convocation
-
ఘనంగా అపోలో మెడికల్ కాలేజ్ కాన్వోకేషన్
అపోలో మెడికల్ కాలేజ్ కాన్వోకేషన్ ఉత్సవం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ నాగేశ్వరరెడ్డి హాజరయ్యారు. అపోలో మెడికల్ కాలేజ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి అత్యుత్తమంగా నిలిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందజేశారు. 2018 బ్యాచ్ ఎంబీబీఎస్ చదివిన 100 మంది విద్యార్థులకు పట్టాలు అందించారు. ఈ కార్యక్రమంలో సీవోవో అపర్ణా రెడ్డి, డీన్ మనోహర్, మెడికల్ కాలేజ్ విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.జనరల్ మెడిసిన్లో అవినాష్కు గోల్డ్ మెడల్2018 బ్యాచ్ జనరల్ మెడిసిన్కు గాను డాక్టర్ దండు అవినాష్ రెడ్డి గోల్డ్ మెడల్ అందుకున్నారు. "కష్టపడి చదవడం వల్ల గోల్డ్ మెడల్ సాధించగలిగానని, తల్లితండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని, అత్యుత్తమ విద్య బోధించినందుకు అపోలోకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని" అవినాష్ తెలిపారు. ఇక డాక్టర్ ప్రతాప్రెడ్డికి సంబంధించి ఛైర్మన్ మెడల్ను సిద్ధాంత్ బర్మేచ అందుకున్నారు.700 దాటిన అపోలో మెడిసిన్ గ్రాడ్యుయేట్లుఅపోలో కాలేజ్ ప్రారంభించి ఇప్పటికీ పుష్కరకాలం దాటింది. 2012లో ప్రారంభమైన అపోలో మెడికల్ కాలేజ్ నుంచి ఇప్పటివరకు 700 మంది విద్యార్థులు డాక్టర్లుగా ఎదిగారు. ఇదే విషయాన్ని కాన్వోకేషన్లో ప్రస్తావించారు డాక్టర్ నాగేశ్వరరెడ్డి. "భారతదేశంలోనే నాణ్యమైన వైద్య విద్యను అందిస్తోన్న అపోలోలో చదువుకునే అదృష్టం మీకు దక్కడం గొప్ప విషయం. ఈ పునాదిని మరింత బలంగా మార్చుకుని వైద్యులుగా రాణించాలని కోరుకుంటున్నాను. అలాగే నేర్చుకోవాలన్న మీ ధృడ సంకల్పం జీవితాంతం కొనసాగాలని ఆశిస్తున్నాను" అని అన్నారు. -
నల్సార్ స్నాతకోత్సవానికి హాజరైన రాష్ట్రపతి ముర్ము
హైదరాబాద్, సాక్షి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక రోజు పర్యటన నిమిత్తం నగరానికి వచ్చారు. శనివారం ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, అధికారులు తదితరులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి.. మేడ్చల్ జిల్లాలోని శామీర్పేట్లో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయాలనికి వెళ్లారు. అక్కడ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముర్ము ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమం తర్వాత బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయల్దేరారు. అక్కడ భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. -
బహదూర్పల్లిలోని మహీంద్రా యూనివర్శిటీ మూడవ వార్షిక స్నాతకోత్సవం (ఫొటోలు)
-
భారతీదాసన్ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రధాని
-
జనాభా పెరుగుదలపై ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు..
ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి (Narayana Murthy) ఇటీవల కోల్కతాలోని టెక్నో ఇండియా యూనివర్శిటీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం గురించి, జనాభా నియంత్రణ గురించి వ్యాఖ్యానించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నారాయణ మూర్తి స్నాతకోత్సవంలో మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు తన విశ్వాసాలను స్వేచ్ఛగా ఆచరించుకోవచ్చు. అలాంటి సమాజంలో ప్రజాస్వామ్యం ఉత్తమంగా ఉంటుందని వ్యక్తం చేశారు. దేశ జనాభా నియంత్రణకు సరైన ప్రాధాన్యం లేదని వెల్లడించారు. దేశంలోనో కొన్ని ప్రాంతాల్లో నియంత్రణ ఉన్నప్పటికీ.. చాలా ప్రాంతాల్లో దీన్ని పూర్తిగా విస్మరించినట్లు చెప్పుకొచ్చారు. నిజనమైన ప్రజాస్వామ్యానికి నాలుగు స్వేచ్ఛలు ఉంటాయని, అవి.. భావ ప్రకటన స్వేచ్ఛ, విశ్వాసాల మీద స్వేచ్ఛ, భయం నుంచి స్వేచ్ఛ, కోరికల పట్ల స్వేచ్ఛ అని అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డీ రూజ్వెల్ట్ మాటలు గుర్తు చేశారు. ఇదీ చదవండి: అదే జరిగితే 70 వేల ఉద్యోగాలు పోతాయ్.. ఎక్కడో తెలుసా? భారతదేశం గత మూడు దశాబ్దాలుగా ప్రశంసనీయమైన ఆర్థిక పురోగతి ఉన్నప్పటికీ, పేదరికం, త్రాగునీరు, విద్య, పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ వంటి వాటిలో ఇంకా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తున్నట్లు తెలిపారు. జనాభా పెరుగుదలను తగ్గించడం ఇప్పుడు చేయవల్సిన ముఖ్యమైన పని. జనాభా సమస్య రానున్న 20 నుంచి 25 ఏళ్లలో మన దేశంపై విధ్వంసం సృష్టించే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించారు. -
ప్రిన్సిపాల్ ఎదుట డాన్స్.. ఊహించని షాక్.. డిగ్రీ గోవిందా!
అమెరికా: అమెరికాలో ఒక హై స్కూల్లో స్టేజి మీద డాన్స్ చేసినందుకు ఓ విద్యార్థినికి డిప్లొమా పట్టా ఇవ్వడానికి నిరాకరించారు ఆ స్కూలు ప్రిన్సిపాల్. దీంతో ఇన్నేళ్ల శ్రమ మొత్తం బూడిదలో పోసినట్టయ్యిందని ఆ విద్యార్థిని తోపాటు ఆమె తల్లిదండ్రులు వాపోతున్నారు. జూన్ 9న ఫిలడెల్ఫియా బాలికల హై స్కూల్ స్నాతకోత్సవంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తమ పిల్లలు డిగ్రీలు స్వీకరిస్తున్న సమయంలో ఎలాంటి గోల, అరుపులు చేయవద్దని.. కనీసం చప్పట్లు కూడా కొట్టవద్దని స్ట్రిక్ట్ గా చెప్పింది స్కూల్ యాజమాన్యం. దీంతో నిశ్శబ్ద వాతావరణంలో పట్టా ప్రదానోత్సవం జరుగుతుండగా హఫ్సా అబ్దుల్ రహ్మాన్ అనే అమ్మాయి తన పేరు పిలవగానే స్టేజి మీదకు వచ్చింది. కానీ డిగ్రీ పట్టా సాధిస్తున్నానన్న సంతోషంలో ఉండబట్టలేక చిన్నగా చిందేసింది. అదికాస్తా ప్రిన్సిపాల్ దృష్టిలో పడేసరికి ఆమెకు పట్టా అందివ్వలేదు సరికదా మర్యాదగా స్టేజి విడిచి వెళ్ళమని ఆదేశించారు. దీంతో స్టేజి విడిచి వెళ్లిన హఫ్సా అబ్దుల్ రహ్మాన్ ప్రిన్సిపాల్ పట్టా అందివ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది. నేనే తప్పూ చేయలేదు, ఏ నిబంధనను అతిక్రమించలేదని తెలిపింది. ఇదే స్నాతకోత్సవంలో హఫ్సా తనతో పాటు 2014లో కాల్పుల్లో చనిపోయిన తన సోదరి ఐషా తరపున కూడా డిగ్రీ పట్టా స్వీకరించాల్సి ఉంది. కానీ అంతలోనే ఆమెను స్టేజి విడిచి వెళ్ళమనడంతో బోరున ఏడ్చేసింది. హఫ్సా తల్లి మాట్లాడుతూ.. నాలుగేళ్లపాటు కోవిడ్ సమయంలో మానసికంగానూ, శారీరకంగానూ చాలా ఇబ్బందులు ఎదుర్కొని చదువుకున్నారని. ప్రిన్సిపాల్ ఇలా చేయడం అమానుషమని అన్నారు. Controversy at Philadelphia Girls' High School as Muslim graduate Hafsah Abdur-Rahman's diploma denied on stage for a celebratory dance. Despite the district's apology, her family calls for rule changes. pic.twitter.com/qbiIG0Rlr7 — Middle East Eye (@MiddleEastEye) June 18, 2023 ఇది కూడా చదవండి: మోస్ట్ వాంటెడ్ ఖలిస్థాన్ ఉగ్రవాది హతం.. -
20న ఏఎన్యూ స్నాతకోత్సవాలు
ఏఎన్యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 37, 38వ స్నాతకోత్సవాలు కలిపి ఈనెల 20న నిర్వహించనున్నామని వీసీ ఆచార్య పి.రాజశేఖర్ తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని, ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేయనున్నామని పేర్కొన్నారు. చాన్సలర్ హోదాలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొంటారని తెలిపారు. స్నాతకోత్సవంలో పలువురికి డిగ్రీలు, బంగారు పతకాలు అందజేయనున్నామని వివరించారు. స్నాతకోత్సవ ఏర్పాట్లపై మంగళవారం వీసీ పలు కమిటీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కమిటీ సభ్యులకు సూచించారు. (క్లిక్: ‘చంద్ర’గ్రహణం వీడుతున్న కుప్పం) -
CM YS Jagan: సీఎం జగన్ పారిస్కు పయనం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పారిస్కు బయలుదేరారు. తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో పారిస్ బయలుదేరారు. బుధవారం ఉదయం 5.10 గంటలకు పారిస్ చేరుకుంటారు. అక్కడ తన కుమార్తె గ్రాడ్యుయేషన్ కాన్వొకేషన్ వేడుకలో పాల్గొననున్నారు. తిరిగి జూలై 2న సాయంత్రం 4 గంటలకు పారిస్లో బయలుదేరి, 3వ తేదీ ఉదయం 6.45 గంటలకు గన్నవరం చేరుకుంటారు. చదవండి: (ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో 3 లక్షల మందికి కొత్త పింఛన్లు) -
ISB Hyderabad: అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు.. అరుదైన ఘనతలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది నగరంలోని ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ (ఐఎస్బీ). దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది ఈ కళాశాల. గురువారం ఐఎస్బీ స్నాతకోత్సవం, వార్షికోత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేయనుండటం దీని ప్రాధాన్యాన్ని తేటతెల్లం చేస్తోంది. ఐఎస్బీ విశిష్టతలపై ప్రత్యేక కథనం ఇదీ.. స్థాపన ఇలా.. ► ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహకారంతో పలువురు వ్యాపారవేత్తలు నగరంలోని గచ్చిబౌలిలో 260 ఎకరాల విస్తీర్ణంలో 1999 డిసెంబర్ 20న ఐఎస్బీని ఏర్పాటు చేశారు. ఇండియన్ బిజినెస్ స్కూల్కు అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయీ శంకుస్థాపన చేశారు. ఇది లండన్ బిజినెస్ స్కూల్, వార్టన్ బిజినెస్ స్కూల్, కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్, లండన్ బిజినెస్ స్కూళ్లతో భాగస్వామ్య సంబంధాలు కలిగి ఉంది. ► ఐఎస్బీకి దేశంలో హైదరాబాద్లోని గచ్చిబౌలి, పంజాబ్లోని మొహలీలో క్యాంపస్లు ఏర్పాటు చేశారు. ఇది ఏఎంబీఏ, ఈక్యూయూఐఎస్, ఏఏసీఎస్బీల ద్వారా అక్రిడిటేషన్ల ‘ట్రిపుల్ క్రౌన్’ పొందిన ప్రపంచంలోని 100వ కళాశాలల్లో ఐఎస్బీ ఒకటి. గచ్చిబౌలిలోని ఐఎస్బీ క్యాంపస్కు ఈ నెల 26న ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు. 930 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేయనున్నారు. అప్పట్లో ప్రముఖుల సందర్శన.. ఐఎస్బీ గచ్చిబౌలి క్యాంపస్ను డిసెంబర్ 2, 2001న అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ ప్రారంభించారు. 2006 డిసెంబర్ 5న డాక్టర్ మన్మోహన్సింగ్ క్యాంపస్కు విచ్చేశారు. 2006 మార్చి 1న అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ సందర్శించారు. 2002 జనవరి 2న సింగపూర్ అధ్యక్షుడు ఎస్ఆర్ నాథన్ పరిశీలించారు. 2002 జనవరి 2న అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ ఐఎస్బీ క్యాంపస్ను సందర్శించారు. (క్లిక్: బేగంపేటలో మోదీ స్వాగత సభ?) ప్రపంచంలో 38వ స్థానం.. ఐఎస్బీ తాజాగా 2022లో ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్స్ ప్రోగ్రామ్స్ ర్యాంకింగ్స్ను తాజాగా విడుదల చేశారు. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్లో ప్రపంచంలోనే 38వ స్థానం పొందింది. ఇండియాలోనే నెంబర్ వన్ బిజినెస్ స్కూల్గా కూడా ర్యాంకింగ్ను సాధించింది. ఎఫ్టీ ర్యాంకింగ్, అధిక– నాణ్యత పరిశోధన, విద్య కోసం భారతదేశాన్ని ప్రపంచ మ్యాప్లో ఉంచింది. ఇదిలావుండగా ఐఎస్బీ ఫ్యూచర్ యూస్ పారామీటర్లో అంతర్జాతీయంగా 7వ స్థానంలో నిలిచింది. ‘డీ ల్యాబ్స్’తో నూతన ఆవిష్కరణలు.. ఐఎస్బీలోని గచ్చిబౌలి క్యాంపస్లో డీ ల్యాబ్స్ పేరిట నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఇంక్యుబేషన్ కేంద్రాన్ని 2015లో ప్రారంభించారు. దీంట్లో ఇప్పటి వరకు 125కు పైగా స్టార్టప్లను వివిధ రంగాలలో ఏర్పాటు చేశారు. దీనికి అంతర్జాతీయ ఇంక్యుబేటర్ నుంచి మద్దతు లభిస్తోంది. ఇటీవలే కేంద్రం రూ.5 కోట్ల నిధులను స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్కింద మంజూరు చేసింది.70 స్టార్టప్లకు దాదాపు 350 కోట్ల నిధుల సేకరణ కోసం స్టార్టప్లు ముందంజ వేశాయి. ప్లేస్మెంట్స్లోనూ టాపే.. ► ప్లేస్మెంట్స్లోనూ ఐఎస్బీ దేశంలోనే టాప్గా నిలుస్తోంది. ప్రతియేటా 100 శాతం విద్యార్థులు ఉద్యోగాలు పొందడం విశేషం. 2019–20లో ఏడాదికి సరాసరి వేతనం రూ.42 లక్షలు, అత్యల్పంగా రూ.24.10 లక్షల వేతనం, 20–21లో సరాసరి వేతనం రూ.72 లక్షలు, అత్యల్పంగా రూ.27 లక్షల వేతనం లభించింది. 2021–22లో సరాసరి వేతనం రూ.34.07 లక్షలుగా పొందారు. ► 2019–20లో 1,504 ఆఫర్లు, 20–21లో 1,195 ఆఫర్లు, 2021–22లో 2,066 ఆఫర్లను విద్యార్థులు పొందారు. (క్లిక్: మోదీ హైదరాబాద్ టూర్; ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్) ► అమెజాన్, ఫ్లిప్కార్ట్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, హనీవెల్, యాక్సిస్ బ్యాంక్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, జెన్ప్యాక్ట్, విప్రో, సీకే బిర్లా గ్రూపు, కేపీఎంజీ, హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్, టెక్ మహీంద్ర, డీబీఎస్ బ్యాంక్, డిలాయిట్ యూఎస్ఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి ప్రధాన కంపెనీలు ప్లేస్మెంట్లో పాల్గొన్నాయి. ఐఎస్బీ–20 ఏళ్ల వేడుకల్లో ప్రధాని పాల్గొనడం విశేషం.. ఐఎస్బీ 20 ఏళ్ల వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడం మాకు ఎంతో గౌరవంగా ఉంది. ఆయన హైదరాబాద్, మొహాలీ క్యాంపస్ల విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు. హైదరాబాద్ క్యాంపస్లో మొక్కను నాటి స్మారక ఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ఐఎస్బీ మై స్టాంప్, ప్రత్యేక కవర్ను విడుదల చేస్తారు. అకడమిక్ స్కాలర్స్ ఆఫ్ ఎక్స్లెన్స్ పతకాలను కూ డా ప్రధాని చేతుల మీదుగా పంపిణీ చేస్తాం. – ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల, ఐఎస్బీ డీన్ -
మోదీ హైదరాబాద్ టూర్; ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (గురువారం) ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ స్నాతకోత్సవంలో పాల్గొననున్న నేపథ్యంలో గచ్చిబౌలి స్టేడియం, ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి గచ్చిబౌలి మధ్యలో ఉన్న ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని లేదా ఉద్యోగుల హాజరు సమయాలలో మార్పులు చేసుకోవాలని ఆయా కంపెనీలకు పోలీసులు అంతర్గత ఆదేశాలు జారీ చేశారు. గురువారం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సైబరాబాద్ కమిషరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా: ► గచ్చిబౌలి జంక్షన్ నుంచి లింగంపల్లి వెళ్లేవారు గచ్చిబౌలి జంక్షన్ దగ్గర రైట్ టర్న్ తీసుకుని బొటానికల్ గార్డెన్, కొండాపూర్ ఏరియా హాస్పిటల్, మజీద్ బండ, హెచ్సీయూ డిపో ద్వారా లింగంపల్లికి వెళ్లాలి. ► లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వచ్చేవారు హెచ్సీయూ డిపో దగ్గర లెఫ్ట్ తీసుకుని మజీద్ బండ, కొండాపూర్ ఏరియా హాస్పిటల్, బొటానికల్ గార్డెన్ నుంచి గచ్చిబౌలి జంక్షన్కి చేరుకోవాలి. ► విప్రో నుంచి లింగంపల్లికి వెళ్లేవారు విప్రో జంక్షన్ దగ్గర లెఫ్ట్ తీసుకుని క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపనపల్లి ఎక్స్ రోడ్, హెచ్ సీయూ బ్యాక్ గేట్, నల్లగండ్ల నుంచి లింగంపల్లికి వెళ్లాలి. ► విప్రో నుంచి గచ్చిబౌలికి వెళ్లేవారు విప్రో జంక్షన్ దగ్గర రైట్ తీసుకుని ఫెయిర్ ఫీల్డ్ హోటల్, నానక్ రామ్ గూడ రోటరీ, ఓఆర్ఆర్, ఎల్ఆండ్ టీ టవర్స్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్కి చేరుకోవాలి. ► కేబుల్ బ్రిడ్జి నుంచి గచ్చిబౌలి జంక్షన్కి వెళ్లేవారు కేబుల్ బ్రిడ్జ్ పైకి ఎక్కే ర్యాంప్ దగ్గర రైట్ తీసుకుని రత్నదీప్, మాదాపూర్ పీఎస్, సైబర్ టవర్స్, హైటెక్స్, కొత్తగూడ, బొటానికల్ గార్డెన్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్కి వెళ్లాలి. (క్లిక్: రెండో దశ మెట్రో రూట్ చేంజ్!) డ్రోన్లను ఎగురవేయొద్దు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. భద్రత చర్యలలో ఐఎస్బీ, గచ్చిబౌలి స్టేడియం ప్రాంతాలలో డ్రోన్లను ఎగరేయడానికి అనుమతి లేదు. ఆయా ప్రాంతాల చుట్టూ 5 కి.మీ. పరిధిలో పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్క్రాఫ్ట్లకు నిషేధం విధించారు. బుధవారం మధ్యాహ్నం 12 నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని సైబరాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. (క్లిక్: హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్.. ‘త్రి’ పాత్రాభినయం!) -
జేఎన్టీయూ అనంతపురం స్నాతకోత్సవం.. బంగారు కొండలు వీరే...
