పాపికొండల విహారయాత్ర ప్రారంభం.. | Avanthi Srinivas The Minister Who Started The Papikondalu Excursion | Sakshi

పాపికొండల విహారయాత్ర ను ప్రారంభంచిన మంత్రి అవంతి

Jul 1 2021 8:08 PM | Updated on Jul 1 2021 8:09 PM

Avanthi Srinivas The Minister Who Started The Papikondalu Excursion - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, తూర్పుగోదావరి : గత 21 నెలలు గా నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర తిరిగి ప్రారంభమైంది. గోదావరి నదికి హారతి ఇచ్చి పాపికొండల విహారయాత్ర ను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. పాపికొండల విహారయాత్రకు వెళ్లే టూరిజం బోట్ల ట్రయిల్ రన్‌లో మంత్రి అవంతి పాల్గొన్నారు. కచ్చులూరు దుర్ఘటన, కొవిడ్ పరిస్థితుల కారణంగా పాపికొండల టూరిజం 21 నెలలుగా నిలిపి వేసినట్లు మంత్రి తెలిపారు. రేపటి నుంచి పాపికొండల బోటింగ్‌కు  బుకింగ్స్ ప్రారంభం అవుతాయని చెప్పారు. ఈ సందర్భంగా గండిపోచమ్మ అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు. 

చదవండి: పులిచింతల ప్రాజెక్ట్ వద్ద మరో వివాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement