Graduation
-
బీటెక్ జోరు.. ఎంటెక్ బేజారు!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా బీటెక్కు ఆదరణ పెరుగుతుంటే, మరోవైపు ఎంటెక్లో మాత్రం ప్రవేశాలు గణనీయంగా తగ్గుతున్నాయి. సత్వర ఉపాధి, వీలైతే అమెరికా లాంటి దేశాల్లో ఎమ్మెస్ లక్ష్యంతో బీటెక్లో చేరుతున్న విద్యార్థులు.. పై చదువు విషయంలో నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్న ధోరణితో పాటు, పలు మాస్టర్ డిగ్రీ కాలేజీల్లో అవసరమైన మౌలిక వసతులు, సరైన బోధన సిబ్బంది ఉండక పోవడం కూడా ఇందుకు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంజనీరింగ్లో పీహెచ్డీ చేయాలన్నా ఎంటెక్తో పనిలేకపోవడం కూడా ప్రవేశాలు తగ్గడానికి మరో కారణమని విశ్లేషిస్తున్నారు.మరోవైపు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఎంటెక్కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీనివల్ల విద్యార్థుల్లో అదనంగా ఉండే నైపుణ్యం కూడా అంతగా ఏమీ ఉండదని సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సాంకేతిక విద్యలో గ్రాడ్యుయేషన్ తర్వాత యువత ఉపాధి వైపు మళ్లిపోతున్నారు. అనేకమంది ఎంఎస్ కోసం విదేశాలకు వెళ్తున్నారు. బీటెక్ చేసిన వారిలో కనీసం 10 శాతం కూడా ఎంటెక్ వైపు వెళ్లడం లేదని ఏఐసీటీఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏదీ కుదరని పక్షంలో ఎంటెక్లో చేరే విద్యార్థులు అత్యాధునిక సాంకేతిక కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. తగ్గిన సీట్లు.. ప్రవేశాలుఅఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఎంటెక్ ప్రవేశాలపై ఇటీవల పూర్తిస్థాయి సమాచారం వెల్లడించింది. ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలు ఏడేళ్ల కనిష్టానికి పతనమైనట్టు పేర్కొంది. ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ఎంటెక్ కోర్సుల్లో 68,677 మంది చేరితే, గత మూడు విద్యా సంవత్సరాల్లోనూ ఈ సంఖ్య దాదాపుగా 45 వేలు మాత్రమే కావడం గమనార్హం. ఈ మేరకు అందుబాటులో ఉన్న ఎంటెక్ సీట్ల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2017–18లో దేశవ్యాప్తంగా 1.85 లక్షల సీట్లు ఉంటే, 2024–25 నాటికి 1.24 లక్షలకు తగ్గాయి. ఇక రాష్ట్రంలో 2019–20 విద్యా సంవత్సరంలో 12,892 మంది ఎంటెక్లో చేరితే 2023–24 నాటికి ఆ సంఖ్య ఏకంగా 5,271కి దిగజారిపోవడం గమనార్హం.బీటెక్లో భిన్న పరిస్థితి బీటెక్ విషయంలో దేశవ్యాప్తంగా ఎంటెక్కు భిన్నమైన పరిస్థితి కన్పిస్తోంది. 2017–18లో 14.75 లక్షల సీట్లుంటే, 7.50 లక్షల మంది విద్యార్థులు చేరారు. 2023–24లో సీట్ల సంఖ్య 13.49 లక్షలకు తగ్గినా..విద్యార్థుల చేరిక మాత్రం గణనీయంగా పెరిగి 11.21 లక్షలకు చేరింది. దాదాపు 58% విద్యార్థులు కంప్యూటర్ సైన్స్, ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ వంటి కోర్సుల్లోనే చేరుతున్నారు. గ్రాడ్యుయేషన్ తర్వాత సత్వర ఉపాధి, విదేశాల్లో ఎమ్మెస్ తదితర కారణాలతోనే బీటెక్లో ప్రవేశాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.ఎంటెక్తోనూ మంచి భవిష్యత్తు వాస్తవానికి ఎంటెక్లో కొన్ని బ్రాంచీలకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎంటెక్ కంప్యూటర్ సైన్స్, సంబంధిత కొత్త బ్రాంచీల్లో ఉత్తీర్ణులైన వారికి ఇంజనీరింగ్ కాలేజీల్లో బోధించే అర్హత లభిస్తుంది. బీటెక్లో ప్రవేశాలు గణనీయంగా పెరుగుతున్న విషయం విదితమే కాగా అందుకు అనుగుణంగా అధ్యాపకుల అవసరం కూడా ఏర్పడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా 1.35 లక్షల బీటెక్ సీట్లున్నాయి. ఇందులో సీఎస్ఈ, ఐటీ, సంబంధిత సీట్లే 68 వేల వరకు ఉన్నాయి.ఈ పరిస్థితుల్లో కంప్యూటర్ సైన్స్ సంబంధిత పాఠ్యాంశాలను బోధించే అధ్యాపకులకు డిమాండ్ పెరుగుతోంది. ఎంటెక్ సీఎస్ఈ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ లాంటి స్పెషలైజేషన్ ఉంటే మంచి వేతనాలు లభించే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏఐసీటీఈ లెక్కల ప్రకారం ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు అవసరం. దీన్నిబట్టి కీలకమైన బ్రాంచీలను పరిగణనలోకి తీసుకున్నా తెలంగాణలోని 68 వేల సీట్లకు గాను 3,400 మంది అధ్యాపకుల అవసరం ఉందని విశ్లేషిస్తున్నారు.అదనంగా వచ్చేదేమీ ఉండటం లేదు సీఎస్సీ బీటెక్ తర్వాత ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఐటీ రంగంలో చేరిన తర్వాత స్వతహాగా పరిజ్ఞానం ఉంటేనే పురోగతి సాధ్యం. ఒకవేళ రెండేళ్ల పాటు ఎంటెక్ చేసి వచ్చినా ప్యాకేజీలో పెద్దగా మార్పు ఉండదు. బీటెక్ ఫ్రెషర్స్కు ఇచ్చే వేతనమే అప్పుడూ ఉంటుంది. అలాంటప్పుడు ఎంటెక్ వల్ల ప్రయోజనం ఏమిటి? – నీలేశ్ పుల్లెల ఐటీ ఉద్యోగిఅర్హత కాదు.. నైపుణ్యమే ముఖ్యంఐటీ రంగంలో ఉన్నతమైన అర్హత కన్నా అభ్యర్థి నైపుణ్యానికి పెద్దపీట ఉంటుంది. బీటెక్ తర్వాత పలు రౌండ్ల ఇంటర్వ్యూల్లో కంపెనీలు విద్యార్థి నైపుణ్యాన్ని అంచనా వేస్తాయి. నైపుణ్యంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పరిగణనలోకి తీసుకుని ఉద్యోగాలిస్తాయి. ఈ కారణంగానే ఎక్కువ మంది బీటెక్ తర్వాత ఐటీ రంగంలోకి వస్తున్నారు. – రాహుల్ సౌరభ్ ఐటీ కంపెనీ హెచ్ఆర్ విభాగం ఉద్యోగి -
ఉద్యోగాలను మించి.. కెరీర్పై దృష్టి
సాక్షి, అమరావతి: మన దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లకు ఎంతో క్రేజ్ ఉంది. ఏటా లక్షలాదిమంది విద్యార్థులు ఐఐటీల్లో ప్రవేశాల కోసం పోటీ పడుతుంటారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక రూ.కోట్లలో ప్యాకేజీలతో ప్లేస్మెంట్స్ సాధిస్తుంటారు. అయితే.. ఐఐటీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో సగం మంది కెరీర్లో విభిన్న అవకాశాలను అన్వేషించడంపై మొగ్గు చూపుతున్నారు. ఈ అంశం ఇటీవల ఢిల్లీ ఐఐటీ ఎగ్జిట్ సర్వేలో వెల్లడైంది. ఈ ఏడాది ఆగస్ట్లో డిగ్రీ పట్టా అందుకున్న 2,656 మంది విద్యార్థులపై ఎగ్జిట్ సర్వే నిర్వహించారు. పారిశ్రామిక రంగంపై 14 శాతం మంది దృష్టిఇదిలావుండగా.. దేశంలో ఐఐటీలతోపాటు ఇతర సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో 14 శాతం మంది పారిశ్రామిక రంగంపై దృష్టి సారిస్తున్నట్టుగ్లోబల్ యూనివర్సిటీ ఎంట్రప్రెన్యూరియల్ స్పిరిట్ స్టూడెంట్స్ సర్వే–2023 వెల్లడించింది. 57 దేశాల్లో చేపట్టిన సర్వే ఫలితాలు ఈ ఏడాది అక్టోబర్లో వెలువడ్డాయి. భారత గ్రాడ్యుయేట్లలో అత్యధికులు పారిశ్రామిక రంగంపై దృష్టి సారించినట్టు సర్వే పేర్కొంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత విద్యార్థులు అత్యధిక ఎంట్రప్రెన్యూర్షిప్ ఆలోచనలు కలిగి ఉన్నారని ఈ సర్వే తేల్చింది. ఎగ్జిట్ సర్వే ఏం తేల్చిందంటే..» 53.1 శాతం అంటే 1,411 మంది అందివచి్చన ఉద్యోగ అవకాశాల్లో కొనసాగుతామని వెల్లడించారు.» 8.4 శాతం అంటే 224 మంది స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపారు. 1.7 శాతం అంటే 45 మంది స్టార్టప్స్ కోసం పనిచేస్తామని వెల్లడించారు. 2.5 శాతం అంటే 66 మంది ఎంటర్ప్రెన్యూర్స్గా రాణించాలని నిర్ణయించుకున్నారు. » 13.5 శాతం అంటే 359 మంది ఉన్నత చదువుల్లో రాణించాలని నిర్ణయించుకున్నారు. 1.8 శాతం అంటే 47 మంది పీహెచ్డీ, పరిశోధన రంగాల్లో అవకాశాల కోసం అన్వేషిస్తామన్నారు.» 321 మంది (12.1) శాతం మంది సివిల్స్, ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో రాణించేందుకు సన్నద్ధం అవుతామన్నారు. » 134 మంది విద్యార్థులు (5 శాతం మంది) మాత్రమే ఇంకా కెరీర్లో ఏం చేయాలో నిర్ణయించుకోలేదని వెల్లడించారు. -
గ్రాడ్యుయేట్లకు అమెరికా గ్రీన్ కార్డు: ట్రంప్
వాషింగ్టన్: జాతీయవాదిగా, వలసలను వ్యతిరేకించే నాయకుడిగా పేరుగాంచిన అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన ధోరణి మార్చుకున్నారు. అమెరికాలో చదువుకొనే విదేశీ విద్యార్థులకు తీపి కబురు చెప్పారు. తాజాగా ఆల్–ఇన్ పాడ్కాస్ట్లో మాట్లాడారు. అమెరికా కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విదేశీ విద్యార్థులకు అటోమేటిక్గా గ్రీన్ కార్డులు అందించే విధానం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ చదివిన తర్వాత సొంత దేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సిన అవసరం ఉండదని, అమెరికాలోనే ఉండొచ్చని వెల్లడించారు. జూనియర్ కాలేజీల్లో చదువుకున్నవారికి సైతం గ్రీన్కార్డులు ఇస్తామన్నారు. ఇండియా, చైనా దేశాల విద్యార్థులు అమెరికా కాలేజీల్లో చదువుకొని, స్వదేశాలకు తిరిగివెళ్లి మల్టీ బిలియనీర్లుగా పైకి ఎదుగుతున్నారని, పరిశ్రమలు స్థాపించి, వేలాది మందికి ఉపాధి కలి్పస్తున్నారని చెప్పారు. వారు ఇక్కడే ఉండేలా చేస్తే అమెరికాకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యరి్థగా ట్రంప్ మరోసారి బరిలోకి దిగుతుండటం తెలిసిందే. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం: 105 ఏళ్ల బామ్మ మాస్టర్స్ డిగ్రీ
మధ్యలో వదిలేసిన చదువును పూర్తి చేయడం సామాన్య విషయం కాదు. అందుకు చాలా పట్టుదల కావాలి. పెళ్లి పిల్లలు తరువాత, పెళ్లికి ముందు వదిలివేసిన డిగ్రీ, లేదా ఇతర చదువు పూర్తి చేయమంటే.. ఇపుడేం చదువులే.. అని పెదవి విరుస్తారు చాలామంది. కానీ 105 ఏళ్ల బామ్మ ఏకంగా మాస్టర్స్ డిగ్రీ పట్టా పుచ్చుకుంది. చాలామందికి డిగ్రీ పట్టా పుచుకోవడం ఒక కలగా మిగిలిపోతుంది. కానీ 83 ఏళ్ల క్రితం మిస్ అయిన స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ (GSE) మాస్టర్స్ డిగ్రీని తాజాగా 105 ఏళ్ల వయసులో అందుకుంది. వర్జీనియా "జింజర్" హిస్లాప్ తాజాగా ఈ డిగ్రీని అందుకుంది. దీని కోసం ఎంతో కాలంగా వేచి ఉన్నానంటూ ఆమో భావోద్వేగానికి లోనైంది.1940లలో స్టాన్ఫోర్డ్లో అవసరమైన తరగతులను పూర్తి చేసింది వర్జీనియా . మాస్టర్స్ థీసిస్లో ఉండగా, రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. దీంతో చదువు మధ్యలోనే ఆగిపోయింది. మరోవైపుఆమె ప్రియుడితో పెళ్లి. భర్త జార్జ్ హిస్లోప్ యుద్ధంలో పనిచేయడానికి వెళ్లి పోయాడు. దీంతో అమెరికాలోని అనేకమంది ఇతర మహిళల్లాగానే వర్జీనియా కూడా చదువును త్యాగం చేయాల్సి వచ్చింది. అతనికి సాయం చేస్తూ, కుటుంబ పోషణపై దృష్టి పెట్టింది. తాజాగా ఇద్దరు పిల్లలు, నలుగురు మనుమలు , తొమ్మిది మంది మనవరాళ్లతో కూడిన తన కుటుంబంతో హాయిగా గడుపుతోంది. అటు వర్జీనియా వాషింగ్టన్ స్టేట్లోని పాఠశాల, కళాశాల బోర్డులలో దశాబ్దాలుగా పనిచేశారు. కానీ డిగ్రీ పట్టా పుచ్చుకోవాలనే తాపత్రయం ఆమెను ఊరికే కూర్చోనీయలేదు. పట్టుదలతో సాధించింది. ఈ ఏడాది జూన్ 16, ఆదివారం తన కల మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ని దక్కించుకుంది. మనుమలు, మనువరాళ్లు, ఇతర కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య 2024 గ్రాడ్యుయేటింగ్ ఈవెంట్లో కాలేజీ డీన్ డేనియల్ స్క్వార్ట్జ్ ఆమెకు డిప్లొమాను అందజేస్తోంటే సంతోషంగా ఉప్పొంగిపోయింది. -
చదువు ఎంపికలో పిల్లల మాట కూడా వినండి
మార్కులు రాలేదని తల్లి పెద్ద ర్యాంకు రాలేదని తండ్రి ఫలానా కోర్సు చదవాలని తల్లి ఆ కాలేజీలోనే చేర్పిస్తానని తండ్రి టీనేజ్ పిల్లలకు ఇది కీలక సమయం. వారు ఇంటర్లో, డిగ్రీలో చేరాలి. కాని పిల్లల మాట వింటున్నారా? మీరే గెలవాలని పట్టుబడుతున్నారా? అప్పుడు పిల్లలు లోలోపల నలిగి పోవడం కన్నా ఏం చేయలేరు. పత్రికల్లో వస్తున్న ఘటనలు హెచ్చరిస్తున్నాయి. ఆచితూచి అడుగు వేయండి.‘నువ్వు ఆ కోర్సు చేయాలనేది మా కల’ అనే మాట తల్లిదండ్రుల నుంచి వెలువడితే అది పిల్లల నెత్తిమీద ఎంత బరువుగా మారుతుందో పిల్లలకే తెలుసు. టీనేజ్ మొదలయ్యి టెన్త్ క్లాస్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఈ ‘కలలు వ్యక్తపరచడం’ తల్లిదండ్రులు మొదలెడతారు. టెన్త్లో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలో, ఇంటర్లో ఏ స్ట్రీమ్లోకి వెళ్లాలో, అందుకు ఏ కాలేజీలో చేరాలో, ఆ కాలేజీ ఏ ఊళ్లో ఉంటే బాగుంటుందో ఇన్ని డిసైడ్ చేసి పిల్లలకు చెబుతుంటారు. పిల్లలు వినాలి. వారికి ఏ అభిప్రాయం లేకుండా ఆ కోర్సు పట్ల ఆసక్తి ఉంటే మంచిదే. వారికి మరేదో ఇంటరెస్ట్ ఉండి, ఇంకేదో చదవాలని ఉంటే... ఆ సంగతి చెప్పలేకపోతే ఇబ్బంది. అది భవిష్యత్తును కూడా దెబ్బ కొట్టగలదు.ఏంటి... ఆ కోర్సా?ఆ ఇంట్లో తండ్రి అడ్వకేట్, తల్లి గవర్నమెంట్ ఉద్యోగి. కుమార్తెకు మేథ్స్గాని, బయాలజీగాని చదవాలని లేదు. హాయిగా టీచర్గా సెటిల్ అవ్వాలని ఉంది. తన స్కూల్లో చక్కగా తయారై వచ్చే టీచర్ పిల్లల పేపర్లు దిద్దే సన్నివేశం ఆ అమ్మాయికి ఇష్టం. తాను కూడా టీచరయ్యి పేపర్లు దిద్దాలని అనుకుంటుంది. టెన్త్ అవుతున్న సమయంలో ‘టీచర్ అవుతాను’ అని కూతురు అంటే తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ‘మన హోదాకు టీచర్ కావడం ఏం బాగుంటుంది... మన ఇళ్లల్లో టీచర్లు ఎవరూ లేరే’ లాంటి మాటలు చెప్పి ఎంపీసీలో చేర్పించారు. ఆ అమ్మాయి ఆ లెక్కలు చేయలేక తల్లిదండ్రులకు చెప్పలేక కుమిలిపోయింది. డిప్రెషన్ తెచ్చుకుంది. అదే ‘టీచర్ కావాలనుకుంటున్నావా? వెరీగుడ్. అక్కడితో ఆగకు. నువ్వు హార్వర్డ్లో ప్రోఫెసర్ అవ్వాలి. అంత ఎదగాలి’ అని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే హార్వర్డ్కు వెళ్లకపోయినా ఒక మంచి యూనివర్సిటీలో లెక్చరర్ అయినా అయ్యేది కదా.అన్నీ మాకు తెలుసుతల్లిదండ్రులకు అన్నీ మాకు తెలుసు అనే ధోరణి ఉంటుంది. నిజమే. కాని వాళ్లు ఇప్పుడున్న స్థితి రకరకాల ప్రయోగాలు చేసి రకరకాల దారుల్లో ప్రయత్నించి ఒక మార్గంలో సెటిల్ అయి ఉంటారు. తమ లాగే తమ పిల్లలు కూడా కొన్ని దారుల్లో నడవాలని అనుకోవచ్చు అని భావించరు. అన్నీ తమ ఇష్టప్రకారం జరగాలనుకుంటారు, ఓవర్ కన్సర్న్ చూపించి ఉక్కిరిబిక్కిరి చేస్తారు. ఉదాహరణకు ఒకబ్బాయికి ‘నీట్’లో మెడిసిన్ సీటు వచ్చే ర్యాంకు రాలేదు. కాని డెంటిస్ట్రీ సీటు వచ్చే ర్యాంకైతే వచ్చింది. అబ్బాయికి ఆ కోర్సు ఇష్టమే. కాని తల్లిదండ్రులకు తమ కొడుకు ఎలాగైనా ఎంబిబిఎస్ మాత్రమే చదవాలనేది ‘కల’. ‘లాంగ్ టర్మ్ తీసుకో’ అని సూచించారు. లాంగ్ టర్మ్ అంటే ఒక సంవత్సరం వృథా అవుతుంది... పైగా ఈసారి ఎంట్రన్స్లో కూడా మంచి ర్యాంక్ వస్తుందో రాదో అనే భయం ఆ అబ్బాయికి ఉన్నా బలవంతం చేస్తే ఎంత చెప్పినా వినకపోతే ఆ అబ్బాయి ఉక్కిరిబిక్కిరి అవ్వడా?ప్రతిదీ నిర్ణయించడమేతల్లిదండ్రుల స్తోమత పిల్లలకు తెలుసు. వారు చదివించ దగ్గ చదువులోనే తమకు ఇష్టం, ఆసక్తి, ప్రవేశం ఉన్న సబ్జక్టును చదవాలని కోరుకుంటారు. పైగా తమ స్నేహితుల ద్వారా వారూ కొంత సమాచారం సేకరించి ఫలానా కాలేజీలో ఫలానా కోర్సు చదవాలని నిశ్చయించుకోవచ్చు. అయితే తల్లిదండ్రులు పిల్లల ఆసక్తికి ఏ మాత్రం విలువ లేకుండా ఎలాగైనా చేసి రికమండేషన్లు పట్టి తాము ఎంపిక చేసిన కాలేజీలోనే చదవాలని శాసిస్తారు. ఇది అన్నివేళలా సమంజసం కాదు. ఒత్తిడి వద్దుటీనేజ్ సమయంలో పిల్లల భావోద్వేగాలు పరిపక్వంగా ఉండవు. కొంత తెలిసీ కొంత తెలియనితనం ఉంటుంది. ఆసక్తులు కూడా పూర్తిగా షేప్ కావు. ఇంటర్, గ్రాడ్యుయేషన్ కోర్సులకు సంబంధించి, కాలేజీలకు సంబంధించి వారికి ఎన్నో సందేహాలుంటాయి. ఎంపికలు ఉంటాయి. ఇవాళ రేపు తల్లిదండ్రులు ‘తాము చదివించాలనుకున్న కోర్సు’ కోసం ఏకంగా పంజాబ్, హర్యాణ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు పంపుతున్నారు. ఇంట్లో ఉండి చదివే వీలున్నా రెసిడెన్షియల్ కాలేజీల్లో పడేస్తున్నారు. అంతంత మాత్రం చదువు చెప్పినా పర్లేదని మెడిసన్ పట్టా ఉంటే చాలని ఆసియా దేశాలకు సాగనంపుతున్నారు. పిల్లలతో ఎంతో మాట్లాడి, కౌన్సెలింగ్ చేసి, మంచి చెడ్డలన్నీ చర్చించి, వారికి సంపూర్ణ అవగాహన కలిగించి రెండు ఆప్షన్లు ఇచ్చి వారి ఆప్షన్లు కూడా పరిగణించి సానుకూలంగా ఒక ఎంపిక చేయడం ఎప్పుడూ మంచిది. లేదంటే ‘కోటా’ లాంటి కోచింగ్ ఊర్లలో జరుగుతున్న విషాదాలు, హైదరాబాద్లాంటి చోట్ల ఇల్లు విడిచి పోతున్న సంఘటనలు ఎదుర్కొనాల్సి వస్తుంది. -
యూకే పోస్టు–స్టడీ వీసాలు రద్దు!