ఎంతో మంది జీవితాలకు మంచి పునాది వేసింది జేఎన్టీయూ... సమాజానికి శాస్త్రవేత్తలు, ఇంజినీరింగ్ నిపుణులను అందించింది నాణ్యమైన పరిశోధనలకూ కేరాఫ్గా మారింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాల్లో అనంత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది జేఎన్టీయూ అనంతపురం. శనివారం 12వ స్నాతకోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అనంతపురం విద్య: జేఎన్టీయూ అనంతపురం 1946లో ఒక కళాశాలగా ఏర్పడింది. విశ్వవిద్యాలయంగా ఏర్పడిన ఆనతి కాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతి దక్కించుకుంది. పరిశోధనల్లో నాణ్యతా ప్రమాణాలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. బీటెక్, బీఫార్మసీ, ఫార్మాడీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు అందిస్తోంది. విదేశీ వర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుని నూతన ప్రోగ్రామ్లను అందుబాటులోకి తెచ్చింది. వర్సిటీ పరిధిలో అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, వైఎస్సార్, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఉన్న అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏటా 1.70 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. జేఎన్టీయూ అనంతపురం క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల, కలికిరి ఇంజినీరింగ్, పులివెందుల ఇంజినీరింగ్ కళాశాలలు స్వతంత్య్ర ప్రతిపత్తి సాధించాయి. ప్రైవేట్ కళాశాలల్లోనూ పరిశోధన చేయడానికి వీలుగా 16 రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. జాతీయ సేవా పథకాన్ని సమర్థవంతంగా చేస్తున్నందుకు ఇందిరాగాంధీ జాతీయ సేవా పథకం అవార్డు జేఎన్టీయూ, అనంతపురం సొంతం చేసుకుంది. పూర్వ విద్యార్థుల చేయూత క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా ఇటీవలే వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించారు. ఇక్కడ చదివి ఉన్నత స్థానాల్లో అధిరోహించిన పూర్వ విద్యార్థులు చేయూతనందించారు. రూ.8 కోట్లు వెచ్చించి 100 గదులతో విద్యార్థుల హాస్టల్ నిర్మాణానికి చేయూతనిచ్చారు. పూర్వ విద్యార్థులు ఇచ్చిన సహకారంతో ప్రత్యేకంగా హాస్టల్ నిర్మిస్తుండడం విశేషం. రూ.50 లక్షలు విలువైన ల్యాబ్ సదుపాయాన్ని కూడా పూర్వ విద్యార్థుల సహకారంతో ఏర్పాటు చేశారు. సతీష్రెడ్డికి గౌరవ డాక్టరేట్ భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ–డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) చైర్మన్ డాక్టర్ జి.సతీష్రెడ్డికి జేఎన్టీయూ అనంతపురం గౌరవ డాక్టరేట్ను అందజేస్తోంది. గతేడాది ఎస్కేయూ కూడా ఆయనను గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. సతీష్రెడ్డి జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ విభాగంలో 1984లో బీటెక్ పూర్తి చేశారు. ఎంటెక్, పీహెచ్డీని జేఎన్టీయూ హైదరాబాద్లో పూర్తిచేసిన తర్వాత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబోరేటరీలో శాస్త్రవేత్తగా చేరారు. వివిధ హోదాల్లో పనిచేసి కీలకమైన డీఆర్డీఓ చైర్మన్ హోదాలో పనిచేస్తున్నారు. 35,177 మందికి డిగ్రీలు.. 81 మందికి పీహెచ్డీలు జేఎన్టీయూ అనంతపురం 12వ స్నాతకోత్సవానికి అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథులతో పాటు విద్యార్థులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. స్నాతకోత్సవానికి చాన్సలర్ విశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మొత్తం 35,177 మంది విద్యార్థులకు డిగ్రీలు, 81 మందికి పీహెచ్డీలు ప్రదానం చేయనున్నారు. బంగారు కొండలు వీరే... జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల నుంచి సివిల్ ఇంజినీరింగ్లో కే. మైథిలి, ఈఈఈలో డి. సుప్రజ, మెకానికల్ ఇంజినీరింగ్లో ఎం. సతీష్కుమార్రెడ్డి, ఈసీఈలో టి. అనూష, సీఎస్ఈలో బి. సరయూ, కెమికల్ ఇంజినీరింగ్లో బి. వీరవంశీకుమార్ బంగారు పతకాలను సాధించారు. సువర్ణ విజేత.. సుప్రజ జేఎన్టీయూ అనంతపురం ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్ పూర్తిచేసిన సుప్రజ ఆరు బంగారు పతకాలు దక్కించుకున్నారు. 9.14 జీజీపీఏ సాధించి బ్రాంచ్ టాపర్గా నిలిచారు. అలాగే ప్రొఫెసర్ తిరువెంగళం గోల్డ్మెడల్, చల్లా సుబ్బరాయుడు ఎండోమెంట్ గోల్డ్మెడల్, ప్రొఫెసర్ టీఎస్ రాఘవన్ గోల్డ్మెడల్, చండుపల్లి వెంకటరాయుడు– సరోజమ్మ గోల్డ్మెడల్, కళాశాల టాపర్ మహిళా విభాగం కోటాలోనూ గోల్డ్మెడల్ దక్కించుకున్నారు. ఎలక్ట్రికల్ రంగంలో వినూత్న ఆవిష్కరణలు చేస్తానని సుప్రజ పేర్కొన్నారు. చదువుల తల్లి .. మైథిలి జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలోని సివిల్ బ్రాంచ్లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన మైథిలి మూడు బంగారు పతకాలు దక్కించుకున్నారు. సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ టాపర్గా నిలవడంతో పాటు చల్లా సుబ్బరాయుడు ఎండోమెంట్ గోల్డ్మెడల్, కే.వెంకటేశ్వరరావు గోల్డ్మెడల్కు ఎంపికయ్యారు. సివిల్ ఇంజినీరింగ్లో చదవాలనే ఆకాంక్షతోనే కష్టపడి చదివానని, బ్రాంచ్ టాపర్ రావడం ఆనందంగా ఉందని మైథిలీ పేర్కొన్నారు. మెకానికల్ టాపర్ .. సతీష్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఎం.సతీష్రెడ్డి మూడు బంగారు పతకాలకు ఎంపికయ్యారు. మెకానికల్ బ్రాంచ్ టాపర్తో పాటు కళాశాల టాపర్, టీవీ లక్ష్మణరావు గోల్డ్మెడల్ దక్కింది. నానోటెక్నాలజీ రంగంపై దృష్టి సారించినట్లు సతీష్రెడ్డి పేర్కొన్నారు. మెకానికల్ రంగంలోని అధునాతన పరిశోధనలే తన లక్ష్యమన్నారు. అగ్రగామిగా తీర్చిదిద్దుతాం జేఎన్టీయూ అనంతపురాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతాం. నాణ్యమైన పరిశోధనలతో పాటు అత్యుత్తమ బోధన ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందించే దిశగా విద్యా ప్రణాళికను సమూలంగా మార్పు చేశాం. కోర్సు పూర్తియ్యేలోపు ఇంటర్న్షిప్ తప్పనిసరి. విద్యార్థుల సర్టిఫికెట్ల భద్రతకు డీజీ లాకర్ విధానాన్ని అమల్లోకి తెచ్చాం. క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలకు ఎన్బీఏ గుర్తింపు దక్కేలా కృషి చేశాం. – జింకా రంగజనార్దన, వీసీ, జేఎన్టీయూ అనంతపురం -
హెల్త్ యూనివర్సిటీ స్నాతకోత్సవం.. జరిగేది అప్పుడే!
లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ 22, 23వ స్నాతకోత్సవాలు జనవరి 6న విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్టు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ తెలిపారు. మెరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, పీహెచ్డీలు, మెడల్స్, బహుమతులు అందిస్తున్నట్టు చెప్పారు. మెడల్స్, బహుమతులకు ఎంపికైన వారి వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. ఈ నెల 8న జరగాల్సిన ఈ కార్యక్రమం అనివార్య కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. టెన్త్ విద్యార్థులకు ‘సర్టిఫికెట్’ ఇవ్వాలి నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి సాక్షి, అమరావతి: పదో తరగతి పూర్తయిన తర్వాత వివిధ కారణాల వల్ల చాలా మంది విద్యార్థులు చదువు మానేస్తున్నారని.. వారి కోసం మార్కుల మెమోతో పాటు కోర్స్ కంప్లీట్ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాగంటి శ్రీనివాసరావు రాష్ట్ర పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డికి విజ్ఞప్తి చేశారు. అలాగే ఇంటర్లో లాంగ్వేజెస్తో పాటు ఒకటి లేదా రెండు సబ్జెక్టులు గ్రూప్లో ఉంటున్నందున.. పదో తరగతిలో ఆయా సబ్జెక్టులు పాస్ అయిన వారికి ఇంటర్లో జాయిన్ అయ్యే అవకాశం కూడా ఇవ్వాలని కోరారు. దీని వల్ల డ్రాపౌట్లు తగ్గే అవకాశముందన్నారు. -
ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం.. దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయ 81వ స్నాతకోత్సవంలో భాగంగా ఈ నెల 27వ తేదీన జరిగే కార్యక్రమంలో డిగ్రీ పట్టాలను అందుకోవాలనుకునే పీహెచ్డీ అభ్యర్థులు ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ శుక్రవారం తెలిపారు. బంగారు పతకాలు అందుకునే అభ్యర్థుల జాబితాను ఉస్మానియా వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. పూర్తి వివరాలకు వెబ్సైట్లో చూడాలన్నారు. 18 వరకు డిగ్రీ సప్లిమెంటరీ, ఇన్స్టంట్ పరీక్షల ఫీజు చెల్లింపు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ కోర్సుల 1, 3, 5 బ్యాక్లాగ్లతో పాటు కోవిడ్ కారణంగా ప్రత్యేకంగా నిర్వహిస్తున్న డిగ్రీ ఇన్స్టంట్ 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 18 వరకు చెల్లించవచ్చునని ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేష్ శుక్రవారం తెలిపారు. రూ.200 అపరాధ రుసుముతో 23 వరకు, రూ.500 రుసుముతో 26, 27 వరకు, రూ.1000 రుసుముతో 28, 29 వరకు, రూ.2000 రుసుముతో నవంబరు 1, 2 వరకు, రూ.5000 అపరాధ రుసుముతో నవంబరు 3 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చునన్నారు. వివరాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయ వెబ్సైట్ చూడాలన్నారు. 26 నుంచి ఎంబీఏ పరీక్షలు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో ఈ నెల 26 నుంచి వచ్చే నెల 6 వరకు ఎంబీఏ రెగ్యులర్ 2వ సెమిస్టర్, బ్యాక్లాగ్ 1వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కంట్రోలర్ తెలిపారు. పరీక్షల టైంటేబుల్ను ఉస్మానియా వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. ఓయూ దూరవిద్యలో సెమిస్టర్ విధానం ఉస్మానియా విశ్వవిద్యాలయ దూరవిద్య కేంద్రంలో వివిధ కోర్సులలో సెమిస్టర్ పరీక్షా విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. ప్రస్తుతం ఎంబీఏ కోర్సుకు మాత్రమే ఉన్న సెమిస్టర్ పరీక్ష విధానాన్ని ఇతర పీజీ కోర్సులకు కూడా అమలు చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం (2021–22) ఎంసీఏ కోర్సును మూడు నుంచి రెండు సంవత్సరాలకు కుదించి సెమిస్టర్ పరీక్షను అమలుపర్చనున్నారు. రానున్న విద్యా సంవత్సరం (2022–23) నుంచి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, పీజీడీసీఏ కోర్సులకు సెమిస్టర్ పరీక్ష విధానాన్ని అమలు చేస్తామని అధికారులు వివరించారు. అందుకు అనుగుణంగా పీజీ పుస్తకాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. పీజీ తర్వాత డిగ్రీ కోర్సులకు కూడ సెమిస్టర్ పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టేయోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ విద్యా సంవత్సరానికి (2021–22) వివిధ కోర్సులలో జోరుగా అడ్మిషన్లు సాగుతున్నాయన్నారు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశ గడువు పొడిగింపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ, బీకాం,బీఎస్సీ), పీజీ (బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ) పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో చేరడానికి ఆలస్య రుసుము రూ. 200 తో చివరి తేదీ అక్టోబర్ 13 వరకు పొడిగించినట్లు వర్సిటీ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను https://www.braouonline.in/లో పొందుపర్చినట్లు వెల్లడించారు. వివరాలకు 7382929570/580 లేదా విశ్వవిద్యాలయ 040–23680290/291/294/295 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. -
వైద్య సిబ్బంది కొరతను తక్షణమే తీర్చాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వైద్యాన్ని చౌకగా అందుబాటులోకి తీసుకురావడంతోపాటు సరైన సమయంలో వైద్యం అందించడాన్ని సైతం ప్రాధాన్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు స్థానికసంస్థలు, ప్రైవేటు, కార్పొరేట్ రంగం సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం వైద్య కళాశాల స్వర్ణ జయంతి వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. మహిళలకు సరైన ప్రోత్సాహం అందించాలి దేశంలో వైద్యం మరింత ఖరీదవుతున్న నేపథ్యంలో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆ భారాన్ని మోయలేకపోతున్న విషయాన్ని ప్రతీ ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. స్నాతకోత్సవంలో పతకాలు అందుకున్న వారిలో ఎక్కువమంది యువతులు ఉండటాన్ని ప్రత్యేకంగా అభినందించిన వెంకయ్యనాయుడు... మహిళలకు సరైన ప్రోత్సాహాన్నందిస్తే ఏదైనా సాధించగలరనే దానికి ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. కరోనాపై పోరాటంలో ఫ్రంట్లైన్ వారియర్లుగా వైద్యులు, వైద్య సిబ్బంది పోషించిన పాత్రను సమాజం ఎన్నటికీ మరిచిపోదన్నారు. అయితే దేశంలో వైద్యులు, రోగుల నిష్పత్తి మధ్య ఉన్న భారీ అంతరాన్ని తగ్గించేందుకు కృషి జరగాలని సూచించారు. వలసవాద విధానాలు విడనాడాలి ప్రతి జిల్లా కేంద్రానికి ఒక మెడికల్ కాలేజీ, తత్సంబంధిత ఆసుపత్రి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, రానున్న రోజుల్లో ప్రతి రెవెన్యూ కేంద్రానికి ఒక సకల సౌకర్యాలున్న ఆసుపత్రి ఏర్పాటు జరగాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. వైద్యరంగం అత్యంత పవిత్రమైన వృత్తుల్లో ఒకటన్న ఉపరాష్ట్రపతి, వైద్య విద్యార్థులు విధుల్లో చేరిన తర్వాత తమ బాధ్యతలను నిర్వర్తించే విషయంలో ఎలాంటి వివక్ష లేకుండా పనిచేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారంలో, అక్కడి ప్రజలకు వైద్యం అందించడంలో చొరవ తీసుకోవాలన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావొస్తున్నా ఇప్పటికీ కొన్ని వలసవాద విధానాలను కొనసాగించడంపై వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మన విధానాలను, మన అలవాట్లను భారతీయీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన దిశానిర్దేశం చేశారు. చట్టసభలు, విద్య, పరిపాలన, న్యాయ ఇలా అన్నిరంగాల్లోనూ భారతీయ విధానాలను అలవర్చుకోవాలన్నారు. న్యాయవ్యవస్థను జాతీయీకరించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు అభినందనీయమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. చదవండి: మమతా బెనర్జీ ఇటలీ పర్యటనకు అనుమతి నిరాకరణ -
ఘనంగా ఐసీబీఎం స్కూల్ స్నాతకోత్సాహం
-
తీరని అవమానం.. గోల్డ్మెడల్ నాకొద్దు!
-
తీరని అవమానం.. గోల్డ్మెడల్ నాకొద్దు!
పుదుచ్చేరి విశ్వవిద్యాలయంలో బంగారు పతక విజేత రుబీహాకు చేదు అనుభవం ఎందురైంది. 2018 మాస్ కమ్యూనికేషన్ (ఎంఏ) విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన రుబీహా కాన్వొకేషన్ కార్యక్రమానికి వెళ్లారు. కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ వేదిక నుంచి వెళ్లేంత వరకు తనను తిరిగి హాల్లోకి అనుమతించలేదని రుబీహా ఆరోపించారు. రాష్ట్రపతి విశ్వవిద్యాలయం నుండి బయలుదేరే వరకు దాదాపు 20 నిమిషాలు బయటనే వేచి ఉండాల్సి వచ్చిందని వాపోయారు. స్నాతకోత్సవం ముగిసిన తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి వచ్చినప్పుడు, తను హాలు నుంచి బయటికి (బలవంతం చేయనప్పటికీ) రావాలని కోరారని తెలిపారు. ఇది తనకు తీరని అవమానమని కేరళకు చెందిన రుబీహా కంట తడి పెట్టారు. సీఏఏకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయవచ్చనే అనుమానంతోనే తనను కాన్వొకేషన్ హాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. దీనికి నిరసనగా తన సర్టిఫికెట్ను మాత్రమే తీసుకుని, గోల్డ్మెడల్ను తిరస్కరిస్తున్నట్టు వెల్లడించారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీకి, సీఏఏకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రతీ ఒక్కరికీ సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దారుణానికి వ్యతిరేకంగా తన బంగారు పతకాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తున్నట్టు చెప్పారు. దీనిపై విద్యావంతులైన యువతగా తాము బలమైన వైఖరి తీసుకోవాలన్నారు. అయితే ఈ ఆరోపణలను విశ్వవిద్యాలయ అధికారులు ఖండించారు. కాగా, విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ర్యాలీలలో రుబీహా క్రమం తప్పకుండా పాల్గొనేవారని తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో బీజేపీ నాయకుడు తరుణ్ విజయ్ క్యాంపస్ పర్యటనకు వ్యతిరేకంగా ఆమె నిరసనలకు నాయకత్వం వహించినట్టుగా సమాచారం. మరోవైపు బంగారు పతకాలను గెల్చుకున్న ఇతర విద్యార్థులు ఈ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించారట. ఇందులో భాగంగా కొంతమంది కేవలం సర్టిఫికెట్లను మాత్రమే స్వీకరించారు. -
'స్నాతకోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉంది'
సాక్షి, కాకినాడ : కాకినాడ జేఎన్టీయులో ఏడవ స్నాతకోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్, యునివర్సిటీ కులపతి బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మక యూనివర్సిటీ స్నాతకోత్సవానికి కులపతి హోదాలో హాజరుకావడం సంతోషంగా ఉంది. మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా, డిజిటల్ ఇండియాలో విద్యార్దులు భాగస్వామ్యం కావాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పటి నుంచే భారత్ బలమైన అణుశక్తిగా ఎదిగిందని, ఎలాంటి ఛాలెంజ్ అయినా ఎదుర్కొనేందుకు మోదీ సర్కారు సిద్ధంగా ఉందని తెలిపారు. గాంధీ కలలుగన్న భారతదేశం ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ బిహెచ్ఈఎల్ మాజీ సీఎండీ ప్రసాదరావుకు గౌరవ డాక్టరేట్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 119 మంది విద్యార్థులు గవర్నర్ చేతుల మీదుగా పీహెచ్డి పట్టాలు అందుకున్నారు. -
శాతవాహన యూనివర్సిటీ ‘పట్టా’పండుగ
సాక్షి, శాతవాహనయూనివర్సిటీ: శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవం కల నెరవేరనుంది. యూనివర్సిటీ ఏర్పడిన దశాబ్దం దాటినా స్నాతకోత్సవం జరగలేదు. చాలాసార్లు అధికారులు ప్రయత్నించినా వివిధ కారణాలతో కుదరలేదు. తాజాగా గవర్నర్ కార్యాలయం నుంచి స్నాతకోత్సవ నిర్వహణకు గ్రీన్సిగ్నల్ రావడంతో ఆగస్టు మొదటి వారంలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2017 వరకు యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు ఈనెల 31 తేదీ వరకు కాన్వకేషన్కు దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించినట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉమేష్కుమార్ వెల్లడించారు. పలుమార్లు ప్రయత్నాలు..శాతవాహన యూనివర్సిటీలో స్నాతకోత్సవం నిర్వహించాలని చాలాసార్లు అధికారులు ప్రయత్నించారు. కానీ వివిధ కారణాలతో కుదరలేదు. వీరారెడ్డి వీసీగా పనిచేస్తున్నప్పడు 2014లో నిర్వహించేందుకు ప్రయత్నించినా ప్రత్యేక తెలం గాణ ఉద్యమం తీవ్రతరం కావడంతో అప్పుడు అటకెక్కింది. 2015 నుంచి 2017 వరకు బి.జనార్దన్రెడ్డి ఇన్చార్జీ వీసీగా ఉన్నప్పుడూ మరోసారి స్నాతకోత్సవం జరుపాలని నిర్ణయించారు. వివిధ కారణాలతో ఆగిపోయింది. ఆ తర్వాత ఇన్చార్జి వీసీగా 2018 ఆగస్టు 30 నుంచి టి.చిరంజీవులు కొనసాగుతున్న క్రమంలో ఆదిలో స్నాతకోత్సవ ప్రయత్నాలు కొనసాగినా కార్యరూపం దాల్చలేదు. రిజిస్ట్రార్గా ఉమేష్కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత స్నాతకోత్సవం నిర్వహణకు కసరత్తు తీవ్రంగా కృషిచేశారు. ఫలితంగా పలుమార్లు వాయిదా పడుతూ చివరకు ఆగస్టు మొదటి వారంలో నిర్వహిం చాలని శాతవాహన అధికారులు భావిస్తున్నారు. గవర్నర్ పచ్చజెండా.. రాష్ట్ర గవర్నర్ శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవం నిర్వహించడానికి పచ్చజెండా ఊపారు. దీనికి సంబందించిన లేఖ గవర్నర్ కార్యాలయం నుంచి శాతవాహన యూనివర్సిటీ వీసీకి అందించినట్లు సమాచారం. ఇంత వరకు స్నాతకోత్సవం నిర్వహించని శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవం విషయంలో వివిధవర్గాల నుంచి అపవాదు ఎదుర్కొంది. ఈ విషయంపై వివిధ సామాజిక సంఘాలు, పార్జీలు, విద్యార్థిసంఘాలు, పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు, ఉన్నతాధికారులకు విజ్ఞప్తుల ప్రక్నియ కొనసాగుతూ వచ్చింది. గవర్నర్ నుంచి లేఖ రావడంతో మార్గం సుగమమై ఆగస్టు మొదటి వారంలో నిర్వహించడానికి అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. జూలై 31 వరకు దరఖాస్తులు... శాతవాహన యూనివర్సిటీ ఏర్పడినప్పటి నుంచి 2017 వరకు డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు స్నాతకోత్సవం పట్టా పొందడానికి దరఖాస్తులు చేసుకోవచ్చని రిజిస్ట్రార్ ఉమేష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 తేదీ వరకు గడువు ఉందని, అర్హులందరూ శాతవాహన యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. స్నాతకోత్సవం నిర్వహించడంపై శాతవాహన యూనివర్సిటీ వర్గాల్లో చాలా రోజుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్చార్జి వీసీ ఉండగా స్నాతకోత్సవం అవసరమా అని కొన్నివర్గాలు అభిప్రాయం వ్యక్తం చేయగా... కొద్ది రోజుల్లోనే రెగ్యులర్ వీసీని నియమించాలని దరఖాస్తులు కూడా ప్రభుత్వం కోరిందని, రెగ్యులర్ వీసీ వచ్చాక స్నాతకోత్సవం జరుపాలని మరికొన్నివర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా గవర్నర్ కార్యాలయం నుంచి స్నాతకోత్సవంపై సముఖత వ్యక్తం చేస్తూ లేఖ రావడంతో శాతవాహన యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి సన్నద్ధమవుతోంది. -
గౌరవ డాక్టరేట్ లేనట్టే!
