది. ఇదీ చదవండి.. మూడు ముక్కలైన ఉండి టీడీపీ -
పశ్చిమగోదావరి: టీడీపీ-జనసేనలో భగ్గుమన్న అసమ్మతి
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: టీడీపీ-జనసేన అధినేతల వ్యవహార శైలి, సీట్ల ప్రకటన ఇరు పార్టీల కేడర్కు మింగుడు పడటం లేదు. పొత్తుల పేరుతో ఇరు పార్టీల నేతలు కత్తులు నూరుకుంటున్నాయి. జిల్లాలో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. నరసాపురంలో జనసేన నేత బొమ్మిడి నాయకర్కు సీటు కేటాయించడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, కొవ్వలి రామ్మోహన్ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు సమాచారం ఇవ్వకుండా టికెట్ కేటాయించారంటూ కొత్తపల్లి సుబ్బారాయుడు అలకబూనారు. భీమవరంలో జనసేన అభ్యర్థిని బరిలో దింపకుండా టీడీపీ నుంచి పులపర్తి రామాంజనేయులు చేర్చుకుని టికెట్ కేటాయించడంపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆచంట నియోజకవర్గంలో కొందరు నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ జనసేన నేతల్లో వర్గ పోరు నెలకొంది. తణుకు నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ మాట ఇచ్చిన సీటు రాకపోవడంతో విడివాడ రామచంద్రరావు నైరాశ్యంలో మునిగిపోయారు. తణుకులో టీడీపీ జెండా ఎగరనివ్వనంటూ ఆయన శపథం పూనుతున్నారు. దశాబ్ద కాలంగా పార్టీకి సేవ చేసిన టికెట్ తనకు కేటాయించకపోవడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు రెబల్ అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు సమాచారం. పోలవరం సీటుపై పంచాయితీ తేలలేదు. టీడీపీ నుంచి బొరగం శ్రీనివాస్, లేదా జనసేన నుంచి బాలరాజు కేటాయించుకుంటే.. తాము సహకరించబోమని కేడర్ తేల్చి చెబుతోంది. -
పశ్చిమగోదావరి YSRCP MLA అభ్యర్థుల జాబితా
-
ఉమ్మడి పశ్చిమగోదావరి: టీడీపీలో అసమ్మతి సెగ
సాక్షి, పశ్చిమగోదావరి: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా టీడీపీలో అసమ్మతి సెగ రగులుతోంది. పార్టీని నమ్ముకున్న తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు సీటు గల్లంతయ్యింది. పోలవరం, తాడేపల్లిగూడెం సీట్లు కూడా ఇదే పరిస్థితి.. పొత్తు స్థానాల ఇన్ఛార్జ్లకు ఫోన్ చేసి సీట్లు లేవంటూ చంద్రబాబు తేల్చి చెప్పారు. పొత్తు స్థానాలు జనసేన ప్రకటించకుండానే చంద్రబాబు లీక్స్తో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. పోలవరం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెంలో అసంతృప్తి భగ్గుమంది. డబ్బు ఖర్చుపెట్టి హడావుడి చేసిన తర్వాత పొత్తు పేరు చెప్పి సీటు గల్లంతు చేయడం సరికాదంటూ తాడేపల్లిగూడెం ఇంచార్జ్ వలవల బాబ్జి అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు అత్యవసర సమావేశం నిర్వహించాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్కు సీటు కేటాయించాలని నాయకులు తీర్మానించారు. పోలవరం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉంగుటూరులో జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులుకి సీటు కేటాయించాలంటూ చంద్రబాబును కలిసేందుకు భారీ ర్యాలీతో మంగళగిరి వెళ్లేందుకు ఉంగుటూరు నియోజకవర్గం టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జనసేన అభ్యర్థుల పేరుతో జిల్లాలో హడావిడిగా సర్వేలు చేపట్టగా, భీమవరం, నరసాపురం సీట్లు తేల్చకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇదీ చదవండి: ఎచటి నుంచో ఆ పవనం! -
వైఎస్సార్సీపీ నేత కుమారుడి వివాహానికి హాజరైన సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: కాళ్ల మండలం పెద అమిరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించారు. రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్లో పాలకొల్లు వైఎస్సార్సీపీ నాయకులు గుణ్ణం నాగబాబు కుమారుడు సుభాష్ వివాహానికి సీఎం హాజరయ్యారు. వరుడు గుణ్ణం సుభాష్, వధువు దీప్తిలను సీఎం జగన్ ఆశ్వీరదించారు. ఈ వివాహ వేడుకలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు, ఎమ్మెల్యేలు గ్రంథి శ్రీనివాస్, పుప్పాల వాసు బాబు, శ్రీ రంగనాథరాజు తదితరులు పాల్గొన్నారు. -
భీమవరం: పవన్ తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం
సాక్షి, పశ్చిమగోదావరి: భీమవరం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర నిరుత్సాహం నెలకొంది. భీమవరం టీడీపీ నేతలను పవన్ కళ్యాణ్ కలవకపోవడంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో పవన్తో సమావేశం కోసం ఉదయం నుంచి టీడీపీ నాయకులు వేచి ఉన్నారు. కేవలం భీమవరం నియోజకవర్గ నాయకులతో అని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు సమావేశం ఏర్పాటు చేసింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్లతో మాత్రమే భేటీ జరిగింది. పవన్ అర్థతరంగా వెళ్లిపోవడంతో టీడీపీ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. భీమవరం టీడీపీ నాయకులతో పవన్ మీటింగ్ రద్దు అవడంపై మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.మమ్మల్నే కలవకపోతే ప్రజలని ఎలా కలుస్తారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ వచ్చింది తెలుగుదేశం పార్టీని పాడు చేయడానికా.. అంటూ టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెప్పుడూ పవన్ మీటింగ్ అని భీమవరం పిలవద్దంటూ వీరవాసరం నాయకులు ధ్వజమెత్తారు. మండలాల వారీ మీటింగ్ పెట్టండి అంటూ సీరియస్ అయ్యారు. దీంతో పార్టీ నాయకులపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరెవరు ఎక్కడ మీటింగ్ పెట్టాలో చెప్పడానికి అంటూ పితాని మండిపడ్డారు. ఇదీ చదవండి: చంద్రబాబుకి రెస్ట్.. కుప్పం బరిలో భువనేశ్వరి? -
టీడీపీ కార్యకర్తల అత్యుత్సాహంతో భారీ అగ్ని ప్రమాదం
యలమంచిలి: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఆర్యపేటలో శనివారం నిర్వహించిన పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. కొబ్బరి కాయల్ని నిల్వ ఉంచే కురిడీ కొట్ల సమీపంలో పాదయాత్ర సాగుతుండగా.. టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహంతో బాణసంచా కాల్చారు. కొబ్బరి కొట్ల నిర్వాహకులు తారాజువ్వలు వేయొద్దని వేడుకుంటున్నా టీడీపీ కార్యకర్తలు వినిపించుకోలేదు. గాలిలోకి వదిలిన తారాజువ్వల వల్ల ఆర్యపేటలోని కొడవటి వెంకటేశ్వరరావు (కొండయ్య) అనే వ్యాపారికి చెందిన మూడంతస్తుల కొబ్బరి గోడౌన్లో మంటలు చెలరేగాయి. ఆ మంటలు క్షణాల్లో ఉద్ధృతమై గోడౌన్లో ఉన్న 10 లక్షల కురిడీ కొబ్బరి కాయలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వాటితో పాటు గోడౌన్ కూడా దగ్ధమైంది. దగ్ధమైన కొబ్బరి కాయల విలువ సుమారు రూ.కోటి ఉంటుందని, దగ్ధమైన గోడౌన్ విలువ మరో రూ.కోటి ఉంటుందని రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనతో వ్యాపారి కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. -
టీడీపీ మేనిఫెస్టో మాకు గొడ్డలిపెట్టుగా మారింది: ఆటో డ్రైవర్లు
-
చంద్రబాబు సభలకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ
సాక్షి, పశ్చిమగోదావరి: చంద్రబాబు సభలకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ తగిలింది. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో చంద్రబాబు ‘రా కదలిరా’ సభకు ఎన్టీఆర్ బ్యానర్లతో ఫ్యాన్స్ రాగా, టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ చోటుచేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లతో వేదికపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట, పరస్పర దాడులు జరిగాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్లకార్డులను తీసుకువచ్చిన ఫ్యాన్స్.. చంద్రబాబు వేదికపైకి వచ్చే ముందు ప్రదర్శించారు. కోపోద్రిక్తులైన టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులపై దాడికి పాల్పడారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ నినాదాలతో హోరెత్తించారు. తిరువూరులో... కాగా, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు చంద్రబాబు సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఎన్టీఆర్ ఫోటో ఉన్న బ్యానర్లు, జెండాలతో వచ్చిన టీడీపీ కార్యకర్తలు.. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ జెండాలపై రాశారు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ రాసిన జెండాలను లాక్కొన్న టీడీపీ నేతలు పక్కన పడేశారు. టీడీపీ నేతల తీరుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: ఎంత మంది ఉన్నారన్నది కాదు.. ఇటు ఎవరున్నారన్నది పాయింట్ -
ఇళ్లకొచ్చి బెదిరింపులు.. సమాచార దోపిడీలో టీడీపీ, జనసేన
సాక్షి ప్రతినిధి, ఏలూరు/తణుకు అర్బన్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీలు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దోపిడీ చేస్తున్నాయి. ఆ పార్టీలకు చెందిన కొందరు వ్యక్తులు ఇళ్లకు వచ్చి, వ్యక్తిగత సమాచారం కోరుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా ఉన్న సమయంలో ఇళ్లలోకి చొరబడి దౌర్జన్యం చేస్తున్నారు. ఆధార్ కార్డులు చూపాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఓటీపీ వస్తుందని, వెంటనే చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారు. వారు చెప్పినట్లు చేయని వారిపై దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా ఏలూరు, తణుకు నగరాల్లో వీరు ఇంటింటికీ వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో జిల్లావాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలో అమరావతి భూముల కుంభకోణంలో పలువురి ఆధార్ కార్డులతో భూములను రిజిస్ట్రేషన్ చేసిన టీడీపీ.. ఇప్పుడు తమ ఆధార్ కార్డు, ఫోన్ నంబర్లతో ఏం చేయబోతుందనే భయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. కొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల ఏలూరు పత్తేబాదలోని ఓ ఇంటికి వెళ్లిన కొందరు వ్యక్తులు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను ఆధార్ కార్డు కావాలంటూ అడిగారు. మీరెవరని ప్రశ్నించగా టీడీపీ నుంచి వచ్చామని, ఆధార్ కార్డు ఇస్తే యాప్లో వివరాలను నమోదు చేస్తామని చెప్పారు. ఫోన్ నంబర్కు వచ్చే ఓటీపీ చెప్పాలంటూ దురుసుగా అడిగారు. మీకెందుకివ్వాలంటూ ఆ మహిళ గట్టిగా నిలదీయడంతో ఆమెను బెదిరిస్తూ వెళ్లిపోయారు. ఏలూరు కొత్తపేటలోనూ ఇదే విధంగా పలు ఇళ్లలో ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ చెప్పాలని టీడీపీ, జనసేనకు చెందిన కొందరు వ్యక్తులు డిమాండ్ చేశారు. స్థానికులు గట్టిగా ఎదురు తిరగడంతో అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇలా దెందులూరు, ఉంగుటూరు, తణుకులో కూడా టీడీపీ, జనసేనకు చెందిన పలువురు స్థానిక నాయకులు కొందరు యువకులను ఇళ్లకు పంపి బెదిరింపులకు పాల్పడుతున్నారు. తణుకులోనూ ఓటరు లిస్టుతో ఇంటింటికీ వచ్చి వివరాలు అడుగుతూ బాబు గ్యారంటీ కార్డులు అందజేస్తున్నారు. మొబైల్ ఫోన్కు వచ్చే ఓటీపీ వెంటనే చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం 8, 17 వార్డుల్లో ఇలాగే బెదిరించిన టీడీపీ కార్యకర్తలపై మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించి, హెచ్చరించి పంపించారు. వ్యక్తిగత సమాచారం చెప్పొద్దని పోలీసుల హెచ్చరిక ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో అపరిచితులు ఎవరికీ వ్యక్తిగత సమాచారం, ఆధార్ కార్డులు, ఓటీపీ నంబర్లు ఇవ్వవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు చెప్పవద్దంటూ తణుకులో మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు వారి వివరాలను గోప్యంగా ఉంచుకోవాలని, ఎవరికీ చెప్పవద్దని వాటి కోసం బలవంతం చేసిన వారిపై ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. వాలంటీర్లపై దుష్ప్రచారం చేసిన పవన్.. ఇప్పుడిదేం పని? ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారికి అండదండగా ఉంటూ, సంక్షేమ పథకాలను అందిస్తున్న వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలు దు్రష్పచారం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును తెలుసుకొనేందుకు వెళ్లిన వాలంటీర్లపై నానా రకాల ప్రచారం చేశారు. వాలంటీర్లు ప్రభుత్వం నియమించిన వారు. అదే ప్రాంతానికి చెంది, నిత్యం ప్రజల మధ్య ఉండి, వారికి సుపరిచితులైన వారు. అలాంటి వాలంటీర్లు ప్రభుత్వ పథకాలు మరింత సమర్ధంగా అందేలా ప్రజల నుంచి సమాచారాన్ని సేకరిస్తే తప్పంటూ నానా యాగీ చేశారు. ఇప్పుడు అదే జనసేన, టీడీపీ వారు ఆ ప్రాంతానికి సంబంధం లేని వారిని, అపరిచితులను ఇంటింటికీ పంపి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, ఇవ్వని వారిపై బెదిరింపులు, దాడులకు పాల్పడటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అపరిచిత వ్యక్తులు వస్తున్నారు అపరిచిత వ్యక్తులు ఇళ్లకు వచ్చి ఆధార్ కార్డు కావాలని అడుగుతున్నారు. ఫోన్ నంబర్లకు ఓటీపీలు వస్తాయని అవి చెప్పాలని అడుగుతున్నారు. మీకెందుకని అడిగితే టీడీపీ యాప్లో నమోదు చేయాలని అంటున్నారు. వారి తీరుతో మాకు భయంగా ఉంది. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. – బి.మణి, వన్టౌన్, ఏలూరు చదవండి: ఇదీ.. జగన్ కమిట్మెంట్ -
AP: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. ఉండి మండలం చెరుకువాడలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో సాబ్జీ మృతి చెందారు. సాబ్జీ కారు డ్రైవర్, గన్మెన్, పీఏకి తీవ్రగాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సీఎం జగన్ దిగ్భ్రాంతి మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణవార్త తెలుసుకున్న సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాబ్జీ మృతికి కేబినెట్ సంతాపం తెలిపింది. కేబినెట్ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించారు. -
మెడలో తాళి కట్టి.. విద్యార్థినిపై టీచర్ లైంగికదాడి
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: యండగండి పాఠశాలలో అమానుషం జరిగింది. ప్రేమ పేరుతో ఉపాధ్యాయుడు.. విద్యార్థినిని మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే స్కూల్ లో హిందీ టీచర్గా పనిచేస్తున్న పురెళ్ల సోమరాజు మాయమాటలతో విద్యార్థిని మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకున్నట్లు నమ్మించి లైంగికదాడికి పాల్పడ్డాడు. విద్యార్థిని, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కీచక ఉపాద్యాయుడిపై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఆమెకు ముగ్గురు... మొదటి భర్త ఆత్మహత్య! -
నేడు విశాఖ, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో సాధికార యాత్ర
సాక్షి, అమరావతి: నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా జనం నీరాజనాలు పలుకుతున్నారు. నివారం సామాజిక సాధికార యాత్ర విశాఖ జిల్లాలో విశాఖపట్నం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు, కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గాల్లో జరగనుంది. ఈ యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదలకు చేసిన మేలును ఆ వర్గానికి చెందిన మంత్రులు, నేతలు ప్రజలకు వివరించనున్నారు. -
టీడీపీ-జనసేన పొత్తు.. టీడీపీ నేతల్లో కంగారెందుకు?.. ఏం జరగబోతోంది?