లండన్: యునైటెడ్ కింగ్డమ్(యూకే)లోకి వలసలను అరికట్టడానికి ప్రధానమంత్రి రిషి సునాక్ కొత్తరకం ఆలోచనలు చేస్తున్నారు. యూకేలో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత రెండేళ్లపాటు ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకొనేందుకు వీలు కల్పించే పోస్టు–స్టడీ వీసాను రద్దు చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై సొంత మంత్రివర్గం నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడం గమనార్హం. యూకే పోస్టు–స్టడీ వీసా పథకం 2021లో ప్రారంభమైంది. దీనితో భారతీయ విద్యార్థులు అధికంగా ప్రయోజనం పొందుతున్నారు. యూకేలో యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ అభ్యసించిన తర్వాత రెండేళ్లదాకా ఇక్కడే ఉంటూ ఉద్యోగాలు చేసుకొనే వెసులుబాటు లభిస్తోంది. ఒకవేళ ఈ వీసాను రద్దుచేస్తే భారతీయ విద్యార్థులే ఎక్కువగా నష్టపోతారని నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో యూకేలోకి వలసలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవన్నీ చట్టబద్ధంగానే జరుగుతున్నప్పటికీ ప్రభుత్వానికి భారంగా మారుతున్నాయి. వలసలను అరికట్టే చర్యల్లో భాగంగా పోస్టు–స్టడీ వీసాలపై ఆంక్షలు విధించడమా లేక శాశ్వతంగా రద్దు చేయడమా అనే దానిపై ప్రధాని రిషి సునాక్ తర్జనబర్జన పడుతున్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రతిపాదనను పలువురు యూకే మంత్రులు వ్యతిరేకిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి గిలియన్ కీగన్, విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరూన్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. -
స్నాతక పాఠం అంటే..?
ఒక వయసులో ఒక స్త్రీ ఒకపురుషుడికి నచ్చిందనీ, ఒక పురుషుడు ఒక స్త్రీకి నచ్చాడనీ...కాబట్టి కలసి జీవించడం... అనేది శాస్త్ర సమ్మతం కాదు. కాలం గడిచేకొద్దీ ధనం వెళ్ళిపోతుంది, నీ వాళ్ళనుకున్న వాళ్ళు వెళ్లిపోతారు, అధికారం పోతుంది, జ్ఞాపకశక్తి కూడా పోతుంది.. అన్నీ పోతాయి... అలాగే యవ్వనం కూడా. కానీ మిగిలిపోయేది ఏదయినా ఉంటే.. ఆ వ్యక్తి ధార్మికంగా బతికాడా..అన్నదే! పెళ్ళి ఎందుకు చేస్తున్నారు, వారిద్దర్నీ ఎందుకు కలుపుతున్నారు... ప్రస్థానం అంటే వారిద్దరూ కలిసి ఏం చేయాలి? అన్న దాని గురించి అవగాహన కల్పించడం కోసం గృహస్థాశ్రమ స్వీకారానికి ముందు గురువుని తీసుకొచ్చి మంచి విషయాలు చెప్పిస్తారు. దానిని స్నాతక పాఠం అంటారు. స్నాతక పాఠంగా కాకపోయినా పెద్దల్ని తీసుకొచ్చి ‘‘మీరు వివాహం చేసుకోవాలి. ఇద్దరూ అన్యోన్యంగా బతకడం మీద ఎన్నో జీవితాల అభ్యున్నతి ఆధారపడి ఉంది. ఈ ఏర్పాటు మీ వ్యక్తిగత జీవితం కోసం మాత్రమే కాదు సుమా! మీ పెద్దల కీర్తి ప్రతిష్ఠలు, నీ తోబుట్టువుల తృప్తి, మీ బిడ్డల భవిష్యత్తు.. ఇలా చాలా ముడిపడి ఉన్నాయి. ఇది తొందరపడి తీసుకునే నిర్ణయం కాదు. దీనిని మీరు లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని అవగాహనపరిచే ప్రయత్నం చేస్తారు. అది సనాతన ధర్మానికి ఉన్న గొప్పదనం. అన్నపానీయాలుగానీ, మరేవయినాగానీ వాటిని సంస్కరించకుండా స్వీకరించం. అటువంటి ఒక ఏర్పాటును నీవు జీవితంలోకి ఆహ్వానిస్తున్నావు.. ఇక అక్కడినుంచి నీ జీవితం పండవలసిన అవసరం ఉంది. ఇది బ్రహ్మచర్యం అన్న కట్టువిప్పి గృహస్థాశ్రమం అన్న కొత్తకట్టు వేయడం కాదు. బ్రహ్మచర్యం అన్న కట్టు విప్పేయడం అన్నమాట ఉండదు. కారణం – ఆ ఆశ్రమంలో క్రమశిక్షణ, విద్యాభ్యాసం, గురువుపట్ల చూపే గౌరవమర్యాదలు ...ఇవన్నీ ఉన్నాయి. గృహస్థాశ్రమంలోకి వచ్చినప్పుడు ఆ కట్టుబాటు ఎటు పోయింది? ఎటూ పోలేదు. దాని మీద మరో కట్టు వచ్చి చేరింది. కట్టుమీద కట్టు. ΄పొలంలో పచ్చిగడ్డికోసి మోపుకట్టిన తండ్రిని చూసి కొడుకు ‘‘మోపు గట్టిగా కట్టలేదు’’ అంటే తండ్రి బాధపడతాడని... ‘‘అది వదులుగా ఉన్నట్లుంది. ఎందుకైనా మంచిది, మరో కట్టు వేస్తాను’’ అని మోపును మోకాళ్ళతో అదిమి గట్టిగా కట్టి తలమీద పెట్టుకుని ఇంటిబాట పడతాడు. తండ్రి వేసిన కట్టును విప్పి ఆయనను అగౌరవ పరచలేదు. ఆ కట్టు వదులుగా ఉన్నందువల్ల ఎక్కడో దానంతట అదే జారిపోయింది. అంతే.గృహస్థాశ్రమం అన్న కట్టు వేసినప్పుడు బ్రహ్మచర్య నియమాలు జారిపోతాయి తప్ప బ్రహ్మచర్యంలో ఏ బంధాలున్నాయో అవి, అక్కడ అలవర్చుకున్న సంస్కారం మాత్రం జీవితాంతం ఉంటాయి. ఎప్పటికప్పుడు ఎలా సంస్కరిస్తే వ్యక్తి జీవితాన్ని పండించుకుంటాడో దానికి అవసరమయిన విషయాలను అందించి ఆశ్రమాన్ని మారుస్తారు. -
విద్యావంతులకు పెద్దపీట
సాక్షి, అమరావతి: 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు వైఎస్సార్సీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో విద్యావంతులకు పెద్దపీట వేశారు. వీరిలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన వారు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, ఇంజినీర్లు, సివిల్ సర్వెంటు, జర్నలిస్టు ఇలా అన్ని రకాల విద్యావంతులకు జాబితాలో సీఎం జగన్ చోటు కల్పించారు. ఈ జాబితాలో మొత్తం 200 మందికి గాను 77 శాతం మంది ఉన్నత విద్యావంతులున్నారు. 175 శాసనసభ స్థానాలకు వైఎస్సార్సీపీ ప్రకటించిన అభ్యర్థుల్లో 131 మంది గ్రాడ్యుయేషన్, ఆపై చదవులు చదివినవారు ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 47 మంది పోస్టు గ్రాడ్యుయేషన్, డాక్టరేట్ చేసిన వారున్నారు. 13 మంది డాక్టర్లు, 11 మంది లాయర్లు, 34 మంది ఇంజినీర్లు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు సివిల్ సర్వెంట్లు(ఎ.మహ్మద్ ఇంతియాజ్, ఆదిమూలపు సురేష్), ఒకరు డిఫెన్స్లో చేసినవారు (వాసుపల్లి గణేష్కుమార్), ఒక జర్నలిస్టు(కురసాల కన్నబాబు) ఉన్నారు. ఎంపీ అభ్యర్థుల్లో 88 శాతం డిగ్రీ, ఆపై చదివినవారే.. 25 లోక్సభ స్థానాలకు వైఎస్సార్సీపీ ప్రకటించిన అభ్యర్థుల్లో 22 మంది (88 శాతం) డిగ్రీ, ఆపై చదువులు చదివిన వారు ఉన్నారు. ఇందులో 11 మంది పోస్టు గ్రాడ్యుయేషన్, ఇద్దరు డాక్టరేట్ చేసిన వారు ఉన్నారు. లోక్సభ అభ్యర్థుల్లో సింహాద్రి చంద్రశేఖరరావు, గూడురి శ్రీనివాసులు, మద్దుల గురుమూర్తి, పి.అనిల్కుమార్ యాదవ్లు డాక్టర్లు కాగా.. నలుగురు లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్(వి.విజయసాయిరెడ్డి), ఒక మెడికల్ ప్రాక్టిషనర్ ఉన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు అవకాశం ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న పలువురికి వైఎస్సార్సీపీ టికెట్లు కేటాయించింది. మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్యకర్తల్లో 13 మందికి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీకి అవకాశం కల్పించింది. కర్నూలు మేయర్ బీవై రామయ్యకు కర్నూలు ఎంపీగా, గుంటూరు మేయర్ కావటి మనోహర్నాయుడుకి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్ పిరియ విజయకు ఇచ్ఛాపురం నుంచి అవకాశం కల్పించారు. సాధారణ కార్యకర్తలు లక్కప్ప, వీరాంజనేయులుకు మడకశిర, శింగనమల నుంచి పోటీకి అవకాశం కల్పించారు. పార్టిలో క్రియాశీల కార్యకర్తగా పనిచేసిన గూడూరి ఉమాబాలకు నరసాపురం ఎంపీ సీటు కేటాయించారు. కడప జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. జెడ్పీటీసీ సర్నల తిరుపతిరావుకు మైలవరం టికెట్ కేటాయించారు. వైఎస్సార్సీపీ నేత బలసాని కిరణ్కుమార్ ప్రత్తిపాడు నుంచి, గృహిణి మురుగుడు లావణ్య మంగళగిరి నుంచి పోటీç³డుతున్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తిరుపతి నుంచి, నెల్లూరు సిటీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ నెల్లూరు నుంచి, జెడ్పీటీసీ బూసినే విరూపాక్ష ఆలూరు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. -
అవమానించిన వాళ్లే అభినందిస్తున్నారు!
‘నువ్వేమైనా కలెక్టర్వా? డాక్టర్వా? లేకపోతే ఏమైనా కంపెనీకి ఓనర్వా? ఆఫ్టరాల్... సెక్యూరిటీ గార్డ్వి. సెక్యూరిటీ గార్డు కూతురు విదేశాల్లో చదవగలదా?’ అని ఆ గార్డు ముఖం మీదే కరుకుగా మాట్లాడారు చాలామంది. బాధ పెట్టే కామెంట్స్ ఎన్ని చెవిన పడ్డా కూతురిని విదేశాల్లో చదివించాలనే లక్ష్యం విషయంలో ఆయన ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. కట్ చేస్తే... యూకే లో ఒక యూనివర్శిటీ నుంచి సెక్యూరిటీ గార్డ్ కూతురు ధనుశ్రీ గైక్వాడ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ధనుశ్రీని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడం, ఆమె తన గ్రాడ్యుయేషన్ డిగ్రీని స్వీకరించడానికి వేదికపైకి వెళ్లడం, గ్రాడ్యుయేషన్ క్యాప్, గౌన్ ధరించిన ధనుశ్రీ తండ్రిని ఆనందంగా ఆలింగనం చేసుకోవడంలాంటి దృశ్యాలు వీడియోలో కనిపిస్తాయి. ఆయుష్మాన్ ఖురాన, ఈశా గుప్తాలాంటి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ వీడియోపై స్పందించారు. ‘నువ్వు గార్డువి మాత్రమే. నీ కూతురిని విదేశాల్లో చదివించడం అసాధ్యం’ అని తండ్రితో చెప్పిన ప్రతి ఒక్కరికీ వీడియోను షేర్ చేసింది ధనుశ్రీ గైక్వాడ్. ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోకు 20 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. -
‘గగన’ విజయం
సాక్షి, హైదరాబాద్: కలలు కన్నారు.. ఆ కలను నిజం చేసుకునేందుకు కష్టపడ్డారు.. వ చ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటూ గగనతలంలో విజయబావుటా ఎగురవేశారు ఈ యువ ఫ్లయింగ్ కేడెట్లు. ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం అయినా..అంతిమ లక్ష్యం మాత్రం భరతమాత సేవలో తాము ఉండాలన్నదే. ఆదివారం దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో పాల్గొని భారత వాయుసేనలోని వివిధ విభాగాల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా యువ అధికారులు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు ఇలా పంచుకున్నారు. దేశ సేవలో నేను మూడో తరం.. దేశ సేవలో మా కుటుంబ నుంచి మూడో తరం అధికారిగా నేను ఎయిర్ఫోర్స్లో చేరడం ఎంతో సంతోషంగా ఉంది. మా తాతగారు పోలీస్ అఫీసర్గా చేశారు. మా నాన్న కర్నల్ రాజేశ్ రాజస్థాన్లో పనిచేస్తున్నారు. నేను ఇప్పుడు ఎయిర్ ఫోర్స్లో నావిగేషన్ బ్రాంచ్లో సెలక్ట్ అయ్యాను. వెపన్సిస్టం ఆపరేటర్గా నాకు బాధ్యతలు ఇవ్వనున్నారు. ఇది ఎంతో చాలెంజింగ్ జాబ్. శిక్షణ సమయంలో ఎన్నో కఠిన పరిస్థితులను దాటిన తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎలాంటి బాధ్యత అయినా నిర్వర్తించగలనన్న నమ్మకం పెరిగింది. మా స్వస్థలం జైపూర్. నేను బీటెక్ ఎల్రక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ సిస్టం అమేథీలో చేశాను. – ఫ్లయింగ్ కేడెట్ థాన్యాసింగ్, జైపూర్ నాన్నే నాకు స్ఫూర్తి... మాది వికారాబాద్ జిల్లా చీమల్దరి గ్రామం. నాన్నపేరు శేఖర్. ప్రైవేటు ఉద్యోగి, అమ్మ బాలమణి టైలర్. చిన్నప్పటి నుంచి నాన్న స్ఫూర్తితోనే నేను డిఫెన్స్ వైపు రాగలిగాను. కార్గిల్ యుద్ధంలో సూర్యకిరణ్ పైలెట్ బృందం ఎంతో కీలకంగా పనిచేసిందన్న వార్తలను చూసి మా నాన్న నాకు సూర్యకిరణ్ అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచే నన్ను డిఫెన్స్కు వెళ్లేలా ప్రోత్స హించారు. అలా నేను ఏడో తరగతిలో డెహ్రాడూన్లోని రాష్ట్రాయ ఇండియన్ మిలిటరీ కాలేజ్కు ప్రవేశ పరీక్ష రాసి 8వ తరగతిలో చేరాను. అందులో రాష్ట్రానికి ఒక్క సీటు మాత్రమే కేటాయిస్తారు. అంత పోటీలోనూ నేను సీటు సాధించాను. అక్కడే ఇంటర్మీడియెట్ వరకు చదివాను. ఆ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో రెండేళ్లు శిక్షణ తీసుకున్న తర్వాత ఇండియన్ ఎయిర్ఫోర్స్కి సెలక్ట్ అయ్యాను. – సూర్యకిరణ్, చీమల్దరి, వికారాబాద్ జిల్లా భారత సైన్యంలో చేరడం నా కల.. నా పేరు లతా కౌషిక్. మాది హరియాణా రాష్ట్రంలోని జజ్జర్ జిల్లా దుబల్దాన్ గ్రామం. మానాన్న రైతు. అమ్మ గృహిణి. నేను ఢిల్లీ యూనివర్సిటీలోని మిరండా కాలేజీలో బీఎస్సీ హానర్స్, మ్యాథ్స్ చదివాను. డిఫెన్స్ ఫోర్స్లో చేరడం ద్వారా దేశానికి, ప్రజల రక్షణకు పనిచేయవచ్చని నా కోరిక. ఆడపిల్ల డిఫెన్స్లోకి ఎందుకు అని ఏనాడు మా ఇంట్లో వాళ్లు అనలేదు. మా నాన్నతో సహా కుటుంబం అంతా నన్ను ప్రోత్సహించడంతోనే నేను ఎయిర్ఫోర్స్కి వచ్చాను. లక్ష్యం స్పష్టంగా ఉంటే ఏదీ మనల్ని అడ్డుకోలేదు. అన్ని పరిస్థితులు కలిసి వస్తాయి. – లతా కౌషిక్, ఫ్లయింగ్ ఆఫీసర్, హరియాణా ఎప్పుడూ ఫ్లైట్ ఎక్కని నేను ఫైటర్ పైలట్ అయ్యాను.. నాపేరు జోసెఫ్. నేను ఒక్కసారి కూడా ఫ్లైట్ ఎక్కలేదు. ఇప్పుడు ఏకంగా ఫైటర్ పైలెట్ కావడం సంతోషంగా ఉంది. మా సొంత ప్రాంతం గుంటూరు. నేను టెన్త్ వరకు గుంటూరులో చదివాను. ఎయిర్ఫోర్స్కి రావాలని అనుకోలేదు. ఇంటర్మిడియెట్ తర్వాత ఎన్డీఏ గురించి తెలుసుకుని ఈ కెరీర్ని ఎంచుకున్నాను. మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయ్యాను. తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్లగలిగాను. అక్కడ నుంచి భారత వాయుసేనలో సెలక్ట్ అయ్యాను. మా తల్లిదండ్రు ల ప్రోత్సాహంతోనే నేను ఈ స్థాయికి చేరాను. పేరెంట్స్ సపోర్ట్ లేకుండా పిల్లలు ఏదీ సాధించలేరు. తల్లిదండ్రులు పూర్తిగా సహకరిస్తేనే పిల్లలు వారి కలలు నిజం చేసుకోగలుగుతారు. – జోసెఫ్, ఫైటర్ పైలట్, గుంటూరు -
సాయుధ దళాలు.. వినూత్నంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: సాయుధ దళాలలో సంప్రదాయ పద్ధతులకు తగిన ప్రాధాన్యం ఇస్తూనే.. కాలానుగుణంగా కొత్త ఆవిష్కరణలు తేవాల్సిన అవసరం ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ చెప్పారు. కొత్త ఆలోచనలు చేయకుండా చాలా కాలం ఒకే తరహా సంప్రదాయాలను అనుసరిస్తే వ్యవస్థలో జడత్వం వస్తుందని అభిప్రాయపడ్డారు. యువ అధికారులు తమలో నూతనత్వానికి, వినూత్న ఆలోచనలకు ఎప్పటికప్పుడు పదునుపెట్టాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ శివార్లలోని దుండిగల్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ( ఇఎ్క) జరిగింది. ఇందులో శిక్షణ పూర్తి చేసుకున్న 213 ఫ్లైట్ కేడెట్లు (వీరిలో 25 మంది మహిళలు) పాల్గొన్నారు. గౌరవ వందనం స్వీకరించి.. పరేడ్కు సమీక్ష అధికారిగా రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ పాల్గొని యువ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. యువ కేడెట్లు భారత వాయుసేనలోని వివిధ విభాగాల్లో విధుల్లోకి చేరడానికి సూచికగా వారందరికీ అధికారిక హోదా కల్పిస్తూ రాష్ట్రపతి కమిషన్ (అధికారిక బ్యాడ్జ్లను)ను ప్రదానం చేశారు. తర్వాత రాజ్నాథ్సింగ్ ప్రసంగించారు. ‘‘నిరంతరం అభివృద్ధి చెందుతున్న కాలానికి అనుగుణంగా సంప్రదాయాలు, ఆవిష్కర ణల మధ్య సమతుల్యత సాధించండి. సంప్రదాయాన్ని మాత్రమే పాటిస్తే.. మనం ఎండిపోయిన సరస్సులా మారిపోతాం. మనం ప్రవహించే నదిలా ఉండాలి. ఇందుకు సంప్రదాయంతోపాటు కొత్తదనాన్ని తీసుకురావాలి. వాయుసేన అధికారులుగా మీరు ఆకాశంలో ఎగురుతూ ఉండండి. ఎక్కు వ ఎత్తును తాకండి, కానీ నేలతో మీ సంబంధాన్ని కొనసాగించండి’’అని పిలుపునిచ్చారు. అకాడమీలో భారత వాయుసేనకు చెందిన అధికారులతోపాటు నౌకాదళానికి చెందిన ఎనిమిది మంది అధికారులు, కోస్ట్ గార్డ్ (తీర రక్షక దళం) నుంచి 9 మంది, స్నేహపూర్వక దేశమైన వియత్నాం నుంచి ఇద్దరు అధికారులు కూడా ఫ్లయింగ్ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసి.. రక్షణ మంత్రి రాజ్నాథ్ నుంచి అవార్డులు అందుకున్నారు. శిక్షణలో టాపర్గా నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ అతుల్ ప్రకాశ్ రాష్ట్రపతి ఫలకాన్ని చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ స్వోర్డ్ ఆఫ్ హానర్ను రాజ్నాథ్ చేతులమీదుగా అందుకున్నారు. గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్లలో మెరిట్లో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ అమరీందర్ జీత్ సింగ్కు రాష్ట్రపతి ఫలకం లభించింది. అంతకుముందు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, యువ కేడెట్లతో ప్రమాణం చేయించారు. ఆకట్టుకున్న కవాతు శిక్షణలో ప్రథమస్థానంలో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ అతుల్ ప్రకాశ్ ఆదివారం నాటి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు పరేడ్ కమాండర్గా వ్యవహరించారు. ఈ సందర్భంగా యువ ఫ్లయింగ్ కేడెట్లు చేసిన కవాతు ఆకట్టుకుంది. పరేడ్ అనంతరం భారత వాయుసేన నిర్వహించిన వైమానిక ప్రదర్శన అలరించింది. సారంగ్ హెలికాప్టర్ బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృంద విన్యాసాలు, సుఖోయ్–30 ఎంకేఐ గగనతల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎయిర్ఫోర్స్ అధికారులతోపాటు యువ ఫ్లయింగ్ ఆఫీసర్ల తల్లిదండ్రులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. -
మానవతా విలువల్ని పరిరక్షిద్దాం
సుభాష్నగర్: మన జీవితాలు యంత్రాలతో ఎంతగానో పెనవేసుకుపోయాయని, వాటిని వినియోగిస్తూనే సమాజంలో మానవతా విలువల్ని కూడా పరిరక్షించేలా మనం ముందుకు సాగాలని మహీంద్రా యూనివర్శిటీ చాన్స్లర్ ఆనంద్ మహీంద్ర అన్నారు. బహదూర్పల్లిలోని మహీంద్ర యూనివర్సిటీలో శనివారం స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జున రావు, అప్గ్రేడ్ చైర్మన్ రొన్నీ స్రీవల తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం ఆనంద్ మహీంద్ర మాట్లాడుతూ భారత ఆర్ధిక వ్యవస్థ ప్రపంచంలోనే మూడవ పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉందని, 76 సంవత్సరాలుగా టెక్ మహీంద్ర కంపెనీ సేవలందించడం గర్వంగా ఉందన్నారు. విద్యార్థులు మానవాభివృద్ధికి దోహదపడే నూతన ఆవిష్కరణల దిశగా కృషి చేయాలన్నారు. టెక్ మహీంద్ర ఎండీ మోహిత్ జోషి, మహీంద్రా యూనివర్శిటీ వైస్ఛాన్సలర్ డాక్టర్ యాజులు మేదురి, యూనివర్సిటీ, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