చారిత్రక విశ్వవిద్యాలయం.. వందేళ్ల వైభవం.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందినఉస్మానియా యూనివర్సిటీ ‘గౌరవం’ ఎవరికీ దక్కడం లేదు. 14 ఏళ్లుగా వర్సిటీ గౌరవడాక్టరేట్కు ఎవరినీ ఎంపిక చేయడం లేదు. ఇటీవల వందేళ్లు పూర్తి చేసుకున్న ఓయూస్నాతకోత్సవం ఈ నెల 17న జరగనుంది. స్వరాష్ట్రంలో నిర్వహించనున్న తొలి వేడుక ఇది. అయితే ఈసారి కూడా ఓయూ గౌరవ డాక్టరేట్ ప్రదానం లేదని తెలుస్తోంది. తొలుతగౌరవ డాక్టరేట్ సీఎం కేసీఆర్కు ప్రదానం చేయాలని ప్రతిపాదించగా వ్యతిరేకత రావడంతో విరమించుకున్న అధికారులు.. ఆ తర్వాత మరెవరినీ ఎంపిక చేయలేదు. మరోవైపుస్నాతకోత్సవానికి సీఎం కేసీఆర్ హాజరుకాకపోతుండడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. – ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్ ఠాగూర్ ఆడిటోరియంలో ఈ నెల 17న ఉస్మానియా యూనివర్సిటీ 80వ స్నాతకోత్సవం జరగనుంది. అయితే ఈసారి కూడా ఓయూ గౌరవ డాక్టరేట్ ప్రదానం లేదని తెలుస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన గొప్ప వ్యక్తులను గుర్తించి గౌరవ డాక్టరేట్ అందజేస్తారు. కానీ గత 14 ఏళ్లుగా ఓయూ గౌరవ డాక్టరేట్కు ఎవరినీ ఎంపిక చేయడం లేదు. ఇటీవల వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఏదో ఒక రంగంలో విశిష్ట సేవలందించిన వారిని గుర్తించి గౌరవ డాక్టరేట్తో సత్కరించాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన సీఎం కేసీఆర్కు ఓయూ గౌరవ డాక్టరేట్కు ఎంపిక చేయాలని అనుకున్నారు. కానీ కొందరు వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. మరొకరిని ఎంపిక చేయాలనే విషయంలో ఓయూ అధికారులు శ్రద్ధ చూపలేదు. నిబంధనలు కఠినం... స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఓయూ స్నాతకోత్సవం మొక్కుబడిగా జరగనుంది. గౌరవ డాక్టరేట్ ఎంపికకు నియమ నింబంధనలు అతి కఠినంగా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. అవి ఈ కాలం నాటి వ్యక్తులకు ఉండాలంటే చాలా అరుదు అంటున్నారు. ఉన్న వారిలోనే మంచి వారిని ఎంపిక చేసి గౌరవ డాక్టరేట్ను అందజేయవచ్చు. కానీ ఓయూ అధికారులు వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వారిని విస్మరిస్తున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం కవి, గాయకులు అందెశ్రీని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. మారిన పరిస్థితితులకు అనుగుణంగా నిబంధనలు సడలించుకుంటే సమాజం, ప్రజల కోసం పనిచేసే వారిని ప్రోత్సహించేలా గౌరవ డాక్టరేట్ అందజేయొచ్చు. ‘ఓయూ గౌరవ డాక్టరేట్ ఎంపికకు ఈ కాలంలోనూ ప్లేటోలు, అరిస్టాటిల్స్ కనిపించరు కదా.!’ అని సీనియర్ అధ్యాపకులు వ్యాఖ్యానించడం గమనార్హం. ఉన్న వారిలోనే ఒకరిని ఎంపిక చేసి గౌరవ డాక్టరేట్ను అందచేస్తే ఓయూ విశిష్టత మరింత పెరుగుతుందన్నారు. ముఖ్య అతిథి ఎంపికపై అసంతృప్తి.. ఓయూ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ పేరును ఖరారు చేయడంపై పలువురు అధ్యాపకులు, విద్యార్థులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐఐసీటీ డైరెక్టర్ చంద్రశేఖర్ నిత్యం ఓయూను సందర్శిస్తారని, తమ కంటే జూనియర్ అని పలువురు సీనియర్ అధ్యాపకులు పేర్కొన్నారు. వందేళ్ల ఓయూలో జరిగే 80వ స్నాతకోత్సవానికి జాతీయ స్థాయిలో పేరున్న వ్యక్తిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కోరారు. స్నాతకోత్సవానికి కేవలం గవర్నర్ మాత్రమే వస్తుండడం, సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడంపై నిరాశతో ఉన్నారు. దేశమంతటా పర్యటించే సీఎం కేసీఆర్ ఓయూకు రాకపోవడంపై విద్యార్థులు, అధ్యాపకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తగ్గిన దరఖాస్తులు.. ఓయూ స్నాతకోత్సవం నిర్వహణపై సరిగా ప్రచారం లేకపోవడంతో దరఖాస్తుల సంఖ్య తగ్గింది. మే 31తో గడువు ముగియగా... డిగ్రీ, పీజీ పట్టాకు 600, పీహెచ్డీకి 380 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వీరితో పాటు 292 మందికి బంగారు పతకాలు అందజేయనున్నారు. గత ఆరేళ్లలో లక్షలాది మంది విద్యార్థులు పాస్ కాగా సరైన సమాచారం లేక కొద్ది మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. స్నాతకోత్సవ నిర్వహణపై ఇంత వరకు ఓయూ వీసీ ప్రొ.రాంచంద్రం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అయితే డిగ్రీ, పీజీకి రూ.200 అపరాధ రుసుముతో జూన్ 4 వరకు, పీహెచ్డీ అభ్యర్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. స్నాతకోత్సవానికి ముందు దరఖాస్తు చేసుకుంటే తక్కువ ఫీజు ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని ప్రతి కాలేజీకి చేరవేయడంలో అధికారులు విఫలమయ్యారు. వేదికపై కేవలం పీహెచ్డీ అభ్యర్థులకు మాత్రమే పట్టాలను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఓవైపు పరీక్షలు... ఓయూలో డిగ్రీ, పీజీ, ఇతర కోర్సుల పరీక్షలు జరుగుతున్నాయి. గతంలో జరిగిన పరీక్షల ఫలితాలను విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇలాంటి తరుణంలో స్నాతకోత్సవ పనులకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఆరేళ్లుగా స్నాతకోత్సవం జరగకపోవడంతో ప్రభుత్వం, విద్యార్థుల ఒత్తిడి మేరకు ఎట్టకేలకు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే జూలై 24తో వీసీ ప్రొ.రాంచంద్రం పదవీ కాలం ముగుస్తుంది. తాను పదవిలో ఉండగానే స్నాతకోత్సవం నిర్వహించాలని ఆయన భావించారు. సిబ్బంది కొరత, వేసవి సెలవులకు అధ్యాపకులు వెళ్లడంతో జవాబు పత్రాల మూల్యాంకనం ఆలస్యమై ఫలితాల్లో జాప్యం జరుగుతోంది. ఒక పక్క పరీక్షలు, ఫలితాలు, మరో పక్క స్నాతకోత్సవం పనులతో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కంట్రోలర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ పేర్కొన్నారు. -
శాతవాహనలో స్నాతకోత్సవం ఎప్పుడూ..?!
యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులకు స్నాతకోత్సవం కీలక ఘట్టం. అలాంటి స్నాతకోత్సవాన్ని శాతవాహన యూనివర్సిటీ స్థాపించి దశాబ్దం దాటినా ఇంతవరకు ఒక్కసారి కూడా నిర్వహించలేదు. దీంతో విద్యార్థులు పట్టాపండుగ భాగ్యానికి నోచుకోవడం లేదు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు స్నాతకోత్సవాన్ని పండుగలా నిర్వహిస్తున్నప్పటికీ శాతవాహన అధికారులు మాత్రం దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. స్నాతకోత్సవం నిర్వహించాలని విద్యార్థులు ఏళ్ల తరబడి విన్నవిస్తున్నా.. అధికారులు పెడచెవినపెడుతున్నారు. యూనివర్సిటీ అధికారులు, పరీక్షల విభాగం పెద్దగా పట్టించుకోకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. సాక్షి, కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ ప్రారంభమై పదేళ్లు గడుస్తోంది. వందల సంఖ్యల్లో విద్యార్థులు పట్టభద్రులై వెళ్తున్నప్పటికీ వారు వర్సిటీ ఛాన్స్లర్ చేతులమీదుగా పట్టాలు అందుకునే భాగ్యం మాత్రం కోల్పోతున్నారు. గతంలో ఒకరిద్దరు వీసీల కాలంలో ప్రయత్నాలు ప్రారంభమైనప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత అంతా ఇన్చార్జి వీసీల పాలనే జరుగుతుండడంతో సాధ్యపడలేదని కనిపిస్తోంది. కానీ సంబంధిత విభాగం అధికారుల సోమరితనంతోనే.. స్నాతకోత్సవానికి బ్రేక్ పడుతున్నట్లు యూనివర్సిటీ వర్గాల ద్వారా సమాచారం. ఏదిఏమైనా యూనివర్సిటీ ఈ సంవత్సరం స్నాతకోత్సవం నిర్వహించకుంటే పదేళ్లు గడిచినా పట్టా పండగ నిర్వహించలేదనే అపవాదును ఎదుర్కొవడం ఖాయమని విద్యారంగ నిపుణుల భావన. కార్యరూపం దాల్చని స్నాతకోత్సవం స్నాతకోత్సవం నిర్వహించాలని గతంలో వీరారెడ్డి వీసీగా ఉన్నప్పుడు 2014లో గవర్నర్ చేతులమీదుగా నిర్వహించాలని భావించినా రాష్ట్ర విభజన సమయం కావడంతో అప్పటి పరిస్థితుల్లో ఆలోచనను విరమించుకున్నారు. ఆ తర్వాత 2015 నుంచి 2017 వరకు బి.జనార్దన్రెడ్డి ఇన్చార్జి వీసీగా విధులు నిర్వహించిన సమయంలో మరోసారి స్నాతకోత్సవం అంశం తెరమీదికొచ్చినా.. ఆయన మున్సిపల్శాఖ కీలక బాధ్యతల్లో ఉండడంతో కుదరలేదు. ఆ తర్వాత స్నాతకోత్సవం నిర్వహించాలనే ఆలోచనకు కూడా ఆయన సమయం కేటాయించే పరిస్థితులు లేకపోవడంతో అది కాస్తా అటకెక్కింది. ఆయన తర్వాత 2017 ఆగస్టు 30 నుంచి టి.చిరంజీవులు ఇన్చార్జి వీసీగా కొనసాగుతున్నప్పటికీ ముఖ్య బాధ్యతల్లో భాగంగా ఆయన హైదరాబాద్లోనే ఉంటుండడంతో ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప వర్సిటీకి సమయం కేటాయించడం లేదు. దీనికితోడు ప్రభుత్వం రెగ్యులర్ వీసీ నియామక ప్రక్రియ తుదిదశకు వచ్చింది. ఈ తరుణంలో ఇన్చార్జి వీసీ స్నాతకోత్సవ నిర్వహణకు సముఖత చూపేలా లేరని తెలుస్తోంది. ఇలా దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ స్నాతకోత్సవ కార్యక్రమానికి విద్యార్థులు దూరమవుతున్నారు. రాష్ట్రంలోనే నిర్వహించని ఏకైక వర్సిటీ రాష్ట్రంలో శాతవాహన యూనివర్సిటీతోపాటు మహాత్మగాంధీ, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీలను ఒకేసారి ప్రారంభించారు. ఒక్క శాతవాహన తప్ప అన్ని వర్సిటీలు ఒక్కోసారి స్నాతకోత్సవాన్ని నిర్వహించాయి. ముఖ్యంగా పరీక్షల విభాగం అధికారుల నుంచి ప్రయత్నాలు లేకపోవడమే దీనికి కారణమని విద్యార్థుల్లో చర్చ జరుగుతుంది. కొత్తగా రిజిస్ట్రార్గా బాధ్యతలు చేపట్టిన ఉమేశ్కుమార్ దీనిపై ప్రత్యేక దృష్టిసారించి తీవ్రంగానే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ఈసారి ఏం జరుగుతుందో చూడాల్సిందే. ఏదిఏమైనా శాతవాహన యూనివర్సిటీ అధికారులు స్నాతకోత్సవంపై దృష్టిసారించి విద్యార్థులకు వచ్చే సంవత్సరం నుంచి నిర్వహించాలని వివిధ కోర్సుల విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వచ్చే మే లోగా నిర్వహిస్తాం శాతవాహన యూనివర్సిటీ ఏర్పడిన నాటినుంచి స్నాతకోత్సవం నిర్వహించనిది వాస్తవమే. గతంలో కొన్నిసార్లు ప్రయత్నించినా సాధ్యపడలేదని తెలిసింది. బాధ్యతలు చేపట్టిన యూనివర్సిటీలో నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారంతో పాటు స్నాతకోత్సవంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాం. మే 2019 లోపు స్నాతకోత్సవానికి ప్రణాళిక రూపొందించి కచ్చితంగా నిర్వహిస్తాం. – ఉమేష్కుమార్, శాతవాహన రిజిస్ట్రార్ -
వివాదాస్పదులకు డాక్టరేటా?
ఆంధ్ర విశ్వవిద్యాలయం 85వ స్నాతకోత్సవం వివాదాస్పదమవుతోంది. ఈ నెల 31న జరిగే కాన్వొకేషన్ నిర్వహణకు అధికారులు తీసుకుంటున్న పలు నిర్ణయాలు అందరి ఆగ్రహానికి కారణమవుతున్నాయి. స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిని ఆహ్వానించడం, వేదిక మార్పు, కళాప్రపూర్ణల ఎంపిక ప్రక్రియ.. ఇలా ప్రతి అంశం వివాదానికి కేంద్రంగా నిలుస్తోందనడంలో సందేహం లేదు. విశాఖ సిటీ : ఆంధ్రవిశ్వవిద్యాలయానికి తొమ్మిది దశాబ్దాల ఘన చరిత్ర ఉంది. లక్షలాది మంది విద్యార్థులకు అక్షర భిక్ష పెట్టిందీ విద్యా సంస్థ. ఇంతటి విశిష్ట విశ్వవిద్యాలయంలో పాలకులు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు వర్సిటీకి మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయి. ప్రధానంగా స్నాతకోత్సవ ముఖ్య అతిథిగా ఆహ్వానించే వ్యక్తి ఎంతో ప్రముఖుడై ఉండటం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ను పాలకులు ఆహ్వానించారు. విభజన తరువాత ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని, ఇవ్వరాదని కేంద్రానికి చెప్పిన ఆ పెద్దమనిషికి ఏయూ ఎర్ర తివాచీ పరవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆయనకు వర్సిటీ గౌరవ డాక్టరేట్ను సైతం ప్రదానం చేయనుండడం అందరి మనో భావాలను దెబ్బ తీయడమే. సమైక్యాంధ్ర, ప్రత్యే క హోదా ఉద్యమాలకు ఊపిరిలూదినది ఏయూ నే. అటువంటి ఉద్యమ గడ్డపై హోదావాదాన్ని పక్కన పెట్టడానికి కారణమైన వ్యక్తికి ఉన్నతాసనం వేసి గౌరవించాలనే నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బీజేపీతో తమ అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడానికే ఏయూ పెద్దలు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ను స్నాతకోత్సవానికి ఆహ్వానిస్తున్నారనే గుసగుసలు వర్సిటీలో వినిపిస్తున్నాయి. దీనిని బహిరంగంగా వ్యతిరేకించడానికి పలు వర్గాలు సిద్ధమవుతున్నాయి. వేదిక మార్పు తగదు స్నాతకోత్సవ వేదిక మార్పు సైతం ఆక్షేపణలకు గురవుతోంది. దశాబ్దాల క్రితం నిర్మించి పదుల సంఖ్యలో స్నాతకోత్సవాలకు వేదికగా నిలచిన కట్టమంచి రామలింగారెడ్డి స్నాతకోత్సవ మంది రాన్ని కాదని.. బీచ్రోడ్డులో హంగు, ఆర్భాటానికి ప్రాధాన్యం ఇస్తూ నిర్మించిన కన్వెన్షన్ కేంద్రంలో కాన్వొకేషన్ నిర్వహించాలని వర్సిటీ అధికారులు తీసుకున్న నిర్ణయం అందరినీ బాధించింది. దీనిపై పాలకమండలి సభ్యులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి, బాహాటంగానే వర్సిటీ అధికారుల నిర్ణయాన్ని తప్పుపట్టినట్టు సమాచారం. స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథి, గవర్నర్, ఇతర అతిథులను తోడ్కొని వీసీ సభికుల మధ్య నుంచి వేదికను అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. కన్వెన్షన్ కేంద్రంలో ఇటా జరగాలంటే మొదటి అంతస్థుకు ఎక్కాల్సిందే. మెట్ల మార్గం లో గవర్నర్ వంటి వ్యక్తిని ఎక్కి రావాలని కోరడం సమంజసం కాదు. దీనితో ఈ ప్రక్రియ నామమాత్రంగా ముగిసే అవకాశం ఉంది. వేదికకు అనుకుని ఉన్న వీవీఐపీ గది వైపు నుంచి మాత్రమే అతిథులు లోనికి ప్రవేశించే అవకాశం ఉంది. ప్రముఖుల విస్మరణ కళాప్రపూర్ణల ఎంపికలో వర్సిటీ అధికారులు ఇష్టారాజ్యంగా, హడావుడిగా నిర్ణయాలు తీసుకున్నారని పలువురు మేధావులు ఆరోపిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖులను, సాహితీవేత్తలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, జానపదానికి చిరునామాగా నిలుస్తున్న వంగపండు ప్రసాదరావులకు కళాప్రపూర్ణకు పరిశీలించక పోవడం విచారకరమని పలువురు మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతవరకు కేంద్రం పద్మశ్రీ ఇవ్వకపోయినా కనీసం ఆంధ్రవిశ్వవిద్యాలయమైనా గౌరవించి సముచితంగా సత్కరించి ఉండాల్సిందని వీరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో జన్మించి తెలుగు రాష్ట్రాలలో జానపదానికి పెద్ద దిక్కుగా నిలచిన వంగపండు ప్రసాదరావు కళాప్రపూర్ణకు ఏవిధంగా అర్హులు కాదో తెలపాలని వీరు వర్సిటీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. విశ్రాంత ఆచా ర్యులు నలుగురైదుగురితో ముందుగానే ప్రత్యే కం కమిటీ వేసి పేర్లు పరిశీలించాల్సిందని సూ చిస్తున్నారు. ఆదరాబాదరాగా ఆరు రోజుల ముందు పాలక మండలి సమావేశం నిర్వహిం చి నలుగురి పేర్లు గవర్నర్ ఆమోదానికి పం పడం సమంజసం కాదనే వాదన వినిపిస్తోంది. -
మోదీ నిర్ణయం.. మమత షాక్
కోల్కతా: ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ఓ నిర్ణయం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం శాంతినికేతన్లోని విశ్వభారతి యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ హాజరయ్యారు. అయితే యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా అందించే దేశికొత్తమ్ అవార్డుల ప్రదానొత్సవంలో మాత్రం ఆయన పాల్గొనట్లేదు. దీంతో అవార్డుల వేడుక లేనట్లేనని యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ప్రధాని బిజీ షెడ్యూల్ కారణంగా అవార్డులను అందించలేరని ప్రధాని కార్యాలయం బెంగాల్ ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ పరిణామాలపై సీఎం మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఎంవో కార్యాలయం ఇచ్చిన వివరణ అసంబద్ధంగా ఉందని ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ఈ వ్యవహారంపై యూనివర్సిటీ అధికారులు స్పందిస్తూ.. గతంలోనూ ఇలాంటి పరిణామాలు జరిగాయని చెబుతున్నారు. అయితే గత ఐదేళ్లుగా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ కార్యక్రమం.. ఈసారి జరిగి తీరుతుందని అంతా భావించారు. ఇదిలా ఉంటే ఈ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మొదటిసారిగా ముఖ్యమంత్రి అతిథులతో వేదిక పంచుకోవటం గమనార్హం. అవార్డుల జాబితాపై కూడా... అవార్డుల ఎంపిక పైనా మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వభారతి అకాడమీ కౌన్సిల్ ఈనెల మొదట్లో దేశీకొత్తమ్ అవార్డుల కోసం పలువురు ప్రముఖుల పేర్లను ఎంపిక చేసింది. జాబితాలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, రచయిత అమితవ్ ఘోష్, ప్రముఖ కవి గుల్జర్, పెయింటర్ జోగెన్ చౌదరి, ద్విజెన్ ముఖర్జీ తదితరుల పేర్లు ఉన్నాయి. అయితే అమితాబ్తోపాటు ద్విజెన్ పేర్లను అవార్డుకు ఎంపిక చేయలేదు. ‘అర్హత ఉన్న వారికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారో తెలీట్లేదు. ఈ నిర్ణయం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది’ అంటూ ఆమె మీడియా ఎదుట అసహనం వ్యక్తం చేశారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో... ప్రధాని నరేంద్ర మోదీ విశ్వ భారతి యూనివర్సిటీ స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక హసీనా కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఇరు ప్రధానులతోపాటు సీఎం మమతా బెనర్జీ వేదికను పంచుకున్నారు. అంతకు ముందు ప్రధాని మోదీకి స్వయంగా మమతా ఆహ్వానం పలికి, యూనివర్సిటీకి వెంటబెట్టుకొచ్చారు. స్నాతకోత్సవం ముగిశాక బంగ్లాదేశ్ భవన్కు శంకుస్థాపన చేయనున్నారు. వీడియోపై పేలుతున్న జోకులు.. ఇటీవల కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరైన సీఎం మమతా బెనర్జీ కర్ణాటక డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కొద్ది దూరం నడవాల్సి రావటంతో ఆమె డీజీపీ నీలమణి రాజుపై చిందులు తొక్కారు. ఆ పరిణామంతో కుమారస్వామి-దేవగౌడలు కూడా బిత్తరపోయారు. అనంతరం ఆ డీజీపీని బదిలీ చేస్తూ కుమారస్వామి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు ప్రధాని రాక సందర్భంగా ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హెలిప్యాడ్కు దూరంలో ఉన్న మమతను ఇటువైపుగా రావాలంటూ ప్రధాని మోదీ సైగలు చేయటం, ఆమె అక్కడి దాకా నడుచుకుంటూ వచ్చి మోదీకి పుష్ఫగుచ్ఛం అందించటం చూడొచ్చు. మరి తనను అంత దూరం నడిపించిన మోదీపై మమత ఎవరికి ఫిర్యాదు చేస్తుందో చూడాలంటూ పలువురు సెటైర్లు పేలుస్తున్నారు. #WATCH PM Narendra Modi arrives in Shanti Niketan to attend the convocation of Visva Bharati University, received by West Bengal CM Mamata Banerjee pic.twitter.com/dnDE1pZmyf — ANI (@ANI) 25 May 2018 -