తెలుగుదేశం-జనసేన పొత్తు వ్యవహారంలో చాలా చోట్ల టీడీపీ అభ్యర్ధుల్లో గుబులు రేపుతోంది. పొత్తులో భాగంగా తమ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తారేమోనని టీడీపీ నేతలు కంగారు పడుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఓ నియోజకవర్గంలో టీడీపీ-జనసేన నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయేది నేనంటే నేనే అంటూ పోటా పోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే జనసేన అభ్యర్ధి పట్ల పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలు రావడంతో టీడీపీ శ్రేణులకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. జనసేనకే ఆ సీటు ఇస్తే వారికి సహకరించే ప్రసక్తే లేదని టీడీపీ శ్రేణులు భీష్మించుకుని ఉన్నాయంటున్నారు. తణుకు నియోజకవర్గం నుంచి రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీకి చెందిన ఆరిమిల్లి రాధాకృష్ణపై విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి తణుకు నుంచే పోటీ చేయాలని ఆరిమిల్లి భావిస్తున్నారు. అయితే ఆ మధ్య వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ తణుకు సభలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తణుకు నుండి తమ పార్టీ తరపున విడివాడ రామచంద్రరావు పోటీ చేస్తారని ప్రకటించి సంచలనం సృష్టించారు. అది స్థానిక టీడీపీ నేతల్లో మంట పుట్టించింది. టీడీపీ-జనసేనల మధ్య పొత్తు అప్పటికి ఖరారు కాలేదు. పొత్తు పెట్టుకుంటాం అని అన్నా కూడా సీట్ల సర్దుబాటు కాలేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా విడివాడ రామచంద్రరావు పేరు ప్రకటించడం ఏంటని టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. అయితే పవన్ అలా ప్రకటించిన క్షణం నుంచి వచ్చే ఎన్నికల్లో తణుకు నియోజక వర్గంలో టీడీపీ-జనసేనల తరపు అభ్యర్ధిని తానే అని విడివాడ రామచంద్రరావు ప్రచారం చేసుకుంటున్నారు. మరో వైపు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయేది తానే అని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం మధ్యంతర బెయిల్పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలయిన సందర్బంగా ఆయన విజయవాడ దాకా ర్యాలీగా వెళ్తూ తణుకు వద్ద ఆగారు. అక్కడ జనసేన అభ్యర్ధి విడివాడ రామచంద్రరావు అమాంతం వచ్చి చంద్రబాబు కాళ్లకు నమస్కరించేశారు. ఆయన్ను చంద్రబాబు కూడా ఆప్యాయంగా లేవదీసి భుజం తట్టారు. టీడీపీ అభ్యర్ధి ఆరిమిల్లి కూడా చంద్రబాబుకు అభివందనం చేశారు కానీ విడివాడ రామచంద్రరావును రిసీవ్ చేసుకున్నంత సన్నిహితంగా ఆరిమిల్లిని చంద్రబాబు రిసీవ్ చేసుకోలేదని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. తణుకు సీటును జనసేనకు కేటాయించేసినట్లే అని చంద్రబాబు సంకేతాలు ఇచ్చారని చర్చించుకుంటున్నారు. చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత తిరిగి ఆరిమిల్లి, విడివాడ ఎవరికి వారే రాబోయే ఎన్నికల్లో తణుకు సీటు నాదంటే నాదే అని తమ తమ శిబిరాల ద్వారా ప్రచారాలు చేయించుకుంటున్నారు. ఎన్నికల నాటికి ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో.. ఏ ముగింపునిస్తుందో అని రాజకీయ పరిశీలకులు అనుకుంటున్నారు. చదవండి: ‘సెలెక్టివ్ అటెన్షన్’ అనే మానసిక భ్రాంతిలో పురందేశ్వరి’ -
అందుకే మళ్లీ సీఎంగా వైఎస్ జగనే కావాలి: మంత్రి కారుమూరి
సాక్షి, పశ్చిమగోదావరి: సీఎం జగన్ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నారని, అందుకే మళ్లీ సీఎంగా వైఎస్ జగనే కావాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో గురువారం ఆయన ‘వై ఏపీ నీడ్ జగన్’ కార్యక్రమంలో మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో 17వ స్థానంలో ఉన్న విద్యా వ్యవస్థ.. సీఎం జగన్ పాలనలో 3వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. అవినీతి లేని పాలన సీఎం జగన్ అందిస్తున్నారు. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా పాలన అందిస్తున్నందుకు మళ్లీ సీఎంగా జగన్ కావాలి. కరోనా కష్టకాలంలో అన్ని రాష్ట్రాలకన్నా మిన్నగా అందరికి మేలు చేశారు. జీడీపీ వృద్ధి రేటులో ఏపీని భారతదేశంలోనే నంబర్వన్గా నిలబెట్టారు. గతంలోలా మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చి ప్రజలను దోచుకు తినకుండా ఉండాలంటే మళ్లీ సీఎంగా జగనే కావాలి’’ అని మంత్రి కారుమూరి పేర్కొన్నారు. చదవండి: తెలంగాణలో టీడీపీని ఎందుకు మూసేశారు?: మంత్రి జోగి రమేష్ -
చంద్రబాబు అబద్ధం.. జగన్ నిజం.. పాలకొల్లు సభలో మంత్రి వేణు
సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా: పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుని, సంక్షేమ పథకాలతో వారి ఎదుగుదలకు ఆలోచన చేసిన నాయకుడు సీఎం జగన్ అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో శ్రీహరి గోపాలరావు (గోపి) ఆధ్వర్యంలో బస్సుయాత్ర నిర్వహించారు. పాలకొల్లు బైపాస్ రోడ్డు రామచంద్ర గార్డెన్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. అనంతరం పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ వరకు బస్సుయాత్ర సాగింది. గాంధీ బొమ్మల సెంటర్లో జరిగిన బహిరంగ సభలో మంత్రులు కొట్టు సత్యనారాయణ, విశ్వరూప్, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు, ఎంపీ నందిగాం సురేష్, ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్, ఇజ్రాయెల్ పాల్గొన్నారు. మంత్రి వేణు మాట్లాడుతూ, గతంలో అబద్ధం అధికారంలో ఉంది.. ఆ అబద్ధమే చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. ‘‘ఎన్నికల సమయంలో నాలుగు మాయమాటలు చెప్పి అధికారం పొందాలని గత పాలకులు అనుకుంటున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 90 శాతం అమలు చేసిన నాయకుడు సీఎం జగన్. 139 బీసీ కులాలను గుర్తించి వారి సామాజిక స్థితి పెరగడానికి అండగా నిలిచారు. బీసీ వర్గాలను అణచివేసిన వ్యక్తి చంద్రబాబు. పేదరికంపై యుద్ధం చేయాలంటే ఆయుధం విద్య అని అంబేద్కర్ చెప్పారు. ఆయనకు నిజమైన వారసుడిగా విద్యకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారు’’ అని మంత్రి వేణు పేర్కొన్నారు. ‘‘విద్యా కానుక, వసతి దీవెన, విద్యా దీవెన.. వంటి పథకాలతో అందరిని ద్రాక్షగా ఉన్న చదువును పేదలకు చేరువచేశారు. ఫీజు రియింబర్స్మెంట్కు కోతలు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా జబ్బున్న వారిని జల్లెడ పట్టి వారికి అండగా నిలిచారు. గతంలో చంద్రబాబు బీసీలు వెళ్లి అడిగితేనే తోకలు కత్తిరిస్తా అన్నాడు. మంత్రి మండలిలో సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారు.. బీసీ కులాలకు ఆత్మ గౌరవాన్ని నింపిన వ్యక్తి సీఎం జగన్.’’ అని మంత్రి చెప్పారు. మూడు ప్రాంతాల్లో జరుగుతున్న వైఎస్సార్సీపీ సామాజిక సాధికారిక యాత్ర బహిరంగసభలు ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. సీఎం జగన్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీల అగ్రవర్ణ పేదల ప్రభుత్వం. సామాజిక సాధికారత జగనన్నకే సాధ్యమైందని పాలకొల్లు సభ ద్వారా తెలుపబోతున్నాం. రెండు లక్షల 38 వేల కోట్లు అవినీతికి ఆస్కారం లేకుండా దళారీ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు చేరింది. అందులో ఒక లక్ష 78 వేల కోట్లు బీసీ సంక్షేమ శాఖ ద్వారా అణగారినవర్గాలకు చేరింది. సీఎం జగన్ పాలన అణగారిన వర్గాల్లో మనోధైర్యం నింపింది’’ అని మంత్రి వేణు తెలిపారు. చదవండి: ‘వెనుకబడిన వర్గాలకు అండగా సీఎం జగన్’ సామాజిక న్యాయం తుంగలో తొక్కిన ఘనత చంద్రబాబుది: మంత్రి విశ్వరూప్ ప్రజలను ఎలా మోసం చేయాలో చంద్రబాబుకి తెలిసినట్టు ఎవ్వరికీ తెలీదంటూ మంత్రి విశ్వరూప్ ఎద్దేవా చేశారు. చెప్పింది చెప్పినట్టు నెరవేర్చే ఒకే ఒక్కడు జగన్ మాత్రమే.. చంద్రబాబు ఇచ్చే హామీలు ఎన్నికలు ముగిసేవరకు మాత్రమే.. సామాజిక న్యాయం తుంగలో తొక్కిన ఘనత చంద్రబాబుది. దేశంలో అత్యుత్తమ పాలన జగన్ అందిస్తున్నారు. పక్క రాష్ట్ర సీఎం కేసీఆర్ సైతం పింఛన్ విడతల వారీగా పెంచుతామని అన్నారు. 1లక్ష 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ది. చంద్ర బాబు హయాంలో ఎస్సీ, మైనారిటీలకు ఒక్క మంత్రి పదవి లేదు. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన నాయకుడు సీఎం జగన్’’ అని మంత్రి కొనియాడారు. -
పోలవరం పనులను పరిశీలించిన మంత్రి అంబటి
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: పోలవరంలో రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు పర్యటించారు. ప్రాజెక్టులో దిగువ కాఫర్ డ్యాం వద్ద జరుగుతున్న డి వాటరింగ్ పనులను ఆయన పరిశీలించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య ఉన్న సీ ఫేజ్ నీటి మళ్లింపు పనులను స్వయంగా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని పరిశీలించామని.. లోయర్, అప్పర్ కాఫర్ డ్యాంల మధ్య ఏరియాలో డీ వాటర్ వర్క్స్ జరుగుతున్నాయన్నారు. డీ వాటర్ వర్క్ అనంతరం వైబ్రో కాంపాక్ట్ పనులు మొదలవుతాయన్నారు. లోయర్ అప్పర్ కాఫర్ డ్యాంల మధ్య.. సీఫేస్ ఎక్కువ ఉండటంతో పనులకు ఆటంకం కలుగుతుందన్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, దానికి సమాంతరంగా కొత్తది కట్టే అంశంలో కేంద్ర జలశక్తి శాఖ ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి అంబటి తెలిపారు. ‘‘నిర్వాసితుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. 41.15 కాంటూరు వరకు టీడీపీ హయాంలో వేసిన అంచనాకు నేటికి ఖర్చు పెరిగింది. 41.15 వరకు రూ.31,625 కోట్లతో సీడబ్ల్యూసీ రివైజ్డ్ కాస్ట్ కమిటీకి బిల్లు పంపాం. 45.72 కాంటూరు వరకు మరో రూ.16 వేలు కోట్లు ఖర్చు పెట్టాలి. 41.15 వరకు పూర్తియ్యాక మిగిలిన వాటి గురించి చర్యలు తీసుకుంటాం. కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయాలని ప్రధాని మోదీని సీఎం జగన్ కలిశారు’’ అని మంత్రి తెలిపారు. -