చైనాను అధిగమించి.. దూసుకెళ్తున్నారు..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : అమెరికాలో గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ చదువుల కోసం వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల్లో చైనీయులు అధిక సంఖ్యలో ఉన్నారు. తర్వాత స్థానంలో భారత్ ఉంది. కానీ ఈ పరిస్థితి మరికొన్ని సంవత్సరాల్లోనే మారనుంది. త్వరలోనే భారత్ మొదటి స్థానంలోకి రానుంది. చైనా నుంచి వెళ్లే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటమే ఇందుకు కారణం. ఇటీవలి కాలం వరకు అమెరికా విద్యాసంస్థలు చైనా విద్యార్థులను చేర్చుకోవ డానికి అధిక ప్రాధాన్యతనిచ్చేవి. కోవిడ్ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ద్వైపాక్షిక సంబంధాలు కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేప థ్యంలో అమెరికా విద్యాసంస్థలు భారత్ను తమకు అనుకూలమైన అతిపెద్ద మార్కెట్గా పరిగణిస్తు న్నాయి. స్ప్రింగ్ స్నాప్షాట్ పేరిట ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఐఐఈ) నిర్వహించిన సర్వే ఈ విషయం స్పష్టం చేస్తోంది. 2020 నుంచి 2023 నాటికి చైనా నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య 3,68,800 నుంచి 2,53,630కి తగ్గగా.. అదే సమయంలో భారత్ నుంచి వెళ్లే విద్యార్థుల సంఖ్య 1.90 లక్షల నుంచి 2.53 లక్షలకు పెరిగినట్లు ఐఐఈ పేర్కొంది. 2030కి 3.94 లక్షల మందితో భారత్ అగ్రస్థానానికి చేరుతుందని అంచనా వేసింది. భారత్ వైపే 57% సంస్థలు మొగ్గు గ్రాడ్యుయేషన్తో పాటు అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులను ఆకర్షించడానికి అమెరికా విద్యాసంస్థలు ప్రయత్ని స్తున్నాయి. ప్రతి పది మంది గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో నలుగురు విదేశీ విద్యార్థులు ఉండేలా ఈ రిక్రూట్మెంట్ విధానం కొనసాగుతోంది. 2023–24 విద్యా సంవత్సరంలో విదేశీ విద్యార్థుల చేరికకు సంబంధించి ఏప్రిల్ నుంచి మే మధ్య కాలంలో ఐఐఈ సర్వే నిర్వహించింది. మొత్తం 527 విద్యాసంస్థల నుంచి డేటా సేకరించింది. సుమారు 57 శాతం సంస్థలు భారత్ విద్యార్థులను ఎక్కువగా చేర్చుకోవడానికి ప్రయత్నించినట్లు వెల్లడించింది. 2022–23 కంటే 2023–24 విద్యా సంవత్సరంలో విదేశీ విద్యార్థుల నుంచి తమకు అధికంగా దరఖాస్తులు అందినట్లు 61 శాతం కాలేజీలు/యూనివర్సిటీలు వెల్లడిస్తే.. మరో 28 శాతం విద్యా సంస్థలు తమకు గత సంవత్సరం వచ్చిన మేరకు దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నాయి. మరో 12% విద్యా సంస్థలు మాత్రం తమకు దరఖాస్తులు తగ్గినట్లు తెలిపాయి. అమెరికాకు తగ్గిన ఆదాయం కోవిడ్ తరువాత గడిచిన రెండేళ్లుగా విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా, కోవిడ్ కంటే ముందున్న ఆదాయం రాలేదని ఐఐఈ సర్వే వెల్లడిస్తోంది. కోవిడ్కు ముందు 2018 విద్యా సంవత్సరంలో విదేశీ విద్యార్థుల నుంచి అమెరికాకు వచ్చే ఆదాయం దాదాపు 45 బిలియన్ డాలర్లు.. మన రూపాయల్లో అది రూ. 3.7 లక్షల కోట్లు. ఇప్పటివరకు ఏ విద్యా సంవత్సరంతో పోల్చినా ఇదే అత్యధిక ఆదాయం. కాగా అప్పట్లో ఏటా దాదాపు 11 లక్షల వరకు విదేశీ విద్యార్థులు అమెరికాలో విద్యాభాస్యం కోసం వచ్చేవారని పేర్కొంది. అయితే 2022–23లో విదేశీ విద్యార్థుల వల్ల అమెరికాకు 33.8 బిలియన్ డాలర్ల ఆదాయం మాత్రమే సమకూరింది. అంటే మన కరెన్సీలో ఇది రూ.2.7 లక్షల కోట్లు. అమెరికా విద్యా సంస్థలకు ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల నుంచి పోటీ ఎక్కువ అవుతున్నట్లు సర్వేలో తేలింది. అంటే ఈ దేశాల విద్యా సంస్థల్లో కూడా విదేశీ విద్యార్థులు అధిక సంఖ్యలో చేరుతున్నారన్నమాట. ప్రస్తుతం దాదాపు 10 లక్షల మంది వరకు విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉన్నారు. టాప్ టెన్ దేశాలివే.. విదేశీ విద్యార్థుల చేరికకు సంబంధించి ఐఐఈ గణాంకాల ప్రకారం.. గత సంవత్సరం చైనా, భారత్, దక్షిణ కొరియా, కెనడా, వియత్నాం, తైవాన్, సౌదీ అరేబియా, బ్రెజిల్, మెక్సికో, నైజీరియా దేశాలు వరుసగా తొలి పది స్థానాల్లో ఉన్నాయి. ఈ టాప్ టెన్ దేశాల విద్యార్థులే కాకుండా ఇతర దేశాల విద్యార్థులను సైతం అమెరికా విద్యాసంస్థలు ఆకర్షిస్తున్నాయి. 2021–22 సంవత్సరంలో 11వ స్థానంలో ఉన్న జపాన్ నుంచి 14 శాతం పెరుగుదల ఉండగా, చైనా నుంచి 8.6 శాతం తగ్గుదల కనిపించింది. 2023లో జపాన్ విద్యార్థుల సంఖ్యలో 33 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా వేసింది. నైజీరియా నుంచి కూడా అనూహ్యంగా విద్యార్థులు పెరిగినట్లు ఐఐఈ తెలిపింది ఇక సౌదీ అరేబియా నుంచి 17 శాతం మేర విద్యార్థులు తగ్గారు. అయితే 2030 నాటికి ఈ దేశం నుంచి విద్యార్థులు గణనీయంగా పెరగనున్నారు. తర్వాత నేపాల్, బంగ్లాదేశ్ల నుంచి కూడా విద్యార్థుల సంఖ్య పెరిగి ఆ రెండు దేశాలు టాప్ టెన్లో (8, 9 స్థానాల్లోకి)కి రానున్నాయి. ఇంగ్లిష్ మాట్లాడే ఇతర దేశాలకూ విద్యార్థులు విదేశీ విద్యార్థులకు అమెరికానే తొలి ప్రాధాన్యత అయినప్పటికీ..అమెరికాతో పాటు ఆంగ్లం మాట్లాడే ఇతర దేశాలకు కూడా విద్యార్థులు గణనీయ సంఖ్యలో వెళుతున్నారు. ఈ మేరకు ఆమెరికాకు విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్తో పాటు జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్ తదితర దేశాలకు విదేశాల నుంచి విద్యార్థులు వెళ్తున్నారు. ఆయా దేశాలు విదేశీ విద్యార్థులను ఆకట్టుకోవడానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తున్నాయి. – డాక్టర్ ఎస్తేర్ డి బ్రిమ్మర్, ఈడీ, సీఈఓ, నేషనల్ అసోసియేషన్ ఫర్ ఫారిన్ స్టూడెంట్ ఎఫైర్స్ -
డియర్ అచ్చూ కంగ్రాట్స్! మురిసిపోయిన మంత్రి హరీశ్ రావు
సాక్షి, హైదరాబాద్/సిద్దిపేట జోన్: అమెరికాలోని కొలరాడో విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కుమారుడు అర్చిష్మాన్ పట్టభద్రుడయ్యాడు. భారత కాలమానం ప్రకారం గురువారం యూనివర్సిటీలో జరిగిన పట్టా ప్రదానోత్సవంలో అర్చిష్మాన్ సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు. పట్టా ప్రదానోత్సవానికి హాజరైన మంత్రి హరీశ్ రావు తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ‘నా కుమారుడు అర్చిష్మాన్ కొలరాడో యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పట్టాతో పాటు గ్లోబల్ ఎంగేజ్మెంట్ అవార్డును కూడా అందుకున్నాడు’ అని పేర్కొన్నారు. డియర్ అచ్చూ.. కంగ్రాట్స్ అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన కుమారుడి ప్రతిభకు గర్వపడుతునట్టు ట్విట్టర్లో పేర్కొన్నారు. భవిష్యత్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని హరీశ్ ఆకాంక్షించారు. I am ecstatic to announce my son @tarchishman graduation 🎓 in Civil Engineering from University of Colorado at Boulder and also recipient of the Global Engagement Award! I couldn't be more proud of his remarkable achievement, which is a testament to his perseverance and passion… pic.twitter.com/Ecw8yPVgM9 — Harish Rao Thanneeru (@BRSHarish) May 12, 2023 -
CM Jagan Tweet: డియర్ హర్ష.. గర్వంగా ఉంది
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన కుమార్తె హర్ష గ్రాడ్యుయేషన్ పూర్తిచేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్యారిస్లో జరిగిన ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కుమార్తెపై తనకున్న ప్రేమను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ ట్వీట్కు గ్రాడ్యుయేషన్ పట్టాతో ఉన్న హర్షతో సతీసమేతంగా దిగిన తన ఫొటోను సీఎం జతచేశారు. అంతేకాక.. ‘‘డియర్ హర్ష.. నీ అద్భుతమైన ఎదుగుదలను చూస్తే ఎంతో గర్వంగా ఉంది. నీకు ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ మెండుగా ఉంటాయి. ఈరోజు ఇన్సీడ్ ((INSEAD) బిజినెస్ స్కూల్ నుంచి డిస్టింక్షన్లో పాస్ కావడమే కాకుండా డీన్స్ లిస్ట్లో నీ పేరు చూసి గర్వపడుతున్నాను. భవిష్యత్తులో భగవంతుడు నీకు అన్ని విధాలుగా తోడుగా నిలవాలని కోరుకుంటున్నా’’.. అంటూ జగన్ ట్వీట్ చేశారు. Dear Harsha, it’s been a wonderful journey watching you grow up. God has been abundantly gracious. Today I’m proud to see you graduate from INSEAD with distinction and on the Dean’s list. Wishing you God’s very best! pic.twitter.com/7FuZcXp4uT — YS Jagan Mohan Reddy (@ysjagan) July 2, 2022 చదవండి: (CM YS Jagan: ఆదోని పర్యటనకు సీఎం జగన్) -
CM YS Jagan: సీఎం జగన్ పారిస్కు పయనం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పారిస్కు బయలుదేరారు. తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో పారిస్ బయలుదేరారు. బుధవారం ఉదయం 5.10 గంటలకు పారిస్ చేరుకుంటారు. అక్కడ తన కుమార్తె గ్రాడ్యుయేషన్ కాన్వొకేషన్ వేడుకలో పాల్గొననున్నారు. తిరిగి జూలై 2న సాయంత్రం 4 గంటలకు పారిస్లో బయలుదేరి, 3వ తేదీ ఉదయం 6.45 గంటలకు గన్నవరం చేరుకుంటారు. చదవండి: (ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో 3 లక్షల మందికి కొత్త పింఛన్లు) -
వీఎస్యూ లోగిలి.. ఆనందాల కేళి
నెల్లూరు (అర్బన్): కొత్తకొత్త స్కిల్ డెవలప్మెంట్, రీసెర్చ్, ఉపాధి కోర్సులను ప్రవేశ పెడుతూ నాణ్యమైన విద్య, ఉద్యోగాల కల్పనకు కేంద్ర బిందువుగా మారి జిల్లాకే ప్రతిష్టాత్మకమైన విక్రమసింహపురి యూనివర్సిటీలో మంగళవారం స్నాతకోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. వెంకటాచలం మండలం కాకుటూరులోని యూనివర్సిటీ ప్రాంగణంలో 6, 7వ స్నాతకోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వర్సిటీ ఛాన్సలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్య అతిథిగా హైదరాబాద్కు చెందిన మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డీఎన్రెడ్డి హాజరయ్యారు. ప్రపంచీకరణకు అనుగుణంగా నైపుణ్యం మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డీఎన్రెడ్డి మాట్లాడుతూ ప్రపంచీకరణతో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నేటి యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, అప్పుడే ప్రపంచంలో ఎక్కడైనా రాణించగలరన్నారు. విక్రమ సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జీఎం సుందరవల్లి మాట్లాడుతూ వర్సిటీ పరంగా సాధించిన ప్రగతిని వివరించారు. నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేసిన ఆచార్యులను అభినందించారు. రవీంద్ర సన్నారెడ్డికి గౌరవ డాక్టరేట్ శ్రీసిటీ సృష్టికర్త, మేనేజింగ్ డైరెక్టర్గా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న రవీంద్ర సన్నారెడ్డికి విక్రమసింహపురి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ డాక్టరేట్ను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ తాను చిట్టమూరు మండలంలోని ఓ చిన్న పల్లెటూళ్లో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని కష్టపడి పైకి వచ్చానన్నారు. నేటి విద్యార్థులు కష్టపడితే ఏదైనా సాధించవచ్చన్నారు. ముగిసిన పర్యటన నెల్లూరు (క్రైమ్): అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పర్యటన ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం గవర్నర్ ప్రత్యేక హెలికాప్టర్లో గన్నవరం నుంచి బయలుదేరి విక్రమసింహపురి యూనివర్సిటీలోని హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడ స్నాతకోత్సవంలో పాల్గొన్న అనంతరం రోడ్డు మార్గాన పొదలకూరురోడ్డులోని కేన్సర్ హాస్పిటల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి పోలీసు కవాతుమైదానంలో హెలిప్యాడ్ నుంచి విజయవాడుకు బయలుదేరారు. దేశాభివృద్ధికి నూతన ఆవిష్కరణలు కీలకం : గవర్నర్ వీఎస్యూ చాన్సలర్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ దేశాభివృద్ధికి యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణ జరగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. గాంధీ మహాత్ముడితో పాటు ఎంతో మంది త్యాగధనులు తమ ప్రాణాలు పణంగా పెట్టి స్వాతంత్య్రం సాధించారన్నారు. గాంధీజీ పిలుపు క్విట్ ఇండియా ఉద్యమంలో లక్షలాది మంది యువత పాల్గొన్నారన్నారు. ఇలాంటి స్వాతంత్య్రయోధులను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ప్రపంచంలో భారత్ ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్న దేశమన్నారు. దేశాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేసేందుకు, సమాజ ప్రగతి కోసం, మాతృభూమి గొప్ప తనం కోసం విద్యార్థులు పాటు పడాలన్నారు. అందుకు విద్య చక్కటి మార్గమన్నారు. విద్యార్థులు పట్టా అందుకోవడం జీవితంలో మధుర జ్ఞాపకమన్నారు. గ్రాడ్యుయేట్ అయిన ప్రతి విద్యార్థి ప్రయాణంలో కాన్వొకేషన్ ఒక మైలు రాయి అన్నారు. మానవత్వం మెలగడానికి ప్రాథమిక విలువలు విధిగా పాటించాలన్నారు. నూతన జాతీయ విద్యావిధానం 2020కి అనుగుణంగా అన్ని ప్రోగ్రాంల పాఠ్యాంశాలను ప్రభుత్వం సవరించిందన్నారు. 2025 నాటికి 1.20 కోట్ల మంది నైపుణ్యం ఉన్న యువత అవసరమన్నారు. అందుకనుగుణంగా యూనివర్సిటీలు విద్యార్థులను నైపుణ్య వంతులుగా తీర్చిదిద్దాలని కోరారు. గోల్డ్ మెడల్స్, డిగ్రీ పట్టాలు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. గోల్డ్ మెడల్స్, డిగ్రీ పట్టాలు అందజేత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా అత్యధిక మార్కులు సాధించి గ్రాడ్యుయేట్, పోస్ట్గ్రాడ్యుయేట్, రీసెర్చ్ స్కాలర్స్గా పట్టాలు పొందిన 18 మందికి 26 గోల్డ్ మెడల్స్, కాన్వొకేషన్ పట్టాలు అందించారు. వీరితో మరో 250 మంది గ్రాడ్యుయేట్, పోస్ట్గ్రాడ్యుయేట్కు పట్టాలు అందించా రు. 1. పెనుమాల మనీషా, 2.దారా మాధవి, 3. ఎర్రగుడ్ల శ్రావ్యసుహిత్, 4. కారుమంచి వాసవి, 5. మూర్తి లోహిత (మూడు గోల్డ్ మెడల్స్), 6. షేక్ అఫ్సానా (మూడు గోల్డ్ మెడల్స్), 7. టాటా శ్రీనాథ్గౌడ్ (రెండు గోల్డ్ మెడల్స్), 8. పంచకట్ల జ్యోతి (రెండు గోల్డ్ మెడల్స్) 9. దేవరకొండ కల్పన, 10. పోలు అపర్ణ (రెండు గోల్డ్ మెడల్స్), 11. బొరిగి కిరణ్కుమార్, 12. రేవిల్ల వర్షిణి సాయిమమత, 13.తన్నీరు మల్లిక, 14. షేక్ ఫజులున్, 15. పోలిరెడ్డి శ్రీదేవి, 16.పల్నాటి సంధ్య (రెండు గోల్డ్ మెడల్స్), 17. పి.లిల్లీ, 18. గొల్లపల్లి సునీత అందుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎల్.విజయకృష్ణారెడ్డి, గవర్న ర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడి యా, కలెక్టర్ చక్రధర్బాబు, కమ్యూనిటీ డెవలప్మెంట్ చైర్మన్ నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, జేసీ హరేందిరప్రసాద్, నగరపాలక సంస్థ కమిషనర్ జాహ్నవి, అధికారులు, డీన్ లు, అధ్యాపకులు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, రీసెర్చ్ స్కాలర్స్ పాల్గొన్నారు. చదవండి: (ప్రేమ వివాహం.. సాంబశివరావు చెవికొరికి, కర్రలతో దాడి) -
Sociology: సామాజిక శాస్త్రాన్ని అభ్యసించాలి
ప్రపంచంలో భారతదేశానికి ఒక విశిష్టస్థానం ఉండటానికి గల కారణం మనదేశ సంస్కృతి, ఆచార సంప్రదాయాలు, కట్టుబాట్లు, విలువలు, జానపద రీతులు భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉండటమే. వీటి గురించి తెలిపేదే సామాజిక శాస్త్రం (సోషియాలజీ). సమాజ పరిణామ దశలనూ, సమాజంలోని మానవ సంబంధాలనూ, సమాజ మనుగడనూ; ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక అంశాలనూ ఇది వివరిస్తుంది. సమాజ మనుగడ సక్రమంగా, సరైన రీతిలో కొనసాగాలంటే సమాజం లోని అంతర్గత సంబంధాలు, సంస్కృతీ కరణ, సామాజికీకరణ, స్తరీకరణ ఏవిధంగా ఉండాలో తెలుపుతుంది. ప్రపంచీకరణలో భాగంగా జరిగే పాశ్చాత్యీకరణ మూలంగా క్రమేణా మన దేశంలో ఆచార సాంప్రదాయాలు, సంస్కృతి మార్పులకు గురవుతున్నాయి. అందులో భాగంగానే విద్యావ్యవస్థలో సైతం సమాజ శాస్త్రానికి క్రమంగా గుర్తింపు కరవవుతోంది. ఇంటర్, డిగ్రీ స్థాయిల్లో సామాజిక శాస్త్రం ఒక సబ్జెక్టుగా దాదాపు కనుమరుగై పోయింది. కేవలం కొన్ని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుగానే ఇది అందుబాటులో ఉంది. (క్లిక్: 124–ఏ సెక్షన్ను ఎందుకు రద్దు చేయాలి?) గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు రకాల అంశాలను అధ్యయనం చేయడానికి సామాజిక శాస్త్రం తోడ్పడుతుంది. మానసిక రోగులను పరిరక్షించడానికీ తోడ్పడుతుంది. అంటే ప్రతి వైద్యశాలలో ఒక సామాజికశాస్త్ర నిపుణుడు ఉండాల్సిన అవసరం లేక పోలేదు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల్లో ఈ కోర్సును ప్రవేశ పెట్టి, సమాజం గురించి సమగ్రంగా తెలుసుకునే వీలు కల్పిస్తూ, చదివిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంది. (క్లిక్: ఒక కొత్త వ్యవస్థ అవసరం) – డాక్టర్ పోలం సైదులు ముదిరాజ్ తిరుమలగిరి, నాగర్ కర్నూల్ జిల్లా -
వలస కార్మికుల ఆశలు ఆవిరి
మోర్తాడ్ (బాల్కొండ): విదేశీ వలస కార్మికుల సంఖ్యను తగ్గించుకునే విషయంలో మొదట వెనక్కి తగ్గిన కువైట్ ప్రభుత్వం మళ్లీ చర్యలు తీసుకుంటోంది. డిగ్రీ పట్టా లేని 60 ఏళ్ల వయసు నిండిన విదేశీ వలస కార్మికుల వీసాల రెన్యువల్కు సానుకూలత తెలిపిన కువైట్ ప్రభుత్వం అంతలోనే మనసు మార్చుకుంది. తమ దేశంలో ఉన్న విదేశీ వలస కార్మికులలో 60 ఏళ్ల వయసు నిండినవారికి డిగ్రీ పట్టా లేకుంటే వారిని సొంత గడ్డకు పంపించాలని 2020 డిసెంబర్లో కువైట్ విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంది. తర్వాత ఈ నిబంధనను అమలు చేస్తే తమ దేశంలోని వివిధ కంపెనీలలో ఉన్న ఎంతో మంది నిపుణులను కోల్పోవలసి వస్తుందని భావించిన కువైట్ సడలింపులు ఇచ్చింది. దీని ప్రకారం 250 దినార్లు అంటే మన కరెన్సీలో రూ.60 వేల వరకు ఫీజును చెల్లించి 60 ఏళ్లు పైబడిన వలస కార్మికులు వీసాను రెన్యువల్ చేసుకోవచ్చని సూచించింది. దీంతో ఈ కేటగిరీలోని కార్మికులు కాస్త ఊరట చెందారు. సీనియారిటీ ఉన్న వలస కార్మికులకు రూ.50 వేలకు మించి వేతనాలు ఉన్నాయి. కువైట్ ప్రభుత్వం సూచించిన ఫీజు చెల్లిస్తే నెల నుంచి 40 రోజుల వేతనం ఖర్చు చేస్తే సరిపోతుందని వలస కార్మికులు భావించారు. కువైట్లోని ఆయిల్ కంపెనీలు, కన్స్ట్రక్షన్ కంపెనీలు, మాల్స్ ఇలా ఎన్నో రంగాల్లో 1.75 లక్షల మంది వరకు తెలంగాణకు చెందిన వలస కార్మికులు ఉంటారని అంచనా. ఇందులో డిగ్రీ పట్టా లేని 60 ఏళ్ల వయసు నిండిన వలస కార్మికుల సంఖ్య 30 వేల వరకు ఉంటుంది. కువైట్ ప్రభుత్వం ఇప్పుడు వీసాలను రెన్యువల్ చేయకపోవడంతో వీసా గడువు ముగిసిన వారు ఇంటికి చేరుకోవాల్సి వస్తోంది. చదవండి: విదేశాల్లో వైద్య విద్యకు ఎన్ఎంసీ కఠిన నిబంధనలు -
మన స్టార్ హీరోహీరోయిన్లు ఏం చదివారో తెలుసా?