ఎస్కేయూ కాన్వొకేషన్ నోటిఫికేషన్ విడుదల
– జులై 20 వరకు దరఖాస్తుకు అవకాశం – ఆగస్టులో స్నాతకోత్సవం ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవం(కాన్వొకేషన్) ఆగస్టులో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను శుక్రవారం విడుదల చేశారు. విద్యార్థులకు ఈ నెల 20 నుంచి దరఖాస్తులు ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి జులై 20 చివరి తేదీగా నిర్ణయించారు. తొలిసారిగా కాన్వొకేషన్ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దరఖాస్తుతో పాటు ఫీజును సైతం ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది. డెబిట్, క్రెడిట్ కార్డులు, ఆన్లైన్ బ్యాంకింగ్, మీ సేవ ద్వారా ఫీజు చెల్లించొచ్చు. దరఖాస్తు పూర్తయ్యి, ఫీజును చెల్లించిన తర్వాత హార్డ్కాపీని ‘ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్, ఎస్కేయూ, అనంతపురం ’ చిరునామాకు రిజిష్టర్ పోస్టు ద్వారా పంపాలి. 2014, 15, 16 విద్యా సంవత్సరాల్లో డిగ్రీ, పీజీ (రెగ్యులర్, దూరవిద్య), ఎం.ఫిల్, పీహెచ్డీ (రెగ్యులర్) పూర్తి చేసిన వారికి కాన్వొకేషన్ డిగ్రీలు ప్రదానం చేయనున్నారు. వీరే కాకుండా అంతకుముందే ఉత్తీర్ణతులై.. కాన్వొకేషన్ సర్టిఫికెట్ తీసుకోని వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే..వారు అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు, ఆన్లైన్ దరఖాస్తు తదితర పూర్తి వివరాలను ఠీఠీఠీ.టజుunజీఠ్ఛిటటజ్టీy.్చఛి.జీn అనే వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. స్నాతకోత్సవాన్ని ఆగస్టులో ఏ తేదీన నిర్వహిస్తారనే విషయాన్ని గవర్నర్ ముందస్తు అనుమతితో వెల్లడించనున్నారు. -
కట్ అండ్ పేస్ట్ పీహెచ్డీలు వద్దు: గవర్నర్
నల్లగొండ : ధనార్జన కోసమే విద్య అనే భావం నుండి యువత బయటపడాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఉద్బోధించారు. నల్లగొండలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రస్తుత కాలంలో విలువలతో కూడిన విద్య ఎంతో ముఖ్యమని, కట్ అండ్ పేస్ట్ పీహెచ్డీలు నిరుపయోగమన్నారు. ప్రజల వాస్తవ అవసరాలపై పరిశోధనలు జరగాలన్నారు. నైతిక విలువలను బోధించడంలో అధ్యాపకులదే కీలకపాత్ర అని, నాణ్యమైన, సృజనాత్మక విద్యకు విశ్వవిద్యాలయాలు పెద్ద పీట వేయాలని సూచించారు. చదువుతోనే సమాజంలోని రుగ్మతలకు చరమ గీతం పాడాలని, ఆచార్య దేవోభవ అనే భావాన్ని ఎవ్వరూ మరవొద్దని అన్నారు. జీవితంలో ఆత్మపరిశీలన చాలా ముఖ్యమని, మానవతా విలువలకు నిలయాలు విశ్వవిద్యాలయాలని పేర్కొన్నారు. -
ఎంజీ వర్సిటీ తొలి స్నాతకోత్సవం ప్రారంభం
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఛాన్స్లర్ హోదాలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హాజరయ్యారు. జేఎన్టీయూ న్యూఢిల్లీ వీసీ ప్రొఫెసర్ జగదీశ్కుమార్ కూడా హాజరయ్యారు. వీరికి యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్, రిజిష్ట్రార్లు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా యూనిర్సిటీ స్థాయిలో ప్రథమస్థానంలో నిలిచిన 40 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 84 మందికి మెరిట్ సర్టిఫికెట్స్ అందజేయనున్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. విద్యార్థుల అరెస్ట్ స్నాతకోత్సవానికి గవర్నర్ నరసింహన్ హాజరవుతున్న సందర్భంగా కొంతమంది విద్యార్థులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. రాత్రి యూనివర్సిటీ హాస్టల్స్లోని విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకుని నార్కట్పల్లి పోలీసు స్టేషన్కు తరలించారు. నల్లగొండలోనూ పలు విద్యార్థి సంఘాల నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. స్నాతకోత్సవాన్ని యూనివర్సిటీలో కాకుండా ఓ కన్వెన్షన్ హాలులో నిర్వహించి ఎంపిక చేసుకున్న విద్యార్థులను మాత్రమే అనుమతించారు. దీంతో యూనివర్సిటీ విద్యార్థుల్లో కొందరు యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ఆందోళనకు దిగారు. స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తూ విద్యార్థులను అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. వీసీ, రిజిస్ట్రార్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు -
‘పట్టా’భిషేకం
– ఘనంగా 2011 బ్యాచ్ మెడికల్ విద్యార్థుల స్నాతకోత్సవం – 94 మందికి పట్టాల ప్రదానం ఆరేళ్లు కలిసి చదువుకున్నారు. రోగుల నాడిపట్టారు. మానవ శరీరంపై పూర్తిగా అధ్యయనం చేశారు. విజయవంతంగా వైద్యవిద్య పూర్తి చేశారు. కన్నవారి కలలను నిజం చేస్తూ వారి సమక్షంలోనే ‘పట్టా’భిషిక్తులయ్యారు. గురువారం అనంతపురం మెడికల్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన 12వ స్నాతకోత్సవం కన్నుల పండువగా సాగింది. 2011 బ్యాచ్కు చెందిన 94 మంది వైద్య విద్యార్థులు కరతాళ ధ్వనుల మధ్య తల్లిదండ్రులతో కలిసి ఆనందోత్సాహంగా పట్టాలు అందుకున్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, బంధువులతో ఆడిటోరియం, కళాశాల ఆవరణ పండుగ వాతావరణాన్ని తలపించింది. అందమైన ముగ్గులతో, వివిధ రకాల పుష్పాలతో వేదికను అలంకరించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా వైద్య విద్యార్థిని లేఖ ‘ఓం నమఃశివాయ.. చంద్రకళాధర సహృదయా’ అంటూ చేసిన నృత్యం ఆకట్టుకుంది. ఆడిటోరియంలోకి పట్టాలు అందుకునే విద్యార్థులు కొవ్వొత్తులు వెలిగించుకుని వచ్చిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చివరగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో సెల్ఫీలు దిగుతూ హుషారుగా గడిపారు. ‘వెళ్లొస్తా నేస్తం’ అంటూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. - అనంతపురం మెడికల్ సేవే జీవిత పరమార్థంగా భావించండి వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం అన్నారు. గ్రాడ్యుయేషన్ డేకు ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ ఈ రోజు పట్టాలు అందుకునే వారంతా డాక్టర్లుగా మారారని, ఇక సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అదే జీవిత పరమార్థమన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాక గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయాలని సూచించారు. డబ్బు శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మంచి డాక్టర్గా పేరు తెచ్చుకోవాలన్నారు. కమీషన్ల కోసం రోగులతో చెలగాటమాడుతున్న వైద్యుల్ని అక్కడక్కడా చూస్తున్నామని, ఇది మంచిది కాదన్నారు. చికిత్స కోసం వచ్చే వారి కళ్లలో సంతోషం చూడాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాళ్లు చిట్టి నరసమ్మ, జేసీ రెడ్డి, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ మాట్లాడుతూ అందరూ మానవతా విలువలు పాటించాలన్నారు. పేదల సేవలో తరించాలని సూచించారు. విజయవంతంగా వైద్య విద్య పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వైద్య కళాశాల, సర్వజనాస్పత్రి వైద్యులు పాల్గొన్నారు. సురేందర్రెడ్డికి సన్మానం మెడికల్ కళాశాలలో 2014లో వైద్య విద్యార్థిని స్నేహిత మృతి చెందిన వైనం విదితమే. స్నేహిత పేరు మీద ఆమె తండ్రి సురేందర్రెడ్డి ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో వైద్య విద్యార్థులంతా భాగస్వాములయ్యారు. పట్టాల ప్రదానోత్సవం సందర్భంగా సురేందర్రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుమార్తె ఇక్కడ లేకున్నా ‘స్నేహిత ఫౌండేషన్’ ద్వారా సామాజిక సేవ చేస్తానన్నారు. అందరూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. -
‘పట్టా’భిషేకం
-వారి పేరు ముందు ఇకపై ‘డాక్టర్’ –కేఎంసీలో ఘనంగా స్నాతకోత్సవం దాదాపు ఆరేళ్ల పాటు కలిసి మెలసి తిరిగారు.. ఒకరి భావాలు మరొకరు పంచుకున్నారు.. జూనియర్లు, సీనియర్లు అన్న తేడా లేకుండా అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. అధ్యాపకులను కన్నవారిలా భావించారు.. వారి చెప్పింది శ్రద్ధగా విన్నారు. రోగుల నాడీ పట్టుకున్నారు.. వారి బాగోగులు చూసుకున్నారు. విజయవంతంగా వైద్య విద్యను పూర్తి చేసి డాక్టర్ పట్ట తీసుకున్నారు. బుధవారం కర్నూలు మెడికల్ కళాశాలలో జరిగిన ఈ పట్టాభిషేకం (సా్నతకోత్సవం) కార్యక్రమాన్ని చూసేందుకు వారి కుటుంబసభ్యులు, స్నేహితులు వచ్చారు. తమ వాడు/ఆమె పేరు ముందు ఇకపై ‘డాక్టర్’ అని రాసుకునే రోజు వచ్చిందని మురిసిపోయారు. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కళాశాలలోని నూతన ఆడిటోరియంలో 146 మంది 2011 బ్యాచ్ వైద్య విద్యార్థులకు ముఖ్యఅతిథి డీఐజీ రమణకుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ చేతుల మీదుగా వైద్యవిద్య పట్టాలను ప్రదానం చేశారు. పట్టాలు తీసుకున్నాక, తీసుకోకముందు ఆడిటోరియం ఆవరణలో వైద్యవిద్యార్థులు సందడి చేశారు. వైద్య విద్య పూర్తయిందన్న విషయాన్ని చెప్పడానికి చిహ్నంగా వారి పట్టాలను గాలిలోకి ఎగురవేశారు. కన్నవారు, కుటుంబసభ్యులు, స్నేహితులు, సహ విద్యార్థులతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. కార్యక్రమం అనంతరం భారమైన హృదయంతో కళాశాల నుంచి బయటకు అడుగులు వేశారు. వైద్యవృత్తిలో నైతిక విలువలు ప్రధానం –కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ వైద్యవృత్తిలో నైతిక విలువలు ప్రధానమని కర్నూలు రేంజ్ డీఐజీ బీవీ రమణకుమార్ చెప్పారు. కర్నూలు మెడికల్ కళాశాలలో బుధవారం జరిగిన స్నాతకోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యవృత్తి సమాజంలో ఓ నోబుల్ ప్రొఫెషన్ అని చెప్పారు. ఎంబీబీఎస్ అనంతరం కొందరు ఐఏఎస్లు కూడా అయ్యారని చెప్పారు. ఎంతో ప్రఖ్యాతి గాంచిన కర్నూలు మెడికల్ కళాశాల నుంచి 146 మంది వైద్య విద్యార్థులు ఈ రోజు బయటకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సమాజంలోకి వచ్చే ప్రతి ఒక్కరినీ ప్రజలు గమనిస్తారన్నారు. వైద్యుడిగా మీరు నేర్చుకున్నది 25 శాతం మాత్రమేనని, ఇంకా 75 శాతం తెలుసుకోవాల్సి ఉందన్నారు. మీ కెరీర్ను మరింత మెరుగులు దిద్దుకోవాలని, ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని ఇనుమడింపజేసుకోవాలన్నారు. అన్నింటికీ ప్రణాళిక అవసరమన్నారు. ప్రణాళికతో ముందుకు వెళితే విజయం ఖాయమన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ మాజీ రాష్ట్రపతి దివంగత డాక్టర్ అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రోగులను ఆదరించడం.. తల్లిదండ్రులను గౌరవించడం ఎప్పటికీ మరువకూడదన్నారు. మంచి నైపుణ్యాలు గల, మానవత్వంతో కూడిన వైద్యుడిగా సమాజంలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. సమాజం డాక్టర్ల నుంచి ఎంతో ఆశిస్తోంది –ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ సమాజం డాక్టర్ల నుంచి ఎంతో ఆశిస్తోందని కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ చెప్పారు. దానికి అనుగుణంగా భావి వైద్యులు ముందుకు సాగాలన్నారు. వైద్యులకు కమ్యూనికేషన్ స్కిల్స్(భావవ్యక్తీకరణ) ప్రధానమని, రోగులకు మందులు రాసేటప్పుడు అది వారికి అవసరమా అని ఆలోచించుకోవాలన్నారు. మార్పును ఆహ్వానిస్తూ జ్ఞానాన్ని ఇనుమడింపజేసుకుంటే మంచి డాక్టర్గా రాణిస్తారన్నారు. అనంతరం రిటైర్డ్ డీఎంఈ డాక్టర్ ఎస్ఏ సత్తార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, ప్రాంతీయ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్రెడ్డి ప్రసంగించారు. చివరగా బంగారు పతకాలు సాధించిన 9 మంది వైద్య విద్యార్థులకు వాటిని ప్రదానం చేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ప్రభాకర్రెడ్డి, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ కృష్ణానాయక్, డాక్టర్ పి. చంద్రశేఖర్, మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. గోల్డ్మెడల్ సాధించిన విద్యార్థులు విద్యార్థి పేరు సబ్జక్టులు డి. రాగదీపిక అనాటమి, బయోకెమిస్ట్రీ, పెథాలజి, పీడియాట్రిక్స్ బి. శ్రవణ్కుమార్ ఫిజియాలజి ఎ. నిహారిక పెథాలజి, మైక్రోబయాలజి వి. మనోజ్రెడ్డి ఫోరెన్సిక్ మెడిసిన్ కె. రవీంద్రనాథ్రెడ్డి, కేవీ హరీష్కుమార్ ఫార్మకాలజి ఎస్. సుప్రియ ఆఫ్తమాలజి ఎం. జయరామకృష్ణ ఆబ్స్ట్రిక్ట్ అండ్ గైనకాలజి సి. సుధాప్రియ(బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్) బయోకెమిస్ట్రీ, ఎస్పీఎం, ఈఎన్టీ, మెడిసిన్, సర్జరీ నాన్న కల నెరవేర్చాను –ముల్లా జైతున్ రుమన్, వైద్యవిద్యార్థి నాన్న ముల్లా అబ్దుల్ కలాం కలను నెరవేర్చాను. ఆయన నేను వైద్యవిద్యను అభ్యసించాలని ఎన్నో కలలు గన్నారు. ఈ రోజు కోసం ఎంతో కాలం ఎదురుచూశారు. కానీ దురదృష్టవశాత్తు నాన్న గత మార్చి నెలలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన ఆశయాల మేరకు సోదరి సైతం ఎంటెక్ చదివి, గోల్డ్ మెడల్ సాధించింది. ఎంబీబీఎస్ పూర్తయిన వెంటనే నేను పీజీ ప్రవేశ పరీక్షలోనూ విజయం సాధించడం ఇంకా ఆనందంగా ఉంది. -
వైభవం..స్నాతకోత్సవ సంబరం
పుట్టపర్తి టౌన్ : నీలి,ఎరుపు వస్త్రధారులైన విద్యాకుసుమాలు సాయి నామాన్ని స్మరించగా.. వక్తల సందేశాత్మక ప్రసంగాల నడుమ సాయి కుల్వంత్ సభా మందిరంలో జరిగిన సత్యసాయి విద్యా సంబరం వైభవంగా సాగింది. సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 35వ స్నాతకోత్సవం మంగళవారం ప్రశాంతి నిలయంలో ఘనంగా జరిగింది. వేడుకల్లో చాన్సలర్ హోదాలో సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ వెంకటాచలయ్య పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా కేంద్ర సాంకేతిక ప్రధాన సలహాదారు రాజగోపాల చిదంబరం హాజరయ్యారు.చాన్స్లర్ వెంకటాచలయ్య యూనివర్శిటీ పరిధిలోని నాలుగు క్యాంపస్లలో ఉత్తమ ప్రతిభ కనబరచిన 24 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, విభిన్న రంగాలలో నిబద్ధతతో కృషి చేసినందుకు నలుగురు విద్యార్థులకు ఆల్రౌండర్ గోల్డ్ మెడల్స్, 10 మంది పరిశోధన విద్యార్థులకు పీహెచ్డీలను ప్రదానం చేశారు. -
జోసెఫ్ దంతవైద్య కళాశాల స్నాతకోత్సవం
దుగ్గిరాల(పెదవేగి రూరల్) : సెయింట్ జోసఫ్ దంత వైద్య కళాశాల పదో స్నాతకోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. దుగ్గిరాలలోని దంత కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(న్యూ ఢిల్లీ) మెంబర్ ప్రొఫెసర్ డాక్టర్ పి.రేవతి విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. కళాశాల చైర్మన్ రెవరెండ్ బిషప్ పొలిమేర జయరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 2011–16 విద్యా సంవత్సరం అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు, 2013–16 విద్యా సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్యఅతిథిగా విచ్చేసిన రెవరెండ్ ఫాదర్ తోట గాబ్రియోల్, వ్యవస్థాపక కరస్పాండెంట్ సెక్రటరీ ఫాదర్ పి.బాల ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ప్రిన్సిపాల్ ఎన్ స్లీవరాజ్, అన్ని విభాగాల హెచ్ఒడిలు, అడ్మినిస్టేటర్ ఫాదర్ కె.బల్తజర్, నర్సింగ్ కళాఇశాల కరస్పాండెంట్ ఫాదర్ కె.అమృతరాÐŒ , సిబ్బంది పాల్గొన్నారు. -
