
సాక్షి, విజయవాడ : గ్రూప్-1 మెయిన్ పరీక్షలను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షలు వాయిదా వేస్తూ నిర్ణయించింది. వచ్చేనెల 2 తేదీ నుంచి 13 తేదీ వరకూ పరీక్షలు నిర్వహించేలా గతంలో షెడ్యూలు విడుదల చేసింది. అయితే తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షలను వాయిదా వేసింది. పరీక్షల షెడ్యూలును ఈనెల 29వ తేదీన ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు తెలిపారు.