సినీ పరిశ్రమలో స్టార్ హీరోహీరోయన్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. తమ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని పరిశ్రమలో ఓ వెలుగువెలుగుతున్నారు. చదువుతో సంబంధం లేకుండా స్టార్లుగా ఎదిగిన మన హీరోహీరోయిన్లు ఏం చదివారనేది తెలుకోవాలని అందరికి ఆసక్తిగా ఉంటుంది. అయితే ఈ పరిశ్రమలో రాణించాలంటే చదవును పక్కన పెట్టాలనేది ప్రతిఒక్కరి ఉద్దేశం. అయితే మన స్టార్లలో చదువును మధ్యలో ఆపేసి పరిశ్రమలో సెటిలైయిపోయిన వారు కొందరు ఉంటే డిగ్రీ పట్టాలు పుచ్చుకుని ఇండస్ట్రీలో స్టార్లుగా ఎదిగిన వారున్నారు. మరీ మన స్టార్ హీరోహీరోయిన్లు ఏఏ డిగ్రీలో పట్టాలు తీసుకున్నారో ఇక్కడ ఓ లుక్కేయండి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రాలతో పాన్ ఇండియా నటుడిగా మారిన ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఈశ్వర్ మూవీతో హీరోగా వెండితెరకు పరిచయమైన ప్రభాస్ హైదరాబాద్లో నలంద కాలేజీలో ఇంటర్మిడియట్ చదివాడు. అనంతరం హైదరాబాద్లోని శ్రీచైతన్య కాలేజీ నుంచి బీటేక్లో డిగ్రీ పట్టా పొందాడు. అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్గా టాలీవుడ్లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ గంగోత్రి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దీనికంటే ముందు మేనమామ మెగాస్టార్ చిరంజీవి డాడీ చిత్రంలో నటుడిగా పరిచమైన ఈ ఐకాన్ స్టార్ చెన్నైలోని ఎంఎస్ఆర్ కాలేజీ నుంచి బ్యాచ్లర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) పూర్తి చేశాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరో కృష్ణ ఘట్టమనేని వారసుడిగా, బాలనటుడిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు చెన్నైలోని లయోలా కాలేజీలో బ్యాచిలర్ ఆప్ కామర్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత హీరోగా మారి టాలీవుడ్లో సూపర్ స్టార్గా ఎదిగాడు. నాగార్జున్ అక్కినేని అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చి దక్షిణాదిలో వన్ ఆఫ్ ది లీడ్ యాక్టర్గా మారిపోయాడు నాగార్జున. అయితే నాగార్జున నటనకు ముందు అమెరికాలో జాబ్ చేసిన సంగతి తెలిసిందే. అమోరికాలోని మిచిగాన్ యూనివర్శిటీలో ఆటోమొబైల్ ఇంజినీరింగ్లో గ్రాడ్యుమేషన్ పూర్తి చేశాడు. కాజల్ అగర్వాల్ లక్ష్మీ కళ్యాణం మూవీతో తెలుగు తెరపై మెరిసింది కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్. ఆ తర్వాత వెంటనే చందమామ, మగధీర వంటి చిత్రాల్లో నటించి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన కాజల్ ముంబైలోని కేసీ కాలేజీ నుంచి మాస్ మీడియాలో మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ స్పెషలైజేషన్లో డిగ్రీ పూర్తి చేసింది. శ్రుతీ హాసన్ విలక్షణ నటుడు కమల్ హాసన్ నట వారసురాలిగా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రుతి హాసన్. ఆ తర్వాత నటిగా, గాయనీగా, మ్యూజిక్ కంపోజర్గా ఇక్కడ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న శ్రుతి ముంబైలోని సెయింట్ ఆండ్రీవ్ కాలేజీ నుంచి సైకాలజీలో పట్టా అందుకుంది. సాయి పల్లవి తెలుగు, తమిళ, మలయాళంలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సాయి పల్లవి నటనకు ముందు జార్జియాలోని బిలిసి మెడికల్ స్టేట్ యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆ తర్వాత కొంతకాలం ట్రైనీ డాక్టర్ కూడా ఆమె పనిచేసింది. రకుల్ ప్రీత్ సింగ్ అటూ బాలీవుడ్, ఇటూ టాలీవుడ్లో హీరోయిన్గా సత్తా చాటుతోన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ యూనివర్సిటీ సంబంధించిన జీసస్ అండ్ మేరీ కాలేజీ నుంచి మేథమెటిక్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. దుల్కర్ సల్మాన్ మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేశాడు. పర్డ్యూ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్న దుల్కర్ సల్మాన్ సినిమాల్లోకి రాకముందు బిజినెస్ మేనేజర్గా పనిచేశాడు. -
ఆనందంలో మలాలా కుటుంబ సభ్యులు
నోబెల్ శాంతి బహుమతి గ్రహిత, పాకిస్తాన్కు చెందిన మలాలా యూసఫ్ జాయ్ సంబరాల్లో మునిగిపోయారు. ప్రఖ్యాత ఆక్స్ఫర్ట్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసిన ఫొటోలను కూడా షేర్ చేశారు. ‘హ్యాపీ గ్రాడ్యుయేషన్ మలాలా’ అని రాసి ఉన్న కేక్ను కట్ చేశారు. ‘నేను ఆక్స్ఫర్డ్లో నా ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ డిగ్రీ పూర్తిచేశాను. దీనిపై నా ఆనందాన్ని, కృతజ్ఞతను తెలుపడానికి మాటలు రావడం లేదు. ఇక ముందు ఏం జరుగుతుందో నాకు తెలియదు. ప్రస్తుతానికి నెట్ఫ్లిక్స్, పుస్తకాలు చదవడం, నిద్ర పోవడం ఇదే నా పని’ అని మలాలా పేర్కొన్నారు. కాగా, బాలికల విద్య కోసం పోరాడిన మలాలా.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. పాకిస్తాన్లో బాలికలను పాఠశాలల్లోకి అనుమతించాలని మలాలా ప్రచారం చేయడంతో.. 2012లో ఆమె ప్రయాణిస్తున్న స్కూలు బస్సుపై మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆమె గాయపడ్డారు. ఈ క్రమంలోనే మలాలా సేవకు గుర్తింపుగా 2014లో ఆమెను నోబెల్ శాంతి బహుమతి వరించిన విషయం తెలిసిందే. (చదవండి : ఆ దేశంలో టెలిగ్రామ్పై నిషేధం ఎత్తివేత!) Hard to express my joy and gratitude right now as I completed my Philosophy, Politics and Economics degree at Oxford. I don’t know what’s ahead. For now, it will be Netflix, reading and sleep. 😴 pic.twitter.com/AUxN55cUAf — Malala (@Malala) June 19, 2020 -
ఆనందంలో బచ్చన్ ఫ్యామిలీ
బిగ్బీ అమితాబ్ బచ్చన్ మనువరాలు నవ్య నవేలి నందా పట్టభద్రురాలైంది. న్యూయార్క్లోని ఫోర్డ్హమ్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ పూర్తిచేసింది. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. మనువరాలు పట్టభద్రరాలైన సందర్భంగా బిగ్బీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టారు. "నవ్య..ప్రతీ విద్యార్థి జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు గ్రాడ్యుయేషన్ డే. లాక్డౌన్ కారణంగా ఈవెంట్ క్యాన్సల్ అయిపోయింది. కానీ బాధపడకు. నిన్ను సంతోషపెట్టేందుకు మేమందరం నీతో పాటే ఉన్నాం. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాం. గాడ్ బ్లస్ యూ నవ్య "..అంటూ పోస్ట్ చేశారు. (రెండు రోజుల పని ఒక రోజులోనే పూర్తి: అమితాబ్ ) View this post on Instagram Grand daughter Navya .. the most important day in the life of a young student - Graduation Day .. ! She graduated from College in New York, but ceremony and presence got cancelled because of Corona and lockdown .. she could not go .. we too had all planned to be with her on this important occasion .. BUT .. she though wanted to wear that Graduation gown and Cap .. so staff stitched her an impromptu gown and cap .. and she wore it and celebrated at home in Jalsa .. So proud of you NAVYA .. god bless .. such a positive and happy attitude .. LOVE YOU💕💕💕💕 A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on May 6, 2020 at 7:22am PDT దీంతో పలువరు ప్రముఖులతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ఇక మేనకోడలు గ్రాడ్యుయేట్ కావడం పట్ల అభిషేక్ బచ్చన్ ఆనందం వ్యక్తం చేశారు. కంగ్రాట్స్ నవ్య అంటూ పోస్ట్ చేశారు. ఇక లాక్డౌన్ కారణంగా గ్రాడ్యేయేషన్ వేడుకకు వెళ్లలేని కారణంగా మనువరాలు నవ్య కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన డ్రెస్లో నవ్య ఫోటోలకు ఫోజులిస్తూ ఆనందంగా కనిపించింది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త నిఖిల్ నందా, శ్వేతా బచ్చన్ నందా మొదటి సంతానమే నవ్య నందా. -
మన మట్టిలోనే ఉంది
కుమారి పుట్టింది కేరళలోని రామమంగళం. మధ్య తరగతి కుటుంబం. తల్లిదండ్రులు వ్యవసాయదారులు. అక్షరం జీవితాన్ని వెలిగిస్తుందని నమ్మారు. పిల్లలిద్దరినీ చదివించి తీరాలనుకున్నారు. కుమారి, ఆమె తమ్ముడు.. ఇద్దరూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కుమారి... అమ్మానాన్నల పెద్ద బిడ్డ కావడంతో ఆ ఇద్దరిలో ముందుగా గ్రాడ్యుయేట్ అయ్యారు. అయితే ఆ రికార్డు ఆ ఇంటికి మాత్రమే పరిమితం కాలేదు. ఊరంతటికీ రికార్డే. కేరళ అక్షరాస్యతలో ముందున్నప్పటికీ... అప్పటివరకు ఆ ఊర్లో పట్టభద్రులైన వాళ్లు లేరు. కుమారి ఆ రికార్డును బ్రేక్ చేశారు. ఆమె ఆ చదువుతో తన కుటుంబ జీవితాన్ని నిర్మించుకుని అక్కడితో గిరిగీసుకుని ఉండి ఉంటే ఆమె గురించి ఇంతగా చెప్పుకోవడానికి ఏమీ ఉండేది కాదేమో. ఆమె తన గ్రామంలో తర్వాతి తరం పిల్లలందరినీ గ్రాడ్యుయేట్లను చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఇప్పటికి ఆ సంఖ్య వెయ్యి దాటింది. అత్తగారి మద్దతు కుమారి పెళ్లి శిబులాల్తో జరిగింది. అతడు ఇన్ఫోసిస్లో సీఈవో హోదాలో ఉన్నాడు. పెళ్లితో కేరళ వదిలి ముంబయి, ఆ తర్వాత యూఎస్కు వెళ్లారు కుమారి. కొన్నేళ్ల తర్వాత 1997లో కుటుంబంతో సహా ఇండియాకి తిరిగి వచ్చారామె. ఆమె చేయదలుచుకున్న విద్యాసేవకు అత్తగారి కుటుంబం సంపూర్ణంగా మద్దతునిచ్చింది. కుమారి 1999లో సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ (ఎస్డీఎఫ్), 2004లో అద్వైత్ ఫౌండేషన్ స్థాపించారు. హైస్కూల్ పూర్తయిన పిల్లలందరూ జూనియర్ కాలేజ్లో చేరేలా చూడడం, ఇంటర్ పూర్తయిన తర్వాత విధిగా గ్రాడ్యుయేషన్లో చేర్పించడం ఆమె తలకెత్తుకున్న బాధ్యత. పిల్లల వయసుల వారీగా విద్యాదాన్, విద్యారక్షక్, అద్వైత్ ఫౌండేషన్, అంకుర్ ఫౌండేషన్లను స్థాపించి వాటిని సంయుక్తంగా నిర్వహిస్తున్నారామె. అందరికీ తెలియాలి ‘‘పరోపకారంలో భారతదేశ సంస్కృతి మహోన్నతమైనది. అయినప్పటికీ గత ఏడాది 128 దేశాల వరల్డ్ గివింగ్ ఇండెక్స్ ర్యాంకులో భారతదేశానికి దక్కింది 82 స్థానం. ఇందుకు కారణం భారతదేశంలో, భారతీయుల్లో ఎదుటి వారికి ఇచ్చే గుణం లేదని కాదు. పరోపకారాలు పైకి తెలియకపోవడమే. ఎదుటి వ్యక్తి అవసరంలో ఉన్నట్లు గమనించినప్పుడు తమకు తోచిన సహాయం చేసేస్తారు. అంతేతప్ప ఒకరికి సహాయం చేయడానికి లెక్కలు, రిజిస్టర్లు మెయింటెయిన్ చేయరు. పరోపకారం చేసిన విషయానికి ప్రచారం కల్పించుకోకపోవడం, డాక్యుమెంట్లు తయారు చేసుకోలేకపోవడం, వాటిని ఇలాంటి పోటీలకు దరఖాస్తు చేసుకోకపోవడం వల్ల గణాంకాల ఆధారంగా వచ్చే ర్యాంకులలో పై స్థానాలకు చేరుకోవడం భారతదేశానికి కష్టమవుతోంది. నిజానికి భారతీయుల్లో సహాయం చేసేగుణం మెండు’’ అని చెప్పారు కుమారి. తమ కుటుంబం ఆర్థికంగా వెనుకపడిన కుటుంబాల పిల్లల ఉన్నత చదువుల కోసం చేస్తున్న సహాయాన్ని వివరిస్తూ... ‘‘ఇలాంటి కుటుంబాలు మనదేశంలో చాలానే ఉన్నాయి. ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చదివిస్తున్నామంటే అది ఆ ఒక్కరికి లేదా ఆ కుటుంబానికి మాత్రమే చేస్తున్న సహాయం కాదు. దేశానికి మనవంతుగా ఇస్తున్న సహకారం’’ అన్నారామె. – మంజీర -
‘ఇంటరే పాస్ అయ్యాడు.. ప్రధానిగా పనికి రాడు’
న్యూఢిల్లీ : గత ఎన్నికల్లో కేవలం ఇంటర్ పాస్ అయిన వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకున్నారు. కానీ ఈ సారి మాత్రం అలాంటి తప్పు చేయకండంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలను కోరారు. ఢిల్లీలో నిర్వహించిన విపక్షాల ర్యాలీలో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ యూనివర్సిటీ డిగ్రీ వివాదాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘గతంలో కేవలం ఇంటర్మీడియెట్ పాస్ అయిన వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకున్నారు. ఎలాంటి కాగితాల మీద సంతకం పెడుతున్నాడో.. ఏం నిర్ణయం తీసుకుంటున్నాడో అతనికి అర్థం కావడం లేదు. ప్రస్తుతం దేశంలో వనరులు పుష్కలంగా ఉన్నాయి. వాటిని సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవాలంటే విద్యావంతుడైన ప్రధాని కావాలి. అందుకే ఈ సారి ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయండి’ అని ప్రజలను కోరారు. అంతేకాక గతంలో మాదిరిగానే ఇంటర్ పాస్ అయిన వ్యక్తిని మరోసారి ప్రధానిగా ఎన్నుకోవద్దని తెలిపారు. అతను నియంతలా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నాడు అంటూ మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా సమర్థించారు. -
విద్యార్థిని గర్భవతి అయిందని..!
అమెరికాలోని మేరిల్యాండ్లో గర్భవతి అయిన ఓ విద్యార్థినిని స్నాతకోత్సవ వేడుకకు హాజరుకాకుండా నిషేధించడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ఈ విషయమై ప్రజల నుంచి, జాతీయ అబార్షన్ వ్యతిరేక సంఘాల నుంచి ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా.. వచ్చేవారం జరగనున్న స్నాతకోత్సవానికి సదరు విద్యార్థిని అనుమతించరాదన్న తన నిర్ణయంపై మేరిల్యాండ్ హాజర్స్టౌన్లోని హెరిటేజ్ అకాడమీ వెనుకకు తగ్గడం లేదు. సీనియర్ విద్యార్థిని అయిన మ్యాడీ రంక్లెస్ లైంగిక కలాపాల్లో పాల్గొనడం ద్వారా తమ పాఠశాల నిబంధనలను ఉల్లంఘించిందని, అందుకే సహ విద్యార్థులతోపాటు ఆమెకు స్నాతకోత్సవ వేదికపై డిప్లోమా పట్టా అందజేయడం లేదని పేర్కొంది. ఆమె గర్భవతి అయినందుకు కాదు.. కానీ అనైతిక చర్యల్లో పాల్గొన్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తల్లిదండ్రులకు స్కూల్ ప్రిన్సిపాల్ డేవిడ్ హాబ్స్ రాసిన లేఖలో పేర్కొన్నారు. 18 ఏళ్ల రంక్లెస్ 2009 నుంచి హెరిటేజ్ అకాడమీ స్కూల్లో చదువుతున్నది. గత జనవరిలో ఆమె గర్భవతి అని తేలింది. అప్పట్లో ఆమె తండ్రి స్కూల్ బోర్డు మెంబర్గా ఉండేవారు. మొదట ఆమెను స్కూల్ నుంచి బహిష్కరిస్తామని, విద్యార్థి కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తామని పాఠశాల యాజమాన్యం హెచ్చరించింది. ఏడాదిపాటు ఇంటివద్దే ఉండి చదుకోవాలని చెప్పింది. అయితే, తల్లిదండ్రులు విజ్ఞప్తి చేయడంతో 14మంది తోటి విద్యార్థులతో కలిసి ఆమె కూడా తరగతులకు హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, తోటి విద్యార్థుల తరహాలో ఆమె కూడా స్నాతకోత్సవ వేడుకలో డిప్లమా పట్టా అందుకోవడానికి పాఠశాల అనుమతించకపోవడాన్ని తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు. స్కూలు యాజమాన్యం నిర్ణయం సరైనది కాదని అంటున్నారు. వారికి అమెరికాలోని హక్కుల సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. -
తీరని కోరిక అంటున్న హీరోయిన్!
చిన్పప్పుడు స్కూలుకు వెళ్లాలంటే పిల్లలు ఎవరైనా కాస్త బద్దకంగా కనిపిస్తారు. అదే కాస్త అలవాటు పడితే వారే స్కూలు జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇందుకు సెలబ్రిటీలు కూడా అతీతులు కాదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ముక్కుసూటిగా మాట్లాడుతుందన్న పేరు కూడా సోనమ్ సొంతం. తాను అనుకున్న విషయంపై నేరుగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే కొంత మంది హీరోయిన్లలో సోనమ్ ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెలబ్రిటీలకు కూడా చదువు కష్టాలు తప్పవని బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ అంటోంది. తన జీవితంలో ఇప్పటివరకూ తీరని కోరికల గురించి సోనమ్ మీడియాతో కొన్ని విషయాలు పంచుకుంది. ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో చేయలేకపోయానే అనే వెలితి ఉంటుంది కదా.. తనకు కూడా అలాంటి విషయం ఒకటుందని సోనమ్ చెప్పింది. చదువు తనకు సమస్యగా మారిందని అభిప్రాయపడింది. కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలన్నది తన కల అని, అయితే ఇంటర్ తర్వాత చదువు సాగలేదని వివరించింది. యూనివర్సిటీకి వెళ్లి కనీసం గ్రాడ్యుయేషన్ ఐనా పూర్తి చేయాలని ప్రస్తుతం ఆ పనిలో ఉన్నానని ముప్పై ఏళ్ల సోనమ్ చెప్పుకొచ్చింది. అయినా తనకు అప్పుడే వయసు మించిపోలేదంటూ చిన్నగా నవ్వేసింది సోనమ్. -
వేమన బిడ్డలకు పట్టాలు
♦ నేడు వైవీయూ స్నాతకోత్సవం ♦ 31 మందికి డాక్టరేట్లు ♦ 45 మందికి గోల్డ్మెడల్స్ ♦ భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన అధికారి ♦ వీఎస్. సంపత్ రాక వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహిస్తున్న స్నాతకోత్సవంలో 31మంది పరిశోధక విద్యార్థులు డాక్టరేట్ పట్టా అందుకోనున్నారు. వీరితో పాటు వివిధ సబ్జెక్టుల్లో ప్రథములుగా నిలిచిన 100 మంది విద్యార్థులు గోల్డ్మెడల్కు అర్హత సాధించారు. అయితే వీరిలో 45 మంది స్నాతకోత్సవంలో అతిథుల చేతులమీదుగా బంగారు పతకం అందుకోనున్నారు. మిగతా 55 మంది తర్వాత తీసుకోనున్నారు. అదేవిధంగా డిగ్రీ, పీజీ పూర్తయిన విద్యార్థులు పట్టాలు తీసుకునేందుకు 8,507 మంది దరఖాస్తు చేయగా వీరిలో 780 మంది అతిథులు చేతులమీదుగా అందుకోనున్నారు. మిగతా 7,727 మంది తర్వాత పట్టాలు అందుకుంటారు. 2, 3, 4, 5వ స్నాతకోత్సవాలకు సంబంధించి వివిధ సంవత్సరాల్లో ప్రథములుగా నిలిచి పతకాలు సాధించిన విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి. సైన్స్ విభాగం ఎమ్మెస్సీ (బోటనీ) : జి.విజయలక్ష్మి (2010-12), కె.సురేష్బాబు (2011-13), ఎ.రెడ్డి హిమబిందు (2012-14), పి.సునంద (2013-15). ఎమ్మెస్సీ (బయో కెమిస్ట్రీ) : వి.శ్రీదేవి (2010-12), ఇంద్రకంటి షర్వాణి (2011-13), డి.సుశీలమ్మ (2012-14), పి.నవీన్ (2013-15). ఎమ్మెస్సీ (బయో టెక్నాలజీ) : పి.సాయిగిరీష (2010-12), కె.గురులక్ష్మి (2011-13), పి.వినయ (2012-14), జి.మల్లికార్జున (2013-15). ఎమ్మెస్సీ (బయో టెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మాటిక్స్) : కె.విష్ణుప్రియ (2007-12), ఎం.సూర్యప్రకాశ్రెడ్డి (2008-13), ఎం.సరస్వతి (2009-14), ఎప్రసన్నబాబు (2010-15). ఎమ్మెస్సీ (జెనిటిక్స్ అండ్ జీనోమిక్స్): ఎన్ఏ సోమయాజులు (2010-12), జి.శివకుమార్ (2011-13), పి.సుబ్బలక్షుమ్మ (2012-14), ఎం.మధుసూదన్ (2013-15). ఎమ్మెస్సీ (జియాలజీ) : బి.లక్ష్మన్న (2010-12), ఆర్.సిద్దిరాజు (2011-13), ఎం.రాజశేఖర్ (2012-14), వై.సుదర్శన్రెడ్డి (2013-15). జువాలజీ : కె.సూర్యనారాయణ (2010-12), డి.అనూరాధ (2011-13), పి.శేషుబాబు (2012-14), జి.రాధ (2013-15). ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ): కె.శివజ్యోతి (2010-12), సి.శిరీష (2011-13), జె.లక్ష్మిదేవి (2012-14), జి.అనూష (2013-15). ఎమ్మెస్సీ (మెటీరియల్ సైన్స్ అండ్నానో టెక్నాలజీ) : ఎన్.లక్ష్మిరెడ్డి (2010-12), ఎ.సాయికుమార్ (2011-13), ఏపీ రంగప్ప (2012-14), ఇ.సునంద (2013-15). ఎంఎస్సీ మ్యాథమ్యాటిక్స్ : ఎస్ఏ తబస్సుమ్ (2010-12),వి.సుమలత (2011-13), ఎన్.జీవన సంధ్య (2012-14), ఎస్సునీత (2013-15), ఎస్.మహమ్మద్ (2013-15). ఎంఎస్సీ(ఫిజిక్స్) : బి.సుజిత (2010-12), కె.అమీదాబి (2011-13), ఎం.గురులక్ష్మి (2012-14), ఎస్.సల్మా (2013-15). బీఎస్సీ : జి.జ్యోతి (2010-13), ఎం.రాజేశ్వరి (2011-14), ఎస్.సాగరిక (2012-15). -
డిగ్రీ ఉంటేనే ఓటు
సొంత ఇల్లు ఉన్నా ఓకే... 1934 మొదటి కార్పొరేషన్ సభ్యులు 30 మందే.. 1937 అయ్యంగార్ కమిటీతో మార్పులు 1965 అమల్లోకి మున్సిపాలిటీ చట్టం ► ఇప్పుడు 18 ఏళ్లు నిండితే అందరికీ ఓటు హక్కు... మరి 1934లో... గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారికి మాత్రమే ఆ భాగ్యం... కనీసం సొంత ఇల్లైనా ఉండాలి. ఓటు హక్కు కల్పించినా... ఎక్కువమంది సామాన్యులకు వేసే భాగ్యం దక్కలేదు. ► 1934 లో మొదటి కార్పొరేషన్లో సభ్యులు 30... ఓటర్లు 13 మందిని మాత్రమే ఎన్నుకోవాలి. మరో 13 మందిని జాగీర్ల ప్రతి నిధులుగా, నలుగురిని ప్రభుత్వ తరఫున నామినేట్ చేసేవారు. మొదట్లో కొత్వాల్ చేతుల్లో నగరం పాలన సాగింది. తర్వాత బ్రిటిష్ ఇండియా విధానాల్ని అమలు చేశారు. పారిశుద్ధ్యం, రోడ్ల నిర్వహణ, మున్సిపాలిటీ ముఖ్య బాధ్యతల్ని హెల్త్ ఆఫీసర్లు, మునిసిపల్ ఇంజినీర్లు పర్యవేక్షించేవారు. కమిషనర్ ఎక్స్అఫీషియో సెక్రటరీగా విధులు నిర్వహించేవారు. మౌలికసదుపాయాలు కావాలంటే ప్రజలు ప్రత్యేక పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడది ఆస్తిపన్నుగా వసూలు చేస్తున్నారు. 1934కు ముందు కార్పొరేషన్లో కేవలం 21 మంది మాత్రమే సభ్యులుండేవారు.వీరందరిని నిజాం ప్రభుత్వమే నామినేట్ చేసేది. ప్రస్తుతం నగర్ కార్పొరేషన్లో సభ్యుల సంఖ్య 150 మందికి చేరింది. 1937లో అయ్యంగార్ కమిటీ... ► దీవాన్ బహదూర్ అరవమడ్ సిఫార్సు మేరకు మెరుగైన మున్సిపాలిటీ పాలనకు విధానాలు సూచించాలని నిజాం 1937లో అయ్యంగార్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ‘హైదరాబాద్ మున్సిపాలిటీ అండ్ టౌన్ కమిటీస్ యాక్ట్ (ఏ) ఆఫ్ 1941’ ను రూపొందించింది. ► నగరాన్ని రెండుగా విభజించి.... జనాభా 15 వేలకు పైగా ఉంటే సిటీ మున్సిపాలిటీ, 5 నుంచి 15 వేల వరకైతే టౌన్ మున్సిపాలిటీగా వ్యవహరించేవారు. పురపాలనంలో ప్రజాస్వామ్యం ► 1951లో కార్పొరేషన్ స్వరూపమే పూర్తిగా మారిపోయింది. ప్రజాస్వామ్య విధానాలు అమల్లోకొచ్చాయి. కౌన్సిల్ అధికారాల అమలు, పాలన కోసం ఎగ్జిక్యూటివ్ అధికారిని నియమించారు. పూర్తి స్థాయి మునిసిపాలిటీగా మార్చారు. 1965లో ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ అమల్లోకి వచ్చింది. పురపాలన విభాగాలన్ని ఇందులో చేర్చారు. మొత్తం 391 సెక్షన్లు రూపొందించారు. -
జాక్పాట్ కొట్టేసింది!
