Avanti Srinivas
-
వారెవ్వా..! కుదిరితే ఎర.. లేకుంటే వధ్యశిల!
చంద్రబాబునాయుడు ప్రభుత్వం తాము ఎన్నికల్లో ఎలాంటి వంచనాత్మకమైన మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టిందో.. ఆచరణాత్మకం కాని ఎలాంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో.. ప్రజలకు తెలుసు. ఎన్డీయే సర్కారు ఆ హామీలను నిలబెట్టుకుంటుందో లేదో వేచిచూస్తూ వైఎస్సార్సీపీ ఆరునెలల గడువు ఇచ్చింది. ప్రజలకు అదే ధోరణిలో మాయమాటలు చెప్పడం తప్ప.. ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీల విషయంలో నోరు మెదపకుండా ప్రభుత్వం వంచిస్తూనే పాలన సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఇచ్చిన హనీమూన్ పీరియడ్ దాటిపోయిందనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ పోరుబాటలో కార్యచరణకు దిగుతుండడం.. కూటమి సర్కారులో వణుకు పుట్టిస్తోంది. వైఎస్సార్సీపీ ఉద్యమ ప్రణాళికకు జడుసుకుంటున్న ప్రభుత్వం రాజకీయం కుటిల వ్యూహాలను అమల్లో పెడుతోంది. ఆ పార్టీ నాయకులను లోబరచుకోవడం.. తమకు అనుకూలంగా మార్చుకుని.. తమ చేతి కీలుబొమ్మల్లాగా ఆడించడం.. వైఎస్సార్సీపీ మీదకే అస్త్రాల్లాగా ప్రయోగించడం అనేది అధికార పార్టీ అనుసరిస్తున్న తాజా వ్యూహంగా ఉంది. వైఎస్సార్సీపీ బలహీన పడుతున్నట్టుగా ప్రజల్లో ఒక తప్పుడు భావనను క్రియేట్ చేయడానికి వైఎస్సార్సీపీ నాయకులతో రాజీనామాలు చేయించడం ఒక తక్షణ ఎజెండాగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. విశాఖపట్నానికి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి ఇన్నాళ్లుగా తనకు రాజకీయ భిక్ష పెట్టిన, తనను మంత్రిని చేసిన వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. భవిష్యత్తు కార్యాచరణ గురించి ఊహాగానాలు రాయొద్దని మీడియాకు విన్నవించుకున్నారు. ఒకవైపు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొంటూ.. మరోవైపు కనీసం ఏడాది రోజులైనా ప్రభుత్వానికి హామీలు నెరవేర్చడానికి టైం ఇవ్వకుండా.. అప్పుడే ఉద్యమాలు చేయడం కరెక్టు కాదని అవంతి సూత్రీకరించడం అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది. తాడేపల్లిలో కూర్చుని నిర్ణయాలు చేస్తోంటే అమలు చేయడానికి కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారంటూ అవంతి అనడాన్ని లోతుగా గమనిస్తే.. ఆ మాటల వెనుక ‘ఉండవల్లి’ స్క్రిప్టు ఉన్నదనే సంగతి ఎవ్వరికైనా ఇట్టే అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వానికి, తమ హామీలు తీర్చడానికి ప్రజలు అయిదేళ్ల గడువు ఇచ్చారని, అప్పుడే పోరాటాలు సరికాదని.. ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకున్నట్టుగా అవంతి శ్రీనివాస్ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.వైఎస్సార్సీపీ నాయకుల మీద తెలుగుదేశం అండ్ కో పార్టీలు రెండు రకాల గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఆ పార్టీ నేతలకు గేలం వేసి, ఎర వేసి, ప్రలోభపెట్టి ఆకర్షించడం ఒక పద్ధతి. వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి వస్తే మంచి భవిష్యత్తు చూపిస్తామని ఆశ పెడతారు. గేలం వేస్తే లొంగని వారిని బెదిరిస్తున్నారు. వధ్యశిల బెదిరింపు అన్నమాట. వారి కెరీర్ అంతం అయ్యేలాగా కేసుల్లో ఇరికిస్తామని బెదిరిస్తున్నారు. ఈ రెండురకాల వక్ర మార్గాల్లో ఏదో ఒకదానికి వైఎస్సార్సీపీ నాయకులు లొంగిపోతున్నారు. అయితే రాజీనామా చేసిన నేతలకు మంచి భవిష్యత్తు అనేది బూటకం మాత్రమే. మంత్రి పదవి ఆశ పెట్టి బాలినేని శ్రీనివాస రెడ్డిని చేర్చుకున్నారు. ఆయనతో జగన్ మీద నానా నిందలు వేయించారు. తీరా ఇప్పుడు కరివేపాకు లాగా తీసి పక్కన పడేశారు. తెలుగుదేశం కూటమి పార్టీల ప్రలోభాలకు లొంగి వైఎస్సార్సీపీని వీడుతున్న వారి భవిష్యత్తు కూడా అంతేనని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.:::ఎం.రాజేశ్వరిఇదీ చదవండి: యనమల గతి ఇక ఇంతేనా? -
భీమిలి సీటు గెలిచి సీఎం జగన్ కి బహుమతిగా ఇస్తా...