సందడిగా స్నాతకోత్సవం
బాచుపల్లిలోని విజ్ఞాన జ్యోతి ఇన్సిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజీలో శుక్రవారం 22వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది.ప్రగతి లీడర్ షిప్ వైస్ చైర్మన్ అరుణ్ వకుల్ ముఖ్య అతిథిగా హాజరై పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా అరుణ్ వకుల్ మాట్లాడుతూ.. జీవిత ప్రయాణంలో ఐదు ముఖ్య సూత్రలు గుర్తుంచుకోవాలని సూచించారు.సేవ, మంచి ఉద్దేశ్యం,కార్యాచరణ, సృజనాత్మకత, ఉత్సాహం అనే సూత్రాలను తమ చేతి ఐదు వేళ్లుగా భావించాలన్నారు. ఈ ఐదు వేళ్లు కలిగిన చేయి జీవితంపై అవగాహన అనే జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుందన్నారు. మొత్తం 161 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. కాలేజీ ప్రైసిడెంట్ డిఎన్ .రావు తదితరులు పాల్గొన్నారు. – జగద్గిరిగుట్ట -
వరంగల్ నిట్కు జాతీయ స్థాయి గుర్తింపు
పరిశోధనాత్మక విద్యతో ముందుకు వెళ్లాలి స్నాతకోత్సవంలో డాక్టర్ సంజయ్ గోవింద్ దండే ఎనిమిది మందికి బంగారు పతకాలు, 4,151 మందికి డిగ్రీలు ప్రదానం కాజీపేట రూరల్ : వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని కాన్పూర్ ఐఐటీ పూర్వ డైరెక్టర్ పద్మశ్రీ డాక్టర్ సంజయ్ గోవింద్ దండే అన్నారు. నిట్ ఆడిటోరియంలో శనివారం 14వ స్నాతకోత్సవం కనుల పండువగా జరిగింది. స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా సంజయ్ మాట్లాడుతూ నిట్ విద్యార్థులు ఇక్కడ అధ్యాపకుల సేవలను వినియోగించుకుంటూ పరిశోధనలపై దృష్టి సారించాలని సూచించారు. నైపుణ్యం కలిగిన విద్య పూర్తిచేసిన వారి ద్వారానే సమాజ మార్పు సాధ్యమవుతుందని తెలిపారు. నిట్ ఇన్చార్జి డైరెక్టర్ జీఆర్సీ.రెడ్డి మాట్లాడుతూ నిట్లో చదువుకునే విద్యార్థులు పరిశోధనల ద్వారా తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకున్నారని తెలిపారు. అనంతరం సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థి, నేపాల్ వాసి నిశ్చల్ ప్రసాద్ నుచ్చే ప్రదాన్కు ఇన్స్టిట్యూట్ గోల్డ్ మెడల్తో పాటు రోల్ ఆఫ్ హానర్ గోల్డ్ మెడల్ అందజేశారు. ఇంకా చామ వెంకట మంజునాథరెడ్డి, కొండపర్తి సాయి విష్ణువర్థన్, కొల్లి శ్రీకాంతప్రసాద్, ఆలే శ్రావణి, మన్వితరెడ్డి, రోబిన్ ఓం నెహ్రాకు బంగారు పతకాలు, 4151 మంది విద్యార్థులకు డిగ్రీలు, మరికొందరికి పీహెచ్డీలు ప్రదానం చేశారు. ఈ స్నాతకోత్సవంలో నిట్ రిజిస్ట్రార్ వైఎన్.రెడ్డి, అన్ని విభాగాల డీన్లు, ప్రొఫెసర్లు, సెనేటర్లు పాల్గొన్నారు. కాగా, స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో నిట్లో సందడి నెలకొంది. పట్టాలు స్వీకరించిన అనంతరం విద్యార్థులు ఫొటోలు దిగుతూ ఆనందంగా గడిపారు. నేపాల్ ప్రజలకు సేవ చేయాలని ఉంది నిట్లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన నాకు ఇన్స్టిట్యూట్ గోల్డ్మెడల్ సాధించడం ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు నిట్లో వివిధ కేటగిరీల్లో ఏడు బంగారు పతకాలు సాధించాను. భవిష్యత్లో ఉన్నత స్థానానికి చేరాక మా దేశ ప్రజలకు సేవ చేయాలనేది నా ఆకాంక్ష. – నిశ్చల్ ప్రసాద్ నుచ్చే ప్రదాన్, నేపాల్ ఐఏఎస్ నా లక్ష్యం నిట్ ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేశాను. ప్రస్తుతం గోల్డ్ మెడల్ సాధించడంతో నాకు ఆనందం రెట్టింపైంది. నేను చదువుపై దృష్టి సారించేలా తల్లిదండ్రులు, అధ్యాపకులు సహకరించారు. భవిష్యత్లో ప్రజలకు సేవ చేసేందుకు ఏఐఎస్ సాధించాలనేది లక్ష్యం. – వెంకట మంజునాథరెడ్డి, కడప జనరల్ మోటార్స్లో ఉద్యోగం చేస్తున్నా.. నిట్లో మెకానికల్ ఇంజనీర్ అయిపోయింది. గోల్డ్ మెడల్ రావడం సంతోషంగా ఉంది. నిట్లో జరిగిన ప్లేస్మెంట్ ద్వారా పూణేలోని జనరల్ మోటార్స్లో ఉద్యోగం సాధించాను. అయితే, ఉద్యోగం చేస్తూనే సివిల్స్కు ప్రిపేర్ అయి ఐఏఎస్ సాధించి ప్రజలకు సేవ చేస్తా. – సాయి విష్ణువర్ధన్, స్టేషన్ ఘన్పూర్, వరంగల్ హార్డ్వేర్ కంపెనీ పెడతా.. నిట్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తి అయిపోయిది. కాలిఫోర్నియాలోని యూసీఎల్ఏలో క్యాంపస్ ప్లేస్మెంట్లో భాగంగా ఉద్యోగం సాధించి చేస్తున్నాను. కొంతకాలం తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి హార్డ్వేర్ చిప్స్ కంపెనీ పెట్టి మరికొందరికి ఉపాధి కల్పిస్తా. – శ్రీకాంత ప్రసాద్, వరంగల్ ఉన్నత చదువులపైనే దృష్టి నిట్లో మెటలార్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. పలు సంస్థల్లో ఉద్యోగాలు వస్తున్నా వాటిపై నాకు ఆసక్తి లేదు. భవిష్యత్లో ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాను. ప్రస్తుతం ఇక్కడ బంగారు పతకం సాధించడం ఆనందంగా ఉంది. – ఆలే శ్రావణి, హైదరాబాద్ -
3న నిట్ స్నాతకోత్సవం
హాజరుకానున్న 1451 మంది విద్యార్థులు వివరాలు వెల్లడించిన ఇన్చార్జి డైరెక్టర్ జీఆర్సీ రెడ్డి కాజీపేట రూరల్ : కాజీపేటలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) 14వ స్నాతకోత్సవాన్ని సెప్టెంబర్ 3వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జి డైరెక్టర్ జీఆర్సీ రెడ్డి అన్నారు. నిట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్నాతకోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు చెప్పారు. నిట్ స్నాతకోత్సవానికి ఫార్మర్ డైరెక్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్, పద్మశ్రీ డాక్టర్ సంజయ్ గోవింద్దండేను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. స్నాతకోత్సవానికి మొత్తం 1451 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, ఇందులో పీహెచ్డీలో 40 మందికి, ఎంటెక్లో 613 మందికి, బీటెక్లో 798 మందికి డిగ్రీలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు చెందిన నిశ్చల్ప్రసాద్ నుచ్చే ప్రధాన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో చమా వెంకటమంజునాథ రెడ్డి, మెకానికల్ ఇంజనీరింగ్లో కొండపర్తి సాయివిష్ణువర్థన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో కొల్లి శ్రీకాంత్ ప్రసాద్, మెటలార్జికల్ మెటిరీయల్స్ ఇంజనీరింగ్లో ఆలే శ్రావణి, కెమికల్ ఇంజనీరింగ్లో మన్వితసిరెడ్డి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో రొబిన్ ఓమ్ నెహ్రా, బయోటెక్నాలజీలో ఐశ్వర్య. ఆర్కు బంగారు పతకాలు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే నిట్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు చెందిన నిశ్చల్ ప్రసాద్ నుచ్చే ప్రధాన్ ఆల్ నిట్ ఆల్ డిపార్ట్మెంట్లలో టాపర్గా నిలిచినందుకు గోల్డ్ మెడల్ను ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో నిట్ రిజిస్ట్రార్ వైఎన్.రెడ్డి, డీన్ అకాడమిక్ ఎన్వీఎస్ఎన్. శర్మ, నిట్ పీఆర్ఓ ప్రాన్సిస్ సుధాకర్ పాల్గొన్నారు. -
ఘనంగా గీతం వర్శిటీ స్నాతకోత్సవం
-
స్నాతకోత్సవానికి నల్సార్ ముస్తాబు
శామీర్పేట్: నల్సార్ న్యాయవిశ్వవిద్యాలయం ప్రాంగణం లో నేటి సాయంత్రం 4గంటలకు 14వ స్నాతకోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు నల్సార్ లా యూనివర్సీటీ వైస్ చాన్సలర్ ఫ్రొ.ఫైజాన్ముస్తఫా, రిజి్ట్రార్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలోని జస్టీస్ సిటీ ప్రాంగణంలో నిర్వహించే 14వ స్నాతకోత్సవాలను అట్టహాసంగా నిర్వహించేం దుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చీఫ్ జస్టీస్ ఆఫ్ ఇండియా టీఎస్.ఠాకూర్, విశిష్ట అతిథిగా తెలం గాణ -ఆంధ్రప్రదేశ్ (ఉమ్మిడి) రాష్ట్రాల సంయు క్త హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నల్సార్ చాన్సలర్ జస్టీస్ రమేశ్రంగనాథన్లతో పాటుపలువురు ప్రముఖులు విచ్చేస్తున్నట్లు తెలిపారు. -
స్నాతకోత్సవంలో విద్యార్థుల పట్టాభిషేకం
⇒ బంగారు పతకాలు అందుకున్న ప్రతిభావంతులు ⇒ మాజీ సీఈసీ వి.ఎస్.సంపత్కు గౌరవ డాక్టరేట్ ప్రదానం ⇒ ప్రణాళికతో సవాళ్లను అధిగమించవచ్చు : సంపత్ ⇒ విద్యాప్రమాణాలు మెరుగుపరుస్తాం: వీసీ శ్యాంసుందర్ వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయంలో నాలుగేళ్ల తర్వాత నిర్వహించిన స్నాతకోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. కనులపండువగా సాగిన ఈ సంబరానికి విద్యార్థులు ప్రత్యేక దుస్తులు (గౌనులు) ధరించి హాజరయ్యారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన అధికారి వి.ఎస్. సంపత్ లైబ్రరీ బిల్డింగ్ వద్ద గౌరవవందనం స్వీకరించారు. అనంతరం వైస్చాన్స్లర్,రిజిస్ట్రార్, డీన్లు ఆయనతో కలిసి వేదిక వద్దకు చేరుకున్నారు. కార్యక్రమానికి వీసీ ఆచార్య బేతనభట్ల శ్యాంసుందర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఈసీ సంపత్ మాట్లాడుతూ యువ పట్టభద్రులారా.. చక్కటి ప్రణాళికలతో సవాళ్లను అధిగమించవచ్చని తెలిపారు. స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. స్వచ్ఛ ఇంధనాన్ని ఎల్లప్పుడూ ప్రోత్సహించే తను వైవీయూలో 20 మెగావాట్ల సోలార్ పవర్ప్లాంటు ఏర్పాటుకు చర్యలు తీసుకోవడాన్ని అభినందిస్తున్నాని పేర్కొన్నారు. ⇒ పట్టభద్రులంతా అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. అనంతరం సంపత్కు వైస్చాన్స్లర్ శ్యాంసుందర్ గౌరవ డాక్టరేట్ పట్టాను అందజేశారు. ఈ సందర్భంగా వైస్ చాన్స్లర్ మాట్లాడుతూ 2012లో మొదటి స్నాతకోత్సవం నిర్వహించామని, ఇప్పుడు 2, 3,4, 5వ స్నాతకోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. పరిశోధనలకు ఊతం ఇస్తూ ర్యాగింగ్ను దూరంగా ఉంచుతూ చక్కటి వాతావరణం నెలకొనేలా చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో డిజిటల్ లైబ్రరీ, ఇన్ఫ్లిబ్నెట్ సేవలను అందిస్తామని తెలిపారు. అధ్యాపక బృందం రూ.19 కోట్ల విలువైన 72 పరిశోధక ప్రాజెక్టులతో పాటు వివిధ సంస్థల నుంచి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పొందారన్నారు. అనంతరం పరిశోధక విద్యార్థులకు డాక్టరేట్ పట్టాలు, వివిధ సబ్జెక్టుల్లో ప్రథములుగా నిలిచిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ⇒ అనంతరం లాంఛనంగా డిగ్రీ, డిప్లొమా పట్టాలకు సంబంధించిన రికార్డుపై సంతకం వీసీ సంతకం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా.వై.నజీర్అహ్మద్, ప్రిన్సిపాల్ ఆచార్య బి. జయపాల్గౌడ్, డీన్లు ఆచార్య కె.వలీపాషా, జయచంద్రారెడ్డి, శ్రీనివాస్, సాంబశివారెడ్డి, గులాంతారీఖ్, ఆర్థికశాఖ కార్యదర్శి సుబ్రమణ్యం, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల కరస్పాండెంట్లు బెరైడ్డి రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, అక్బర్ఖాన్, నాగార్జున విద్యాసంస్థల చైర్మన్ శివశంకర్రెడ్డి, డెరైక్టర్ శ్రీదేవి, టీడీపీ నాయకుడు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
'డబ్బే ముఖ్యం కాదు'
విజయవాడ : గోల్డ్ మెడల్ తీసుకునేటప్పుడు ఉండే చిరునవ్వు భవిష్యత్తులో రోగులను చూసేటప్పుడు కూడా ఉండాలని వైద్యులకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచించారు. బుధవారం విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.... డబ్బే ముఖ్యం కాదని వైద్యులకు ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు. వైద్యులను రోగులు దేవుళ్లుగా భావిస్తారని తెలిపారు. వారి నమ్మకాలను వమ్ము చేయవద్దు అంటూ వైద్యులకు చెప్పారు. ఆసుపత్రికి వెళ్లాలంటే సామన్య ప్రజలు భయపడే పరిస్థితి నెలకొందని నరసింహన్ ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ పట్టా తీసుకున్న ప్రతి ఒక్కరూ రెండేళ్ల పాటు గ్రామీణ ప్రాంతంలో వైద్యం చేయాలని పట్టా తీసుకున్న వైద్యులను అర్థిస్తున్నానని గవర్నర్ నరసింహన్ అన్నారు. -
మిమ్మల్ని, దేశాన్ని, సృష్టికర్తను నమ్మండి
లవ్లీ వర్శిటీ స్నాతకోత్సవంలో యువతకు కామన్వెల్త్ ఆఫ్ డొమినికా ప్రధాని స్కెర్రిట్ పిలుపు జలంధర్: ప్రపంచాన్ని సానుకూలంగా ఎదుర్కోవడానికి మిమ్మల్ని, మీ దేశాన్ని, సృష్టికర్తను విశ్వసించాలని.. అప్పుడే ప్రతి ఒక్కరు ఒక ప్రధాని, సీఈవో, ప్రపంచ ప్రసిద్ధ ఎంట్రప్రెన్యూర్లు కాగలుగుతారని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) విద్యార్థులను ఉద్దేశించి కామన్వెల్త్ ఆఫ్ డొమినికా (నార్త్ అమెరికా) ప్రధాని రూజ్వెల్ట్ స్కెర్రిట్ పిలుపునిచ్చారు. యూనివర్సిటీలోని శాంతి దేవీ మిట్టల్ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన వర్సిటీ ఆరో స్నాతకోత్సవంలో ప్రపంచంలోనే అత్యంత పిన్నవయసు ప్రధాని అయిన స్కెర్రిట్ పాల్గొన్నారు. స్కెర్రిట్ పాలనా దక్షతకు, ప్రపంచ వ్యాప్తంగా శాంతిని నెలకొల్పడానికి చేస్తున్న కృషికిగాను వర్సిటీ ఆయనకు ‘ఆనరిష్ కాసా డాక్టర్ ఆఫ్ లెటర్స్’ డిగ్రీని ప్రదానం చేసింది. అనంతరం పెద్ద సంఖ్యలో హాజరై విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి స్కెర్రిట్ మాట్లాడుతూ ఎల్పీయూలో అందుకున్న ఈ గౌరవాన్ని ఇరు దేశాల యువతకు అంకితం ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. విద్యార్థులు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పరస్పరం కలసి పనిచేయడానికి తాను భారత్లో ఎల్పీయూతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆసక్తితో ఎదురుచూస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన 2015 బ్యాచ్కు సంబంధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ను ప్రదానం చేశారు. మొత్తం 7,810 మంది విద్యార్థులు డిగ్రీలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డొమినికా రిపబ్లిక్ క్యాబినెట్ సెక్రటరీ స్టీవ్ ఫెర్కొల్, అజిత్ గ్రూప్ పబ్లికేషన్స్ చీఫ్ ఎడిటర్ పద్మ భూషణ్ డా.బర్జిందర్ సింగ్ హమ్దార్, లవ్లీ గ్రూప్ చైర్మన్ రమేష్ మిట్టర్, వైస్ చైర్మన్ నరేష్ మిట్టల్, ఎల్పీయూ చాన్స్లర్ అశోక్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. స్కెర్రిట్ 31 ఏళ్ల వయసులో ప్రధాని పదవి చేపట్టారు. -
మోదీకి వ్యతిరేకంగా విద్యార్ధుల నినాదాలు
-
రేపు ఎన్జీ రంగా వర్సిటీ స్నాతకోత్సవం
సాక్షి, హైదరాబాద్/బాపట్ల టౌన్ : రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం జరుపుకోనుంది. గుంటూరు జిల్లా బాపట్ల వ్యవసాయ కళాశాలలో బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ టీవీ సత్యనారాయణ వెల్లడించారు. బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కళాశాలలోని బీవీ నాథ్ ఆడిటోరియంలో జరిగే స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా జాతీ య వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ హ ర్షకుమార్ భన్వాలా, రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హాజరుకానున్నట్లు తెలిపారు. -
స్నాతకోత్సాహం
యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీ 54వ స్నాతకోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. మూడేళ్ల తర్వాత జరిగిన స్నాతకోత్సవానికి విద్యార్థులు హాజరై, డిగ్రీలు తీసుకున్నారు. 1,297 మంది ప్రత్యక్షంగా, 18,762 మంది పరోక్షంగా పట్టాలు పొందారు. స్నాతకోత్సవంలో 117 మంది పీహెచ్డీలు, 12 ఎంపీల్, 18 మంది ఎంటెక్, 14 ఎంబీఏ, 7 ఎంసీఎ, 30 ఎంఈడీ, 4 ఎంఎల్ఐసీ, 17 ఎంఫార్మసీ, 6 ఎల్ఎల్ఎం, 677 ఎమ్మెస్సీ, 302 ఎంఏ, 72 ఎంకాం, 6 ఎంఎఫ్ఎం, 15మంది ఎంబీఈ డిగ్రీలు పొందారు. పతకాల పంపిణీ గందరగోళం ఎస్వీయూ స్నాతకోత్సవంలో బంగారు పతకాలు పంపిణీ చేసే సమయంలో గందరగోళం ఏర్పడింది. పరీక్షల విభాగం సరైన ఏర్పాట్లు చేయకపోవడం, పలువురు స్నాతకోత్సవానికి హాజరుకాకపోవడం, బంగారుపతకాలు అందుకోవాల్సిన జాబితాను సిబ్బంది సరిగా పెట్టుకోకపోవడంతో ఆటంకాలు తలెత్తాయి. ఒకరి డి గ్రీలు మరొకరికి ఇచ్చేశారు. పలుమార్లు అంతరాయం ఏర్పడి గందరగోళం ఏర్పడింది. దీంతో వైస్చాన్సలర్ నేరుగా వెళ్లి సిబ్బందితో మాట్లాడి, సరిగా డిగ్రీలు ప్రదానం చేయాలని సూచించారు. డిగ్రీలు అందించే సమయంలో గవర్నర్ చాలాసేపు ఎదురు చూడాల్సి వచ్చింది. ఎక్కువ సార్లు ఆటంకం ఏర్పడడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో వీసీ రాజేంద్ర, రెక్టార్ జయశంకర్, రిజిస్ట్రార్ ఎం.దేవరాజులు, డీన్ ఉషారాణి, కేవీ శర్మ, భగవాన్రెడ్డి, కార్తికేయన్, కృష్ణయ్య, ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ స్నాతకోత్సవానికి టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, పీఆర్వో రవి, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్రెడ్డి ,మాజీ స్పీకర్ అగరాల ఈశ్వరరెడ్డి హాజరయ్యారు. పసిడి వీరులు వీరే ఎస్వీయూ స్నాతకోత్సవంలో బంగారు పతకాలు పొందినవారి వివరాలిలావున్నాయి. జోహారాభాను (గణితం), సునీతా(గణితం), మీనాకుమారి (బయోకెమిస్ట్రీ), సి.అలే ఖ్య (బోటనీ), కె.స్వాతి, సుధామణి, గీతారాణి, హేమలత, విజయలక్ష్మి (కెమిస్ట్రి), జాహ్నవి(కంప్యూటర్సైన్స్), కె.మహేశ్వరి (హోంసైన్స్), సోమశేఖర్( జియాలజీ), ఎం.ప్రియదర్శిని, పవన్కుమార్ (ఫిజిక్స్), శ్రీనప్ప(ఆంథ్రోపాలజీ), పి.శ్రీహరిత, ఎవి ప్రసాద్(స్టాటిస్టిక్స్), వెంకటరామయ(జువాలజీ), వీరేష్ (ఎకనామిక్స్), జయపద్మ( ఇంగ్లి షు), పి.రవి(హిస్టరీ), లక్ష్మీప్రసన్న (హిందీ), శ్రీకాంతమ్మ (సోషియాలజీ), రాజేష్(తమిళం), నాగరాజు , బిందు (తెలుగు), ఈశ్వరయ్య (కామర్స్), కె.అనిత (ఎంఎఫ్ఎం), ఎం.జయశంకర్ (ఎల్ఎల్ఎం), కె.రమ్యకృష్ణ, ప్రత్యూష(ఏంబీఏ), వి.సతీష్కుమార్ (ఎంఎల్ఐసీ), ఫణికుమార్ (ఎంటెక్)లు బంగారు పతకాలు పొందారు. -