గ్లామర్ పాయింట్ విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన రిదిమకు అకాడమీ సినిమాల గురించి మాట్లాడుకునే అవకాశం కంటే అకాడమిక్ పుస్తకాల గురించి మాట్లాడే అవకాశమే ఎక్కువగా వచ్చేది. సినిమాల గురించి మాట్లాడుకున్న సందర్భం కంటే సీరియస్ టాపిక్ల మీద మాట్లాడుకున్న సందర్భాలే ఎక్కువ. న్యూయ్యార్క్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత బుద్ధిగా వాల్స్ట్రీట్లో 9 టు 5 జాబ్లో చేరింది రిదిమ. అయినంత మాత్రాన మనసులో దాగున్న ‘కళ’ ఊరికే ఉంటుందా? అందుకే నెలలు తిరక్కుండానే ఆ ఉద్యోగానికి గుడ్బై చెప్పి తన అభిరుచిని వెదుక్కుంటూ ముంబాయికి వచ్చింది రిదిమ. సినిమాల కంటే ముందు వొడాఫోన్, కోకోకోలా, టైటాన్... మొదలైన యాడ్స్లో నటించింది. అయితే ఇప్పుడు ఆమె జాక్పాట్ కొట్టేసింది అంటున్నారు సినీ విశ్లేషకులు. ఎందుకంటే జోయా అఖ్తర్ ‘దిల్ దడ్కన్’ సినిమాలో నటించే అవకాశం ఆమెకు వచ్చింది. తనకు ‘2015’ బాగా కలిసొచ్చే సంవత్సరం అని రిదిమ నమ్ముతోంది. ఆమె నమ్మకం నిజం కావాలని ఆశిద్దాం. -
రెండు ఉద్యోగాలు.. ఒకటే సన్నద్ధత!
ప్రిపరేషన్ ప్లాన్ ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మొత్తం 2,045 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 1,536 క్లాస్ 3 అసిస్టెంట్ కేడర్ పోస్టులు, 509 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్-1) ఉద్యోగాలు. ఈ రెండూ వేర్వేరు రకాల ఉద్యోగాలైనప్పటికీ నియామకాలకు సంబంధించి నిర్వహించే రాత పరీక్షలోని అంశాలు దాదాపుగా ఒకటే (స్పెషలిస్ట్ స్ట్రీమ్ మినహా). ప్రశ్నల క్లిష్టతలో కొద్దిపాటి తేడా ఉంటుంది. కాబట్టి ఈ రెండు పోస్టులకు ఏక కాలంలో సన్నద్ధం కావచ్చు. ఇందుకు ఉపకరించే మార్గాలు.. ఈ రెండు ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షలో రీజనింగ్, ఇంగ్లిష్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్/ న్యూమరికల్ ఎబిలిటీ అంశాలు ఉమ్మడిగా ఉంటాయి. వీటికి సంబంధించిన అంశాల సమస్యల ను ప్రాక్టీస్ చేయడం అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరీక్షలకు ఉపయోగపడుతుంది. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు మాత్రం సంబంధిత స్పెషలైజేషన్, అసిస్టెంట్ పోస్టులకు కంప్యూటర్ నాలెడ్జ్ విభాగం అదనంగా ఉంటుంది. అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ లేదా ఇంటర్/తత్సమాన పరీక్షలో 60 శాతం (ఎక్స్ సర్వీస్మెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. ఎస్ఎస్సీ/హెచ్ఎస్ఎస్సీ/ఇంటర్మీడియెట్/గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. ప్రాంతీయ భాష తెలిసుండాలి. వయసు: 2014, జూన్ 30 నాటికి 18-30 ఏళ్లు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కు అర్హత: స్పెషలిస్టు ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. జనరలిస్ట్ ఉద్యోగాలకు డిగ్రీ లేదా తత్సమాన అర్హత. వయసు: 2014, అక్టోబర్ 1 నాటికి 21-30 ఏళ్లు. రీజనింగ్: రీజనింగ్లో కోడింగ్-డీకోడింగ్, సీటింగ్ ఆరేంజ్మెంట్, పజిల్స్, బ్లడ్ రిలేషన్స్, డెరైక్షన్స్ తదితర అంశాలుంటాయి. ఇందులోని ప్రశ్నలను సెట్ల రూపంలో (ఇందులో 3 లేదా 5 స్టేట్మెంట్లు ఉంటాయి) అడుగుతారు. ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సమాధానాలు సరైనవి అయితే పూర్తి మార్కులు పొందడం అనుకూలత. బ్లడ్రిలేషన్స్, డెరైక్షన్స్, ఏజ్ వంటి అంశాల నుంచి కూడా ప్రశ్నలు ఇస్తారు. ఆఫీసర్ పరీక్షలో వచ్చే సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్ ప్రశ్నల క్లిష్టత అధికంగా ఉంటుంది. ఇంగ్లిష్: ఇందులో రీడింగ్ కాంప్రెహెన్షన్, వొకాబ్యులరీ, గ్రామర్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, జంబుల్డ్ సెంటెన్సెస్ సంబంధిత అంశాలు ఉంటాయి. రీడింగ్ కాంప్రెహెన్షన్కు సంబంధించి ఇచ్చిన ప్యాసేజ్ను సరిగా చదివి అవగాహన చేసుకోవడమే కీలకం. ప్రశ్నకు సమాధానం ఇచ్చేటప్పుడు రచయిత (ప్యాసేజ్) దృష్టి కోణంలో ఆలోచించడం ప్రయోజనకరం. ఈ విభాగానికి 12-15 మార్కులు ఉండొచ్చు. అసిస్టెంట్ పేపర్లో ఈ విభాగం సులువుగానే ఉంటుంది. జనరల్ అవేర్నెస్: సమకాలీన అంశాలపై అవగాహనను పరీక్షించే విధం గా ఇందులో ప్రశ్నలు ఉంటాయి. నోబెల్ పురస్కార గ్రహీతలు, క్రీడలు-విజేతలు, వార్తల్లో వ్యక్తులు, సదస్సులు-సమావేశాలు వంటి వాటిపై దృష్టి సారించాలి. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల (ప్రధానమంత్రి జనధన్ యోజన వంటివి) గురించి అవగాహన పెంచుకోవడం కీలకం. న్యూమరికల్ ఎబిలిటీ/ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: అసిస్టెంట్ పరీక్షలో ఈ విభాగాన్ని న్యూమరికల్ ఎబిలిటీగా, ఆఫీసర్స్ పరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్గా వ్యవహరిస్తారు. ఈ విభాగంలో సింప్లిఫికేషన్కు ప్రాధాన్యమిస్తారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, మ్యాథమెటికల్ సిరీస్, యావరేజెస్, రేషియో అండ్ ప్రొపోర్షన్, ప్రాఫిట్-లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పెర్ముటేషన్స్- కాంబినేషన్స్, ప్రాబబిలిటీ నుంచి కూడా ప్రశ్నలు ఇస్తారు. ఆఫీసర్ పరీక్షలో డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 10-15 ప్రశ్నలు, డేటా సఫిషియన్సీ నుంచి 5 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కంప్యూటర్ నాలెడ్జ్: ఈ విభాగాన్ని ఇంటర్నెట్, నాన్ ఇంటర్నెట్ అనే రెండు భాగాలుగా విభజించవచ్చు. ఇంటర్నెట్ భాగంలో నెట్వర్క్స్, నూతన సాంకేతిక అంశాలు, వైరస్, యాంటీ వైరస్, ఫైర్వాల్స్, వైరస్ల బారినుంచి కంప్యూటర్ వ్యవస్థను కాపాడటం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. నాన్ ఇంటర్నెట్ భాగానికి సంబంధించి హార్డ్వేర్, ర్యామ్, ఆపరేటింగ్ సిస్టమ్, రిజిస్టర్స్ వంటి అంశాలను చదవాలి. ఆపరేటింగ్ సిస్టమ్స్కు సంబంధించి ఆధిక శాతం ప్రశ్నలు విండోస్ నుంచి ఉంటాయి. గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ కంపెనీల నూతన ఉత్పత్తులు, చైర్మన్లు, సీఈఓల వివరాలపై కూడా అవగాహన పెంచుకోవడం ప్రయోజనకరం. ఎంఎస్ ఆఫీస్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కు సంబంధించి కీ బోర్డ్ షార్ట్కట్స్ తెలిసుండాలి. గమనిక: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ పరీక్షకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు గడువు ముగిసింది. అసిస్టెంట్ పోస్టులకు చివరి తేదీ నవంబర్ 10, 2014. వెబ్సైట్: www.newindia.co.in - కె.వి.జ్ఞానకుమార్, డెరైక్టర్, డీబీఎస్, హైదరాబాద్. ఆర్ఆర్సీ గ్రూప్ -డి ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్టులు హైదరాబాద్: సౌత్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నవంబర్ 9, 16, 23, 30 తేదీల్లో గ్రూప్ డి పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించనుంది. ఆఫ్లైన్ (పేపర్ బేస్ట్)లో జరిగే ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. సమయం 90 నిమిషాలు. ఈ తరుణంలో గ్రూప్-డి పరీక్షకు సమగ్ర స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందించడంతో పాటు సాక్షి నిపుణులతో రూపొందించిన ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్లు, మాక్ టెస్టులను రూపొందించింది. వీటితో పాటు డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ‘కీ’తో కూడిన మోడల్ పేపర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మోడల్ టెస్ట్స్ ప్రత్యేకతలు: అన్ని ప్రశ్నలకు సమాధానాలతో 5 గ్రాండ్ టెస్ట్లు 24/7 ఎన్ని సార్లైనా పరీక్ష రాసుకునే సౌలభ్యం పరీక్ష ముగిసిన వెంటనే గ్రేడులతో కూడిన ఫలితాలు అభ్యర్థి ప్రదర్శనను తెలిపే గ్రాఫికల్ పెర్ఫార్మెన్స్ రిపోర్టులు సబ్జెక్టుల వారీ వీక్ అండ్ స్ట్రాంగ్ ఏరియా అనాలసిస్ వెబ్సైట్: http://onlinetests.sakshieducation.com/ http://sakshieducation.com/RRB/ Groupd-model-test.html -
రౌడీల పెత్తనం సహించం
గీసుకొండ : ‘ప్రజలు ఎందుకో గుడ్డిగా ఒక్కోసారి రౌడీల వెంట ఉరుకుతుంటరు.. ఎందుకో ఒక్కోసారి గుండాయిజం చేసేవారి వెంట తిరుగుతుంటరు.. వారినే ఎన్నుకుంటారు.. గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్ చేసే వారు కూడా పిచ్చిగా ఆలోచన లేకుండా వారి వెంట తిరుగుతుంటరు.. ఇది ప్రజాస్వామ్యం.. ప్రజలను కొట్టడానికి, దోచుకోవడానికి కాదు ఎన్నికైంది. ప్రజలకు సేవ చేయడానికి. ఎవరో ఒకరిద్దరు రౌడీలను గ్రామాల్లో తయారు చేసుకుని పెత్తనం చెలాయిస్తే చూస్తూ ఊరుకునేది లేదు. రాష్ట్రంలో ఇలాంటి వాళ్లను కనిపెట్టుకుని ఉండాలని మా ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. అలాంటివారిని వదిలి పెట్టేది లేదు’ అంటూ వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి విరుచుకుపడ్డారు. గీసుకొండ మండలంలోని బాలయ్యపల్లె డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టు రెండో దశ పనులకు శనివారం శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. అప్పటి వరకు తనను ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృత జ్ఞతలు అని, పదేళ్ల కాంగ్రెస్ పాలనలో అవినీతి రాజ్యమేలిందని అని మాట్లాడిన ఆయన ఒక్కసారిగా టాపిక్ మార్చారు. ‘ విచిత్రం ఏమిటేంటే ఒక్కసారి ఎమ్మెల్యే అయితే వందల కోట్ల ఆస్తులు, వందల ఎకరాల భూములు ఎట్లా వస్తాయి?. నా ఇల్లు హన్మకొండలోని టీచర్స్ కాలనీలో ఉంది. పదేళ్లు మంత్రిగా పని చేసిన. నా దగ్గరకు వచ్చే సర్పంచ్లు అయ్యో సారూ మీ ఇల్లు గిట్లున్నదేంది అని అంటాంటె వారు నన్ను పొగుడుతాండ్లో.. అవమానపరుస్తాండ్లో తెల్వడం లేదు. మీ ఇంటికన్నా గా వీఆర్వో ఇల్లు బాగున్నదని అంటరు’ అని చెప్పుకొచ్చారు. రౌడీయిజంపై ఎంపీ ఘాటుగా మాట్లాడుతుండగా సభికులు స్పందించి చప్పట్లు కొట్టారు. ఆయన పక్కనే కూర్చున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ముసిముసి నవ్వులు నవ్వారు. అయితే అంతకు ముందు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ గతంలోని ప్రజాప్రతినిధులు పదేళ్లుగా నియోజకవర్గానికి ఒక్క మంత్రిని, ఎంపీని రానివ్వలేదని, దీనికి రౌడీ రాజకీయాలే కారణమంటూ విరుచుకుపడ్డారు. -
బ్రిటన్లో సరస్వతీ పుత్రికల శకం!
బ్రిటన్లో చదువు విషయంలో అమ్మాయిలు దూసుకుపోతున్నారు. అబ్బాయిలతో పోటీ పడటం కాదు.. అబ్బాయిలను ఓడించి, అందనంత వేగంగా దూసుకుపోతున్నారు. అక్కడి యూనివర్సిటీల్లోని విద్యార్థినీ విద్యార్థుల సంఖ్యను బట్టి చూస్తే... ప్రస్తుతం అక్కడ సరస్వతీ పుత్రికల శకం నడుస్తోందని చెప్పవచ్చు. ప్రత్యేకించి పై చదువుల విషయంలో అమ్మాయిల హవా స్పష్టంగా కనిపిస్తోంది. గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ల కోసం యూనివర్సిటీల్లో స్థానం సీట్లు సంపాదిస్తున్న వాళ్లలో, ఆ ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వాళ్లలో అమ్మాయిల శాతం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రస్తుత విద్యాసంవత్సరం లెక్కల ప్రకారం చూస్తే.. బ్రిటన్లోని టాప్ రేటెడ్ యూనివర్సిటీల్లో మొత్తం 4,12,170 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీరిలో 2,32,250 మంది అమ్మాయిలు ఉండగా, అబ్బాయిల సంఖ్య 1,79, 920 మంది మాత్రమే. తేడా దాదాపు 50 వేల మందిపైనే! ఈ ఏడాదికే కాదు.. గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితే ఉంది. ప్రతియేటా గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బయటకు వస్తున్న వాళ్లలో అమ్మాయిల సంఖ్య 50 నుంచి 60 వేలు ఎక్కువగా ఉంటోంది. దీంతో క్లాసురూముల్లో అబ్బాయిలు మైనారిటీలు అయిపోయారు. అమ్మాయిలు మెజారిటీలు అయిపోయారు. మహిళా సాధికారతలో ఇది మరో ముందడుగు అనే అభిప్రాయం వినిపిస్తోందిప్పుడు. అమ్మాయిల్లో చదువు మీద పెరిగిన ఆసక్తికి.. వారి పట్టుదలకు ఇది నిదర్శనమని అంటున్నారు స్థానిక విద్యావేత్తలు, మహిళా హక్కుల ఉద్యమకారిణులు. నిజంగా ఇది మంచి పరిణామం కదా! -
విదేశీ ‘కొలువు’దీరేందుకు మార్గాలు...