మైనర్పై జనసేన కార్యకర్త లైంగిక దాడి
వీరవాసరం: మైనర్పై జనసేన కార్యకర్త లైంగిక దాడికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వీరవాసరం పోలీసులు తెలిపిన వివరాలు.. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం పంజావేమవరానికి చెందిన జనసేన కార్యకర్త పంజా నాగేంద్ర అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలికపై సోమవారం రాత్రి లైంగిక దాడి చేశాడు. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న మైనర్ బాలికను కాళ్లు, చేతులు కట్టేసి వాటర్ ట్యాంక్ సమీపంలోకి తీసుకువెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. తనపై జరిగిన దారుణాన్ని బాధిత బాలిక కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ పి.రమేష్ తెలిపారు. చదవండి: రామోజీ మా సంతకాలు ఫోర్జరీ చేశారు -
పట్టుపురుగుల పెంపకంతో రైతులకు మంచి లాభాలు
-
టీడీపీ నేతల కనుసన్నల్లోనే విధ్వంసం.. యువగళం వలంటీర్లు అరెస్ట్
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: టీడీపీ నేతల కనుసన్నల్లోనే భీమవరంలో విధ్వంసకాండ జరిగిందని పోలీసులు గుర్తించారు. 44 మంది యువగళం వలంటీర్లను అరెస్ట్ చేయగా, 13 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు కేసులు నమోదయ్యాయి. భీమవరం, ఉండి, వీరవాసరం మండలాల టీడీపీ నాయకులపై ఐపీసీ సెక్షన్ 307, 324, 332, రెడ్ విత్ 149 తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే సీఎం జగన్, ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన లోకేష్కు భీమవరం పోలీసులు నోటీసులు జారీ చేశారు. చదవండి: జనంపై టీడీపీ దండయాత్ర! -
నారా లోకేష్కు భీమవరం పోలీసుల నోటీసులు
సాక్షి, పశ్చిమగోదావరి: భీమవరం సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్కు భీమవరం పోలీసులు నోటీసులు ఇచ్చారు. యువగళం పాదయాత్రలో టీడీపీ రౌడీమూకలు మరోసారి రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. పుంగనూరులో చంద్రబాబు కనుసన్నల్లో దౌర్జన్యాలకు తెగబడగా... భీమవరంలో లోకేశ్ ప్రోద్బలంతో పేట్రేగి పోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్లో మంగళవారం రాత్రి బహిరంగ సభ అనంతరం గునుపూడి శివారులో టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు బరి తెగించాయి. లోకేశ్ పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభ వద్ద టీడీపీ కార్యకర్తలు వ్యూహాత్మకంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. గతంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీపై వాటర్ బాటిళ్లు, రాళ్లు రువ్వడంతో పాటు ఫ్లెక్సీని తొలగించడానికి ప్రయత్నించారు. వివేకానందరెడ్డిని చంపింది ఎవరంటూ ఫ్లెక్సీలను ప్రదర్శించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలను పట్టుకుని నినాదాలు చేస్తూ ఉద్రిక్తత సృష్టించారు. చదవండి: భీమవరంలో మరో పుంగనూరు.. -
ఏలూరు, ప.గో.జిల్లాలో పంచాయతీ ఉపఎన్నికలు
అమరావతి: ఏలూరు, పశ్చిమ గోదావరి జిలాల్లో మొత్తం నాలుగు సర్పంచ్ స్థానాలకు 31 వార్డు స్థానాలకు నేడు పంచాయతీ ఉపఎన్నికలు జరగనున్నాయి. ఏర్పాట్లన్నీ పూర్తి కాగా ఉదయం 7 గంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది గత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనంతరం ఖాళీ అయిన స్థానాల భర్తీ కోసం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా ఈరోజు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఏలూరు జిల్లాలో మొతం 3 సర్పంచ్ స్థానాలకు 21 వార్డులకు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సర్పంచ్ స్థానానికి 10 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలనుంచి కౌంటిం ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు రిటర్నింగ్ అధికారి. ఏలూరు జిల్లాలో ఆగిరిపల్లి మండలంలోని అడవినెక్కలం, పెదపాడు మండలం వీరమ్మకుంట, ముదినేపల్లి మండలంలోని వణిదురు సర్పంచ్ స్థానాలకు, అలాగే 21 వార్డులకు.. పశ్చిమగోదావరి జిల్లాలో ఇరగవరం మండలం కావలిపురం సర్పంచ్ పదవికి, 10 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు పూర్తయిన వెంటనే జరగాల్సిన కౌంటింగ్ ప్రక్రియకు కూడా అని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏలూరు జిల్లాలో మొత్తం 4 సర్పంచ్ స్థానాలు, 47 వార్డు మెంబర్లకు గాను శ్రీనివాసపురం సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. అలాగే 12 వార్డులు ఏకగ్రీవం కాగా, 12 వార్డులకు సింగిల్ నామినేషన్లు, మరో రెండు వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో 21 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటి కోసం 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 160 మంది సిబ్బందిని నియమించారు. ఏలూరు జిల్లాలో 11,114 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు, 120 మంది సిబ్బందిని నియమించారు. -
మీ సెల్ఫోన్ పోగొట్టుకున్నారా? ఇలా చేస్తే ఎక్కడున్నా దొరికేస్తుంది
సాక్షి, భీమవరం: సెల్ఫోన్ పోగొట్టుకుంటే వర్రీ కాకండి. ఫోన్ కొనుగోలు చేసిన ఆధారాలతో పోలీసులకు వాట్సాప్ మేసేజ్ ద్వారా ఫిర్యాదు చేస్తే కొద్దిరోజుల్లోనే పైసా ఖర్చులేకుండా మీ చెంతకు చేరుతుంది. పోలీసు శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన సెల్ఫోన్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పోగొట్టుకున్న సెల్ఫోన్ను ఎవరైనా, ఎంత దూరంలో వినియోగిస్తున్నా సులభంగా కనిపెడుతున్నారు. వాటిని రికవరీ చేసి బాధితులకు అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2,400 సెల్ఫోన్ మిస్సింగ్ ఫిర్యాదులు అందగా సుమారు రూ.1.20 కోట్ల విలువైన 801 సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. కొందరే పోలీస్స్టేషన్లకు.. ప్రస్తుతం సెల్ఫోన్ లేనిది ఎటువంటి కార్యకలాపాలు ముందుకు సాగడం లేదు. ప్రధానంగా ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగం పెరిగింది. వీటి ఖరీదు అధికంగా ఉంది. సెల్ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకుంటే ఆ బాధ వర్ణనాతీతం. ఖరీదైన ఫోన్ పోయిందనే బాధతోపాటు ఫోన్లో నిక్షిప్తమైన ఫోన్ నంబర్లు, సమాచారం పొందడం కష్టంగా మారింది. దీంతో ఫోన్ పోగొట్టుకున్నవారు తన ఫోన్ ఎక్కడైనా పడిపోయిందా.. లేదా ఎవరైనా దొంగిలించారా అనే సందేహంతో సతమతమవుతుంటారు. దీనిపై కొందరు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేస్తుండగా మరికొందరు మిన్నకుండి పోతున్నారు. దీంతో సెల్ఫోన్ దొరికిన వారు లేదా దొంగిలించిన వారు ఆ ఫోన్ తమదేనన్న ధీమాతో వినియోగించుకుంటున్నారు. వాట్సాప్కు మెసేజ్ చేస్తే.. సెల్ఫోన్ పొగొట్టుకున్నవారికి పోలీసు శాఖ మంచి అవకాశం కల్పించింది. పోగొట్టుకున్న ఫోన్ వివరాలను 9154966503 వాట్సాప్ నంబర్కు ‘హాయ్’ అనే మెసేజ్ చేస్తే చాట్బోట్ మెసేజింగ్ పద్ధతి ద్వారా ఒక లింక్ ఆటోమెటిక్గా వస్తుంది. ఆ లింక్ను ఓపెన్ చేసి ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి వివరాలతోపాటు ఫోన్ వివరాలను పొందుపరిస్తే సెల్ఫోన్ను గుర్తిస్తారు. దీనికిగాను జిల్లాలో ఎస్పీ యు.రవిప్రకాష్ ప్రత్యేక సెల్ఫోన్ ట్రాకింగ్ బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ బృందంలో దిశా పోలీసు స్టేషన్కు సంబంధించిన ఎస్సైతో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లు, ఐడీ డిపార్ట్మెంట్కు చెందిన ముగ్గురు సిబ్బంది పనిచేస్తున్నారు. బృంద సభ్యులు తమ రోజువారి విధి నిర్వహణతోపాటు ఫోన్ల రికవరీని కూడా చేస్తున్నారు. పోలీసులు రికవరీ చేసిన ఫోన్లలో ఇతర రాష్ట్రాల్లో వినియోగిస్తున్న ఫోన్లు కూడా ఉండటం విశేషం. నా ఫోన్ దొరికింది మోటారు సైకిల్పై భీమమరం నుంచి నిడదవోలు వెళ్తుండగా ఒక వ్యక్తి లిఫ్ట్ అడిగి నా ఫోన్ దొంగిలించాడు. నిడదవోలు స్టేషన్లో కంప్లయింట్ చేశాను. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫోన్ పోగా వెతికి పట్టుకుని జూన్లో అందజేశారు. పోయిన ఫోన్ దొరకడం ఆనందంగా ఉంది. – షేక్ బాషా, భీమవరం సెల్ఫోన్ ట్రాకింగ్ బృందం ద్వారా.. సెల్ఫోన్ దొరికితే పోలీసుస్టేషన్లలో అందజేయాలి. అక్రమంగా వినియోగించినా, ఆధారాలు లేకుండా కొనుగోలు చేసినా ఇబ్బందులు తప్పవు. జిల్లాలో సెల్ఫోన్ ట్రాకింగ్ బృందం ఏర్పాటుచేసిన తర్వాత ఇప్పటివరకు రూ.1,20,15,000 విలువైన 801 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశాం. ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు ఒకసారి ఫిర్యాదు చేసి మిన్నకుండి పోకూడదు. కొన్నిరోజుల తర్వాత మరలా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. – యు.రవిప్రకాష్, ఎస్పీ, భీమవరం -
కుటుంబ కలహాలు.. బాలుడి పీక నొక్కి చంపిన తాత?