ఎస్వీయూ స్నాతకోత్సవంలో గందరగోళం
తిరుపతి: శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ(ఎస్వీయూ) స్నాతకోత్సవంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం జరిగిన యూనివర్శిటీ స్నాతకోత్సవంలో ఒకరికి అందించాల్సిన పట్టాను మరొకరికి ప్రదానం చేయడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీంతో ఈ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యూనివర్శిటీ స్నాతకోత్సవంలో అధికారులు వ్యవహరించిన తీరు సరిగా లేదంటూ నరసింహన్, వెంకయ్యలు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
సామాజిక స్పృహతో రండి
డీఎస్ఎన్ఎల్యూ స్నాతకోత్సవంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు ఉద్బోధ పవిత్రమైన న్యాయవాద వృత్తిని వ్యాపారాత్మకం చేయొద్దు డబ్బు సంపాదించాలనుకుంటే వ్యాపారాలు చేసుకోండి ఉద్దేశపూర్వకంగా ఏ చిన్న పొరపాటు చేసినా వృత్తికి మచ్చ తెచ్చిన వారవుతారు న్యాయ వ్యవస్థలో భాగస్వాములమైన మనంప్రజలకు జవాబుదారులుగా ఉండాలి సాక్షి, విశాఖపట్నం: ‘‘ధనకాంక్షతో న్యాయవాద వృత్తిలోకి రావద్దు. సామాజిక స్పృహతో రండి’’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు న్యాయ విద్యార్థులకు ఉద్బోధిం చారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (డీఎస్ఎన్ఎల్యూ) తొలి స్నాతకోత్సవం శుక్రవారం విశాఖపట్నం లో జరిగింది. ఈ కార్యక్రమంలో జస్టిస్ హెచ్.ఎల్.దత్తు స్నాతకోపన్యాసం చేశారు. ‘‘డబ్బు సంపాదించే ఉద్దేశంతో కొందరు ఈ వృత్తిని ఎంచుకుంటున్నారు. అలాంటి ఉద్దేశం ఉంటే తక్షణం మార్చుకోండి. డబ్బు కోసమైతే ఇతర వృత్తులు, వ్యాపారం చేసుకోవచ్చు. పవిత్రమైన న్యాయ వ్యవస్థను వ్యాపారాత్మకం చేయొద్దు. న్యాయవాదుల చేతుల్లోనే భారత భవిష్యత్తు ఆధారపడి ఉంది. న్యాయవ్యవస్థ గొప్పదనాన్ని గుర్తించి సామాజిక స్పృహతో అందరికీ సమానంగా న్యాయసహాయం చేయాలి’’ అని జస్టిస్ దత్తు చెప్పారు. ‘‘మహా భారతంలోని మూల సిద్ధాంతమైన ధర్మసూత్రాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం ఆచరిస్తోంది. ఎవరికి వారు ధర్మాన్ని ఆచరిస్తే న్యాయ పరిరక్షణ సాధ్యమవుతుంది’’ అని చెప్పారు. ‘‘నేను ఏడో తరగతిలోకి అడుగు పెట్టినప్పుడు రంగనాధరావు అనే ప్రధానోపాధ్యాయుడు మా తరగతి గదిలోకి వచ్చి బోర్డుపై ‘3హెచ్ స్క్వేర్’ అని రాశారు. ఎవరైనా పాఠాలు బోధించే ముందు ఓం అనో, శ్రీ అనో రాస్తారు. కానీ ఆయన ఎందుకిలా రాశారో మాకు అర్థం కాలేదు. అప్పుడాయన చెప్పిన ఫార్ములా ఇప్పటికీ గుర్తుంది. తొలి హెచ్ - హార్డ్వర్క్ (శ్రమ), రెండో హెచ్ - హంబుల్నెస్ అండ్ హ్యుమానిటీ (అణకువ, మానవత్వం), మూడో హెచ్ - హానెస్టీ (నిజాయితీ).. అని వివరించారు. ఇవి అలవరుచుకుంటే జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారని చెప్పారు. ఆ విషయాలను నేను ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ జీవితంలో ముందుకెళ్లాను. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నేను ఇప్పుడు మీ ముందు ఈ స్థాయిలో నిలబడ్డాను. జీవితంలో పైకి రావాలంటే ఎలాంటి అడ్డదారులూ లేవు. తపన, సంకల్పం, క్రమశిక్షణ ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా సులువుగా చేరుకోవచ్చు. అంకితభావం, కష్టపడి పనిచేసే తత్వం అలవర్చుకోవాలి. వీటికి ప్రత్యామ్నాయం లేవు. మార్కులు, ఫలితాలు, ర్యాంకులను పరిగణనలోకి తీసుకోకుండా ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతిలో విజయాలు వరిస్తాయి. ఫస్టా.. లాస్టా అన్నది కాదు.. జీవి తంలో పోరాడటం ముఖ్యం. డిగ్రీలు గుర్తింపు మాత్రమే. మనకు నచ్చిన వృత్తిని ఎంచుకునేందుకు మార్గాలు చూపిస్తాయి. రాణించడమనేది అంకితభావం, కృషి పైనే ఆధారపడి ఉం టుంది. చదువు ముగించుకున్న మీకు జీవితం ఇప్పుడే మొదలైంది. సవాళ్లను ఎదుర్కొనే సమయమిది. వాటిని అధిగమిస్తూ జీవితాన్ని అర్ధవంతం చేసుకోవాలి. చట్ట ప్రకారం న్యాయం పొందడం రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కు. న్యాయ వ్యవస్థలో భాగస్వాములమైన మనంప్రజలకు జవాబుదారులుగా ఉండాలి’’ అని వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతా: సీఎం న్యాయ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఉన్నతమైనదిగా తీర్చిదిద్దేందుకు అన్ని సహాయ సహకారాలు అందిస్తానని సీఎం చంద్రబాబునా చెప్పారు. యూనివర్సిటీకి అవసరమైన 50 ఎకరాలు ఇస్తామని, భవన నిర్మాణాలకు తక్షణమే రూ.25 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. వీసీ ప్రొఫెసర్ ఆర్జీబీ భగవత్ కుమార్ నివేదికను సమర్పించారు. ఎల్ఎల్బీ పూర్తి చేసిన 43 మందికి డిగ్రీలు ప్రదా నం చేశారు. ఐదుగురు టాపర్స్కు స్వర్ణ పతకాలు బహూకరించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్జ్యోతి సేన్గుప్తా, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.చంద్రయ్య, వివిధ న్యాయ విశ్వవిద్యాలయాల వీసీలు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పుటపర్తిలో ఘనంగా సత్యసాయిబాబా వేడుకలు
అనంతపురం:పుటపర్తి సత్యసాయిబాబా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సత్యసాయి ట్రస్ట్ వార్షిక నివేదికను కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా విడుదల చేయగా, రూ.80 కోట్లతో చేపట్టిన సత్యసాయి తాగునీటి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చినరాజప్ప ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 128 గ్రామాలకు మంచి నీరు సరఫరా కానుంది. శనివారం సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 33వ స్నాతకోత్సవాన్నిపుట్టపర్తి ప్రశాంతి నిలయంలో కన్నుల పండువగా నిర్వహించారు. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు, భక్తులు శ్వేత వస్త్రధారులై.. వేడుకల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ ముఖ్యఅతిథిగా హాజరై.. విద్యార్థులనుద్దేశించి ఉపన్యసించారు. -
కన్నుల పండుగ
ఘనంగా సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవం పుట్టపర్తి టౌన్ : సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 33వ స్నాతకోత్సవాన్ని శనివారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో కన్నుల పండువగా నిర్వహించారు. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు, భక్తులు శ్వేత వస్త్రధారులై.. వేడుకల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ ముఖ్యఅతిథిగా హాజరై.. విద్యార్థులనుద్దేశించి ఉపన్యసించారు. ఉదయం 10.35 గంటలకు విద్యార్థుల బ్రాస్బ్యాండ్ వాయిద్యం నడుమ యూనివర్సిటీ బోర్డు ఆఫ్ మేనేజ్మెంట్, అకడమిక్ కౌన్సిల్ బృందాన్ని, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీలను, ముఖ్య అతిథి కస్తూరి రంగన్ను యజుర్ మందిరం నుంచి స్నాతకోత్సవ వేదికైన సాయికుల్వంత్ సభామందిరానికి తీసుకొచ్చారు. 10.45కు యూనివర్సిటీవిద్యార్థులు వేదపఠనం గావించారు. 10.48కి వైస్ ఛాన్సలర్ శశిధర్ ప్రసాద్ స్నాతకోత్సవాన్ని ప్రారంభించాలని యూనివర్సిటీ వ్యవస్థాపక కులపతి అయిన సత్యసాయిని ప్రార్థించారు. ‘నేను ప్రారంభిస్తున్నాను’ అంటూ సత్యసాయి వాణిని డిజిటల్ స్క్రీన్ల ద్వారా వినిపించారు. అనంతరం వీసీ శశిధర్ ప్రసాద్ యూనివర్సిటీ విద్యావిధానం, ఛాన్సలర్ జస్టిస్ వెంకటాచలయ్య, ముఖ్యఅతిథి కస్తూరి రంగన్ల నేపథ్యాన్ని వివరిస్తూ ప్రారంభోపన్యాసం చేశారు. యూనివర్సిటీ పరిధిలోని ప్రశాంతి నిలయం, ముద్దనహళ్లి, బృందావన్, అనంతపురం క్యాంపస్లలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 30 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, ఏడుగురు పరిశోధక విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలను ఛాన్సలర్ విశ్రాంత జస్టిస్ వెంకటాచలయ్య చేతుల మీదుగా ప్రదానం చేశారు. ‘తాము ఆర్జించిన జ్ఞానంతో సత్కర్మలను అచరిస్తామం’టూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ముఖ్య అతిథి కస్తూరి రంగన్ ఉపన్యసించారు. విలువలతో కూడిన సనాతన విద్యా వ్యవస్థను సత్యసాయి నెలకొల్పడం గర్వించదగ్గ విషయమన్నారు. 21వ శతాబ్దపు సమాజ అవసరాలకు అనుగుణంగా సత్యసాయి విద్యా వ్యవస్థ రూపుదిద్దుకుందని వివరించారు. విద్యావంతులైన యువత నూతన ఆవిష్కరణల వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఆవిష్కరణలకు మూలమైన పరిశోధనల వైపు విద్యార్థులను తీసుకెళ్లాల్సిన బాధ్యత యూనివర్సిటీలపై ఉందని అభిప్రాయపడ్డారు. మానవ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకున్నప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి సాధిస్తుందన్నారు. జాతీయ గీతాలాపనతో స్నాతకోత్సవం ముగిసింది. కార్యక్రమంలో రాష్ట్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్రాజు, చక్రవర్తి, మద్రాస్ శ్రీనివాస్, నాగానంద, ఎస్వీ గిరి, టీకేకే భగవత్, ట్రస్ట్ కార్యదర్శి ప్రసాద్ రావు, సిమ్స్ డెరైక్టర్ డాక్టర్ ఓలేటి చౌదరి, జేఎన్టీయూ(ఏ) వైస్ ఛాన్సలర్ లాల్కిశోర్, కదిరి ఆర్డీఓ రాజశేఖర్, గాయని సుశీల, కర్ణాటక సంగీత విద్వాంసుడు బాలమురళీకృష్ణ, విశ్రాంత డీజీపీలు హెచ్జే దొర, అప్పారావు, ప్రశాంతి నిలయం కౌన్సిల్ చైర్మన్ నరేంద్రనాథ్రెడ్డి, సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. -
మానవసేవే మాధవ సేవ
వైద్య విద్యార్థులకు స్విమ్స్ వైస్చాన్స్లర్ వెంగమ్మ పిలుపు స్నాతకోత్సవంలో ఏడుగురికి గోల్డ్మెడల్స్.. కోర్సులు పూర్తిచేసుకున్న 296 మందికి డిగ్రీలు ప్రదానం తిరుపతి కార్పొరేషన్ : మానవ సేవే మాధవ సేవ అని, అదే స్ఫూర్తితో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని స్విమ్స్ డెరైక్టర్, వైస్ చాన్స్లర్ డాక్టర్ బి.వెంగమ్మ పిలుపునిచ్చారు. స్విమ్స్ 5వ స్నాతకోత్సవ వేడుకలు సోమవారం తిరుపతి మహతి కళాక్షేత్రంలో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పద్మవిభూషణ్ గ్రహీత, మణిపాల్ యూనివర్సిటీకి చెందిన జాతీయ పరిశోధనాచార్యులు డాక్టర్ మార్తాండ వర్మ శంకరన్ వలియాతన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి స్నాతకోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.వెంగమ్మ మాట్లాడుతూ డిగ్రీలు పొందిన వైద్యులు నిరుపేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్నారు. 1993లో ప్రారంభించిన స్విమ్స్ ఆసుపత్రి ద్వారా వైద్య, విద్య పరంగా పరిశోధనలు చేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలిచామని గుర్తుచేశారు. ప్రాణదానం వంటి పథకాలతో పాటు పేదలకు ఉచిత వైద్యం, గ్రామీణ ప్రాంతాల్లో వై ద్యశిబిరాలు నిర్వహించి వైద్యసేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యవిద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పంపిన స్నాతకోత్సవ ప్రసంగాన్ని వేదికపై ఆమె చదివి వినిపించారు. టెంపుల్ సిటీగా ఉన్న తిరుపతిలో స్విమ్స్ మెడికల్ హబ్గా ఎదగాలని మంత్రి సందేశంలో వినిపించారు. అనంతరం, స్విమ్స్ యూనివర్సిటీలో వివిధ కోర్సులు పూర్తి చేసుకున్న 296 మంది వైద్య విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. అందులో ఉత్తమ ప్రతిభ చూపిన ఏడుగురికి బంగారు పతకాలు, నలుగురికి మెరిట్ సర్టిఫికెట్లు అందించారు. వీరందరికీ ప్రొఫెసర్ అల్లాడి మోహన్ నేతృత్వంలో వేద పండితులు వేదమంత్రోచ్ఛారణతో ఆశీర్వచనాలు, శ్రీవారి పుస్తక ప్రసాదాలు అందించారు. అనంతరం డాక్టర్ వెంగమ్మ చేతుల మీదుగా అతిథులైన డాక్టర్ మార్తాండ వర్మ శంకరన్ వలియాతన్, టీటీడీ ఈవో ఎంజీ గోపాల్, ఎస్వీయూ వీసీ రాజేంద్ర, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ టి.రవిరాజులకు శ్రీవారి చిత్రపటాలను జ్ఞాపికలుగా అందించారు. చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, స్విమ్స్ రిజిస్ట్రార్ ఆంజనేయులు, శ్రీపద్మావతి మహిళా మెడికల్ కళాశాల డీన్ రామసుబ్బారెడ్డి, మాజీ స్పీకర్ డాక్టర్ అగరాల ఈశ్వర్రెడ్డి, శ్రీసాయిసుధా హాస్పిటల్స్ డెరైక్టర్ డాక్టర్ సుధారాణి, తిరుమల డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, స్విమ్స్లోని అన్ని వైద్య విభాగాధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రగతి పథంలో స్విమ్స్
తిరుపతి : తిరుపతిలోని స్విమ్స్ యూనివర్సిటీ ప్రగతి పథంలో దూసుకుపోతూ, ప్రస్తుతం ఐదవ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. మహతి వేదికగా సోమవారం స్విమ్స్ స్నాతకోత్సవం జరుగనుంది. రాయలసీమ ప్రజలకు మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు 1993 ఫిబ్రవరి 26న స్విమ్స్ ఆస్పత్రి ప్రారంభమైంది. 1995లో యూనివర్సిటీ హోదా పొంది 2003లో యూజీసీ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు సాధించింది. వైద్యం, విద్య, పరిశోధనల పరంగా అంచెలంచెలుగా ఎదిగి స్వతంత్ర ప్రతిపత్తి గలిగిన యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం స్విమ్స్ యూనివర్సిటీలో ఎం డీ, డీఎం, ఎంసీహెచ్ వంటి 60 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సుమారు 195 మంది నిష్ణాతులైన అధ్యాపకులు(ఫ్యాకల్టీ డాక్టర్లు) ఉన్నారు. స్విమ్స్కు అనుబంధంగా నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలలు పనిచేస్తున్నాయి. డయాబెటాలజీ, బ్లడ్ బ్యాంకింగ్ అండ్ ట్రాన్స్ఫ్యూజన్ టెక్నాలజీ తదితర సర్టిఫికెట్ కోర్సులు, న్యూరో అండ్ కార్డియక్ ఆనస్తీషియా, గ్యాస్ట్రో ఎంటరాలజీ తదితర విభాగాలకు సంబంధించి డిప్లొమో కోర్సులు స్విమ్స్లో అందుబాటులో ఉన్నాయి. టీటీడీ నిర్వహణలోని బాలాజీ ఆరోగ్యవరప్రసాదిని, ప్రాణదాన పథకాల ద్వారా రాయితీలు, కొన్ని సందర్భాల్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న స్విమ్స్కు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక్కడ ఇప్పటి వరకు ఐదు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా జరిగాయి. సీటీ సర్జరీ, కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ఆంకాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, యూరాలజీ, మెడిసిన్ తదితర విభాగాలు పటిష్టంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్విమ్స్కు అనుబంధంగా శ్రీపద్మావతి మహిళా మెడికల్ కళాశాల కూడా మంజూైరై ఈ విద్యాసంవత్సరం నుంచి అడ్మిషన్లు, బోధన ప్రారంభించారు. స్నాతకోత్సవంలో ఏడుగురికి మెడల్స్ ప్రదానం తిరుపతి కార్పొరేషన్ : స్విమ్స్ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవంలో ఏడుగురికి మెడల్స్, నలుగురికి మెరిట్ సర్టిఫికెట్లు ఇవ్వనున్నారు. వీరికి సోమవారం తిరుపతి మహతి కళాక్షేత్రంలో నిర్వహించే స్నాతకోత్సవంలో వీటిని ప్రదానం చేయనున్నట్టు స్విమ్స్ డెరైక్టర్, వైస్చాన్స్లర్ డాక్టర్ బి.వెంగమ్మ ఆదివారం తెలిపారు. స్విమ్స్ యూనివర్సిటీలో వివిధ సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన బెస్ట్ ఔట్గోయింగ్ స్టూడెంట్స్ మొత్తం 11 మందికి మెడ ల్స్, మెరిట్ సర్టిఫికెట్లను అందిస్తామన్నారు. వీరితో పాటు వివిధ కోర్సుల్లో బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కు మెరిట్ సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. స్విమ్స్ స్నాతకోత్సవానికి విశిష్ట అతిథి తిరుపతి: తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సోమవారం జరిగే స్విమ్స్ 5వ స్నాతకోత్సవానికి పద్మవిభూషణ్ గ్రహీత, మణిపాల్ యూనివర్సిటీకి చెందిన జాతీయ పరిశోధనాచార్యులు డాక్టర్ మార్తాండ వర్మ శంకరన్ వలియాతన్ విశిష్ట అతిథిగా హాజరు కానున్నట్టు స్విమ్స్ డెరైక్టర్, వైస్ చాన్స్లర్ డాక్టర్ బి.వెంగమ్మ తెలిపారు. దేశంలోని ప్రముఖ మేధావుల్లో ఒకరైన మార్తాండ వర్మ కేరళ యూనివర్సిటీలో మెడిసిన్ పట్టభద్రులై, యునెటైడ్ కింగ్డమ్లో సర్జరీలో శిక్షణ పొందారని గుర్తుచేశారు. ఆపై యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కార్డియాక్ సర్జరీ స్పెషలైజేషన్లో ప్రావీణ్యం పొందారని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో చండీఘర్, వాషింగ్టన్లలో బయోమెడికల్ ఇంజనీరుగా ఆయన విశిష్ఠమైన సేవలు అందించారని గుర్తుచేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో గౌరవ పురస్కారాలు అందుకున్న మార్తాండ వర్మను భారత ప్రభుత్వం 2005లో పద్మవిభూషణ్ పురస్కారంతో గౌరవించిందని అన్నారు. అంతటి గొప్ప వ్యక్తి స్విమ్స్ 5వ స్నాతకోత్సవానికి విశిష్ట అతిథిగా హాజరై స్నాతకోపన్యాసం ఇస్తుండటం గొప్ప విషయమని వెంగమ్మ తెలిపారు. -