-
‘విశాఖ గర్జన రోజే పవన్ మీటింగ్ అవసరమా?’
సాక్షి, విశాఖపట్నం: విశాఖ గర్జన కోసం జేఏసీ సిద్దమైంది. ఇందులో భాగంగానే బుధవారం మంత్రి గుడివాడ అమర్నాథ్.. మూడు రాజధానులకు మద్దతుగా పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వికేంద్రీకరణ సాధన కోసం జేఏసీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. విశాఖ గర్జనలో అన్ని వర్గాలు పాల్గొంటాయి. ఇప్పటికే అన్ని ప్రాంతాల ప్రజలు విశాఖ రావడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలి అని కోరారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. విశాఖ గర్జన అంటే పవన్ కల్యాణ్ నిద్ర లేచారు. విశాఖ గర్జన రోజే విశాఖలో పవన్ మీటింగ్ అవసరమా?. ఉత్తరాంధ్రకు ఉపయోగపడే రాజధాని ఎందుకు వద్దు?. అమరావతిలో 29 గ్రామాలే.. ఇక్కడ 6వేల గ్రామాలు. ఉత్తరాంధ్ర రైతులు చాలా పేదవాళ్లు. రాజకీయాలను పక్కనపెట్టి ప్రజల కోసం నిలుద్దాము అని స్పష్టం చేశారు. -
‘ఉత్తరాంధ్రపై టీడీపీ, బీజేపీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారు’
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో టీడీపీ, బీజేపీ నాయకులపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉత్తరాంధ్రపై టీడీపీ, బీజేపీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారు. విశాఖ రాజధానిగా ఎందుకు వద్దంటున్నారో టీడీపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలి. జేఏసీ కార్యాచరణకు అనుగుణంగానే విశాఖ గర్జన ర్యాలీ జరుగుతుంది. రైతు సంఘాలు, విద్యార్థులు, న్యాయవాదులు ఈ ర్యాలీలో పాల్గొంటారు. టీడీపీ అధినేత డైరెక్షన్లోనే పాదయాత్ర నడుస్తోంది. పెయిడ్ ఆర్టిస్టులు తమ యాత్రను విరమించుకోవాలి’ అని స్పష్టం చేశారు. మరోవైపు, మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రతిపక్ష పార్టీల నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. పార్టీలకు అతీతంగా అందరూ విశాఖపట్నం రాజధాని కావాలని కోరుకుంటున్నారు. టీడీపీ నేతలు చంద్రబాబుకు భయపడి వారి గొంతు నొక్కేసుకుంటున్నారు’ అని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే నినాదం వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలో చాలా ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. వికేంద్రీకరణ జరగకపోతే భావితరాలు క్షమించవు అంటూ కామెంట్స్ చేశారు. -
పరిపాలనా వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి: మంత్రి గుడివాడ
-
‘వైజాగ్ సినిమా హబ్ కావాలంటే పెద్దలు ముందుకు రావాలి’
‘‘చిత్రపరిశ్రమను విశాఖపట్నంలో అభివృద్ధి చేయాలనే పట్టుదలతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు ఉన్నారు. సినీ ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్కి మీరు (అల్లు అరవింద్) మాస్టర్. అల్లు రామలింగయ్యగారి పేరు మీద రాజమండ్రిలో హోమియోపతి మెడికల్ కాలేజీ పెట్టినట్లు వైజాగ్లో అల్లు రామలింగయ్యగారు, చిరంజీవిగారి పేర్లు కలిసి వచ్చేలా ఓ యాక్టింగ్ కాలేజీ పెట్టించాలని అరవింద్గారిని