సాక్షి, ప.గో జిల్లా: సొంత తాతయ్య తన మనువడిని హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న ఘటన పెంటపాడు మండలం మీనవల్లూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రోజుల క్రితం మీనవల్లూరుకి చెందిన పోకల వెంకట కళ్యాణ్ (6) అనే బాలుడు అదృశ్యమయ్యాడు. బుధవారం ఉదయం నుంచి కనిపించడం పోవడంతో బాలుడి తల్లి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం సాయంత్రం యనమదర్రు కాలవలో అదృశ్యమైన ఆరేళ్ల బాలుడు మృతదేహం లభ్యమైంది. తాతనే బాలుడి పీక నొక్కి చంపేసి కాలవలో పడేసినట్లు స్థానికులు చెబుతున్నారు. కుటుంబ కలహాలు,ఆస్థి తగాదాలు మధ్య తాతయ్య హత్య చేసినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. బాలుడు తండ్రి, తాత, నానమ్మ కూడా ఈ హత్యలో పాల్గొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తాతయ్య పరార్ లో ఉండగా, బాలుడి తండ్రి నానమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొత్త రేషన్ కార్డులొచ్చాయ్
సాక్షి, భీమవరం: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పాలన సాగిస్తోంది. దీనిలో భాగంగా ఎప్పటికప్పుడు రేషన్ కార్డులు మంజూరు చేస్తోంది. గతంలో రేషన్కార్డు పొందాలంటే ఏళ్ల తరబడి ఎదురుచూడటంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారింది. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలో ప్రతి ఆరు నెలలకోసారి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారు. వలంటీర్ల ద్వారా అర్హులతో దరఖాస్తు చేయించి కార్డులు మంజూరు చేయడంతో పాటు నేరుగా ఇంటికే తీసుకవచ్చి కొత్త కార్డు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా తాజాగా జిల్లాలోని 20 మండలాల్లో అర్హులైన పేదలకు 9,372 బియ్యం కార్డుల పంపిణీ ప్రారంభమైంది. రేషన్ కార్డు మంజూరు నిరంతర ప్రక్రియగా సాగుతుంది. కొత్తగా పెళ్లయినా దంపతులకు, ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి వేరే కాపురం పెట్టినా తక్షణం కొత్త రేషన్కార్డు మంజూరు చేస్తున్నారు. డివిజన్ల వారీగా.. జిల్లాలోని 20 మండలాల్లో ప్రస్తుతం 5,62,395 రేషన్కార్డుల ద్వారా ప్రతి నెలా 8,641 టన్నుల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అలాగే తక్కువ ధరకు పంచదార, కందిపప్పును ఇంటి వద్దే రేషన్ వాహనాల ద్వారా అందిస్తున్నారు. గతనెలలో ప్రభుత్వం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో 9,372 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయగా వీటి పంపిణీ ప్రారంభమైంది. భీమవరం రెవెన్యూ డివిజన్లో 10 మండలాలకు 4,627, నరసాపురం డివిజన్లో 10 మండలాలకు 4,745 కార్డులు మంజూరయ్యాయి. వీరికి వచ్చే నెల నుంచి రేషన్ అందిస్తారు. గతంలో ఎదురుచూపులు గతంలో రేషన్ కార్డు కావాలంటే ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. జగనన్న సురక్ష కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వెంటనే రేషన్ కార్డు అందజేశారు. సత్వరమే కొత్త కార్డు జారీ చేయడం చాలా ఆనందంగా ఉంది. –కటికితల వసంతకుమార్,ఏలూరుపాడు, కాళ్ల మండలం వచ్చేనెల నుంచి రేషన్ పంపిణీ జిల్లాలో నూతనంగా మంజూరైన 9,372 బియ్యం కార్డుల పంపిణీ చురుగ్గా సాగుతోంది. కొత్త కార్డులు పొందిన వారికి వచ్చేనెల నుంచి ఉచితంగా బియ్యంతోపాటు తక్కువ ధరకు పంచదార, కందిపప్పు అందిస్తాం. ఇప్పటికే జిల్లాలో సుమారు 5.62 లక్షల రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులకు దాదాపు 8,641 టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నాం. –ఎన్.సరోజ, జిల్లా పౌరసరఫరాల అధికారి, భీమవరం -
గోదావరి దాటికి విలవిలలాడుతున్న లంక గ్రామాలు
-
ఆంధ్రా షుగర్స్కు షుగర్ కేన్ హార్వెస్టింగ్ మెషీన్ పేటెంట్
తణుకు: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఆంధ్రా షుగర్స్ సంస్థ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. ఆంధ్రా షుగర్స్ సంస్థ హార్వెస్టింగ్ మెషీన్ పేరుతో చేసిన ఆవిష్కరణకు 20 సంవత్సరాల కాలవ్యవధికి గాను షుగర్ కేన్ పేటెంట్ వ చ్చింది. ఈ మేరకు భారత ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం ఈ నెల 26న పేటెంట్ సరి్టఫికెట్ జారీ చేసింది. సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ముళ్లపూడి నరేంద్రనా«థ్ మార్గదర్శకత్వంలో సంస్థకు చెందిన షుగర్ కేన్ హార్వెస్టర్ డెవలప్మెంట్ టీమ్ దీన్ని నిర్మించడానికి, ఉపయోగించడానికి పదేళ్లుగా అంకిత భావంతో కృషి చేస్తోంది. భారతీయ వ్యవసాయ పరిస్థితులకు అనువైన చెరకు హార్వెస్టర్ ఆవిష్కరణకు పేటెంట్ మంజూరు అయిన దేశంలోనే మొట్టమొదటి సంస్థ ఆంధ్రా షుగర్స్ కావడం విశేషం. -
స్టేజీల మీద, లారీల మీద రంకెలా? పవన్కు డిప్యూటీ సీఎం కొట్టు స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, తాడేపల్లిగూడెం: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చూస్తుంటే కాపు సామాజిక వర్గం తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుతో స్నేహం కారణంగా పవన్ మతిపోయిందని, టీడీపీ వాళ్లు రాసి ఇచ్చిన డైలాగులు, కిరాయి ఇచ్చిన వాళ్ళ స్క్రిప్ట్లు రెచ్చగొట్టే రీతిలో చదివేస్తే కుదరదని స్పష్టం చేశారు కొట్టు సత్యనారాయణ. పవన్ ను చూస్తే జాలేస్తుందని, కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన ముద్రగడను పవన్ అగౌరవపరిచాడన్నారు. "హలో ఏపీ అంటే వీళ్లు తెలంగాణలో ఉన్నారు కాబట్టి బైబై చెప్పినట్టా? - బాబు, పవన్ తెలంగాణ వెళ్లిపోతున్నామని బైబై చెప్పినట్టు ఉంది. నిన్న అమలాపురంలో కిరాయి తీసుకున్న వ్యక్తి, కిరాయి ఇచ్చిన వ్యక్తి చెప్పిన మాటలు సినీ ఫక్కీలో చెప్పారు. ప్రజలు నవ్వుకుంటున్నారు. సిగ్గు శరం వదిలేసారా? ఏది పడితే అది మాట్లాడేస్తారా.." అంటూ పవన్ కల్యాణ్ను ప్రశ్నించారు మంత్రి కొట్టు సత్యనారాయణ చంద్రబాబు ఈ శతాబ్ధపు డర్టీ పొలిటీషియన్గా అభివర్ణించిన మంత్రి కొట్టు.. హరిరామ జోగయ్య వయసు మీద పడి మాట్లాడుతున్నారన్నారు. నాలుగు దశాబ్దాల నుంచి చంద్రబాబు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాడని, కేవలం తన వర్గ ప్రయోజనాల కోసమే చంద్రబాబు పనిచేస్తాడన్నారు. వెన్నుపోటు, మోసానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. చంద్రబాబుని ప్రజలు రాజకీయ సమాధి చేసినా.. పైకి కనబడే ఆ తలతోనే, పచ్చ మీడియా సపోర్ట్తో ఈ నాలుగేళ్లుగా దుష్ప్రచారం చేస్తూ రచ్చ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: కాకినాడ, పిఠాపురం.. పోటీకి సిద్ధమా? పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా.. అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి లిస్టు ప్రకారం వారి దగ్గర చదివి ఇంకా ఏమైనా ఫిర్యాదులు ఉంటే తీసుకుని పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని, మండలానికి సంబంధించి 2 టీమ్లు, పట్టణానికి సంబంధించి 3 టీమ్ లు ఏర్పాటు చేయడం జరిగిందని, 30 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మొదటి 7 రోజులు ఫిర్యాదులు సేకరించడం జరుగుతుందని, క్షేత్ర స్థాయిలో ఏదేని కారణం చేత ప్రజలకు సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరించాలన్న ఉద్దేశ్యంతో జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టామని తెలిపారు. సీఎం జగన్ పరిపాలనలో రూ. 2,16,000 వేల కోట్ల డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్సక్షన్ ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందచేశామని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. -
ధనవంతులకు ఉపయోగపడేలా ఎయిర్పోర్టులు కట్టాను: చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/తణుకు రూరల్: సమస్యలు చెప్పుకోవడానికి రైతులు తన వద్దకు వస్తుంటే రాకుండా అడ్డుకుని భయపెడుతున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులను పరామర్శించడానికి తాను వస్తుంటే.. రైతులను రానీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శుక్రవారం జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్పోర్టులు, పోర్టులు అభివృద్ధి చేసి ధనవంతులకు బాగా ఉపయోగపడ్డానని గుర్తు చేశారు. మళ్లీ ముఖ్యమంత్రి అయితే కోస్తాలో ఆక్వా కల్చర్, రాయలసీమలో హార్టికల్చర్ను అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఆక్వా జోన్ పరిమితి లేకుండా ఆక్వా సాగుదారులందరికీ రూ.1.50కే కరెంట్ ఇస్తానని తెలిపారు. రాష్ట్రంలో రైస్ మిల్లర్లు దళారులుగా మారారని ధ్వజమెత్తారు. రైతాంగం తీవ్రంగా నష్టపోతుంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందన్నారు. పరిహారం ఇవ్వాలని అడిగినా అసమర్థ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. చదవండి: ‘వరం’ పోయిందని కడుపు మంట సంక్షోభంలో ఉన్న రైతులను పరామర్శించే తీరిక సీఎంకు లేదా అని ప్రశ్నించారు. ప్రతి ఎకరాకూ రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టం వస్తుందని చెబుతుంటే తన మీద విమర్శలు, ప్రతిదాడి చేసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి తాను 72 గంటల సమయం ఇచ్చినా రైతుల సమస్య పరిష్కరించలేదన్నారు. ప్రభుత్వం కల్లాల్లోని ధాన్యం కొనే వరకు రైతుల తరఫున పోరాడతానని చెప్పారు. హైదరాబాద్ను తానే నిర్మించానని వెల్లడించారు. -
‘ఏయ్ ఆగవయ్యా.. నువ్వాగు!’.. రైతులపై చంద్రబాబు అసహనం