‘స్టడీ అబ్రాడ్’ అంటే.. సాధారణంగా విదేశాల్లో ఉన్నత విద్యకు సంబంధించి గుర్తొచ్చే పదం. ఇందుకోసం గ్రాడ్యుయేషన్ స్థాయి నుంచే కసరత్తు మొదలుపెడతారు. విదేశాల్లోని యూనివర్సిటీల్లో కాలు మోపేందుకు సన్నద్ధమవుతారు. ఇటీవలకాలంలో స్టడీ అబ్రాడ్తోపాటు బాగా ప్రాచుర్యం పొందుతున్న మాట.. ‘జాబ్స్ అబ్రాడ్’! అంటే.. విదేశీ ఉద్యోగాలు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తమ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల విస్తరణలో భాగంగా కొత్త సంస్థల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నాయి. అవసరమైన మానవ వనరుల కోసం విదేశీ అభ్యర్థులకు స్వాగతం పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో.. విదేశీ కొలువులపై స్పెషల్ ఫోకస్.. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ విద్యార్థులు, ఉద్యోగార్థులకు మంచి ఆదరణ లభిస్తోంది. కష్టపడి పనిచేసే తత్వం.. త్వరగా స్థానిక పరిస్థితులతో ఇమడగలిగే నేర్పు.. ఇంగ్లిష్పై పట్టు.. విదేశాల్లో భారతీయులకు అవకాశాలు పెరగడానికి కారణమన్నది నిపుణుల అభిప్రాయం. అనేక దేశాల్లో భారతీయులకు ఉద్యోగాలు లభిస్తున్నాయి.. లో-స్కిల్డ్, సెమీ స్కిల్డ్, ప్రొఫెషనల్ స్కిల్స్ పేరుతో దిగువ స్థాయి మొదలు.. ఆయా రంగాల్లో అనుభవం గడించిన మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్ వరకూ.. ఎన్నో విదేశీ ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. బెస్ట్ డెస్టినేషన్స్ సాధారణంగా ‘విదేశీ’ లక్ష్యం ఎంచుకున్న వారికి అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాలు తొలి ప్రాధాన్యంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. అయితే ఆయా దేశాలు అనుసరిస్తున్న విధానాల వల్ల అక్కడి సంస్థల్లో డెరైక్ట్ రిక్రూట్మెంట్ ఆశించడం కొంత కష్టంతో కూడుకున్న విషయం. ఇదే సమయంలో అంతే స్థాయిలో ఆదాయార్జనకు మార్గం వేసే క్రమంలో మరెన్నో దేశాలు ఉద్యోగాల పరంగా బెస్ట్ డెస్టినేషన్స్గా నిలుస్తున్నాయి. పొరుగు దేశం చైనా మొదలు ఆఫ్రికా వరకు భారతీయులకు అవకాశాలు కల్పించడంలో ముందుంటున్నాయి. ప్రపంచంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న చైనా.. విదేశీ ఉద్యోగులను ఆకర్షించడంలో ముందుంటోంది. అదేవిధంగా ఆసియా ఖండంలోనే విదేశీ ఉద్యోగులకు పెద్దపీట వేస్తున్న మరో దేశం.. సింగపూర్. ఇక్కడ టూరిజం, హాస్పిటాలిటీ, టెలికాం రంగాల్లో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. గల్ఫ్ దేశాల్లో క్లర్క్ నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ వరకు.. హెల్త్కేర్ నుంచి హాస్పిటాలిటీ దాకా.. అన్ని విభాగాల్లోనూ ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇక.. ఆఫ్రికా దేశాల్లోనైతే భారత అభ్యర్థులకు అవకాశాలు కోకొల్లలు. ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్, మైనింగ్, ఎఫ్ఎంసీజీ, కమోడిటీస్ ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్, టెలికం రంగాల్లో అవకాశాలు విస్తృతం. మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్కు మరింత ప్రయోజనం విదేశీ ఉద్యోగాల విషయంలో ఎంట్రీ లెవల్ అభ్యర్థులతో పోల్చితే.. మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్కు మరిన్ని ప్రయోజనాలు చేకూరుతున్నాయి. దీనికి ప్రధాన కారణం.. జీతభత్యాలే. ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు సంబంధించి మన దేశంలో చక్కటి వేతనాలు లభిస్తున్నాయి. ఇవి ఆయా దేశాల్లోని జీతాలతో పోల్చితే సమానంగా ఉంటున్నాయి. కానీ మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్ విషయంలో మాత్రం ఇక్కడ కంటే విదేశాల్లో ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో వచ్చే జీతభత్యాలకు కనీసం రెండింతలకుపైగా అందుకోవచ్చు. విదేశీ ఉద్యోగాన్వేషణకు మార్గాలు విదేశాల్లో ఉద్యోగం కోరుకునే ఔత్సాహికులకు ఉద్యోగాన్వేషణ క్రమంలో అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అన్నింటికంటే ప్రముఖంగా నిలుస్తోంది కన్సల్టెన్సీల ద్వారా అన్వేషణ. ప్రస్తుతం ఎన్నో ‘అబ్రాడ్ జాబ్ కన్సల్టెన్సీలు’ అందుబాటులోకి వచ్చాయి. ఔత్సాహికులు ముందుగా వీటిని సంప్రదిస్తే సరైన గమ్యాలు తెలుస్తాయి. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్: జాబ్స్ అబ్రాడ్ దిశగా మరో ముఖ్య సాధనం సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్స్. ఔత్సాహికులు ఆయా సోషల్ నెట్వర్క్ వెబ్సైట్స్ ద్వారా తాము అడుగుపెట్టాలనుకుంటున్న దేశం, అక్కడి అవకాశాలపై.. అప్పటికే ఆయా దేశాల్లో స్థిరపడిన స్నేహితులు, ఇతర అనుభవజ్ఞుల ద్వారా సమాచారం పొందొచ్చు. జాబ్ సెర్చ్ ఇంజిన్స్: ఇంటర్నెట్ సాధనంగా జాబ్ సెర్చ్ ఇంజిన్స్ (నౌకరీ డాట్ కామ్, మాన్స్టర్ డాట్ కామ్ తదితర) ద్వారా కూడా విదేశీ ఉద్యోగావకాశాలపై సమాచారం పొందొచ్చు. ఈ మార్గాల ద్వారా అన్వేషణ సాగించి అసలైన గమ్యాన్ని తెలుసుకోవడం ఎంతో తేలిక. స్పష్టతతో అన్వేషణ సాగిస్తేనే విదేశీ ఉద్యోగార్థులు ఎంతో స్పష్టంగా వ్యవహరించాలి. తమ విద్య, ఉద్యోగ నేపథ్యం- అనుభవం ఆధారంగా ముందుగా తాము కోరుకుంటున్న ఉద్యోగాన్ని, అందుకు తగిన గమ్యాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత సదరు దేశంలో తమకు సరిపోయే సంస్థలు, వాటిలో అవకాశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. తర్వాత.. ఆయా సంస్థల పనితీరును పరిశీలించాలి. ఇందుకు ఏకైక సాధనం ఇంటర్నెట్. అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న కంపెనీల వెబ్సైట్లను వీక్షించి సదరు సమాచారం పొందొచ్చు. అంతేకాకుండా ఆయా కంపెనీలకు ఆ దేశంలోని నియంత్రణ సంస్థల అనుమతుల విషయంలోనూ పరిశోధన సాగించాలి. అనుమతులున్న కంపెనీల్లోనే దరఖాస్తుకు ఉపక్రమించాలి. ఇంటర్వ్యూలకు సన్నద్ధత జాబ్ అబ్రాడ్కు సంబంధించి దరఖాస్తుల విషయంలో ప్రస్తుతం ఇంటర్వ్యూలు సాధారణంగా టెలిఫోన్ లేదా ఈ-మెయిల్ లేదా స్కైప్ మాధ్యమాల్లో జరుగుతున్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి. టెలిఫోనిక్, స్కైప్ ఇంటర్వ్యూల సమయంలో.. ప్రశ్నలకు సమాధానమిచ్చేట ప్పుడు ఎలాంటి తడబాటుకు లోనవకూడదు. ఇక ఈ-మెయిల్ లేదా ఆన్లైన్ ఇంటర్వ్యూల సమయంలో సమయపాలన, భాషపై పట్టు ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ఆన్లైన్ చాటింగ్ ద్వారా జరిగే ఇంటర్వ్యూలలో సంబంధిత సంస్థ అధికారులు తాము అడిగిన ప్రశ్నకు అభ్యర్థి సమాధానం ఇవ్వడానికి తీసుకుంటున్న వ్యవధిని కూడా క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. కాబట్టి.. వీటిని దృష్టిలో పెట్టుకుని.. దరఖాస్తు సమయం నుంచే ఇంటర్వ్యూకు సన్నద్ధమయ్యేలా శిక్షణ పొందాలి. అప్రమత్తతో కన్సల్టెన్సీలు, ఏజెంట్స్ ఎంపిక విదేశీ ఉద్యోగార్థులకు మార్గంగా నిలుస్తున్న జాబ్ కన్సల్టెన్సీలు, రిక్రూటింగ్ ఏజెంట్స్ విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన కన్సల్టెన్సీలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. భారత విదేశీ వ్యవహారాల శాఖ అన్ని దేశాలకు సంబంధించి గుర్తింపు పొందిన కన్సల్టెన్సీలు, ఏజెంట్ల జాబితాను వెబ్సైట్లో పొందుపర్చింది. ముందుగా దాన్ని పరిశీలించి ఆ జాబితాలో ఉన్న కన్సల్టెన్సీలను సంప్రదించడం మేలు. అదేవిధంగా ఇతర దేశాలు కూడా విదేశాల్లోని తమ అధీకృత రిక్రూటింగ్ ఏజెన్సీల వివరాలను తమ ఎంబసీ వెబ్సైట్లు, ఇమ్మిగ్రేషన్ వెబ్సైట్లలో పొందుపర్చాయి. ఔత్సాహికులు తాము ఎంపిక చేసుకున్న దేశం.. అక్కడి ప్రభుత్వ గుర్తింపు ఉన్న రిక్రూటింగ్ ఏజెంట్ల ద్వారా మాత్రమే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని ఉద్యోగాలు అందుకు సంబంధించి ఏజెంట్లు జారీ చేసే ప్రకటనల ఆధారంగా వెళ్లే అభ్యర్థులు మరింత అప్రమత్తంగా ఉండాలి. నైపుణ్యాలను నిరూపించుకుంటే.. సులువుగా వీసా వీసా.. విదేశాల్లో అడుగుపెట్టేందుకు కచ్చితంగా అవసరమైంది. ఈ విషయంలో అన్ని దేశాలు ఎంతో నిర్దిష్టంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా.. స్టడీ, టూరిస్ట్, బిజినెస్ వీసాలతో పోల్చితే వర్క్ వీసాల మంజూరులో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తున్నాయి. ఈ సమయంలో ఔత్సాహికులు తమ నైపుణ్యాలను నిరూపించుకోవాల్సి ఉంటుంది. అక్కడి వారికంటే తామెంత మెరుగైన నైపుణ్యాలు కలిగున్నామో తెలియజేయాలి. తద్వారా వీసా అధికారులను మెప్పించాల్సిన బాధ్యత అభ్యర్థులదే. అదనపు ‘భాష’ ప్రయోజనం విదేశీ ఉద్యోగార్థుల కోణంలో మరో అదనపు ప్రయోజనం సంబంధిత దేశ భాషలో నైపుణ్యం సాధించడం. ఇది భవిష్యత్తులో రాణించేందుకు ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా నాన్-ఇంగ్లిష్ స్పీకింగ్ కంట్రీస్గా ఉన్న చైనా, స్కాండినేవియన్ దేశాలలో ఉద్యోగాలు కోరుకునేవారు తప్పనిసరిగా ఆయా దేశాల భాషలను నేర్చుకోవడం లాభిస్తుంది. పని చేసే ప్రాంతంలో ఇంగ్లిష్ భాషా నైపుణ్యంతో రాణించగలిగినా.. సామాజిక పరిస్థితుల కోణంలో స్థానిక భాషను నేర్చుకోవడం అవసరం. అంతేకాకుండా విధుల్లో భాగంగా క్షేత్ర స్థాయి పర్యటనలకు అవసరమైన మార్కెటింగ్ విభాగాలు, ఎన్జీఓ రంగాల్లో ప్రవేశించాలనుకుంటే తప్పనిసరిగా స్థానిక భాషపై పట్టుండాల్సిందే. అప్పుడే.. ఉద్యోగ వాతావరణంలో, అక్కడి సామాజిక పరిస్థితుల్లో రాణించగలిగి భవిష్యత్తులో సుస్థిర స్థానాలు సొంతం చేసుకోగలుగుతారు. జాబ్ అబ్రాడ్.. అనుసరించాల్సిన విధానాలు ముందుగా గమ్యంపై స్పష్టత ఏర్పరచుకోవాలి. ఏ దేశంలో అడుగుపెట్టాలనుకుంటున్నారో.. ఆ దేశంలో తమకు సరితూగే అవకాశాలు, కంపెనీల గురించి తెలుసుకోవాలి. ఆయా కంపెనీలకు సంబంధించిన సమాచారాన్ని వాటి గత చరిత్రను, భవిష్యత్తు ప్రణాళికలను పరిశీలించాలి. ఫలితంగా తమ వ్యక్తిగత ప్రగతిపైనా అవగాహన ఏర్పడుతుంది. ఆయా కంపెనీల వెబ్సైట్లలో పొందుపర్చిన వివరాల ఆధారంగా.. అకడెమిక్, ఎక్స్పీరియన్స్ నిబంధనలతోపాటు ఇతర అవసరాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. కనీసం ఐదేళ్లు పనిచేసే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. అక్కడి సామాజిక, భౌగోళిక పరిస్థితులపై అవగాహన కూడా అవసరమే. అవసరమైన డాక్యుమెంట్లు అబ్రాడ్ జాబ్ దిశగా కదిలే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి. అవి.. పాస్పోర్ట్ వీసా, వర్క్ పర్మిట్ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ పత్రాలు, లేదా రిక్రూట్మెంట్ లెటర్ యాక్స్ప్టెన్స్ లెటర్ (సదరు నియామక ప్రతిపాదనను అంగీకరిస్తూ సంస్థలో చేరేందుకు సంసిద్ధత తెలియజేసే లెటర్) హెల్త్ సర్టిఫికెట్ (దాదాపు అన్ని దేశాలు అభ్యర్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు హెల్త్ సర్టిఫికెట్ను తప్పనిసరి చేశాయి.) ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ అకడెమిక్ సర్టిఫికెట్స్ ట్రావెల్ డాక్యుమెంట్స్ ఎంట్రీ మాత్రమే కాదు.. ఎగ్జిస్టెన్స్ కూడా ముఖ్యమే ఇప్పుడు ఎన్నో దేశాలు భారత అభ్యర్థులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. అందుబాటులోని మార్గాల ద్వారా వీటిని అందిపుచ్చుకోవడం సులభంగా మారింది. ఆన్లైన్ జాబ్ సెర్చ్ ఇంజిన్స్, కన్సల్టెన్సీలు, సోషల్ నెట్వర్కింగ్ సోర్సెస్ ద్వారా వివిధ దేశాల్లోని అవకాశాలు తెలుసుకోవడం, వాటిని సొంతం చేసుకోవడం ఇప్పుడు ఎంతో తేలిక. ఔత్సాహికులు సంబంధిత దేశంలో అడుగుపెట్టడంపై దృష్టి సారించాలి. దాంతోపాటు దీర్ఘకాలం ఉండేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఈ క్రమంలో ఆయా సంస్థల క్షేత్ర స్థాయి నైపుణ్యాల్లో రాణించాలి. అక్కడి సామాజిక పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకోవాలి. విభిన్న సంస్కృతుల నేపథ్యంలో పనిచేయగల నేర్పు ఉండాలి. - సుబ్రహ్మణ్యం, విసు గ్లోబల్ కన్సల్టెంట్స్ వీసా విషయంలో జాగ్రత్తగా విదేశీ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు వీసా పొందే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. సంస్థ అందించిన ఆఫర్ లెటర్ ఆధారంగా వీసా కాలపరిమితి ఉంటుంది. దీన్ని క్షుణ్నంగా పరిశీలించాలి. యూకేలో ఉద్యోగం పొందితే.. ఆయా అభ్యర్థుల నైపుణ్యాల ఆధారంగా టైయర్-2, టైయర్-3 వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. సంస్థ వ్యవహారశైలిపై అనుమానం కలిగితే సందేహ నివృత్తి చేసుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ సంకోచించకూడదు. - సుచిత గోకర్ణ్, హెడ్, బ్రిటిష్ కౌన్సిల్ డివిజన్,బిటిష్ హైకమిషన్, న్యూఢిల్లీ -
విద్యార్థికి మార్గదర్శి.. కెరీర్ కౌన్సెలర్
అప్కమింగ్ కెరీర్: గ్రాడ్యుయేషన్ పూర్తయ్యింది.. తర్వాత ఉన్నత విద్యనభ్యసించాలా? లేక ఏదైనా కొలువు కోసం ప్రయత్నించాలా? ఫలానా కోర్సు చదివితే ఉద్యోగ అవకాశాలు ఉంటాయా? నచ్చిన కోర్సు చదవాలంటే ఏ కాలేజీలో చేరాలి? ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కోర్సుకు ఎక్కువ డిమాండ్ ఉంది? ఉన్నత విద్యకు స్వదేశమా? విదేశమా? ఏది మేలు? ఏ దేశంలో నాణ్యమైన విద్య లభిస్తుంది?... ఇలా ఒక విద్యార్థి మదిలో లెక్కలేనన్ని సందేహాలు. వీటికి సరైన సమాధానాలు చెప్పి, బంగారు భవిష్యత్తుకు మార్గం చూపే ఒక గురువు కావాలి. అతడే.. కెరీర్ కౌన్సెలర్. మనదేశంలో ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతున్న ప్రొఫెషన్.. కెరీర్ కౌన్సెలర్. విద్యార్థులు తమ శక్తిసామర్థ్యాలకు తగిన స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోలేక అనిశ్చిత స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కెరీర్ పరంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గం చూపించి, భవిష్యత్తువైపు విజయవంతంగా అడుగులేసేందుకు సలహాలు, సూచనలు ఇచ్చే కెరీర్ కౌన్సెలర్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. మనుషుల మనస్తత్వాలను చదవాలి: కెరీర్ కౌన్సెలర్గా వృత్తిలో రాణించాలంటే మానసిక శాస్త్రం(సైకాలజీ)పై గట్టి పట్టు ఉండాలి. మనుషుల మనస్తత్వాలను చదవగలగాలి, వారి ప్రవర్తనను, శక్తిసామర్థ్యాలను సరిగ్గా అంచనా వేయగలగాలి. అప్పుడే వారికి సరైన సలహాలు ఇచ్చేందుకు వీలుంటుంది. కౌన్సెలర్లకు మంచి పరిశీలనా, పరిశోధనా నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి. కౌన్సెలర్లకు భారీ డిమాండ్: మన దేశంలో కౌన్సెలింగ్పై ఆసక్తి ఉన్న కొందరు దీన్ని పార్టటైమ్ ప్రొఫెషన్గా మాత్రమే ఎంచుకుంటున్నారు. నిజానికి భారత్లో కెరీర్ కౌన్సెలర్ల అవసరం ఎంతో ఉంది. డిమాండ్కు సరిపడా కౌన్సెలర్లు అందుబాటులో లేరు. ఇది కెరీర్ కాదు.. బాధ్యత! ‘‘కెరీర్ కౌన్సెలింగ్ స్కూల్, కాలేజీ స్థాయిల్లో ఉంటుంది. విద్యార్థుల మనసు చదివి వారి ఇష్టాయిష్టాలను, నైపుణ్యం, దృక్పథం తదితర వ్యక్తిగత సామర్థ్యాలను అంచనా వేయగలగాలి. రాబోయే 5-10 ఏళ్లలో జాబ్మార్కెట్ ఎలా ఉంటుందనేది అంచనావేయగలగటం ముఖ్యం. కెరీర్ కౌన్సిలర్కు ఓర్పు, మనస్తత్వాలను అంచనా వేయగలగటమే అర్హతలు. సోషల్వర్క్, సైకాలజీ, హెచ్.ఆర్ కోర్సులు చేసిన వారికి ఇది కెరీర్గా సరిపోతుంది. స్కూల్స్, ప్రముఖ కాలేజీల్లో కె రీర్ కౌన్సెలర్స్గా అవకాశాలున్నాయి. సొంతగా సంస్థను ఏర్పాటుచేసి విద్యార్థులకు దిశానిర్ధేశం చేయటం ద్వారా ఉద్యోగ సంతృప్తి లభిస్తుంది. దీన్ని కెరీర్గా కాకుండా బాధ్యతగా స్వీకరించాలి’’ -మురళీధరన్, సీఈవో సీ అండ్ కే మేనేజ్మెంట్ లిమిటెడ్, హైదరాబాద్ వేతనాలు: ప్రారంభంలో జూనియర్ కౌన్సెలర్కు నెలకు రూ.15 వేల నుంచి వేతనం ప్రారంభమవుతుంది. సీనియర్ కౌన్సెలర్ తన అనుభవాన్ని బట్టి దాదాపు రూ.2.5 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. కెరీర్ కౌన్సెలింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఎన్సీఈఆర్టీ-న్యూఢిల్లీ, అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మైసూరు వెబ్సైట్: http://www.ncert.nic.in/ యూనివర్సిటీ ఆఫ్ ముంబై వెబ్సైట్: http://www.mu.ac.in/ పంజాబ్ యూనివర్సిటీ-చండీగఢ్ వెబ్సైట్: http://puchd.ac.in/ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్-ముంబై వెబ్సైట్: http://www.tiss.edu/ అర్హతలు: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చదవాలి. తర్వాత పీజీ డిప్లొమా ఇన్ గెడైన్స్ అండ్ కౌన్సెలింగ్ కోర్సులో చేరొచ్చు. కెరీర్ కౌన్సెలర్లకు సైకాలజీ బ్యాక్గ్రౌండ్ ఉండడం వృత్తిలో ఎదిగేందుకు ఉపయోగపడుతుంది. కావాల్సిన లక్షణాలు: విద్యార్థులకు మార్గదర్శకుడిగా వ్యవహరించాలనే బలమైన ఆసక్తి మాటలతో ఇతరులను ప్రభావితం చేసే నైపుణ్యం స్వతంత్రంగా లేదా ఇతరులతో కలిసి బృందంగా పని చేసే నేర్పు కౌన్సెలర్గా కొత్త విషయాలు నేర్చుకుంటూ ప్రతిభకు ఎప్పటికప్పుడు సాన పెట్టుకునే అలవాటు. -
కామర్స్ - కెరీర్ అవకాశాలు
కామర్స్ (వాణిజ్య శాస్త్రం).. వస్తువులు, సేవల అమ్మకాలు, కొనుగోళ్లతో కూడిన ఆర్థిక కార్యకలాపాలను వివరించే శాస్త్రం.. ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణలో పెరుగుదల, దేశంలోకి బహుళజాతి కంపెనీలు అడుగుపెడుతుండటం, సేవా రంగం శరవేగంగా విస్తరిస్తుండటం వంటి వాటివల్ల సుశిక్షితులైన కామర్స్ నిపుణులకు డిమాండ్ ఏర్పడుతోంది. దీంతో కెరీర్ పరంగా కొత్త అవకాశాలను వెతుక్కుంటూ నేటి యువత కామర్స్, సంబంధిత ప్రొఫెషనల్ కోర్సుల వైపు అడుగులేస్తోంది.. కామర్స్ మనిషి జీవన ప్రమాణాలను పెంచుతుంది. వస్తు ఉత్పత్తిదారులకు, కొనుగోలుదారులను అనుసంధానిస్తుంది. జాతీయ ఆదాయం, సంపద పెంపునకు తోడ్పాటునందిస్తుంది. పారిశ్రామిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి పథంలో పయనించేందుకు ఉపయోగపడుతుంది. మొత్తంమీద వస్తువులు, సేవల అమ్మకాలు- కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలను విస్తృతం చేసి, మెరుగైన ఉపాధి అవకాశాలకు ఊతమిస్తోంది. తొలి అడుగు: కామర్స్లో పదిలమైన కెరీర్ను లక్ష్యంగా ఎంపిక చేసుకున్న వారు వేయాల్సిన తొలి అడుగు.. ఇంటర్మీడియెట్లో కామర్స్ ఒక సబ్జెక్టుగా ఉన్న గ్రూప్లో చేరడం. పదో తరగతి పూర్తయిన విద్యార్థులు 10+2 స్థాయిలో కామర్స్ను ఎంపిక చేసుకునేందుకు రెండు గ్రూప్లు అందుబాటులో ఉన్నాయి. అవి.. సీఈసీ (సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్); ఎంఈసీ (మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్).