అన్వేషించండి.. ఆస్వాదించండి
భారత శాస్త్ర సాంకేతిక సలహాదారుడు రాఘవన్ పిలుపు అట్టహాసంగా ఏయూ స్నాతకోత్సవం 225 మందికి డాక్టరేట్ల ప్రదానం ఏయూక్యాంపస్: ‘అన్వేషించండి, ఆనందించండి, ఆస్వాదించండి, ఇతరులను సుసంపన్నం చేయండి.. మీ చుట్టూ ఉన్న అవకాశాలను గుర్తించి అందుకొనే ప్రయత్నం చేయండి’ అని భారత శాస్త్ర సాంకేతిక సలహాదారుడు ఆచార్య ఎస్.వి రాఘవన్ అన్నారు. సోమవారం జరిగిన ఏయూ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ జ్ఞానం, ఆరోగ్యంతో యువత సుసంపన్నం కావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. మీ భవిష్యత్తు, భారత దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.. ఆధునిక భారతం నిర్మించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు మాట్లాడుతూ పీహెచ్డీ విభాగంలో 225 డాక్టరేట్లు అందించడం జరిగిందన్నారు. 13 మంది విశ్రాంతి ఆచార్యులు ఎమిరిటస్ ఆచార్యుల హోదా పొందారన్నారు. వర్సిటీ ద్వారా అందిస్తున్న నూతన కోర్సులు, విదేశీ వర్సిటీలతో జరుపుతున్న పరిశోధనలను వివరించారు. ఏయూలో ప్రస్తుతం 500 మంది విదేశీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు. బడ్జెట్లో అత్యధికంగా నిధులు మంజూరు చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావులకు కృతజ్ఞతలు తెలిపారు. సందడిగా.. ఆంధ్ర విశ్వవిద్యాలయం 82వ స్నాతకోత్సవం సాయంత్రం 3.30 నుంచి 5.45 గంటల వరకు అంగరంగ వైభవంగా జరిగింది. సభావేదిక, సభామందిరం అతిథులు, ఆహ్వానితులతో కిక్కిరిసి పోయింది. వేదికపై వీసీ రాజు, ముఖ్యఅతిథి ఎస్.వి.రాఘవన్, రిజిస్ట్రార్ కె.రామ్మోహనరావు, అకడమిక్ సెనేట్ సభ్యులు, ఫ్యాకల్టీ చైర్మన్లతో 120 మందికి పైగా అతిథులు ఆశీనులయ్యారు. గవర్నర్ స్నాతకోత్సవానికి హాజరుకాకపోవడంతో వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు అధ్యక్షస్థానంలో స్నాతకోత్సవాన్ని నడిపించారు. ముందుగా ఆయన వార్షిక నివేదిక అందించారు. ముఖ్యఅతిథి భారత ప్రభుత్వ సాంకేతిక సలహాదారు ఎస్.వి.రాఘవన్కు డాక్టర్ ఆఫ్ సైన్స్ను ప్రదానం చేశారు. పట్టభద్రులచే ప్రమాణం చేయించారు. తరువాత డాక్టరేట్లు, మెడల్స్, బహుమతులు అందించారు. రిజిస్ట్రార్ ఆచార్య కె.రామ్మోహనరావు వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఇ.ఏ నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య కె.రామ్మోహనరావు, ప్రిన్సిపాళ్లు పి.ఎస్.అవధాని, సి.వి రామన్, డి.సూర్యప్రకాశరావు, బి.గంగారావు, కె.గాయత్రీ దేవి, సి.హెచ్ రత్నం, మాజీ ఉపకులపతులు ఆచార్య కె.రామకృష్ణారావు, వై.సి.సింహాద్రి, కె.వి రమణ, బీలా సత్యనారాయణ, అకడమిక్ సెనేట్ సభ్యులు, ఫ్యాకల్టీ చైర్మన్లు పాల్గొన్నారు. డాక్టరేట్ల ప్రదానం పీహెచ్డీ విభాగంలో 225 డాక్టరేట్లు, 16 పతకాలు, 13 బహుమతులు అందించడం జరుగుతుందన్నారు. ఆర్ట్స్లో 50, సైన్స్ 64, కామర్స్ మేనేజ్మెంట్ 24, ఇంజినీరింగ్ 41, కెమికల్ ఇంజినీరింగ్ 5, ఎడ్యుకేషన్ 6, ఫిజికల్ ఎడ్యుకేషన్ 2, న్యాయశాస్త్రం 3, ఫార్మసీ 30 మందికి డాక్టరేట్ పట్టాలు అందించారు. ఎంఫిల్ విభాగంలో ఆర్ట్స్లో 7, సైన్స్లో 12, కామర్స్, మేనేజ్మెంట్లో ఒకరు పట్టాలను అందుకున్నారు. వీటితో పాటు డిగ్రీ, పీజీ కోర్సుల్లో 426 మంది బహుమతులు, 155 మంది మెడల్స్ అందుకున్నారు. ప్రముఖులకు డాక్టరేట్లు స్నాతకోత్సవంలో మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి (పొలిటికల్ సైన్స్), రాష్ట్ర మాజీ మంత్రి వట్టి వసంత కుమార్(కామర్స్ మేనేజ్మెంట్), జీవీఎంసీ చీఫ్ ఇంజినీర్ బి.జయరామి రెడ్డి(సివిల్ ఇంజినీరింగ్) విభాగాలలో డాక్టరేట్లు అందుకున్నారు. -
నేడు ఏయూ స్నాతకోత్సవం
ఏర్పాట్లు పూర్తి వెబ్సైట్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఏయూ క్యాంపస్: ఆంధ్రా యూనివర్సిటీ 82వ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి స్నాతకోత్సవ మందిరాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. వేదికను విద్యుత్ కాంతుల వెలుగులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. సోమవారం మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 గంటల వరకు రెండు గంటల పాటు ఈ వేడుక సాగనుంది. వీసీ జి.ఎస్.ఎన్.రాజు ఏర్పాట్లను ఆదివారం స్వయంగా పరిశీలించారు. వేదికకు ఇరువైపులా అందరికి కనిపించే విధంగా రెండు స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అతిథుల ఆగమనం, సభావేదికపై సిటింగ్, డాక్టరేట్ తీసుకునే వారి సిటింగ్ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఇ.ఎ.నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య కె.రామ్మోహనరావు, ప్రిన్సిపాళ్లు పి.ఎస్.అవధాని, సి.వి.రామన్, డి.సూర్యప్రకాశరావు, బి.గంగారావు, కె.గాయత్రి దేవి తదితరులు పాల్గొన్నారు. స్నాతకోత్సవాన్ని www.youtube.com/users/andhrauniversitylive, www.andhrauniversity.edu.in, www.aucoe.infoవెబ్సైట్ల ద్వారా ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. ముఖ్యఅతిథిగా రాఘవన్ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా భారత ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు కార్యాలయం సాంకేతిక కార్యదర్శిగా సేవలందిస్తున్న ఆచార్య ఎస్.వి.రాఘవన్ హాజరుకానున్నారు. ఆయనకు వర్సిటీ తరఫున డాక్టర్ ఆఫ్ సైన్స్(డీ.ఎస్సీ)ను ప్రధానం చేస్తారు. ఆయన స్నాతకోత్సవ ప్రసంగం చేస్తారు. ఆయన మద్రాసు ఐఐటీ ఆచార్యునిగా పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీ విశ్వవిద్యాలయం గౌరవ ఆచార్యునిగా, నేషనల్ నాలెడ్జ్ సెంటర్ చీఫ్ ఆర్కిటెక్గా పనిచేస్తున్నారు. -
పీహెచ్డీ అందుకోనున్న పనబాక, వట్టి
విశాఖ : ఈనెల 29న ఆంధ్ర విశ్వవిద్యాలయం 82వ స్నాతకోత్సవం జరగనుంది. ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి మోడీ శాస్త్రీయ సలహాదారు, ఆచార్య రాఘవన్ హాజరు కానున్నారు.ఆయనను గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ ప్రదానం చేయనుంది. కాగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, వట్టి వసంత్ కుమార్, ఐఏఎస్ అధికారి శ్రీనివాస్ శ్రీనరేష్, జివిఎమ్సి చీఫ్ ఇంజినీర్ జయరాంరెడ్డి తదితరులు పీహెచ్డీ అందుకోనున్నారు. -
ఉప్పొంగిన ఉత్సాహం..
మలేసియా టౌన్షిప్: పట్టాలు అందుకున్న వేళ విద్యార్థుల్లో ఉత్సాహం ఉరకలేసింది. పట్టాలను గాల్లోకి ఎగుర వేశారు. స్నేహితులతో కలిసి స్టెప్పులేశారు. కెమెరాల్లో ఫొటోల్లో తీసుకున్నారు. కూకట్పల్లి జేఎన్టీయూహెచ్లో గురువారం ఐదో స్నాతకోత్సవం ఆద్యంతం ఆనందోత్సాహాల మధ్య జరిగింది. పలు కోర్సుల వారికి పట్టాలు అందజేయడంతోపాటు పీహెచ్డీ పూర్తి చేసిన 150 మంది విద్యార్థులకు డాక్టరేట్ ప్రదానం చేశారు. వర్సిటీ ఉపకులపతి రామేశ్వర్రావు చేతుల మీదుగా పట్టాలు పుచ్చుకున్నారు. వివిధ కళాశాలలకు చెందిన 98 మంది గోల్డ్ మెడల్స్ అందుకున్నారు. తమ పిల్లలు గోల్డ్మెడల్స్ అందుకునే క్రమంలో వారి తల్లిదండ్రులు పరవశించిపోయారు. ఆనందంగా ఉంది.. మూడు గోల్డ్ మెడల్స్ సాధించ డం ఎంతో ఆనందంగా ఉంది. అమెరికాకు వెళ్లి ఎంఎస్ పీహెచ్ డీ పూర్తి చేయాలనుకుంటున్నా. ఫార్మసీలో ఉన్నత స్థాయిలో స్థిరపడాలనేదే నా జీవిత ఆశయం. - ఎంవీఎన్ఎస్ అనూష సొంతంగా కంపెనీ స్థాపిస్తా.. బీటెక్లో గోల్డ్మెడల్ సాధించా. ఆస్ట్రేలియాలోని అడ్యులాడే యూనివర్సిటీలో ఎంఈ చేయాలని ఉంది. ఆ తరువాత పీహెచ్డీ చేస్తా. సొంతంగా కంపెనీ స్థాపించి సిర్థపడాలని ఉంది. - కేశభోని రాజేందర్గౌడ్ అమెరికాలో ఎంఎస్ చేస్తా.. కంప్యూటర్ సైన్స్లో రెండు మెడ ల్స్ సాధించిన. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి అక్కడే సాఫ్ట్వేర్ రంగంలోనే స్థిరపడాలని ఉంది. సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించాలనే కోరిక ఉంది. - అనితారెడ్డి స్వర్ణ -
త్వరలో జుడీషియల్ పోస్టుల భర్తీ
కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ దేశ వ్యాప్తంగా 4,382 పోస్టులు ఖాళీ హైకోర్టుల్లో 25 శాతం సిబ్బంది పెంపునకు చర్యలు ఘనంగా ‘నేషనల్ లా స్కూల్’ స్నాతకోత్సవం పది బంగారు పతకాలు అందుకున్న విద్యార్థిని సాక్షి సాక్షి, బెంగళూరు : దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 4,382 జుడీషియల్ ఆఫీసర్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు కేంద్ర న్యాయ, సాంకేతిక సమాచార శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ స్నాతకోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ప్రసంగిస్తూ... దేశంలోని అన్ని హైకోర్టుల్లోనూ ప్రస్తుతమున్న సిబ్బందిని మరో 25 శాతం వరకు పెంచనున్నట్లు చెప్పారు. అయా కోర్టుల్లో కేసు సంఖ్య పేరుకుపోతున్న కారణంగా కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని అన్నారు. ప్రస్తుతం జైళ్లల్లో ఉన్న వారిలో 66శాతం మంది విచారణ ఖైదీలే కావడం ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇది మానవ హక్కులకు తీవ్ర విఘాతం కల్పించడమే కాక న్యాయ వ్యవస్థకు సైతం పెద్ద సవాలువంటిదని అన్నారు. అందుకే విచారణ ఖైదీలుగా ఎక్కువ సమయం జైలులో గడిపిన వారి వివరాలను నమోదు చేసేందుకు గాను ‘ది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్’(ఎన్ఐసీ)తో కలిసి ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్ను కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు. ఈ సాఫ్ట్వేర్ను ఇప్పటికే ప్రయోగాత్మకంగా తీహార్జైల్లో అమలు చేసినట్లు తెలిపారు. అలాగే 14 వేల సబార్డినేట్ కోర్టులను కంప్యూటరీకరణ చేయడానికి నిర్ణయించుకున్నట్లు చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధులైన న్యాయవాదుల జీవితాలు పాఠ్యాంశాలుగా తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది న్యాయవాదులు ఉండడం ఇప్పటి తరం లాయర్లకు ఎంతైనా గర్వకారణమని అన్నారు. బాలగంగాధర తిలక్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇలా ఎంతోమంది న్యాయవాద వృత్తిని చేపట్టి అనంతరం స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారని చెప్పారు. ఇలాంటి వారి జీవిత చరిత్రను నేటి తరం లాయర్లకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. అందుకే వీరి జీవిత చరిత్రను న్యాయశాస్త్ర పాఠ్యాంశంలో చే ర్చే దిశగా విద్యావేత్తలు ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఘనంగా స్నాతకోత్సవం.... నగరంలోని ప్రముఖ న్యాయవిద్యా సంస్థ నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీలో స్నాతకోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఆదివారమిక్కడి యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్.ఎం.లోథా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాస్టర్ ఆఫ్ లా, బీఏ ఎల్ఎల్బీ, పీజీ డిప్లొమా తదితర విభాగాల్లో మొత్తం 647 మంది డిగ్రీలను అందుకున్నారు. డిగ్రీలను పూర్తి చేసిన వారిని జస్టిస్ ఆర్.ఎం.లోథా పట్టాలను అందజేసి అభినందించారు. అనంతరం ఆయా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. బీఏ ఎల్ఎల్బీ విభాగానికి చెందిన సాక్షి అత్యధికంగా పది బంగారు పతకాలు అందుకున్నారు. ఇక ఇదే విభాగానికి చెందిన జూహి గుప్తా ఆరు బంగారు పతకాలను అందుకోగా, వినోదినీ శ్రీనివాసన్ ఐదు, అభినవ్ సేక్రి నాలుగు బంగారు పతకాలను అందుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్.వి.దేశ్పాండే, హైకోర్టు న్యాయమూర్తులు, నేషనల్ లా స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. పై చదువుల కోసం ఆక్స్ఫర్డ్కు..... బీఏ ఎల్ఎల్బీ విభాగంలో విద్యనభ్యసించి పది బంగారు పతకాలను అందుకున్న సాక్షి... ఆక్స్ఫర్డ్కు వెళ్లి న్యాయశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించడమే తన లక్ష్యమని తెలిపారు. కర్ణాటకలోని ఉడుపి ప్రాంతానికి చెందిన సాక్షి తండ్రి ఎస్బీఐలో మేనేజర్గా పనిచేస్తుండగా, తల్లి కన్నడ భాషా అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచే ఓ గొప్ప న్యాయవాది కావాలని తాను ఆరాటపడ్డానని సాక్షి తెలిపారు. అందుకే గంటల పాటు లైబ్రరీలోనే గడిపేదానినని, ఇప్పుడు తన కల సాకారమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ బంగారు పతకాల ద్వారా వచ్చిన స్కాలర్షిప్లతో ఆక్స్ఫర్డ్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళుతున్నట్లు చెప్పారు. -
నిరంతర అధ్యయనానికే గుర్తింపు
వేడుకగా తెలుగు వర్సిటీ స్నాతకోత్సవం ప్రముఖ సాహితీవేత్త కపిలవాయికి గౌరవ డాక్టరేట్ 62 మందికి పీహెచ్డీలు, 59 మందికి బంగారు పతకాల ప్రదానం సాక్షి,సిటీబ్యూరో: మారుతున్న ప్రపంచ పరిణామాల్లో నిరంతర అధ్యయన శీలురుగా మసలుకొంటూ ముందుకు సాగాలని ప్రముఖ సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తి ఉద్బోధించారు. ఎప్పటికప్పుడు విజ్ఞానాన్ని సముపార్జించుకుంటూ మీరు ఎంచుకున్న రంగంలో నిపుణులు కావాలని సూచించారు. అప్పుడే సమాజం గుర్తించే స్థాయికి చేరగలరన్నారు. శనివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం 13 స్నాతకోత్సవం రవీంద్రభారతిలో నిర్వహించారు. శతాధిక గ్రంధకర్త, ప్రముఖ పండితుడు, కవి, నవలాకారుడు, ప్రముఖ సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. శాస్త్ర జ్ఞానం కంటే తనను తాను తెలుసుకున్నప్పుడే తత్త్వజ్ఞుడన్న సంగతి గ్రహించాలన్నారు. అనంతరం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్.కవితా ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య కె.ఆశీర్వాదం, వివిధ పీఠాల అధిపతులు, విశ్వవిద్యాలయ నిర్వహణ మండలి సభ్యులు చెన్నారెడ్డి, సత్తిరెడ్డి, అప్పారావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో గడిచిన మూడు విద్యా సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పట్టాలను ప్రదానం చేశారు. 62 మందికి పీహెచ్డీలు, 97 మందికి ఎంఫిల్ పట్టాలను, 59 మందికి బంగారు పతకాలను అందజేశారు. అన్ని కోర్సులకు కలిపి 2128 మందికి, సంగీత, నృత్య విభాగాల్లో 4757 మంది పట్టాలు అందుకున్నారు. ఈ సందర్భంగా బంగారు పతకాలు, పీహెచ్డీలు సాధించిన వారు తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. బాధ్యతను పెంచింది నృత్యంలో డాక్టరేట్ కొంత కష్టంతో కూడుకున్న పనే అయినా చేశా. లలిత కళల పీఠం నుంచి పట్టా తీసుకోవడం ఆనందంగా ఉంది. డ్యాన్స్కు ముక్తాయింపు పీహెచ్డీ. ఈ పట్టా ద్వారా ఆర్ట్స్పై నాలెడ్జ్ వస్తుంది. ‘సాహిత్యంలో సత్యభామ పాత్ర చిత్రీకరణ’ అంశంపై డాక్టరేట్ చేశాను. - మద్దాళి ఉషా గాయత్రి నా తల్లిదండ్రులకు అంకితం.. నాటక రంగంపై ఉన్న మక్కువతో కష్టమైనా ఇష్టంగా భావించి పరిశోధన చేశా. పీహెచ్డీ వచ్చింది. దీన్ని నా తల్లిదండ్రులకు అంకితమిస్తున్నా. గతంలో కూడా నా రచనలకు నాంది అవార్డు వచ్చింది. పలువురు సాహితీవేత్తలు నాకు సలహాలు ఇచ్చి సహకరించారు. అందరికి కృతజ్ఞతలు. - వి.త్రినాథరావు చాలా సంతోషంగా ఉంది జర్నలిజంలో ఒక అంశంపై అద్యయం చేశాను. కష్టానికి ఫలితమన్నట్టు బంగారు పతకం రావటం మరింత ఆనందం కల్గిస్తోంది. నా కష్టంతో పాటు చాలా మంది తనకి సలహాలు- సూచనలు ఇచ్చి సహకరించారు. భవిష్యత్తులో మరిన్ని అంశాలపై పరిశోధనలు చేస్తా. మా గురువు సత్తిరెడ్డి పొత్సాహం వెలకట్టలేనిది. - భువనగిరి రఘు అమ్మవారి కృపే.. కూచిపూడి నృత్య రూపాల్లో చాలా సార్లు అమ్మవారిపై నృత్యం చేశాను. అమె కృప వల్లే కూచిపూడిలో బంగారు పతకం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. మా గురువు సతీమణి సమక్షంలో రెండు గోల్డ్ మెడల్స్ అందుకున్నా. ఈ ఆనందమైన క్షణాలను వర్ణించలేను. జీవితంలో మరువలేను. - నూతి రోహిణి -
ముస్తాబవుతున్న మహిళా వర్సిటీ