తణుకు: ‘ఏయ్.. ఏం మాట్లాడుతున్నావ్. ఆగవయ్యా.. నువ్వాగు. ముందు నేను చెప్పేది వినవయ్యా’ అంటూ రైతులపై ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో రైతు పోరుబాట పేరుతో పాదయాత్ర నిర్వహించేందుకు గురువారం రాత్రి ఇరగవరం వచ్చిన చంద్రబాబు అక్కడ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రైతులు ఆయనను నిలదీస్తుండగా చంద్రబాబు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓ యువరైతు మాట్లాడుతూ.. ‘మీరు సీఎంగా ఉన్నప్పుడు రైతులు నష్టపోతే వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి పరిస్థితుల్ని చూసి చలించిపోయారు. రైతులు నష్టపోయిన విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. మీరు అలా ఎందుకు చేయట్లేదు’ అని ప్రశ్నించగా.. అతడిపై చంద్రబాబు కస్సుమన్నారు. ‘ఏయ్.. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు. ముందు నేను చెప్పేది వినవయ్యా’ అంటూ అసహనం ప్రదర్శించారు. ప్రభుత్వ యంత్రాంగం రైతుల నుంచి «ధాన్యం కొనుగోలు చేస్తున్న పరిస్థితులను వివరించేందుకు ప్రయత్నిస్తున్న రైతులను అడ్డుకున్న చంద్రబాబు తాను చెప్పేది మాత్రమే వినాలంటూ ఎప్పటిలా తన సొంత డబ్బా చెప్పుకొంటూ వెళ్లారు. రైతు బిడ్డల్ని కోటీశ్వరులను చేస్తానని, పేదలను ధనికులు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తాను అధికారంలోకి వస్తే ధాన్యం కొనుగోలులో పాత విధానం తీసుకొస్తానని చంద్రబాబు చెప్పారు. మూడు రోజులపాటు గోదావరి జిల్లాల్లో పర్యటించి 72 గంటల్లో తడిసిన ధాన్యం, మొలకలు వచ్చిన ధాన్యం కొనుగోలు చేయాలని అల్టిమేటం ఇస్తే.. ఇప్పుడు తాను తిరుగుతున్న ప్రాంతాల్లో హడావుడిగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్నారు. ‘సాక్షి’పై మరోసారి అక్కసు ఈ పర్యటన సందర్భంలో చంద్రబాబు ‘సాక్షి’పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. రైతులను పరామర్శించడానికి వచ్చి రైతులతో మాట్లాడుతుంటే కొందరు సైకో కార్యకర్తలను పంపి గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని అన్నారు. దీనిని వక్రీకరిస్తూ ‘సాక్షి’ పేపర్లో ‘చంద్రబాబును అడ్డుకున్న రైతులు’ అని రాస్తారన్నారు. రైతుల ముసుగులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు వస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
సీఐతో ఎమ్మెల్యే నిమ్మల దురుసు ప్రవర్తన
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని పాలకొల్లులో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మంగళవారం సీఐ, పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. అనుమతిలేని కార్యక్రమాలు నిర్వహించరాదని అడ్డుకున్న సీఐని ఏకవచనంతో సంబోధించడమేగాక మా ఇష్టం వచ్చింది చేసుకుంటామంటూ మాట్లాడారు. రైతుల సమస్యలపై స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇస్తామని ఎమ్మెల్యే పోలీసులకు తెలిపారు. ఎమ్మెల్యే నిమ్మల, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తదితరులు తహసీల్దారు కార్యాలయం వద్దకు వచ్చారు. టీడీపీ నేతలు తహసీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న చెట్టు కొమ్మలను విరగ్గొట్టి రైతుకు ఉరి అనే నినాదంతో రెండు కర్రలను ఏర్పాటు చేసి చెట్టుకు కట్టారు. ప్లకార్డులు, ఉరితాళ్లతో నిరసన తెలిపేందుకు సిద్ధపడ్డారు. దీన్ని పట్టణ సీఐ డి.రాంబాబు అడ్డుకున్నారు. వినతిపత్రం ఇస్తామని అనుమతి తీసుకుని ఈ కార్యక్రమాలు చేయడమేమిటని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే నిమ్మల పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీ ఐ రాంబాబునుద్దేశించి.. నీకు సంబంధం ఏమిటి? మా ఇష్టం వచ్చింది చేసుకుంటాం. రోడ్డుపై ఏది చేసుకున్నా నీకు అనవసరం. నీ తహసీల్దార్ కార్యాలయంలో చేస్తే నువ్వు ప్రశ్నించు.. అంటూ మాట్లాడారు. దీనిపై సీఐ స్పందిస్తూ.. సార్ నేను గౌరవంగా మాట్లాడుతున్నాను.. మీరు మర్యాదగా మాట్లాడండి.. అని సూచించారు. దీంతో మీ మంత్రి రైతులను ఉద్దేశించి ఎర్రిపప్ప అన్న మాటలకు మాకు బాధేసింది అంటూ ఎమ్మెల్యే టాపిక్ను డైవర్ట్ చేసేందుకు ప్రయత్నించారు. సీఐ ఆధ్వర్యంలో పోలీసులు ఉరితాళ్లను తొలగించారు. అనంతరం టీడీపీ నేతలు తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలోకి వెళ్లి అక్కడున్న ఆర్డీవో దాసి రాజుకు వినతిపత్రం అందజేశారు. -
చంద్రబాబుపై తీరుపై మండిపడ్డ మంత్రి ధర్మాన
రైతులకు పూర్తి భరోసా అందించడమే వైసీపీ ప్రభుత్వం ధ్యేయమని మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. రాష్ట్రంలో రైతుల స్వాధీనంలో ఉన్న ఇనాం, అనాధీనం భూములుపై రైతులకు పూర్తి హక్కు కల్పిస్తామని చెప్పారు. పేదలకు, రైతులకు మంచి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ చట్టాలు చేస్తుంటే టీడీపీ వాటిని అడ్డుకుంటుందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరాయి, ఇంకా చేరేలా చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 2,07,000 కోట్లు సంక్షేమ పథకాలకు అందిస్తుంటే చంద్రబాబు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని వాపోయారు. చంద్రబాబు పరిపాలనలో అభివృద్ధి పేరుతో దోచుకుంటే జగన్ అవినీతి రహిత అభివృద్ధి అందిస్తున్నారు. -
అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి
అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వీర సాయిష్ ఉన్నత చదువుల నిమ్మితం అమెరికా వెళ్లాడు. ఓహియో స్టేట్ పిన్స్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. కొలంబస్ ఫ్రాంక్లింటన్లోని ఓ షెల్ గ్యాస్ స్టేషన్లో పార్ట్టైం ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. బుధవారం అర్థరాత్రి 12.50 గంటలకు (భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం) గ్యాస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తుండగా ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి నగదు తీసుకుపోయారు. ఈ కాల్పుల్లో సాయిష్కు తీవ్ర గాయాలవ్వగా ఓహియోహెల్త్ గ్రాంట్ మెడికల్ సెంటర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యరణించాడు. సాయిష్ తల్లి ప్రస్తుతం ఏలూరులో నివాసం ఉంటోంది. ఈ ఘటనపై గురువారం రాత్రి 8 గంటలకు తమకు సమాచారం అందిందని మృతుడి కుటుంబసభ్యులు తెలిపారు. కాగా పాలకొల్లు పట్టణానికి చెందిన వీరా రమణ నాలుగేళ్ల క్రితం మృతిచెందారు. ఆయన చిన్న కుమారుడైన సాయేష్ అమెరికాలోని ఓహియో స్టేట్ పిన్స్ యూనివర్సిటీలో ఎమ్మెస్ చదువుతున్నాడు. రెండేళ్ల క్రితం యూఎస్ వచ్చిన సాయిష్.. ఇప్పడిప్పుడే కుటుంబ ఆర్థిక సమస్యలను చక్కబెడుతున్నాడు. ప్రస్తుతం చివరి సెమిస్టర్ చదువుతుండగా.. మరో 10 రోజుల్లో ఎంఎస్ పూర్తికానుంది. ఈ సమయంలో కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆయన తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చదవండి: రంజాన్ 2023: యెమెన్లో వితరణ వేళ విషాదం.. 78 మంది దుర్మరణం -
శ్రీనివాస్ అనే వ్యక్తిపై జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు దాడి
-
పశ్చిమగోదావరి: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా కలగంపూడి గ్రామంలో ఆదివారం పర్యటించారు. ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు కుమార్తె డాక్టర్ సింధు వివాహ వేడుకలకు సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులను సీఎం ఆశీర్వదించారు. సీఎం జగన్కు మంత్రులు తానేటి వనిత, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ రవి ప్రకాష్ స్వాగతం పలికారు. చదవండి: నాడు చంద్రబాబు అలా.. నేడు సీఎం జగన్ ఇలా.. -
సీఎం జగన్ పశ్చిమగోదావరి పర్యటన షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(ఆదివారం) పశ్చిమగోదావరి జిల్లా కలగంపూడిలో పర్యటించనున్నారు. నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమార్తె వివాహ రిసెప్షన్కు సీఎం హాజరుకానున్నారు. సాయంత్రం 3.50 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 4.20 గంటలకు కలగంపూడి చేరుకుంటారు. 4.30 గంటలకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరుకానున్నారు. అనంతరం 5.15 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 5.55 తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు. చదవండి: GIS: విశాఖ జీఐఎస్ సూపర్ సక్సెస్ -
అసత్య కథనాలపై ఆగని ఆగ్రహ జ్వాల
సాక్షి, భీమవరం/కాళ్ల(పశ్చిమగోదావరి జిల్లా): అసత్య కథనాలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే లక్ష్యంతో ఈనాడు పత్రిక సమాజంలో తన ఉనికిని కోల్పోయిందని భీమవరం ఏఎంసీ చైర్మన్ కోటిపల్లి బాలదుర్గానాగమల్లేశ్వరరావు (బాబు), వైఎస్సార్సీపీ నాయకులు తోట భోగయ్య, గూడూరి ఉమాబాల మండిపడ్డారు. ఈనాడు పత్రిక తప్పుడు రాతలను నిరసిస్తూ శుక్రవారం భీమవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఈనాడు ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టీడీపీ నేత పట్టాభిని కొట్టారంటూ పాత ఫొటోలతో ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రభుత్వంపై బురదజల్లడానికి ఈనాడు చేసిన కుట్ర బహిర్గతమైందన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పదవి చేపట్టినప్పటి నుంచి అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ‘పచ్చ’ రాతలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. పార్టీ నాయకులు కోడే విజయలక్ష్మి, పాలవెల్లి మంగ, కానుబోయిన వెంకటరమణ, మానేపల్లి నాగన్నబాబు తదితరులు పాల్గొన్నారు. విలువలను దిగజార్చుతూ.. కాళ్ల: ఈనాడు అధినేత రామోజీరావు పాత చిత్రాలను కొత్తవిగా చూపించే ప్రయత్నంలో జర్నలిజం విలువలను దిగజార్చారని వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడ్డారు. డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నరసింహరాజు ఆదేశాల మేరకు ఆయన సోదరుడు పెనుమత్స గోపాలకృష్ణరాజు ఆధ్వర్యంలో పెదఅమిరంలోని పార్టీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈనాడు ప్రతులను దహనం చేశారు. నాయకులు పెనుమత్స గోపాలకృష్ణరాజు, జెడ్పీటీసీలు సోమేశ్వరరావు, రణస్తుల మహంకాళి మాట్లాడుతూ చంద్రబాబు పోసిన ‘పచ్చ’ సిరాను పెన్నుల్లో నింపేసుకుని రామోజీరావు రాష్ట్రంపై, సీఎం జగన్పై తప్పుడు వార్తలు, కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. ఉండి ఎంపీపీ ఇందుకూరి శ్రీహరిరాజు, కాళ్ల, ఉండి మండల పార్టీ కన్వీనర్లు రాంబాబు పెనుమత్స ఆంజనేయరాజు కోపల్లె, కలవపూడి, ఉండి సొసైటీల చైర్మన్లు వేగేశ్న జయ రామకృష్ణంరాజు, పెనుమత్స ప్రసాద్రాజు, పేరిచర్ల సూర్యనారాయణ రాజు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ఏపీ క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాత పాటి సర్రాజు కన్నుమూత
-
పాతపాటి సర్రాజు మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సర్రాజు కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, పాతపాటి సర్రాజు గుండెపోటుతో మృతిచెందారు. 1954లో కాళ్ల మండలం జక్కవరం గ్రామంలో జన్మించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ ద్వారా సర్రాజు రాజకీయాల్లోకి వచ్చారు. కోపల్లె సహకార సంఘం అధ్యక్షుడిగా, ఆకివీడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా ఆయన పని చేశారు. 2004లో ఉండి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచి వైఎస్సార్ హయాంలో తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి ఆయన అడుగుపెట్టారు. 17 జులై 2021న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్గా నియమితులయ్యారు. 14 ఆగష్టు 2021న ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పోలవరం నియోజక వర్గ పరిశీలకులుగా సర్రాజు ఉన్నారు. చదవండి: Fact Check: అది రోత రాతల వంటకం -