కరిక్యులం: రెండేళ్ల వ్యవధి గల ఇంటర్లో కామర్స్ సబ్జెక్టుకు సంబంధించి పాఠ్యప్రణాళిక రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం(వాణిజ్య శాస్త్రం)లో వ్యాపారం, భావనలు; వ్యాపార సంస్థల స్వరూప, స్వభావాలు; వ్యాపార విత్తం-మూలాధారాలు; ప్రభుత్వ, ప్రైవేటు బహుళ జాతీయ సంస్థలు; అంతర్జాతీయ వర్తకం; మార్కెటింగ్ వ్యవస్థలు, వ్యాపార ప్రకటనలు, వినియోగదారిత్వం; వ్యాపార సేవలు; స్టాక్ ఎక్స్చేంజ్లు తదితర అంశాలుంటాయి. రెండో భాగం (అకౌంటింగ్)లో సహాయక పుస్తకాలు; బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీ; అంకణా తప్పుల సవరణ; ముగింపు లెక్కలు; వర్తకం బిల్లులు, తరుగుదల; కన్సైన్మెంట్ ఖాతాలు; వ్యాపారేతర సంస్థల ఖాతాలు; ఒంటిపద్దు విధానం; భాగస్వామ్య వ్యాపార ఖాతాలు వంటి అంశాలుంటాయి. గ్రాడ్యుయేషన్ స్థాయిలో: కామర్స్ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ స్థాయిలో బీకామ్ జనరల్, బీకామ్ ఆనర్స్, బీకామ్ కంప్యూటర్స్ వంటి కోర్సు లు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా కొన్ని కళాశాలలు మార్కెటింగ్, ఫారెన్ ట్రేడ్, ట్యాక్సెస్ వంటి స్పెషలైజేషన్లతో బీకామ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. బీకామ్ జనరల్తో పోల్చితే ఇతర కోర్సుల్లో సిలబస్ పరిధి కాస్తా ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం బీకామ్ ఆనర్స్, బీకామ్ కంప్యూటర్స్ కోర్సులకు డిమాండ్ బాగుంది. ఇంటర్మీడియెట్-నాన్ కామర్స్ విద్యార్థులు కూడా బీకామ్ కోర్సులో చేరొచ్చు. వీరికి ప్రవేశాల్లో 20 శాతం రిజర్వేషన్ ఉంటుంది. కరిక్యులం: బీకాంలో ఫైనాన్షియల్ అకౌంటింగ్, కార్పొరేట్ అకౌంటింగ్, డెరైక్ట్ అండ్ ఇన్డెరైక్ట్ ట్యాక్సేషన్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ లా వంటి అంశాలను బోధిస్తారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని మిళితం చేసి బీకామ్ కంప్యూటర్స్ కోర్సును ఆఫర్ చేస్తున్నారు. దీని కరిక్యులంలో ఫైనాన్షియల్ అకౌంటింగ్, బిజినెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫండమెంటల్స్ ఆఫ్ సీ లాంగ్వేజ్, అడ్వాన్స్డ్ అకౌంటింగ్, బిజినెస్ స్టాటిస్టిక్స్, ఈ-కామర్స్, బిజినెస్ లా వంటి అంశాలుంటాయి. బీకామ్ ఫారెన్ ట్రేడ్ గ్రూప్.. విదేశీ వాణిజ్యం సంబంధిత అంశాల కేంద్రీకృతంగా ఉంటుంది. దీని కరిక్యులంలో ఫైనాన్షియల్ అకౌంటింగ్, అడ్వాన్స్డ్ అకౌంటింగ్ వంటి రెగ్యులర్ అంశాలతోపాటు ఇండియాస్ ఫారెన్ ట్రేడ్, ఫారెన్ ట్రేడ్ ఫైనాన్సింగ్ అండ్ ప్రొసీజర్స్, ఎక్స్పోర్ట్ డాక్యుమెంటేషన్ అండ్ ప్రొసీజర్స్ తదితర అంశాలు ఉంటాయి. పోస్టు గ్రాడ్యుయేషన్: బీకామ్ తర్వాత పీజీ స్థాయిలో పలు స్పెషలైజేషన్స్తో ఎంకామ్ పూర్తి చేయవచ్చు. అవి.. ఫైనాన్స్, అకౌంటింగ్, టాక్సేషన్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఇన్సూరెన్స్, మార్కెటింగ్, హ్యుమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ (హెచ్ఆర్ఎం). వీటిల్లో ప్రస్తుతం ఫైనాన్స్, అకౌంటింగ్ స్పెషలైజేషన్స్కు మంచి డిమాండ్ ఉంది. అంతేకాకుండా జాబ్ మార్కెట్ ట్రెండ్ను దృష్టిలో ఉంచుకుని కొన్ని యూనివర్సిటీలు ఎంకామ్లో ఫైనాన్స్ అండ్ కంట్రోల్, కార్పొరేట్ సెక్రటరీషిప్, ఫైనాన్స్ మేనేజ్మెంట్ వంటి వినూత్న స్పెషలైజేషన్స్ను అందిస్తున్నాయి. పీజీ తర్వాత ఆసక్తి ఉంటే పీహెచ్డీ కూడా చేయవచ్చు. నెట్లో అర్హత సాధిస్తే అకడమిక్ రంగంలో ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. మేనేజ్మెంట్ కోర్సులు: మేనేజ్మెంట్వైపు ఆసక్తి ఉంటే ఇంటర్మీడియెట్ సీఈసీ/ఎంఈసీ తర్వాత విద్యార్థులు బ్యాచిలర్ స్థాయిలో బీబీఏ (బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్), బీబీఎం (బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్) కోర్సులను ఎంచుకోవచ్చు. మన రాష్ట్రంలోని కొన్ని కాలేజీలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. మేనేజ్మెంట్ విద్యకు సంబంధించి వీటిని ప్రాథమిక కోర్సులుగా పేర్కొనవచ్చు. ఈ రంగంలో ఉన్నత స్థానాల్లో స్థిర పడాలంటే పీజీ స్థాయిలో ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ వంటి కోర్సులు ఉన్నాయి. వీటిలో చేరడానికి రాష్ట్ర స్థాయిలో ఐసెట్ (ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్), జాతీయ స్థాయిలో క్యాట్, మ్యాట్, సీమ్యాట్, ఎక్స్ఏటీ వంటి ప్రవేశ పరీక్షలు రాయాలి. సాంకేతిక పరిజ్ఞానం తోడైతే: Tally.ERP 9, వింగ్స్, పీచ్ట్రీ వంటి సాఫ్ట్వేర్ అకౌంటింగ్ ప్యాకేజ్లను బ్యాచిలర్, పీజీ కామర్స్ కోర్సులకు సమాంతరంగా నేర్చుకుంటే జాబ్ మార్కెట్లో అదనపు అర్హతలుగా నిలుస్తాయి. ‘లా’ అండగా ఉంటే: కామర్స్ గ్రాడ్యుయేట్లకు న్యాయశాస్త్రంలోనూ పట్టా ఉంటే ఎన్నో అవకాశాలు సొంతమవుతాయి. న్యాయ శాస్త్రంలో బోధించే ఇంటర్నేషనల్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, కార్పొరేట్ అకౌంటెన్సీ, టాక్స్ లా తదితరాలన్నీ వాణిజ్య రంగంలోని లోటుపాట్లను సులువుగా తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి. కాబట్టి కామర్స్కు తోడు ‘లా’ ఉండటం కెరీర్ పరంగా లాభించే అంశం. ఈ క్రమంలో ‘లా’ కోర్సులో ప్రవేశానికి రాష్ట్ర స్థాయిలో లాసెట్ (లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్), జాతీయ స్థాయిలో కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్), ఏఐఎల్ఈటీ (ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్), లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ఇండియా (ఎల్శాట్) తదితర ప్రవేశ పరీక్షలకు హాజరు కావచ్చు. ఈ పట్టిక ఆధారంగా పారిశ్రామిక, విదేశీ, స్వదేశీ వర్తకంలోనూ, బ్యాంకింగ్, రవాణా, గిడ్డంగులు, బీమా, వ్యాపా ర ప్రకటనలకు సంబంధించిన సంస్థలతో పాటు మ్యూచువల్ ఫండ్స్, క్యాపిటల్ మార్కెట్లు, ఈక్విటీ రీసెర్చ్ అండ్ రిటైల్, ఇతర ఆర్థిక సంస్థల్లో కామర్స్ గ్రాడ్యుయేట్లకు అవకాశాలుంటాయని చెప్పొచ్చు. చిన్న చిట్ఫండ్ కంపెనీ నుంచి మల్టీనేషనల్ కంపెనీల వరకు అకౌంట్స్ రాయడానికి కామర్స్ గ్రాడ్యుయేట్లు అవసరమవుతారు. జాబ్ ప్రొఫైల్స్: కామర్స్ కోర్సులు పూర్తిచేసిన వారికి అకౌంటెంట్, బిజినెస్ అనలిస్ట్, ట్యాక్స్ అకౌంటెంట్, ట్యాక్స్ అనలిస్ట్, ట్యాక్స్ అడ్వైజర్, ట్యాక్స్ ఎగ్జామినర్స్, ఫండ్ మేనేజర్, ఫైనాన్షియల్ అనలి్స్ట్, ఇన్సూరెన్స్- డెవలప్మెంట్ ఆఫీసర్, ఫైనాన్స్ మేనేజర్, ఇంటర్నెట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ (ఈ-కామర్స్) వంటి అవకాశాలుంటాయి. వేతనాలు: కెరీర్ ప్రారంభంలో నెలకు రూ.15,000-20,000 వరకు వేతనం లభిస్తుంది. కోర్సు పూర్తిచేసిన విద్యా సంస్థ, ఉద్యోగంలో చేరిన సంస్థ, స్వీయ ప్రతిభ తదితరాల ఆధారంగా వేతనం మారుతుంటుంది. ఉదాహరణకు ఈ ఏడాది హైదరాబాద్లోని ఓ ప్రముఖ కళాశాలలో బీకామ్ పూర్తిచేసిన గౌతమ్ శ్రీనివాస్ అనే విద్యార్థిని ఏడాదికి రూ.6 లక్షల వేతనంతో ఇన్ఫోసిస్ నియమించుకుంది. స్వీయ ఉపాధి: సొంతంగా వ్యాపార సంస్థను ప్రారంభించవచ్చు. స్టాక్ బ్రోకర్గా, ట్రేడ్ కన్సల్టెంట్గా, మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా, ఫైనాన్షియల్ అనలిస్టుగా, ట్యాక్స్ కన్సల్టెంట్గా ఫ్రీలాన్స్ సేవలను అందించొచ్చు. సీఈసీ, ఎంఈసీ.. తొలిమెట్లు ‘‘ఇంటర్మీడియెట్లో ఎంఈసీ, సీఈసీ గ్రూప్లు.. సైన్స్ గ్రూప్ల స్థాయికి ఏ మాత్రం తగ్గని గ్రూపులు. కామర్స్ దిశగా కెరీర్ను లక్ష్యంగా ఎంచుకున్న విద్యార్థులు 10+2 స్థాయిలో చేరాల్సిన గ్రూపులివి. న్యూమరికల్ డేటాను విశ్లేషించగలగడం, తార్కిక ఆలోచన, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త విధానాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒంటబట్టించుకుంటే ఈ రంగంలో అవకాశాలకు కొదవ లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం సాఫ్ట్వేర్, మేనేజ్మెంట్ విభాగాల్లోనూ కామర్స్కు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది’’ - కురుహూరి రమేశ్, డెరైక్టర్, మాస్టర్స్ జూనియర్ కాలేజ్, హైదరాబాద్. అకౌంటింగ్ వివిధ రంగాల సంస్థలకు సంబంధించిన వ్యాపార వ్యవహారాల నమోదు (ఖ్ఛఛిౌటఛీజీజ) ప్రక్రియను అకౌంటింగ్ అంటారు. అకౌంటింగ్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ విభాగాలుంటాయి. ఇంటర్మీడియెట్లో చదివిన గ్రూప్తో సంబంధం లేకుండా అకౌంటింగ్ కోర్సుల్లో చేరే వీలున్నప్పటికీ, కామర్స్ సబ్జెక్టుతో ఇంటర్ పూర్తిచేసిన వారికి ఇవి సౌలభ్యంగా ఉంటాయి. ఎందుకంటే.. కామర్స్లో చదివిన సబ్జెక్టులే వీటిలో అధిక శాతం వరకు ఉంటాయి. కాబట్టి వీటిని అధ్యయనం చేయడం తేలికవుతుంది. ప్రస్తుతం అకౌంటింగ్ సంబంధిత ప్రొఫెషనల్ కోర్సులు పూర్తిచేసిన వారు అందుకునే నేర్పు, ఓర్పు ఉండాలేగానీ కళ్లు చెదిరే వేతనాలతో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సీఎంఏ అకౌంటింగ్ రంగాల్లో సమున్నత భవిష్యత్తును కోరుకునే విద్యార్థులకు మరో చక్కటి అవకాశం కల్పిస్తున్న కోర్సు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ). ఈ కోర్సును ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. సీఎంఏ కోర్సు మూడు దశలుగా ఉంటుంది. అవి.. ఫౌండేషన్ కోర్సు, ఇంటర్మీడియెట్ కోర్సు, ఫైనల్ కోర్సు. ఫౌండేషన్ కోర్సు: ఈ కోర్సులో పేరు నమోదు చేసుకోవడానికి కనీస అర్హత ఇంటర్మీడియెట్/10+2/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. చివరి సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూసే వారు కూడా పేరు నమోదు చేసుకోవచ్చు. ఈ ఫౌండేషన్ కోర్సు పరీక్షలు ఏటా జూన్, డిసెంబర్ నెలల్లో జరుగుతాయి. ఫౌండేషన్ కోర్సులో మొత్తం నాలుగు పేపర్లుంటాయి. ఇంటర్మీడియెట్ కోర్సు: సీఎంఏ ఫౌండేషన్ కోర్సు ఉత్తీర్ణులు లేదా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ ఇంటర్మీడియెట్ కోర్సుకు తమ పేరు నమోదు చేసుకోవచ్చు. ఇంటర్మీడియెట్ కోర్సు రెండు స్టేజ్లుగా ఉంటుంది. ప్రతి దశలో మూడు పేపర్లుంటాయి. ఏటా జూన్, డిసెంబర్లలో నిర్వహించే ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యే క్రమంలో నిర్ణీత తేదీల్లోపు సంబంధిత దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. ఫైనల్ కోర్సు: ఇంటర్మీడియెట్ కోర్సు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో కాస్ట్ అండ్ వర్క అకౌంటెన్సీ ప్రొఫెషనల్గా తీర్చిదిద్దే క్రమంలో చివరి దశ ఫైనల్ కోర్సు. ఇది రెండు దశలలో ఉంటుంది. సీఎంఏ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు తమ ఆసక్తికి అనుగుణంగా మొదట ఫైనల్ కోర్సులోని రెండు దశలలో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఒకేసారి రెండింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షలను కూడా జూన్, డిసెంబర్లలో నిర్వహిస్తారు. కెరీర్ అవకాశాలు: సీఎంఏ పూర్తి చేసిన విద్యార్థులకు ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, వస్తూత్పత్తి సంస్థలు, ఇన్సూరెన్స్ సంస్థలు, మైనింగ్ సంస్థలు, డెవలప్మెంట్ ఏజెన్సీలు, ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెక్టార్, ఇతర పారిశ్రామిక సంస్థల్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, కాస్ట్ ఆడిటర్ వంటి హోదాలో ప్రవేశించొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ మాదిరిగానే ఇండియన్ కాస్ట్ అకౌంట్స్ సర్వీస్ అనే కేంద్ర సర్వీస్ను కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి ఐసీఎంఏఐలో ఫైనల్ పూర్తి చేసిన వారికి కేంద్ర సర్వీసులో అడుగుపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. సొంతంగా కూడా కాస్ట్ అకౌంటెంట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వేతనాలు: ప్రారంభంలో ఏడాదికి రూ.6 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ ఆధారంగా రూ.30 నుంచి రూ.40 లక్షల వేతనాలు కూడా అందుకోవచ్చు. చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) ఏ సంస్థలోనైనా ప్రధాన విభాగాలు అకౌంటింగ్, ఆడిటింగ్, టాక్సేషన్. వాటి గురించి వివరించేదే చార్టర్డ్ అకౌంటెన్సీ. కంపెనీలు, వ్యక్తుల ట్యాక్స్ ప్లానింగ్ విషయుంలో చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) అవసరం తప్పనిసరి. అంతేకాకుండా పెట్టుబడులు, వాటి ప్లానింగ్, సంస్థాగత అభివృద్ధి, కొత్త ప్రాజెక్టుల రూపకల్పన, నిర్వహణలో సాధ్యాసాధ్యాలు, ఆర్థిక వనరుల సమీకరణ, జారుుంట్ వెంచర్స్, విదేశీ భాగస్వావ్యూలు, విస్తరణ, విలీనాల్లోనూ, ఉత్పత్తుల ధరలు మొదలైన వాటిలో సీఏలు కీలక పాత్ర పోషిస్తారు. మూడు దశలు: సీఏ కోర్సును ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) నిర్వహిస్తోంది. ఇందులో కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్(సీపీటీ), ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్స కోర్సు (ఐపీసీసీ), ఫైనల్ దశలుంటాయి. పదో తరగతి పూర్తిచేసిన వారు సీపీటీకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సీపీటీ ఏటా జూన్, డిసెంబర్లలో జరుగుతుంది. ఈ పరీక్ష రాయడానికి ఇంటర్, డిగ్రీ.. ఆపై కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు. సీపీటీ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. దీనికి 200 మార్కులు కేటాయించారు. పరీక్ష రెండు సెషన్లలో ఉంటుంది. ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, మర్కంటైల్ లా, జనరల్ ఎకనామిక్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లపై ప్రశ్నలుంటాయి. ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి విభాగంలో 30 శాతం మార్కులు, అన్ని విభాగాల్లో కలిపి 100 మార్కులు సాధించాలి. ఐపీసీసీ: సీపీటీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. ఐపీసీసీ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ కోర్సు రెండు గ్రూపులుగా ఉంటుంది. అభ్యర్థులు తమ ఆసక్తికి అనుగుణంగా ఏదైనా ఒక గ్రూప్ లేదా ఒకేసారి రెండు గ్రూప్లకు పేరు నమోదు చేసుకోవచ్చు. ఇలా నమోదు చేసుకున్న తర్వాత తొమ్మిది నెలల స్టడీ కోర్సును పూర్తిచేయాలి. దీంతోపాటు ఓరియెంటేషన్ కోర్సు, 100 గంటలపాటు సాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సును పూర్తి చేయాలి. ఏటా మే, నవంబర్లో ఐపీసీసీ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యేందుకు ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం, గ్రూప్ మొత్తంమీద 50 శాతం మార్కులు రావాలి. డిగ్రీతో నేరుగా: 55 శాతం మార్కులతో కామర్స గ్రాడ్యుయేట్స్/ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పూర్తిచేసిన వారు, 60 శాతం మార్కులతో ఏదైనా ఇతర గ్రాడ్యుయేషన్/ పీజీ పూర్తిచేసిన వారు, ఐసీడబ్ల్యూఏఐ లేదా సీఎస్లో ఇంటర్ పూర్తిచేసిన అభ్యర్థులు సీపీటీకి హాజరు కావల్సిన అవసరం లేదు. వీరు నేరుగా రెండో దశ ఐపీసీసీలో చేరొచ్చు. ఆర్టికల్స్: ఐపీసీసీ కోర్సులోని గ్రూప్-1 గాని లేదా రెండు గ్రూప్స్ పూర్తిచేసిన వారు మూడు సంవత్సరాల ఆర్టికల్స్ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఐసీఏఐ గుర్తింపు ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ఆర్టికల్షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో స్టైపెండ్ కూడా సంపాదించుకోవచ్చు. ఫైనల్: ఐపీసీసీలో ఉత్తీర్ణత సాధించిన వారు ఫైనల్కు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రెండున్నరేళ్ల ఆర్టికల్స్ పూర్తిచేసిన తర్వాత ఫైనల్ పరీక్షకు అర్హత లభిస్తుంది. ఇందులోని ప్రతి గ్రూపులో నాలుగు పేపర్లు ఉంటాయి. ఐపీసీసీ మాదిరిగానే ఫైనల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం, గ్రూప్ మొత్తం మీద 50 శాతం మార్కు లు సాధించాలి. ఫైనల్తో పాటు జనరల్ మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సు కూడా చేయాలి. కెరీర్: సీఏ కోర్సు పూర్తిచేసిన వారికి సేవా రంగం, టెలికం, బ్యాంకింగ్, బీమా, సాఫ్ట్వేర్, మైనింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు, ఆడిటింగ్ ఫర్మ్స్, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ హౌసెస్, పేటెంట్ ఫర్మ్స్, లీగల్ హౌసెస్ వంటివి ఉన్నత అవకాశాలు కల్పిస్తున్నాయి. స్టాట్యుటరీ అండ్ ఇంటర్నల్ ఆడిటింగ్, అకౌంటింగ్, డెరైక్ట్-ఇన్డెరైక్ట్ ట్యాక్స్; ట్యాక్స్ ప్లానింగ్, టెక్నికల్ అనాలసిస్, రిస్క్ అసెసర్స్, సర్వేయర్స్, మర్చంట్ బ్యాంకర్స్, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, కన్సల్టెన్సీ సర్వీసెస్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ వంటి ఆధునిక విభాగాల్లోనూ అవకాశాలు లభిస్తున్నాయి. స్వయం ఉపాధి కోరుకునే వారు సొంతంగా ఆడిటర్గా కూడా ప్రాక్టీస్ ప్రారంభించొచ్చు. వేతనాలు: సీఏ ఉత్తీర్ణులకు ఆకర్షణీయమైన వేతనాలు అందుతున్నాయి. కెరీర్ ప్రారంభంలో ఫ్రెషర్కు నెలకు కనీసం రూ.35,000 వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ, అనుభవం ఆధారంగా దాదాపు అధిక వేతనాలు అందుకోవచ్చు. 2014 ఫిబ్రవరిలో ఐసీఏఐ నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్లో 678 మందికి ఉద్యోగావకాశాలు రాగా, వారిలో 144 మందికి రూ.9 లక్షల వార్షిక వేతనంతో ఆఫర్లు వచ్చాయి. అకౌంటింగ్ టెక్నీషియన్ కోర్సు: సీపీటీ పాసైన విద్యార్థి సీఏ పూర్తి చేయలేను అని భావిస్తే ఐపీసీసీలోని గ్రూప్-1 పూర్తిచేసి, ఏడాదిపాటు సీఏ దగ్గర ఆర్టికల్ షిప్ చేస్తే అకౌంటింగ్ టెక్నీషియన్ సర్టిఫికెట్ లభిస్తుంది. ఈ సర్టిఫికెట్తో ప్రభుత్వ/ప్రభుత్వేతర సంస్థల్లో చేరి కనీసం రూ.15 వేలు నుంచి రూ.20 వేల వరకు వేతనం పొందొచ్చు. ఉన్నత ప్రమాణాల కోర్సు.. అత్యున్నత అవకాశాలు ‘‘ఇంటర్లో ఏ గ్రూప్ చదివినా సీఏ కోర్సులోకి అడుగుపెట్టే అవకాశమున్నా, సీఏ కెరీర్ను లక్ష్యంగా నిర్దేశించుకున్న వారికి ఇంటర్లో సరైన గ్రూప్ ఎంఈసీ. దేశంలో థియరీ పరంగా, ప్రాక్టికల్స్ పరంగా ఉన్నత ప్రమాణాలతో అందిస్తున్న కోర్సుల్లో సీఏ ముందు వరుసలో ఉంటుంది. అందుకే ఈ కోర్సు పూర్తి చేసిన వారికి అత్యున్నత అవకాశాలు తలుపుతడుతున్నాయి. పరిశ్రమ అవసరాలకు తగినట్లు ఎప్పటికప్పుడు కొత్త అంశాలను చేర్చుతూ కోర్సును నిత్య నూతనంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ల వంటి అంతర్జాతీయ సంస్థల్లోనూ అవకాశాలు లభిస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సీఏ కోర్సులో అధిక శాతం మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు చేరుతుండటాన్ని దృష్టిలో ఉంచుకొని కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెంపొందించేందుకు జనరల్ మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సును ప్రవేశపెట్టాం. హైదరాబాద్ బ్రాంచ్లో తక్కువ ఫీజుతో, ఉత్తమ ఫ్యాకల్టీతో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. పరీక్షలకు ముందు క్రాష్ కోర్సు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నాం. వీటికి విశేష ఆదరణ లభిస్తోంది. కష్టించే తత్వం, నిరంతర అధ్యయన దృక్పథం ఉన్న వారికి సీఏ కెరీర్ ఆసరాగా ఉన్నతంగా ఎదగొచ్చు.’’ - ఓ.క్చ్టజ్ఛిటజి ఖ్ఛఛీఛీడ, చైర్మన్, హైదరాబాద్ బ్రాంచ్ (ఎస్ఐఆర్సీ), ఐసీఏఐ. కంపెనీ సెక్రటరీషిప్ (సీఎస్) కంపెనీ సెక్రటరీషిప్(సీఎస్) కోర్సును ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) నిర్వహిస్తోంది. ఒక కంపెనీలోని బోర్డ్ మీటింగ్ల నిర్వహణ, ఎజెండా, మినిట్స్ రూపకల్పన, వాటి ఆచరణపై పర్యవేక్షణ వంటి ఎన్నో ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వర్తించేది కంపెనీ సెక్రటరీలే. అయితే ఆ స్థాయికి చేరుకోవాలంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో మెంబర్షిప్ సొంతం చేసుకోవాలి. కంపెనీ సెక్రటరీషిప్ కోర్సు మొత్తం మూడు దశలుగా ఉంటుంది. అవి.. ఫౌండేషన్ ప్రోగ్రాం; ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం; ప్రొఫెషనల్ ప్రోగ్రాం. ఇంటర్తోనే ‘ఫౌండేషన్’: ఐసీఎస్ఐ.. సీఎస్ కోర్సులోని తొలిదశ ఫౌండేషన్ ప్రోగ్రాం. దీనికి అర్హత ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో పేరు నమోదు చేసుకోవాలి.. ఈ ప్రోగ్రాం కోసం పరీక్ష ప్రతి ఏటా రెండుసార్లు జూన్, డిసెంబర్లలో జరుగుతుంది. ఏడాది మొత్తం పేరు నమోదు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. పేరు నమోదు చేసుకున్న తేదీకి, తొలిసారి పరీక్షకు హాజరయ్యే తేదీకి మధ్య కనీసం 8 నెలల వ్యవధి తప్పనిసరి. ఈ ప్రోగ్రాంలో మొత్తం నాలుగు పేపర్లలో పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. రెండో దశ.. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం: ఫౌండేషన్ ప్రోగ్రాంలోని అన్ని పేపర్లలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కంపెనీ సెక్రటరీషిప్ ప్రోగ్రాంలోని రెండో దశ ‘ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం’కు తమ పేరు నమోదు చేసుకోవాలి. బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులు ఫౌండేషన్ ప్రోగ్రాంలో ఉత్తీర్ణతతో సంబంధం లేకుండా నేరుగా ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంకు పేరు నమోదు చేసుకోవచ్చు. ఈ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం రెండు మాడ్యూల్స్లో ఉంటుంది. ఒక్కో మాడ్యూల్లో మూడు పేపర్లు ఉంటాయి. ఈ పరీక్షలు ఏటా రెండుసార్లు జూన్, డిసెంబర్లలో జరుగుతాయి. ప్రొఫెషనల్ ప్రోగ్రాం టు సెటిల్ ఇన్ ప్రొఫెషన్: ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. సీఎస్ ప్రొఫెషన్లో సెటిలయ్యేందుకు చివరి దశ ప్రొఫెషనల్ ప్రోగ్రాంలో పేరు నమోదు చేసుకోవాలి. ప్రొఫెషనల్ ప్రోగ్రాంను మొత్తం నాలుగు మాడ్యూల్స్గా విభజించారు. ఒక్కో మాడ్యూల్లో రెండు పేపర్లు ఉంటాయి. 15 నెలల ప్రాక్టికల్ ట్రైనింగ్: ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంలో ఉత్తీర్ణత సాధించి ప్రొఫెషనల్ ప్రోగ్రాంలో పేరు నమోదు చేసుకున్న అభ్యర్థులు ఫ్రొఫెషనల్ ప్రోగ్రాం పరీక్ష రాసే సమయానికి తప్పనిసరిగా 15 నెలల ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేసుకోవాలి. అవకాశాలు: 1956 కంపెనీల చట్టం ప్రకారం రూ.5 కోట్ల అధీకృత మూలధనం ఉన్న ప్రతి సంస్థ ఒక పూర్తి స్థాయి కంపెనీ సెక్రటరీని నియమించుకోవాలి. కార్పొరేట్ గవర్నెస్ అండ్ సెక్రటరీయల్ సర్వీసెస్, కార్పొరేట్ లాస్ అడ్వైజరీ అండ్ రిప్రజెంటేషన్ సర్వీసెస్, ఫైనాన్షియల్ మార్కెట్ సర్వీసెస్, మేనేజ్మెంట్ సర్వీసెస్ సంబంధిత కంపెనీల్లో అవకాశాలు విస్తృతం. స్వయం ఉపాధి దిశగా ఆలోచించే వారు సొంతంగా ప్రాక్టీస్ కూడా చేయవచ్చు. వేతనం: ఒక ఫ్రెషర్కు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వార్షిక వేతన ప్యాకేజ్ లభిస్తుంది. ఈ రంగంలో కనీసం పదేళ్ల అనుభవం ఉంటే రూ. 25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వేతనం అందుకోవచ్చు. -
ముందు సంపాదన... తర్వాత సరదా!
గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాలనుకొనే ప్రస్తుత యువతరానికి ‘ఒరాకిల్’ కంపెనీలో ఉద్యోగం సంపాదించడం ఒక కల. ఆయన కూడా అలాంటి మంచి ఉద్యోగం ఏదైనా సంపాదించుకొంటే చాలనుకొన్నాడట. అయితే మదిలోని వ్యాపార ఆలోచనలు అతడిని ప్రశాంతంగా ఉద్యోగం మీద దృష్టి సారించనివ్వలేదు. ఏదో చేయాలనే తపన తీవ్రమవసాగింది. అమెరికాలో ఇంకా అప్పుడప్పుడే కంప్యూటరీకరణ అవుతున్న సేవారంగ వ్యవస్థలను చూసి ఆ రంగంలో ప్రయత్నిస్తే లాభం ఉంటుందేమోననే ఆలోచన మొదలైంది. ప్రయత్నాలు మొదలెట్టాడు, అంతే... ఆయన దశ తిరిగింది. ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకడయ్యాడు. దాదాపు 32 ఏళ్ల క్రితం ఒక సాఫ్ట్వేర్ కంపెనీని మొదలుపెట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వేల మందికి ఉపాధినిస్తూ కోట్ల రూపాయలకు అధిపతి అయిన ఆయనే - ఒరాకిల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ ఎలిసన్. న్యూయార్క్లోని ఒక యూదు కుటుంబంలో జన్మించిన ల్యారీ ఎలిసన్ను తల్లిదండ్రులు చిన్నప్పుడు తెలిసిన వాళ్లకు దత్తత ఇచ్చేశారు. వారింట్లో పెరిగి పెద్ద అయిన ఎలిసన్కు చదువు అంతగా అబ్బలేదు. అయితే గ్రాడ్యుయేషన్లో నేర్చుకొన్న కంప్యూటర్స్ సబ్జెక్ట్ బాగా నచ్చింది. దాన్నే అర్హతగా చేసుకొని ‘ఆంపెక్స్ కార్పొరేషన్’ అనే డాటా మేనేజ్మెంట్ కంపెనీలో పని చేయసాగాడు. ఆ సమయంలో అమెరికన్ గూఢచారి సంస్థ ‘సీఐఏ’ ఇచ్చిన ఒక ప్రాజెక్ట్కు ఎలిసన్ పెట్టిన పేరే - ‘ఒరాకిల్’. అది 1970 నాటి మాట. ఆ తర్వాత 12 సంవత్సరాలకు ‘ఒరాకిల్ సిస్టమ్స్ కార్పొరేషన్’ పేరుతో ఒక కంపెనీని స్థాపించాడు ఎలిసన్. 1990 వరకూ కూడా నిలదొక్కుకోవడానికి ఆ కంపెనీ చాలా కష్టాలే పడింది. అప్పటి వరకూ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య కేవలం 400. అయితే ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్వేర్ సేవలు విస్తృతం అయ్యాక ఒరాకిల్ కంపెనీ స్థాయి మారిపోయింది. కోట్ల డాలర్ల టర్నోవర్ స్థాయికి చేరుకొంది. ఆ తర్వాత అనేక సాఫ్ట్వేర్ కంపెనీలను కొనుగోలు చేసి విలీనం చేసుకొన్నాడు. ఉద్యోగుల సంఖ్య వేల స్థాయికి చేరింది. ఎలిసన్ సంపద కోట్ల స్థాయికి చేరింది. ఇందులోనే కొంత మొత్తాన్ని విరాళాలకూ, సామాజిక సేవకూ వెచ్చిస్తూ సాగుతున్నాడు ఎలిసన్. ఇక ఆయన జీవనశైలి విషయానికి వస్తే... ఎలిసన్ ఒక సరదా మనిషి. ఆయన అభిరుచులు చూసిన వారు చెప్పే మాట ఇది. ‘‘ఒక దశ వరకూ క్రమశిక్షణతో గడిపితే తప్ప కోట్ల రూపాయలను జమ చేయడం సాధ్యం కాదు... కానీ కొంత సంపాదించాక మన సరదాలను తీర్చుకోగలగాలి. వాటి కోసం కూడా మనం కొంత సమయాన్ని వెచ్చించాలి. అలా వెచ్చించగలిగినప్పుడు జీవితంలో సాధించిన సక్సెస్కు ఒక పరిపూర్ణత వస్తుంది...’’ అని అంటాడాయన. ఎలిసన్కు విమానాలు నడపడం అంటే ఇష్టం. బాగా డబ్బు సంపాదించిన తర్వాత మొదలైన సరదా అది. అందుకోసం ఆయన సొంతంగా విమానాలు కొనుక్కున్నాడు. పెలైట్గా శిక్షణ పొందాడు. 69 ఏళ్ల వయసులో కూడా విమానాలను నడపడంలో సాహసాలు చేస్తూ థ్రిల్ఫుల్గా గడిపేస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రపంచంలోని శ్రీమంతుల జాబితాలో నాలుగోస్థానంలో ఉన్న ఎలిసన్ భవిష్యత్తులో తొలి స్థానానికి చేరే అవకాశాలు కూడా ఉన్నాయని ‘ఫోర్బ్స్’ అంచనా -
ఎయిర్ఫోర్స్.. అవకాశాలకు ఆకాశమే హద్దు
దేశ సేవలో పాలుపంచుకునే అవకాశంతోపాటు అత్యుత్తమ కెరీర్కు బాటలు వేసే వేదిక భారతీయ వాయుసేన. ఇండియన్ ఎయిర్ఫోర్స్లో వివిధ హోదాల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియెట్, గ్రాడ్యుయేషన్/ఇంజనీరింగ్, బీఈడీ ఉత్తీర్ణులు ఆయా కొలువులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష, వైద్య, శారీరక పరీక్షలు, మౌఖిక పరీక్ష.. ఇలా అన్ని దశలను దాటుకుని విజేతలైనవారు ఇండియన్ ఎయిర్ఫోర్స్లో ప్రవేశించవచ్చు. ఈ నేపథ్యంలో భారతీయ వాయుసేనలో ఉన్న వివిధ ఉద్యోగావకాశాలపై ప్రత్యేక ఫోకస్.. పదో తరగతితో పదో తరగతి ఉత్తీర్ణులు గ్రూప్-వై విభాగంలో మ్యుజీషియన్ ఉద్యోగాలు పొందొచ్చు. అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు కీ బోర్డ్/గిటార్/వయోలిన్ /శాక్సాఫోన్/జాజ్ డ్రమ్/సరోద్/వీణ/నాద స్వరం వంటి వాటిలో దేనిలోనైనా ప్రావీణ్యం ఉండాలి. వయోపరిమితి: నిర్దేశిత తే దీనాటికి 17-25 ఏళ్లు. ఎంపిక: రాత పరీక్ష, వాద్య పరికరంలో పరీక్ష ఆధారంగా. రాత పరీక్షలో భాగంగా ఇంగ్లిష్ డిక్టేషన్ను పరీక్షిస్తారు. దీంతోపాటు సంబంధిత వాద్య పరికరంలో అభ్యర్థి ప్రావీణ్యతను తెలుసుకుంటారు. 10+2తో ప్రతి ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ ఎగ్జామ్ (ఎన్డీఏ అండ్ ఎన్ఏ) ద్వారా ఇండియన్ ఎయిర్ఫోర్స్లో ఫ్లైయింగ్ ఆఫీసర్గా ఉద్యోగం పొందొచ్చు. అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్లతో 10+2 ఉత్తీర్ణత. అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి 16 1/2 నుంచి 19 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా. రాత పరీక్ష విధానం: ఇందులో రెండు పేపర్లుంటాయి. అవి.. 1. మ్యాథ్స్ (300 మార్కులు), 2. జనరల్ ఎబిలిటీ టెస్ట్ (600 మార్కులు). రెండో పేపర్ జనరల్ ఎబిలిటీ టెస్ట్లో భాగంగా పార్ట్-ఏ, పార్ట్-బీ అనే రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్-ఏలో ఇంగ్లిష్ 200 మార్కులకు, పార్ట్-బీలో జనరల్ నాలెడ్జ్ 400 మార్కులకు ప్రశ్నలడుగుతారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. తప్పుగా గుర్తించిన వాటికి నెగెటివ్ మార్కులుంటాయి. ఒక్కో పేపర్ కాల వ్యవధి రెండున్నర గంటలు. నోటిఫికేషన్: ఏడాదికి రెండుసార్లు (మే, డిసెంబర్) వెబ్సైట్: www.upsc.gov.in ఎయిర్మెన్ ఉద్యోగాలు భారతీయ వాయుసేనలో గ్రూప్-ఎక్స్, గ్రూప్-వై విభాగాల్లో ఎయిర్మెన్ ఉద్యోగాల భర్తీకి ప్రతి ఏటా ఎంపిక నిర్వహిస్తారు. అర్హతలు: గ్రూప్- ఎక్స్ (ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ మినహా): 50 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్లతో 10+2 ఉత్తీర్ణత. ఇంగ్లిష్లో 50 శాతం మార్కులు తప్పనిసరి. లేదా 50 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా (మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/కంప్యూటర్ సైన్స్/ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణత. వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి 17 - 21 ఏళ్లు. గ్రూప్-వై (మ్యుజీషియన్, మెడికల్ అసిస్టెంట్ మినహా): 50 శాతం మార్కులతో ఏదైనా గ్రూప్తో 10+2 ఉత్తీర్ణత. ఇంగ్లిష్లో 50 శాతం మార్కులు తప్పనిసరి. వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి 17-21 ఏళ్లు. గ్రూప్-వై (మెడికల్ అసిస్టెంట్): 50 శాతం మార్కులతో ఫిజిక్స్/కెమిస్ట్రీ/బయాలజీ/ఇంగ్లిష్లతో 10+2 ఉత్తీర్ణత. ఎంపిక: దేశవ్యాప్తంగా ఎంపిక పరీక్ష, రిక్రూట్మెంట్ ర్యాలీ, ఇంటర్వ్యూల ఆధారంగా. టెక్నికల్ విభాగాలవారికి ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది. రాత పరీక్ష: గ్రూప్- ఎక్స్ (టెక్నికల్ విభాగాలు) వారికి ఇంగ్లిష్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్లపై పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి ఒక గంట (60 నిమిషాలు). గ్రూప్-వై (నాన్ టెక్నికల్) వారికి ఇంగ్లిష్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్లపై ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 45 నిమిషాలు. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. 10+2 స్థాయి సిలబస్పై ప్రశ్నలు అడుగుతారు. బీఈడీతో.. సంబంధిత డిగ్రీ, పీజీలతోపాటు బీఈడీ ఉత్తీర్ణులు గ్రూప్-ఎక్స్లో ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. బోధనలో రెండేళ్ల అనుభవం ఉండాలి. లేదా ఏదైనా పీజీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత. రెండేళ్లపాటు బోధనలో అనుభవం ఉండాలి. వయోపరిమితి: డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులకు 20-25 ఏళ్లు. పీజీ, బీఈడీ ఉత్తీర్ణులకు 20-28 ఏళ్లు. ఎంపిక: రాతపరీక్ష, శారీరక, వైద్య పరీక్షల ఆధారంగా. ఇంజనీరింగ్/గ్రాడ్యుయేషన్తో ఫ్లైయింగ్ బ్రాంచ్ దీనికి ఎంపికైనవారు ఫైటర్ పైలట్ లేదా హెలికాఫ్టర్ పైలట్ లేదా ట్రాన్స్పోర్ట్ పైలట్గా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వివిధ పద్ధతుల ద్వారా ఫ్లైయింగ్ బ్రాంచ్లో అవకాశాలు కల్పిస్తారు. అవి.. గ్రాడ్యుయేషన్, ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ, ఎస్ఎస్సీ ఎంట్రీ గ్రాడ్యుయేషన్తో సీడీఎస్ఈ ద్వారా.. ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులు యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ (సీడీఎస్ఈ) ద్వారా ఫ్లైయింగ్ బ్రాంచ్లో ప్రవేశించొచ్చు. అర్హతలు: భారతీయ పౌరులై ఉండాలి. అవివాహితులై ఉండాలి. పురుషులు మాత్రమే అర్హులు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్/బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. 10+2లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి. వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి 19- 23 ఏళ్లు. నోటిఫికేషన్: ఏడాదికి రెండుసార్లు (జూన్, అక్టోబర్) మరిన్ని వివరాలకు వెబ్సైట్: www.upsc.gov.in ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ: నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ)లో ‘సి’ సర్టిఫికెట్ పొందినవారు ఎన్సీసీ స్పెషల్ ఎం ట్రీ ద్వారా ఫ్లైయింగ్ బ్రాంచ్లో ప్రవేశం పొందొచ్చు. అర్హతలు: భారతీయ పౌరులై ఉండాలి. అవివాహితులై ఉండాలి. 60 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. 10+2లో మ్యాథ్స్, ఫిజిక్స్లు చదివుండాలి. లేదా 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. ఎన్సీసీ ఎయిర్వింగ్ సీనియర్ డివిజన్ నుంచి ‘సి’ సర్టిఫికెట్ పొంది ఉండాలి. వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి 19-23 ఏళ్లు. దరఖాస్తు: ఎన్సీసీ ఎయిర్ స్క్వాడ్రన్స్/డెరైక్టర్ జనరల్, ఎన్సీసీ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్ఎస్సీ (షార్ట్ సర్వీస్ కమిషన్) ఎంట్రీ: ఇందులో ప్రవేశానికి మహిళలు, పురుషులూ ఇద్దరూ అర్హులే. ఎయిర్ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్సీఏటీ) ద్వారా ఇందులో అడుగుపెట్టొచ్చు. అర్హతలు: భారతీయ పౌరులై ఉండాలి. అవివాహితులై ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. 10+2లో మ్యాథ్స్, ఫిజిక్స్లు చదివుండాలి. లేదా 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి 19 - 23 ఏళ్లు. ప్రకటన: ఎయిర్ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్కు ప్రతి ఏటా జూన్, డిసెంబర్లలో ప్రకటన వెలువడుతుంది. గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ ఇందులో మొత్తం ఐదు విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అవి.. అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచ్: ఇందులో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్గా, ఫైటర్ కంట్రోలర్గా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అర్హత: 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత లేదా 50 శాతం మార్కులతో పీజీ/తత్సమాన డిప్లొమా ఉత్తీర్ణత. అకౌంట్స్ బ్రాంచ్: వివిధ ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించడంతోపాటు ఆడిటర్గా పనిచేయాల్సి ఉంటుంది. అర్హత: 60 శాతం మార్కులతో బీకాం ఉత్తీర్ణత లేదా 50 శాతం మార్కులతో ఎంకాం/సీఏ/ఐసీడబ్ల్యుఏ ఉత్తీర్ణత. లాజిస్టిక్స్ బ్రాంచ్: లాజిస్టిక్స్ బ్రాంచ్కు ఎంపికైనవారు ఎయిర్ఫోర్స్కు సంబంధించిన వివిధ వనరులు, వస్తు సేవలను నిర్వహించాలి. ఎక్విప్మెంట్ పర్యవేక్షణ చేయాలి. అర్హత: 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత లేదా 50 శాతం మార్కులతో పీజీ/తత్సమాన డిప్లొమా. ఎడ్యుకేషన్ బ్రాంచ్: అర్హత: 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత. మెటియొరాలజీ బ్రాంచ్: వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఫ్లైట్ ఆపరేటర్స్కు సలహాలను అందించడంతోపాటు ఇతర విధులు నిర్వహించాలి. అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా సైన్స్ స్ట్రీమ్తో పీజీ/మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/జాగ్రఫీ/కంప్యూటర్ అప్లికేషన్స్/ఎన్విరాన్మెంటల్ సైన్స్/అప్లైడ్ ఫిజిక్స్/ఓషనోగ్రఫీ/అగ్రికల్చర్ మెటియొరాలజీ/ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్/జియోఫిజిక్స్/ఎన్విరాన్మెంటల్ బయాలజీ ఉత్తీర్ణత. 55 శాతం మార్కులతో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్లో ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నికల్ బ్రాంచ్ టెక్నికల్ బ్రాంచ్కు ఎంపికైనవారు ఎయిర్ఫోర్స్లో అత్యాధునిక ఎక్విప్మెంట్కు ఇన్చార్జ్గా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇందులో రెండు విధానాల ద్వారా ప్రవేశించొచ్చు. అవి.. యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ (యూఈఎస్), ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సు. రెండింటిలోనూ ఎయిర్ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది. యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్: అర్హతలు: అవివాహితులై ఉండాలి. పురుషులు మాత్రమే అర్హులు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో బీఈ/బీటెక్ ప్రీ ఫైనలియర్ చదువుతుండాలి. వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి 18-28 ఏళ్లు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్స్ ద్వారా.. అర్హతలు: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్/సంబంధిత బ్రాంచ్ల్లో ఉత్తీర్ణత. పర్మినెంట్ కమిషన్కు పురుషులు, షార్ట్ సర్వీస్ కమిషన్కు పురుషులు, మహిళలు అర్హులు. ఎంపిక: ఎయిర్ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా. ప్రకటన: ప్రతి ఏటా జూన్, డిసెంబర్లలో. వెబ్సైట్: careerairforce.nic.in -
పరిశోధనలకు పదును పెట్టాలి
చంద్రగిరి, న్యూస్లైన్: ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న భారత్లో శాస్త్రవేత్తలు పరిశోధనలకు పదును పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ పిలుపునిచ్చారు. శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల్లో బుధవారం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కస్తూరి రంగన్ మాట్లాడుతూ సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదిగే లక్ష్యంతో చదవాలని సూచించారు. భారత ప్రభుత్వం పరిశోధనలకు పెద్దపీట వేస్తోందని, శాస్త్రవేత్తలకు మంచి గుర్తింపు ఇస్తోందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం 300 మంది ఎంటెక్, ఎంసీఏ విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. అంతకుముందు శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల చైర్మన్, సినీనటుడు మోహన్బాబు, విద్యాసంస్థల సీఈవో మంచు విష్ణువర్ధన్బాబు, చెన్నైకి చెందిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ డెరైక్టర్ ప్రొఫెసర్ నారాయణరావు మాట్లాడుతూ భావితరానికి వెలుగును అందించేందుకు పరిశోధనలు తప్పకుండా జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ ప్రొఫెసర్ శశిధర్, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల ప్రత్యేకాధికారి గోపాలరావు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీసీ కృష్ణమాచారి, సినీ నటుడు మంచు మనోజ్కుమార్, పలువురు విభాగాధిపతులు పాల్గొన్నారు.