రేపు స్నాతకోత్సవం జోరందుకున్న ఏర్పాట్లు యూనివర్సిటి క్యాంపస్ : దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత బుధవారం జరుగనున్న స్నాతకోత్సవానికి మహిళావర్సిటి సిద్ధం అవుతోంది. ప్రస్తుత వీసీ రత్నకుమారి పదవి చేపట్టాక జరుగుతున్న తొలి స్నాతకోత్సవం, నాలుగు సంవత్సరాల తర్వాత జరుగుతున్నది కావడంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణలో ఏర్పాట్లు సాగుతున్నాయి. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చివరిసారిగా 2010 సెప్టెంబర్17న స్నాతకోత్సవం నిర్వహించారు. తర్వాత యేడాదిపాటు రెగ్యులర్ వీసీని నియమించక పోవడం, రత్నకుమారిని వీసీగా నియమించినప్పటి నుంచి సమైక్యాంధ్ర ఉద్యమాలు చోటు చేసుకోవడం వల్ల 15వ స్నాతకోత్సవానికి ముహూర్తం కుదరలేదు. నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు స్నాతకోత్సవం నిర్వహిస్తున్నారు. స్నాతకోత్సవం కోసం మూడురోజులుగా పనులు చురుగ్గా సాగుతున్నాయి. అందులో భాగంగా ఇందిరా ప్రియద ర్శిని ఆడిటోరియంకు రంగులు వేస్తున్నారు. వర్సిటీలోని రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు. లక్ష్మీకాంతంకు గౌరవ డాక్టరేట్ బుధవారం జరిగే స్నాతకోత్సవంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (హైదరాబాద్) డెరైక్టర్ ఎం.లక్ష్మీకాంతంకు గౌరవ డాక్టరేట్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా 1948 మందికి డిగ్రీలు ఇవ్వనున్నారు. గవర్నర్ నరసింహన్ హాజరై డిగ్రీలను ప్రదానం చేస్తారు. 14వ స్నాతకోత్సవంలో ముగ్గురికి గౌరవ డాక్టరేట్ల్ ఇవ్వగా ప్రస్తుతం ఒకరికి మాత్రమే ఇస్తున్నారు. -
27న మహిళా వర్సిటీ స్నాతకోత్సవం
తిరుపతి: శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవాన్ని ఈనెల 27వ తేదీ నిర్వహిస్తున్నట్టు వర్సిటీ వీసీ రత్నకుమారి తెలిపారు. మహిళా యూనివర్సిటీలోని సెనేట్ హాల్లో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (హైదరాబాద్) డెరైక్టర్ ఎం.లక్ష్మీకాంతంకు గౌరవ డాక్టరేట్ ఇస్తున్నామన్నారు. ఆమె స్నాతకోపన్యాసం చేస్తారని చెప్పారు. గవర్నర్ నరసింహన్ ఈ కార్యక్రమానికి హాజరై చాన్సలర్ హోదాలో డిగ్రీలు ప్రదానం చేస్తారన్నారు. ఈ సందర్భంగా 1,948 మందికి వివిధ రకాల డిగ్రీలు ఇస్తున్నామని తెలిపారు. 71 మందికి బంగారు పతకాలు, 13 మందికి బుకే ప్రైజ్లు, 13 మందికి నగదు బహుమతులు, 117 మందికి పీహెచ్డీలు, 986 మందికి పీజీలు, 588 మందికి డిగ్రీలు, 242 మందికి దూరవిద్య డిగ్రీలు, ఎంఫిల్ డిగ్రీలు 15 మందికి ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది నుంచి ఎంకాం, ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ కోర్సులు ప్రవేశపెట్టినట్టు వీసీ పేర్కొన్నారు. -
సవాళ్లు అధిగమించాలి
సరికొత్త పరిశోధనలు చేయాలి 800 ఏళ్ల క్రితమే సాంకేతికతను ప్రవేశపెట్టిన కాకతీయులు రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు పద్మశ్రీ అవినాశ్ చందర్ కనుల పండువగా నిట్ స్నాతకోత్సవం1427 మందికి పట్టాలు ప్రదానం నిట్ క్యాంపస్: దేశాభివృద్ధిలో తమ వంతు పాత్రను పోషించేందుకు యువ ఇంజనీర్లు సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకు రావాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి శాస్త్రీయ సలహాదారు పద్మశ్రీ అవినాశ్ చందర్ అన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్, వరంగల్) 12వ స్నాతకోత్సవం నిట్ ఆడిటోరియంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అవినాశ్ చందర్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవడం, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం వంటి రంగాల్లో మరిన్ని పరిశోధనలు జరగాలని సూచించారు. 21వ శతాబ్దంలో వచ్చే సవాళ్లను అధిగమించేలా కొత్త ఆవిష్కరణలు చేయాలని ఆయన నేటితరం ఇంజనీర్లను కోరారు. ఎనిమిది వందల ఏళ్లక్రితమే నిర్మాణం, సాగు నీటి రంగాల్లో సాంకేతికను ప్రవేశపెట్టిన కాకతీయుల గడ్డపై తాను ప్రసంగిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన నిట్ బోర్డుఆఫ్ గవర్నర్స్ చైర్మన్ కృష్ణ ఎం ఎల్లా మాట్లాడుతూ ఒక విజయం కోసం కల కనాలని, దాన్ని సాధించడానికి అహర్నిశలు కృషి చేయాలని, అప్పుడే విజయం వరిస్తుందన్నారు. నిట్లో ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఎందరో సొంతంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి విజయం సాధించారని చెప్పారు. ఆర్ఈసీ మొదటి బ్యాచ్ విద్యార్థి ఆంజనేయ శాస్త్రీ పరిశ్రమ స్థాపించి విజయం సాధించారని, అంతేగాక నిట్ ఇనిస్టిట్యూట్ ఇంకుబేషన్ సెంటర్కు కోటి రుపాయలు ఇచ్చారన్నారు. అభివృద్ధికి పరిమితులు ఉండవని, యువ ఇంజనీర్లు దేశ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన కోరారు. పరిశోధన రంగాన్ని అభివృద్ధి చేయడానికి కృషి నిట్ డెరైక్టర్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు నిధులతో టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం కింద నిట్లో పరిశోధనరంగం ద్వారా నూతన ఆవిష్కరణలకు కృషి చేస్తున్నామని చెప్పారు. నిట్లో 40మంది ప్యాకల్టీ మెంబర్లు, ఆరుగురు పీహెచ్డీ స్కాలర్లు అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి విదేశాల్లో శిక్షణ ఇప్పించామన్నారు. ఈ సారి 1427మందికి స్నాతకోత్సవంలో పట్టాలు ఇస్తున్నామని అందులో బిటెక్ గ్రాడ్యుయేట్లు 720 మంది, పోస్ట్ గ్రాడ్యుయేట్లు 668 మంది, పీహెచ్డీ స్కాలర్లు 39మంది ఉన్నారన్నారు. కంప్యూటర్సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థి కార్తీకేయన్ మిశ్రా ఫేస్బుక్లో ఉద్యోగం సంపాదించి వార్షిక వేతనంగా రూ.70లక్షలు పొందుతున్నాడని తెలిపారు. నిట్ అసోసియేట్ ప్రొఫెసర్ రతీష్కుమార్ ఫ్యాకల్టీ నుంచి ఆప్తాబ్ముప్తీ మెడల్ను సాధించాడన్నారు. ఇంజనీరింగ్తోపాటు ఇతర రంగాల్లోనూ విద్యార్థులను ప్రోత్సహించడానికి స్ప్రింగ్ స్త్రీ, టెక్నోజియూన్ ప్రతి ఏడాది నిట్లో నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. క్రీడాకారుల కోసం ఆల్ ఇండియా ఇంటర్ నిట్ స్పోర్ట్స్ను నిర్వహించామని ఆయన వివరించారు. నిట్ అకడమిక్ డీన్ డీవీఎల్ఎన్ సోమయాజులు ఇంజనీరింగ్ పట్టభద్రులను వేదికపైకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలోఇంచార్జీ రిజిస్ట్రార్ ఎఆర్సిరెడ్డి, ప్యాకల్టీ వెల్పేర్ డీన్ ఎం.సైదులు, స్టూడెంట్స్ వెల్పేర్ డీన్ ఎస్ శ్రీనివాసరావు, ప్లానింగ్ డెవలప్మెంట్ డీన్ ఆర్ఎల్ఎన్ సాయి ప్రసాద్, రీసెర్చ్కన్సల్టెన్సీ డీన్ జీవీఎస్ నాగేశ్వర్రావు, ప్రొఫెసర్లు సీబీ కామేశ్వర్రావు, కెవీ జయకుమార్, సీఎస్ఆర్కె ప్రసాద్, దేవ ప్రతాప్, ఎన్.సుబ్రమణ్యం, సి.గురుజారావు, జి.అంబప్రసాద్రావు, పులి రవికుమార్, కెఎస్ఆర్ కృష్ణానంద్, ఎన్వీఎస్ఎన్ శర్మ, జీవీఎస్ నాగేశ్వర్రావు, ఎన్.నర్సయ్య, ఎ.శరత్బాబు, పైడిశెట్టి, టి.రమేష్, బిబి.అంబర్కర్, కె.రమేష్, పి.నాగేశ్వర్రావు, జి.రాధాకృష్ణమాచార్య, వైఎన్ రెడ్డి, కెఎన్ఎస్ విశ్వనాథం, జెవి రమణమూర్తి, దత్తా, కె.శ్రీమన్నారాయణ, ఎ.రాంచంద్రారెడ్డి, ఎం.సాయిశంకర్, ఆర్ఎల్ఎన్.సాయిప్రసాద్, బివి.అప్పారావు, అజిత్కుమార్రెడ్డి, పి.నాగేశ్వర్రావు, వి.రాజేశ్వర్రావు, డీఎస్. కేశవరావు, పద్మ, నిట్ పీడీ రవికుమార్, పీఆర్వో ప్రాన్సిస్ సుధాకర్ పాల్గొన్నారు. ఐదుగురికి గోల్డ్మెడల్ ప్రదానం నిట్ బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ కృష్ణ ఎం ఎల్ల, నిట్ డైరక్టర్ ప్రొపెసర్ టి.శ్రీనివాసరావు చేతుల మీదుగా ఐదుగురు గోల్డ్మెడల్ అందుకున్నారు. ఇసీఇ టాపర్గా నిలిచిన జి.విశాల్ లక్ష్మణ్రావుకు నిట్ ఇనిస్టిట్యూట్ గోల్డ్మెడల్ను, సివిల్ ఇంజనీరింగ్లో వి.శ్రీహిత, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్(ఇఇఇ) లో సాయితేజ, కెమికల్ ఇంజనీరింగ్లో శ్రీదిత్యకు, కంప్యూటర్సైన్స్ ఇంజనీరింగ్లో సిహెచ్.అశ్వినికి గోల్డ్మెడల్ను అందజేశారు. -
నేడు కృష్ణా యూనివర్సిటీ స్నాతకోత్సవం
16 వేల మందికి పైగా విద్యార్థులకు పట్టాలు ప్రదానం ముఖ్యఅతిథిగా జర్మనీ న్యాయమూర్తి పి.సి.రావు రాక మూడు బంగారు పతకాలు విద్యార్థినులకే వైస్ చాన్సలర్ ఆచార్య వి.వెంకయ్య వెల్లడి సాక్షి, విజయవాడ : కృష్ణా యూనివర్సిటీ చరిత్రలోనే ప్రథమంగా పీజీ విద్యార్థులతోపాటు డిగ్రీ విద్యార్థులకు స్నాతకోత్సవంలో పట్టాలు ప్రదానం చేస్తున్నామని వైస్ చానల్సర్ ఆచార్య వి.వెంకయ్య చెప్పారు. గురువారం స్థానిక పీబీ సిద్ధార్థ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో స్నాతకోత్సవ వివరాలను వెల్లడించారు. ఆరేళ్ల కిందట ఆవిర్భవించిన యూనివర్సిటీ 2012 డిసెంబర్ 9న మొదటి స్నాతకోత్సవం జరుపుకొందని, శుక్రవారం రెండో స్నాతకోత్సవం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని వివరించారు. వర్సిటీలో ఇంజినీరింగ్, మెడిసిన్ మినహా అన్ని డిగ్రీ, పీజీ కోర్సులు ఉన్నాయని తెలి పారు. ఈ ఏడాది 16 వేల మందికి పైగా విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తున్నామని, వీరిలో 2,276 మంది పీజీ విద్యార్థులు, 14,286 మంది డిగ్రీ విద్యార్థులు ఉన్నారని వివరించారు. ఈసారి డిగ్రీ విద్యార్థులకు కూడా స్నాతకోత్సవంలో పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. పాస్ పర్సెంటేజ్లో విద్యార్థినులే అధికంగా ఉన్నారన్నారు. పీజీ కోర్సులో ఎం.ఫార్మసీ, ఎంఏ తెలుగు, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ తదితర కోర్సుల్లో మూడు బంగారు పతకాలు ప్రదానం చేస్తున్నామని, వీటికి విద్యార్థినులే ఎంపికయ్యారని వివరించారు. విజయవాడలో స్నాతకోత్సవం ... విజయవాడలోని తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో వర్సిటీ స్నాతకోత్సవం శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు. ముఖ్య అతిథిగా జర్మనీ దేశంలోని హేంబర్గ్లో ఉన్న అంతర్జాతీయ సముద్ర జల ట్రిబ్యునల్ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ పి.చంద్రశేఖర్రావు (పి.సి.రావు) ముఖ్యఅతిథిగా హాజరవుతారని చెప్పారు. బంగారు పతక విజేతలు.. ఎంఫార్మసీలో బండి సుస్మితకు, ఎంఏ తెలుగు విభాగంలో కొల్లూరి కల్పనకు, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో మల్లాది దీప్తికి బంగారు పతకాలను ప్రదానం చేయనున్నట్లు వివరించారు. రాష్ట్ర గవర్నర్ పర్యటన ఇంకా ఖరారు కావాల్సి ఉందని చెప్పారు. -
శివన్నకు డాక్టరేట్
సాక్షి, బళ్లారి : విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (వీఎస్కేయూ) రెండవ స్నాతకోత్సవం సందర్భంగా ఏడుగురు ప్రముఖులకు డాక్టరేట్ పట్టాలు శనివారం అందజేసింది. వాటిని అందుకున్న వారిలో ప్రముఖ సినీ నటుడు శివరాజ్కుమార్, కొట్టూరు స్వామి మఠం సంగన బసవ మహా స్వామీజీ, ప్రముఖ శాస్త్రవేత్త యూ ఆర్ రావ్, దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త జాకబ్ క్రాస్టా, దావణగెరెకు చెందిన సీ.ఆర్.నాసిర్ అహమ్మద్, తుమకూరు విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ ఎస్వీ శర్మ, బళ్లారి జిల్లాకు చెందిన రంగస్థల కళాకారిణి సుభద్రమ్మ మన్సూర్ ఉన్నారు. అన్నా హజారేకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసి సత్కరించాల్సి ఉండగా, ఆయన రాలేకపోయారు. నగరంలోని బీడీఏఏ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ మంజప్ప హొసమనే, మాజీ గవర్నర్, మాజీ హైకోర్టు న్యాయమూర్తి రామాజోయిస్ డాక్టరేట్లను ప్రదానం చేశారు. -
నిట్లో పెరిగిన పరిశోధకులు
= గతంలో 23 మందికి.. ఈసారి 44 మందికి పీహెచ్డీ = రేపు స్నాతకోత్సవంలో ప్రదానం = ఏర్పాట్లలో నిమగ్నమైన యాజమాన్యం = అధికారులు, ప్రజాప్రతినిధులకు ఆహ్వాన లేఖలు నిట్ క్యాంపస్, న్యూస్లైన్ : వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో పరిశోధకుల సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది 23మందికి మాత్రమే పీహెచ్డీ రాగా, ఈసారి 44మందికి ప్రదానం చేయనున్నారు. ఈమేరకు మంగళవారం జరగనున్న నిట్ 11వ స్నాతకోత్సవంలో వీరికి పీహెచ్డీలు, వివిధ విభాగాల్లో టాపర్లుగా నిలిచిన ఎనిమిది మందికి బం గారు పతకాలతో పాటు బీటెక్, పీజీ విద్యార్థులు పలువురికి పట్టాలు అందజేస్తారు. కాగా, గత ఏడాది జరిగిన పదో స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన నిట్ చైర్మన్ దీక్షితులు ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఎక్కువ మంది పరిశోధనలపై దృష్టి సారించడం లేదని పేర్కొన్నారు. ఆయన ఉపన్యాస ప్రభావమో లేదా వరంగల్ నిట్ యాజమాన్యమే విద్యార్థులను ప్రోత్సహించిందో తెలియదు కానీ ఈసారి మొత్తం 33మందికి పీహెచ్డీ చేయగా, ఇందులో మెకానికల్ ఇంజినీరింగ్ నుంచి 12మంది ఉండడం విశేషం. ఇంకా సివి ల్ ఇంజినీరింగ్లో ఇద్దరు, ఎలక్ట్రికల్లో ఆరుగురు, మెకానికల్లో 12 మంది, ఈసీఈలో ఒకరు, కెమికల్ ఇంజనీరింగ్లో ఇద్దరు, సీఎస్ఈలో ఇద్దరు, మ్యాథ్స్లో ఎనిమిది మంది, హెచ్ఎస్ఎస్లో ఒకరు, ఫిజిక్స్లో ఒకరు, కెమిస్ట్రీలో తొమ్మి ది మంది పరిశోధన పూర్తి చేశారు. 8 మందికి గోల్డ్ మెడల్స్ నిట్లో బీటెక్ కోర్సుల్లో అత్యధిక మార్కులు సాధించిన వా రిలో ఎనిమిది మందికి కి విభాగాల వారీగా బంగారు పత కాలు ప్రకటించారు. అన్ని విభాగాల్లోనూ పరిశీలించి అత్యధి క మార్కులు సాధించిన వారికి ఇచ్చే నిట్ ఇనిస్టిట్యూట్ గోల్డ్ మెడల్కు మెకానికల్ ఇంజినీరింగ్లో టాపర్గా నిలిచిన పొ న్నపల్లి చైతన్యసాయి ఎంపికయ్యారు. ఆయనతోపాటు మరో ఏడుగురు గోల్డ్ మెడల్కు ఎంపికయ్యారు. గౌరవ్జైన్(సివిల్ ఇంజినీరింగ్), లోకేష్ చంద్ర కోడె (ఇఇఇ), అభిమ న్య శ్రీవాత్సవ(ఈఈసీ), ప్రభాత్కుమార్సింగ్(ఎంఎంఈ), గోకుల్ హరిహరన్(కెమికల్ ఇంజినీరింగ్), అమిత్ జోషి (కంప్యూటర్ సైన్స్), ప్రియవతి డి(బయోటెక్నాలజీ)లో బం గారుపతకాలకు ఎంపికయ్యారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 506 మందికి పట్టాలు నిట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్కు సంబంధించి 506మంది వి ద్యార్థులు పట్టాలు అందుకోనున్నారు. వీరిలో ఇంజినీరింగ్ స్ట్రక్చర్లో 31మంది, జియో టెక్నాలజీలో 12 మంది, ట్రాన్స్పోర్టేషన్లో 25 మంది, కన్స్రక్షన్ టెక్నాలజీలో 17 మంది, ఎన్విరాన్మెంటల్లో ఏడుగురు, వాటర్ రిసోర్సెస్లో ము గ్గురు, ఈఈఈ పీఈడీలో 27 మంది, పీఎస్ఈలో 28 మం ది, మెకానికల్లో థర్మల్లో 19 మంది, మాన్పాక్చరింగ్లో 15 మంది, సీఐఎంలో 14 మంది, పీడీడీలో 20 మంది, మెటీరియల్స్ టెక్నాలజీలో ఒకరు, ఆటోమొబైల్ ఇంజినీరింగ్లో 17 మంది ఉన్నారు. ఇంకా ఈసీఈ విభాగం ఈఐలో 18 మంది, వీఎల్ఎస్ఐలో 16 మంది, ఏసీఎస్లో 23 మంది డిగ్రీలు స్వీకరిస్తారు. ఎంఎంఈ విభాగం ఐఎంలో ఆరుగు రు, ఎంటీలో 11మంది, కెమికల్ ఇంజినీరింగ్ కాప్డ్లో తొ మ్మిది మంది, సీఎస్ఈ విభాగంలో 16 మంది, ఐఎస్లో 16 మంది, ఎంబీఏలో 26 మంది, ఎంసిఎలో 38 మంది, ఎమ్మె స్సీ టెక్నాలజీ(ఫిజిక్స్)లో 15 మంది డిగ్రీలు స్వీకరిస్తారు. అలాగే, ఎమ్మెస్సీ అప్లైడ్ మ్యాథ్స్లో 22 మంది, మ్యాథమెటిక్స్లో 16 మంది, డీడీపీపీలో 19 మంది, ఎంఎంసీఏలో 19 మంది పీజీ విద్యార్థులు డిగ్రీ పట్టాలు అందుకోనున్నారు. బీటెక్ కోర్సుల్లో 773 మందికి.. బీటెక్ కోర్సుల్లో సివిల్లో 98 మంది, ఈఈఈలో 104 మంది, మెకానికల్లో 100మంది, ఈసీఈలో 116 మంది, మెటాలర్జికల్లో 57 మంది, కెమికల్లో 104 మంది, సీఎస్ఈలో 131 మంది, బయో టెక్నాలజీలో 63 మంది కలిపి మొత్తం 773 మంది పట్టాలు అందుకోనున్నారు. ఈ మేరకు బంగారు పతకాలు సాధించిన విద్యార్థులతో పాటు పీజీ, బీటెక్ విద్యార్థులు పట్టాలను మంగళవారం ఉదయం 10గంటల తర్వాత వరంగల్ నిట్ బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ ఎల్ల కృష్ణా చేతుల మీదుగా వాటిని స్వీకరించనున్నారు. ఈ సంద ర్భంగా విద్యార్థులు కాకుండా వారి తల్లిదండ్రులతో నిట్లో సందడి నెలకొననుంది. స్నాతకోత్సవానికి ఏర్పాట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ (ఎన్ఐటీ) 11వ స్నాతకోత్సవం ఈనెల 15న మంగళవారం ఉదయం నిర్వహించేందుకు యాజమాన్యం, అకడమిక్ బృందం సిద్ధమైంది. నిట్ డెరైక్టర్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసరావు, అకడమిక్ డీన్ రమేష్, రిజిస్ట్రార్ ఏఆర్సీ.రెడ్డి, పీఆర్ఓ పులి రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తికావొచ్చాయి. నిట్ ఆడిటోరియంలో స్నాతకోత్సవం జరగనుండగా, హాజరుకావాలని కోరుతూ కలెక్టర్ జి.కిషన్, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావుతో పాటు జిల్లాలోని ఎం పీలు, ఎమ్మెల్యేలకు యాజమాన్యం లేఖలు పంపించిం ది. కాగా, స్నాతకోత్సవానికి కేంద్ర మంతి పల్లం రాజు హాజరవుతారని భావించినా ఆయన పర్యటన ఖరారు కాలేదు. దీంతో వరంగల్ నిట్ బోర్డ్ ఆఫ్ ఆప్ గవర్నర్స్ చైర్మన్ కృష్ణ హాజరై విద్యార్థులకు బంగారు పతకాలు, డిగ్రీ పట్టాలు అందజేయనున్నారు.