ముగిసిన పాతపాటి సర్రాజు అంత్యక్రియలు
సాక్షి, పశ్చిమగోదావరి: గుండెపోటుతో కన్నుమూసిన క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు అంత్యక్రియలు ముగిసాయి. పాతపాటి స్వగ్రామం జక్కరంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పాతపాటి సర్రాజుకు శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో భీమవరంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సర్రాజు తుదిశ్వాస విడిచారు. కాగా, 1954లో కాళ్ల మండలం జక్కవరం గ్రామంలో ఆయన జన్మించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా సర్రాజు రాజకీయాల్లోకి వచ్చారు. కోపల్లె సహకార సంఘం అధ్యక్షుడిగా, ఆకివీడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా ఆయన పని చేశారు. 2004లో ఉండి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచి వైఎస్సార్ హయాంలో తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి ఆయన అడుగుపెట్టారు. 17 జులై 2021న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్గా నియమితులయ్యారు. 14 ఆగష్టు 2021న ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పోలవరం నియోజక వర్గ పరిశీలకులుగా సర్రాజు ఉన్నారు. చదవండి: Fact Check: అది రోత రాతల వంటకం -
జగన్ మళ్లీ సీఎం కావాలంటూ బైక్ యాత్ర
చిత్తూరు (కార్పొరేషన్): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అభిమానంతో ఓ యువకుడు హైదరాబాద్ నుంచి బైక్ యాత్ర చేపట్టాడు. ఈ నెల 6న ప్రారంభమైన ఈ యాత్ర ఆదివారం చిత్తూరు చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్ జగన్కు వీరాభిమాని అయిన వీరబాబు మాట్లాడుతూ.. ‘మాది పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం. 2009లో ఖమ్మంలోని వజీర్ సుల్తాన్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్లో చేరాను. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్మెంట్స్ ద్వారా నాలుగేళ్లు (రూ.1.60 లక్షల ఖర్చుతో) బీటెక్ పూర్తి చేశా. ఆ తరువాత హైదరాబాద్లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం సాధించా. వైఎస్సార్ తనయుడు సీఎం వైఎస్ జగన్పై ఉన్న అభిమానంతో హైదరాబాద్ నుంచి విజయనగరానికి బైక్ యాత్ర మొదలుపెట్టా. ఉదయం 10 గంటలకు యాత్ర ప్రారంభించి సాయంత్రం 6 గంటలకు ముగిస్తున్నా. రోజుకు 100 నుంచి 120 కిలోమీటర్లు వెళ్తున్నా. రాత్రివేళ ఎక్కడికక్కడ లాడ్జిలో బసచేస్తూ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కింద నైట్ షిఫ్ట్ డ్యూటీ చేస్తున్నా. జగనన్న అందిస్తున్న పథకాలు ఎంతగానో నచ్చాయి. అందుకే.. ఆయనే మరోసారి సీఎం కావాలని ఆకాంక్షిస్తూ బైక్ యాత్ర చేపట్టా’ అని వివరించారు. చదవండి: బెజవాడలో టీడీపీ గూండాల బరితెగింపు -
జూదం ఆడితే చర్యలు తప్పవన్న ఎస్పీ రవిప్రకాశ్
-
టీడీపీకి షాక్.. సీనియర్ నేత రాజీనామా
పెంటపాడు(పశ్చిమగోదావరి జిల్లా): ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు తాడేపల్లిగూడెం పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆ పార్టీకి షాక్ తగిలింది. సుదీర్ఘకాలం టీడీపీకి సేవ చేసిన ముదునూరు మాజీ సర్పంచ్ బుద్దన శ్రీరామారావు (బాబులు), ఆయన భార్య, మాజీ సర్పంచ్ శారదలీలాపద్మావతి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన స్వగృహంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి, పార్టీ బలోపేతానికి తాను కృషిచేశానని, అయితే ప్రస్తుతం తెలుగుదేశం నాయకులు వేర్వేరుగా ఉండటం, పార్టీ తనను చిన్నచూపు చూడటంతో మనస్తాపం చెందానన్నారు. కష్టపడే వారికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోవడంతో రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. మండలంలో కీలక నేతగా ఉన్న బాబులు రాజీనామాతో పలువురు ఇదే దారిలో ఉన్నట్టు తెలిసింది. చదవండి: చంద్రబాబు హైడ్రామా.. రొచ్చగొట్టే ప్రసంగాలతో.. విద్వేషాలు రగిల్చేలా.. -
చంద్రబాబుకు భయం మొదలైంది: సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి: టీడీపీని తెలుగు బూతుల పార్టీగా, జనసేనను రౌడీసేనగా మార్చేశారని మార్చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బైబై చెప్పారు. అన్ని ఎన్నికల్లో మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. చివరికి కుప్పంలో కూడా వైఎస్సార్సీపీనే గెలిపించారని సీఎం గుర్తు చేశారు. ‘‘టీడీపీని చిత్తుగా ఓడించి మరోసారి బైబై బాబు అని చెప్పారు. వాళ్ల పాలన చూసి ప్రజలు ఇదే కర్మరా బాబు అనుకుని ఉంటారు. అందుకే 2019లో వారికి ప్రజలు బైబై చెప్పారు’’ అని సీఎం అన్నారు. వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్ కూడా ఇలాంటి మనిషికి తన ఇంట్లో, తన పార్టీ కేబినెట్లో స్థానం ఇచ్చినందుకు ఇదేం ఖర్మరా బాబు అనుకుని ఉంటారని సీఎం ఎద్దేవా చేశారు. ఏ మంచీ చేయని తనకు ఎవరైనా ఎందుకు ఓటు వేస్తారని బాబు చెప్పడు. చంద్రబాబు, దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5ను నమ్మొద్దు. మీకు మంచి జరిగిందా లేదా అనేది కొలమానంగా తీసుకోవాలన్నారు. ‘‘మంచి జరిగితే మాకు అండగా, తోడుగా నిలబడండి’’ అని సీఎం అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: నరసాపురం చరిత్రలో ఇదే మొదటిసారి -
CM YS Jagan: నరసాపురం చరిత్రలో ఇదే మొదటిసారి
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: నరసాపురంలో ఒకేసారి ఇన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎన్నడూ జరగలేదని, దేవుడి దయతో నర్సాపురంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని సీఎం అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పలు అభివృద్ధి పనులకు సోమవారం ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ, ఒకేరోజు ఇన్ని ప్రారంభోత్సవాలు చేయడం నర్సాపురం చరిత్రలో ఇదే మొదటిసారి అని సీఎం జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా యూనివర్శిటీకి శంకుస్థాపన చేశాం. నరసాపురం ఆక్వా రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని సీఎం అన్నారు. ‘‘నర్సాపురం రూపురేఖలు మార్చేందుకు మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఫిషరీస్ యూనివర్శిటీతో నర్సాపురం రూపురేఖలు మారతాయి. ఆక్వారంగం నర్సాపురానికి ఎంత ప్రధానమైందో తెలుసు. ఫిషరీస్ వర్శిటీలు తమిళనాడు, కేరళలో మాత్రమే ఉన్నాయి. ఆక్వా కల్చర్ సుస్థిర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. దేశంలో 3వ ఫిషరీష్ యూనివర్శిటీ ఏపీలో రాబోతుంది. రూ.332 కోట్ల వ్యయంతో ఫిషరీష్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నాం’’ అని సీఎం జగన్ అన్నారు. ‘‘ముమ్మిడివరంలో వేట కోల్పోయినవారికి అండగా నిలుస్తున్నాం. వేట కోల్పోయిన వారికి రెండో దఫా పరిహారం అందిస్తున్నాం. ఈ ప్రభుత్వం మీది.. మీకు అండగా ఉంటుంది. జగనన్న ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం అనుకునేలా పాలన చేస్తున్నాం. ఎన్నికలప్పుడు చెప్పిన హామీలను నెరవేరుస్తున్నాం. నేను విన్నాను.. నేను.. ఉన్నాను.. అని చెప్పి హామీని నెరవేరుస్తున్నాం. నర్సాపురంలో దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నాం’’ అని సీఎం అన్నారు. ఇంటింటికీ అభివృద్ధి, మనిషి మనిషికీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీల్లోని పేదలకు సంక్షేమ పథకాల్లో భాగంగా రూ.1, 76, 516 కోట్లు అవినీతి లేకుండా నేరుగా జమ చేశామని సీఎం జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నామని, మ్యానిఫెస్టోలో లేని హామీలను కూడా నెరవేరుస్తున్నామన్నారు. గత పాలకుల ఊహకు అందని విధంగా సంక్షేమ పాలన అందిస్తున్నామన్నారు సీఎం జగన్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: చంద్రబాబుకు భయం మొదలైంది: సీఎం జగన్ -
సీఎం రాకతో నర్సాపురం రూప రేఖలు మారబోతున్నాయి : ప్రసాద రాజు
-
సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చారంటే.. నెరవేరుస్తారు : మంత్రి కారుమూరి
-
Narasapuram Tour: పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
Time: 01:16 PM టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారు: సీఎం జగన్ టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. జనసేనను రౌడీసేనగా మార్చేశారన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బైబై చెప్పారు. అన్ని ఎన్నికల్లో మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. చివరికి కుప్పంలో కూడా వైఎస్సార్సీపీనే గెలిపించారని సీఎం అన్నారు. Time: 12:46 PM నరసాపురంలో ఒకేసారి ఇన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎన్నడూ జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా యూనివర్శిటీకి శంకుస్థాపన చేశాం. నరసాపురం ఆక్వా రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని సీఎం అన్నారు. Time: 12:42 PM నర్సాపురం చరిత్రలో ఇదే మొదటిసారి: సీఎం జగన్ దేవుడి దయతో నర్సాపురంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని సీఎం జగన్ అన్నారు. ఒకే రోజు ఇన్ని ప్రారంభోత్సవాలు చేయడం నర్సాపురం చరిత్రలో ఇదే మొదటిసారి అని సీఎం పేర్కొన్నారు. Time: 12:34 PM గత ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదు: మంత్రి అప్పలరాజు మత్స్యకారులకు సీఎం జగన్ అండగా నిలిచారని మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మత్స్యకారుల జీవితాల్లో సీఎం వెలుగులు నింపారన్నారు. గత ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదని మంత్రి అన్నారు. Time: 12:25 PM దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం: ప్రసాదరాజు మత్స్యకారులకు అండగా నిలిచిన సీఎం జగన్కు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ రాకతో నర్సాపురం రూపురేఖలు మారబోతున్నాయన్నారు. దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం కానున్నాయన్నారు. గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందని ప్రసాదరాజు అన్నారు. Time: 12:13 PM పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఆంధ్రప్రదేశ్ ఆక్వా యూనివర్శిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్, జిల్లా రక్షితనీటి సరఫరా ప్రాజెక్ట్, ఉప్పు టేరు నదిపై మూలపర్రు రెగ్యులేటర్ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవనాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. నరసాపురం పురపాలక సంఘం మంచినీటి అభివృద్ధి పథకాన్ని సీఎం ప్రారంభించారు. Time: 12:05 PM పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. Time: 11:59 AM మత్స్యకార కుటుంబాలకు పరిహారం ఇచ్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ అన్నారు. 