
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పారిస్కు బయలుదేరారు. తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో పారిస్ బయలుదేరారు. బుధవారం ఉదయం 5.10 గంటలకు పారిస్ చేరుకుంటారు. అక్కడ తన కుమార్తె గ్రాడ్యుయేషన్ కాన్వొకేషన్ వేడుకలో పాల్గొననున్నారు. తిరిగి జూలై 2న సాయంత్రం 4 గంటలకు పారిస్లో బయలుదేరి, 3వ తేదీ ఉదయం 6.45 గంటలకు గన్నవరం చేరుకుంటారు.
చదవండి: (ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో 3 లక్షల మందికి కొత్త పింఛన్లు)