23 వేల మంది మత్స్యకారులకు రూ. 107 కోట్ల పరిహారం అందిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం మత్స్యకారులను ఓటు బ్యాంకుగానే వాడుకుందన్నారు. Time: 11:05 AM సీఎం వైఎస్ జగన్ నరసాపురం చేరుకున్నారు. ముఖ్యమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. కాసేపట్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. Time: 10:35 AM ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం బయల్దేరారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా విశ్వవిద్యాలయానికి, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్కు, రూ.1,400 కోట్లతో జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టులకు శంకుస్థాపన, నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవనానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇవీ ప్రారంభోత్సవాలు ♦నరసాపురం పట్టణం మధ్యలో ఉన్న ప్రాంతీయ వైద్యశాల ఇటీవలే 100 పడకల స్థాయికి అప్గ్రేడ్ అయింది. అందువల్ల చుట్టుపక్కల గ్రామాలలో నివసించే 2 లక్షల మందికి వైద్య సదుపాయాలు, సేవలు అందిస్తోంది. ఇప్పుడు అదే ఆస్పత్రిలో నూతనంగా మాతా శిశు సంరక్షణ విభాగం ఏర్పాటు చేశారు. రూ.13 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించారు. ♦నరసాపురం పట్టణంలో మంచి నీటి ఎద్దడి నివారణకు రూ.61.81 కోట్లతో నీటి సరఫరా అభివృద్ధి పథకం చేపట్టి పూర్తి చేశారు. ఈ పథకం వల్ల రాబోయే 30 ఏళ్ల వరకు నరసాపురం పట్టణానికి మంచి నీటి సరఫరాకు ఎటువంటి సమస్యా ఉండదు. ఇంకా శంకుస్థాపనలు ఇలా.. ♦రూ.4 కోట్ల వ్యయంతో నరసాపురం బస్స్టేషన్ పునరుద్ధరణ పనులు. ♦రూ.1.08 కోట్ల అంచనాతో నరసాపురం డివిజినల్ ఉప ఖజానా కార్యాలయం కొత్త భవన నిర్మాణం. ♦రుస్తుంబాద గ్రామంలో రూ.132.81 కోట్లతో 220/ 132/ 33 కె.వి సబ్స్టేషన్ నిర్మాణ పనులు. ♦నరసాపురం పురపాలక సంఘం పరిధిలో రూ.237 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణం. రూ.87 కోట్లతో మొదటి ఫేజ్ పనులు. ♦రూ.26.32 కోట్లతో వశిష్ఠ వారధి – బుడ్డిగవాని రేవు ఏటి గట్టు పటిష్టం. ♦రూ.7.83 కోట్ల అంచనా వ్యయంతో చివరి గ్రామాలకు సాగు, తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు శేషావతారం పంట కాలువ అభివృద్ధిలో భాగంగా ఛానల్ డీ సిల్టింగ్, టెయిల్ డ్యామ్ నిర్మాణం, సీసీ లైనింగ్ పనులు. ♦రూ.24.01 కోట్లతో మొగల్తూరు వియర్ పంట కాలువ నిర్మాణం. ♦రూ.8.83 కోట్లతో కాజ, ఈస్ట్ కొక్కిలేరు, ముస్కేపాలెం అవుట్ఫాల్ నాలుగు స్లూయీస్ల పునః నిర్మాణం. సీఎం జగన్ పర్యటన ఇలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు నరసాపురం చేరుకుంటారు. 11.15 – 12.50 మధ్య వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత తిరిగి తాడేపల్లికి యలుదేరుతారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘టీడీపీ కుట్ర.. ఆక్వా పాలిట విలన్ చంద్రబాబే’
సాక్షి, పశ్చిమగోదావరి: ఆక్వా పాలిట విలన్ చంద్రబాబేనంటూ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆక్వా రంగానికి చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆక్వా జోన్లు ఏర్పాటు చేసి సబ్సిడీలు అందిస్తుందన్నారు. ధరల నియంత్రణ కోసం కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఆక్వా రంగంలో అల్లకల్లోలం సృష్టించాలని టీడీపీ కుట్రలు చేస్తోందని మంత్రి దుయ్యబట్టారు. చదవండి: అంతా బాగున్నా అసత్యాల సేద్యమే -
సూపర్ స్టార్ మృతి.. ఆ జిల్లా వ్యాప్తంగా మార్నింగ్ షోలు రద్దు
ప్రముఖ నటుడు, సూపర్స్టార్ కృష్ణ (79) మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటే ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందతూ మంగళవారం తెల్లవారు జామును కన్నుమూశారు. ఆయన మృతితో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. సూపర్ కృష్ణ మృతికి పశ్చిమ గోదావరి జిల్లా వాసులు సైతం ఘన నివాళి అర్పించారు. ఆయన అకాల మృతికి సంతాపంగా మంగళవారం(నవంబర్ 15) పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా థియేటర్లో ఉదయం ఆటలను రద్దు చేసినట్లు జిల్లా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తెలిపారు. -
ఆడు ఎదురొస్తే ‘తుపాను’ నడిచొచ్చినట్టు ఉంటది
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన చీర్ల శ్రీనివాస్, గంగా భవానీల కుమారుడు చీర్ల నాగేంద్ర. 1996 నవంబర్ 7న జన్మించాడు. ఆ సమయంలో రాష్ట్రాన్ని పెను తుపాను కమ్మేసి ఉంది. ముసురు బట్టి రోజుల తరబడి వర్షం పడుతోంది. ఆ సమయంలో పుట్టినందున తల్లిదండ్రులు తమ కుమారుడు నాగేంద్రకు తుపాను అని ముద్దు పేరు పెట్టుకున్నారు. అప్పటి నుంచి తల్లిదండ్రులు, బంధువులు, ఇరుగు పొరుగు.. అదే పేరుతో పిలుస్తుండటంతో నాగేంద్ర పేరు తుపానుగానే స్థిరపడిపోయింది. తను కూడా తన పేరు నాగేంద్ర కన్నా.. తుపానుగానే ఎక్కువ ఫీలవుతాడు. అందుకే నాగేంద్రా.. అని పిలిచినదానికన్నా, తుపానూ.. అని పిలిచినప్పుడే ఎక్కువగా స్పందిస్తాడు. ఎనిమిదో తరగతి వరకు చదివిన తుపాను.. బైక్ మెకానిక్గా స్థిరపడ్డాడు. తన తమ్ముడు రామాంజనేయులు కూడా 1998వ సంవత్సరం వరదల సమయంలో పుట్టాడని తుపాను చెప్పాడు. ఇక తన ఇద్దరు కుమారులు పుట్టినప్పుడు కూడా ప్రత్యేకతలున్నాయన్నాడు. పెద్ద కుమారుడు మోహిత్ 2020 జూలైలో కరోనా సమయంలో, చిన్న కుమారుడు ఈ ఏడాది మేలో వచ్చిన అసనీ తుపాను సమయంలో పుట్టారని చెప్పారు. తన కుటుంబానికి ప్రకృతి విపత్తులకు విడదీయరాని అనుబంధం ఉందని.. తమది ప్రకృతి విపత్తుల నుంచి పుట్టుకొచ్చిన ఫ్యావిులీ.. అంటూ చమత్కరించాడు. -
లారీ బోల్తా.. దారి పొడవునా చేపలు..ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
సాక్షి, పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి నుంచి ఒడిశాకు రవాణా చేస్తున్న చేపల లారీ మారేడుమిల్లి ఘాట్ రోడ్డు వద్ద బోల్తా పడింది. దీంతో లారీలోని చేపలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. దారిపొడవునా చేపలు పడిఉండటంతో వాహనదారులు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. కాగా పడిపోయిన చేపలన్నీ క్యాట్ ఫిష్ రకానికి చెందినవి. వీటిని రాష్ట్రంలో నిషేదించడంతో ఒడిశాకు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిన వెంటనే లారీ సిబ్బంది అక్కడ నుంచి పరారైనట్లు భావిస్తున్నారు. చదవండి: (సీఎం జగన్ను అడిగిన 6 రోజుల్లోనే వైద్యానికి రూ.12లక్షలు) -
ఆహ్లాదం.. వన విహారం
పశ్చిమ గోదావరి (బుట్టాయగూడెం): కార్తీకమాసం అంటే కేవలం భక్తితో పూజలు చేయడమే కాదు. పర్యాటకుల సందడి కూడా ఎక్కువగా ఉంటుంది. వన విహారాల పేరిట పర్యాటక ప్రాంతాలు సందడిగా మారతాయి. అలాంటి వారికి భక్తితో పాటు ఆహ్లాదాన్ని అందించే అనేక ఆధ్యాత్మక, ఆహ్లాదకరమైన ప్రదేశాలు జిల్లాలో అనేకం ఉన్నాయి. ప్రస్తుతం కార్తీకమాసం ప్రారంభం కావడంతో పర్యాటకులు దైవ దర్శనాలతోపాటు పిక్నిక్లకు సన్నాహాలు చేసుకుంటున్నారు. జిల్లాలో అందమైన, ఆహ్లాదకరమైన ప్రదేశాలతోపాటు ఆధ్యాత్మక దేవాలయాలపై ఒక లుక్కేద్దాం. పశ్చిమ ఏజెన్సీలోని అటవీ అందాలు పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో అడవి అందాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. జాలువారుతున్న జలపాతాలు, కొండలను తాకే మేఘాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు మనసును దోచుకుంటాయి. ఏజెన్సీ ప్రాంతంలో జలపాతాలు చూపరుల మదిని దోచుకుంటాయి. జల్లేరు జలాశయం, ముంజులూరులోని ఏనుగుతోగు జలపాతం, గుబ్బల మంగమ్మ సన్నిధి, పోగొండ రిజర్వాయర్తో పాటు అటవీప్రాంతంలోని పలు ప్రదేశాలు పిక్నిక్ స్పాట్లుగా ఉన్నాయి. ప్రతీ ఏటా కార్తీకమాసంలో లక్షలాది మంది పర్యాటకులు ఆయా ప్రాంతాల్లో వన¿ోజనాలను ఏర్పాటు చేసుకుంటూ ఆనందంగా గడుపుతారు. ఆహ్లాదకరం గోదావరి విహారం కార్తీకమాసం వచ్చిందంటే పాపికొండల యాత్రకు వెళ్ళేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. గోదావరి తీర ప్రాంతాలతో పాటు పాపికొండల విహారానికి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో రాష్ట్రంతో పాటు తెలంగాణ ప్రాంతం నుంచి యాత్రికుల తాకిడి అధికంగా ఉంటుంది. ఈ ఏడాది అత్యధిక వర్షాలు కురిసి గోదావరి వరద కూడా ఉధృతంగా ప్రవహించడంతో బోటు ప్రయాణాలను పర్యాటక శాఖ నిలిపివేసింది. గోదావరి తగ్గుముఖం పట్టడంతో పాటు కార్తీకమాసం ప్రారంభం కావడంతో పర్యాటక శాఖ తిరిగి పాపికొండల విహార యాత్రకు సన్నాహాలు చేస్తోంది. దేవీపట్నం మండలం గండిపోచమ్మ ఘాట్ నుంచి పాపికొండల విహారయాత్రకు పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. పాపికొండల యాత్రలో సందర్శన స్థలాలు పాపికొండల విహారయాత్రలో భాగంగా పలు సందర్శనా స్థలాలను చూడవచ్చు. పట్టిసీమ వీరభద్రస్వామి, మహానందీశ్వర స్వామి ఆలయాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మగుడి, బ్రిటిష్ కాలపు పోలీస్ స్టేషన్, 11వ శతాబ్దం నాటి ఉమాచోడేశ్వర స్వామి ఆలయం, కొరుటూరులో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన కాటేజీలు, పేరంటాలపల్లి ఆశ్రమం చూడొచ్చు. గోదావరి వెంట ఇరువైపులా గట్లపై దర్శనమిచ్చే గిరిజన గ్రామాల్లోని ఇళ్లు పర్యాటకులను కనువిందు చేస్తాయి. పోలవరం ప్రాజెక్టు కూడా పర్యాటకుల మనస్సును దోచుకుంటుంది. గుంటుపల్లి గుహలు మనసుకు ఆహ్లాదం, ఉత్తేజం కలిగించే కామవరపుకోట మండలంలోని గుంటుపల్లి(జీలకర్రగూడెం) బౌద్ధాలయాల్ని ఈ కార్తీక మాసంలో అత్యధికమంది దర్శించుకుంటారు. ఈ గుహలో ఉన్న భారీ లింగాకారాన్ని ధర్మలింగేశ్వర స్వామిగా కొలుస్తారు. ప్రత్యేకంగా కార్తీక సోమవారాల్లో వేలాది మంది భక్తులు ఈ స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తారు. ధర్మలింగేశ్వర స్వామి పాలరాతి స్తూపాలను భక్తులు కార్తీక సోమవారాల్లో ఎక్కువగా దర్శించుకుంటారు. జిల్లాలో పలు ఆధ్యాత్మక క్షేత్రాలు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అనేక పర్యాటక ఆధ్యాత్మక ప్రదేశాలు ఉన్నాయి. నర్సాపురం సమీపంలోని పేరుపాలెం బీచ్ కార్తీకమాసంలో పర్యాటకులతో నిండిపోతుంది. సముద్ర స్నానానికి అనుకూలంగా ఉంటుంది. రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు బీచ్కు చేరుకుని సందడి చేస్తారు. ఈ సముద్రం వెంట పచ్చని కొబ్బరిచెట్లు, సర్వే చెట్లు ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు వాటికింద సేదతీరుతుంటారు. జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం సమీపంలోని మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకుని ఆ పరిసర ప్రాంతాల్లో కూడా పర్యాటకులు పిక్నిక్లు ఏర్పాటు చేసుకుని సందడి చేస్తారు. పంచారామ క్షేత్రాల్లో భీమవరంలోని గునుపూడి ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి, పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయి. కార్తీక మాసంలో భక్తులు వేలాదిమంది ఈ క్షేత్రాల్ని దర్శించుకుంటారు. అందాల నిలయం కొల్లేరు సరస్సు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల సరిహద్దులో ఉన్న కొల్లేరు సరస్సు అందాలను తిలకించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. కార్తీకమాసంలో వన సమారాధన ఏర్పాటు చేసుకునేలా పర్యాటకులు సన్నాహాలు చేసుకుంటున్నారు. -
అరాచకం.. థియేటర్లో బాణాసంచా పేల్చిన ప్రభాస్ ఫ్యాన్స్
ప్రభాస్ బర్త్డే సందర్భంగా అభిమానులు చేసిన అత్యుత్సాహంతో థియేటర్లో అగ్నిప్రమాదం చేటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వెంకట్రామ థియేటర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్డే సందర్భంగా వెంకట్రామ థియేరట్లో బిల్లా సినిమాను రీరిలీజ్ చేశారు. చాలాకాలంగా మూతబడిన ఈ థియేరట్ను అభిమానుల కోరిక మేరకు బిల్లా స్పెషల్ షో వేయించారు. అయితే సినిమా చూస్తూ థియేటర్లో బాణసంచా పేల్చడంతో సీట్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో అభిమానులు బయటకు పరుగుతు తీశారు. థియేటర్ యాజమాన్యం, అభిమానులు మంటలు ఆర్పేశారు. అయితే షో మధ్యలో ఆపినందుకే ఇలా చేశామని కొందరు ఫ్యాన్స్ చెబుతున్నారు. Rebels on rampage mode 😎🔥🔥🔥💥#HappyBirthdayPrabhas #Billa4KCelebrations pic.twitter.com/A9IvJ4uKKx — 𝖵𝗂𝗃𝖺𝗒𝖺𝗐𝖺𝖽𝖺 𝖯𝗋𝖺𝖻𝗁𝖺𝗌 𝖥𝖢™ (@VJYPrabhasFC) October 23, 2022 -
సిరులు పండిస్తున్న కొర్రమీను.. ఇలా చేస్తే లాభాలే లాభాలు
తాడేపల్లిగూడెం రూరల్(పశ్చిమ గోదావరి): మత్స్య ఉత్పత్తులకు పెట్టింది పేరు పశ్చిమగోదావరి జిల్లా. దేశ, అంతర్జాతీయంగా ఇక్కడి ఉత్పత్తులకు మంచి పేరు ఉంది. మత్స్య ఉత్పత్తుల్లో పండుగప్పది ప్రత్యేక స్థానం. ఇది సముద్రంలో పెరిగే చేప అయినప్పటికీ ఇక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో చెరువుల్లో సైతం సాగు చేస్తున్నారు. తరువాత స్థానం కొర్రమీనుదే. ఔషధ గుణాలతో పాటు రుచిగా ఉండటంతో మాంసప్రియులు దీనిని తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇప్పుడు ఈ చేప సీడ్ విక్రయం లాభసాటిగా మారడంతో కొందరు రైతులు తమ ఇళ్లల్లోనే సాగు చేసి లాభాలను చవిచూస్తుండటం విశేషం. చదవండి: జియో ట్రూ 5జీ : అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో సేవలు కొర్రమీను సాగుపై రైతులు మక్కువ చూపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చెరువుల్లోనూ సైతం సాగు చేసేందుకు రైతులు ముందుకు రావడంతో సీడ్ దశలోనే మంచి గిరాకీ ఉందని సీడ్ సాగుదారులు పేర్కొంటున్నారు. సీడ్ను సైతం ప్రకృతి సిద్ధంగా మురుగు కుంటల్లో పెరిగిన కొర్రమీను నుంచి సేకరిస్తున్నారు. ఈ సీడ్ను ఇంటి పెరట్లోనే పెంచి చెరువుల రైతులకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. ఇలా ఒక్క తాడేపల్లిగూడెం మండలంలోనే జగన్నాథపురం, నవాబ్పాలెం, కృష్ణాయపాలెం, దండగర్ర గ్రామాల్లో దాదాపు 15 నుంచి 20 మంది రైతులు కొర్రమీను సాగు చేపట్టడం విశేషం. జగన్నాథపురం గ్రామానికి చెందిన మారెడ్డి శ్రీనివాస్ తన కుమార్తెను భీమవరం కళాశాలకు తీసుకెళ్లే క్రమంలో కొర్ర మీను సాగుపై తన బంధువుల ద్వారా తెలుసుకున్నాడు. తాను కూడా ఒక ప్రయత్నం చేయాలనే సంకల్పంతో దాదాపు ఐదు వేల కొర్రమీను పిల్లను రూ.3 వేలకు కొనుగోలు చేశారు. దాదాపు మూడు నెలల వ్యవధిలోనే అంగుళం సైజు పిల్ల రూ.17 చొప్పున మొత్తం రూ.85 వేలకు సీడ్ను కైకలూరుకు చెందిన చేపల సాగుదారుడు కొనుగోలు చేశారు. సీడ్కు రూ.3 వేలు, మూడు నెలలు చేప పెంపకానికి ఐదు నుంచి పది వేల రూపాయలు వరకు ఖర్చయిందని అంచనా. పెట్టుబడి రూ.13 వేలు పోను రూ.72 వేల వరకు లాభం కనబడుతుంది. దీంతో మరింత ఉత్సాహంగా రైతు మారెడ్డి శ్రీనివాస్ కొర్రమీను పెంపకాన్ని చేపట్టారు. తాను సాగు చేయడంతో పాటు పరిసర గ్రామాల రైతులను సైతం ప్రోత్సహిస్తున్నారు. ఇంట్లోనే 1.50 లక్షల సీడ్ పెంపకం జగన్నాథపురం గ్రామంలోని తన ఇంటిలోనే మారెడ్డి శ్రీనివాస్ దాదాపు 1.50 లక్షల సీడ్ను పెంచుతున్నారు. సీడ్ పెంపకానికి మొదట్లో అందుబాటులో ఉన్న ట్యాంకులను వినియోగించినప్పటికీ సీడ్ పెరగడంతో వైజాగ్ నుంచి తీసుకువచ్చిన ట్యాంకుల్లో పెంచుతున్నారు. ఒక్కో ట్యాంకు ఖరీదు రూ.4,500 కాగా, పైప్లైన్, ఇతరత్రా పనులకు మరో రూ.500 వెరసి రూ.5 వేల వరకు ఖర్చు చేశారు. ప్రస్తుతం తన ఇంటి వద్ద ఆరు ట్యాంకుల్లో సైజుల వారీగా పెంచుతున్నారు. ఒక్కో ట్యాంకులో ఐదు వేల వరకు పిల్లను పెంచాల్సి ఉండగా, 25 వేల సామర్థ్యంతో పిల్లను పెంచుతుండటం గమనార్హం. పిల్ల పరిమాణం ఆధారంగా మేత మైక్రో సీడ్ నుంచి మూడు అంగుళాల వరకు ఒక్కో దశకు ఒక్కో రకమైన మేతను అందిస్తారు. మైక్రో సీడ్కు తొలి వారం రోజులు ఎటువంటి ఆహారాన్ని అందించరు. తదుపరి తవుడు మాదిరి పౌడర్ను అందిస్తారు. 0.3, 0.6 సైజులు కలిగిన మిల్లెట్స్ను ఆహారంగా అందిస్తారు. ఈ ఆహారం కూడా పోషక విలువలు కలిగిన సోయాబీన్, తవుడు, వేరుశెనగ చెక్కతో తయారు చేసిన వాటినే వినియోగిస్తారు. పది కిలోల బస్తా రూ.1400 నుంచి రూ.2వేల వరకు పిల్ల సైజును బట్టి దాణాను కొనుగోలు చేస్తారు. రెండు నెలలకు సీడ్ను విక్రయించే నాటికి పది వేల పిల్లకు రూ.12 వేలు ఖర్చవుతుంది. ఈ పది వేల పిల్లను విక్రయిస్తే రూ.60 వేలు వస్తుంది. ఖర్చులు తీసివేస్తే రూ.48 వేల వరకు మిగులుతుంది. అన్ని పరిస్థితుల్లోనూ ఆరోగ్యంగా.. సాధారణంగా ఆక్వా సాగులో రైతులను వాతావరణ పరిస్థితులు వెంటాడుతుంటాయి. అయితే కొర్రమీను సాగు చేసే రైతులకు ఇటువంటి సమస్యలు ఉండవు. ఇవి ఆక్సిజన్, ఏ నీటినైనా తట్టుకుని జీవించగలవని రైతు మారెడ్డి శ్రీనివాస్ చెబుతున్నారు. బోరు, చెరువు, మంచినీటిలోనూ ఇవి ఆరోగ్యకరంగా పెరుగుతున్నట్టు చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు సీడ్ ఎగుమతి ఇక్కడ నుంచి అత్యధికంగా కర్ణాటక ఆక్వా సాగుదారులు రెండున్నర నుంచి మూడు అంగుళాల సైజు సీడ్ను కొనుగోలు చేస్తున్నారు. రెండున్నర అంగుళాల పిల్లను రూ.3కు, మూడున్నర అంగుళాల పిల్లను రూ.4 నుంచి రూ.6 వరకు విక్రయిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆక్వా సాగుదారులకు సబ్సిడీలను ఇస్తుండటంతో కొర్రమీను సాగు చేపట్టేందుకు రైతులు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. వీరితో పాటు కైకలూరు, ఆకివీడు, ఇతర రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడుకు సైతం ఎగుమతి చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, మధురై, బెంగళూరులోనూ కొర్రమీను వినియోగం అధికం. దీంతో ఆయా ప్రాంతాలకు ఎక్కువగా సీడ్ ఎగుమతి జరుగుతుంది. ఇంట్లోనే సులభంగా పెంపకం కొర్రమీను పిల్లను ఇంట్లోనే ట్యాంకుల్లో పెంచుకునే వెసులుబాటు ఉంది. కూలీలు అవసరం లేదు. కుటుంబ సభ్యులే సమయానుగుణంగా ఆహారం, నీటిని మారిస్తే చాలు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకోగలదు. మంచి ఆదాయం కూడా వస్తుంది. వీటి పెంపకంపై శిక్షణ ఇచ్చి యువతను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. – మారెడ్డి శ్రీనివాస్, కొర్రమీను పెంపకందారుడు, జగన్నాథపురం, తాడేపల్లిగూడెం మండలం స్వయం ఉపాధికి అవకాశం నిరుద్యోగ యువతకు కొర్రమీను పెంపకం స్వయం ఉపాధి రంగంగా నిలుస్తుంది. దీనిపై అవగాహన కోసం సాగుదారుల వద్దకే నేరుగా తీసుకెళ్లి శిక్షణ ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. యువత కొర్రమీను సీడ్ పెంపకాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకోవాలి. – డాక్టర్ దేవీవరప్రసాద్రెడ్డి, మత్స్య విభాగం శాస్త్రవేత్త, కేవీకే, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం, తాడేపల్లిగూడెం మండలం -
‘చంద్రబాబు నాటకం బట్టబయలు.. వారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులే’
సాక్షి, పశ్చిమగోదావరి: టీడీపీ ముసుగులో జరుగుతున్నదే మహా పాదయాత్ర అని, అందులో ఉన్నదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులేనని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మద్రాస్, హైదరాబాద్లో తంతే అమరావతిలో పడ్డాం. మరోసారి భవిష్యత్ తరాలకు ఆ పరిస్థితి రాకూడదన్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ అని మంత్రి పేర్కొన్నారు. చదవండి: ‘అమరావతిలో సెంటిమెంట్ ఉంటే లోకేష్ ఎందుకు ఓడిపోయాడు’ ‘‘టీడీపీ పరిస్థితి భూ స్థాపితం అయిపోయింది. చంద్రబాబు ఆడుతున్న నాటకం పూర్తిగా బట్టబయలైంది. అన్ని వర్గాల వారు శాంతియుతంగా నిరసన చేస్తుంటే టీడీపీ నేతలు రెచ్చ గొడుతున్నారు. మూడు రాజధానులు కావాలని ప్రజలు కోరుతున్నారు. పాదయాత్రకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర వరకు నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. చంద్రబాబు 14 ఏళ్లలో అవినీతి పాలన చేశారు’’ అని కారుమూరి దుయ్యబట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి గెలవాలని మంత్రి సవాల్ విసిరారు. ‘‘స్థానిక ఎన్నికల్లో గెలవలేని టీడీపీకి తమ రాజీనామాలపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. మహా పాద యాత్ర కాదు.. ఫేక్ యాత్ర అది’’ అంటూ మంత్రి ధ్వజమెత్తారు. -
అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