కోరుతున్నాను. విశాఖపట్నం సినిమా హబ్ కావాలంటే అరవింద్గారి వంటి పెద్దలు ముందుకు రావాలి. చిరంజీవిగారు ఎంతోమందికి ఇన్స్పిరేషన్. ఆయన ఆశీస్సులు అందరికీ ఉంటాయి. వైజాగ్ సినిమా హబ్ అయితే లోకల్ టాలెంట్ చాలామంది వస్తారు. వైజాగ్లో ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రభుత్వం, ప్రజల సహకారం ఉంటుంది’’ అని ఏపీ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గని’. సయీ మంజ్రేకర్ హీరోయిన్. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం వైజాగ్లో జరిగిన ‘గని’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ఏపీ ప్రభుత్వం ఇటీవల సినిమా టికెట్ ధరలను పెంచింది. ‘ఆర్ఆర్ఆర్’కు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇండియాలో కలెక్షన్స్ వైజ్గా టాప్లో ఉంది. ఇండియాలో రెండు బ్లాక్బస్టర్స్ మనవే. అల్లు బాబీ తన తండ్రి అల్లు అరవింద్ స్థాయి ప్రొడ్యూసర్ కావాలి. పదేళ్ల క్రితం వరుణ్ తేజ్ స్టార్ హీరో అవుతాడని చెప్పాను. ఇప్పుడు వరుణ్ తేజ్ పాన్ ఇండియా స్టార్ అవుతాడని చెబుతున్నాను. ‘పుష్ప’ సినిమాతో బన్నీ ఇండియాను షేక్ చేశాడు’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘‘కేజీఎఫ్’ చూసినప్పుడు వరుణ్తో ఇలాంటి సినిమా తీయాలి కదా అనే ఫీలింగ్ వచ్చింది. ఏదో ఒక రోజు వరుణ్తో అలాంటి సినిమా చేస్తాను. కిరణ్ మంచి దర్శకుడు అవుతాడు. అల్లు బాబీకి సినిమా పట్ల మంచి నాలెడ్జ్ ఉంది. వైజాగ్ పై ప్రేమతో మంత్రిగారు నాకు ఇచ్చిన సలహాను తప్పకుండా తీసుకుంటా. మా నాన్నగారు పాలకొల్లులో పుట్టి సినిమాల్లోకి వెళ్లాలని మద్రాసు వెళ్లారు. అలా సినిమా పరిశ్రమలో యాభై ఏళ్లు పైన ఉన్నారు. నేను నిర్మాతగా టాలీవుడ్తో సరిపోదని, హిందీలో కూడా సినిమాలు తీశాను. కానీ బన్నీ ఇండియా స్టార్ అవ్వడమే కాకుండా ఇతర దేశాల్లోని క్రికెటర్స్ కూడా తగ్గేదేలే స్టెప్ను అనుకరించేలా చేశాడు. అల్లు పతాకాన్ని ఎక్కడికో తీసుకుని వెళ్లాడు’’ అన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ – ‘‘మా అన్నయ్య అల్లు బాబీ పూర్తి స్థాయి నిర్మాత అవుతున్నందుకు సంతోషంగా ఉంది. అన్నయ్య కథ ఓకే చేస్తే మినిమమ్ గ్యారంటీ. మా కజిన్ సిస్టర్ వివాహం సిద్ధుతో జరిగింది. సిద్ధు ఇప్పుడు ‘గని’తో నిర్మాత అయ్యాడు. వరుణ్ ఎన్నుకునే కథలు, అతని జర్నీ నన్ను గర్వపడేలా చేస్తాయి’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ – ‘‘నేను కిరణ్ను నమ్మాను. ‘గని’ సినిమా చూశాక తప్పు చేయలేదనిపించింది. కల్యాణ్ బాబాయ్గారి ‘తమ్ముడు’ సినిమా చాలా ఇష్టం. తమ్ముడు అంత కాకపోయినా ఆ సినిమా అంత బాగుండాలని ప్రయత్నం చేశాం. చిరంజీవిగారి గురించి మాట్లాడకపోతే నాకు ఇన్ కంప్లీట్గా ఉంటుంది. మా పెదనాన్నగానే కాదు.. ఓ యాక్టర్గా కూడా ఆయన నాకు స్ఫూర్తి. నాతో పాటు చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తున్న నాన్నగారికి (చిరంజీవిని ఉద్దేశిస్తూ..) థ్యాంక్స్’’ అన్నారు. కిరణ్ కొర్రపాటి మాట్లాడుతూ – ‘‘గని’ త్రీ ఇయర్స్ కల.. కష్టం. ఒక వ్యక్తి నమ్మకం. అతనే వరుణ్. పవన్ కల్యాణ్గారికి ‘తమ్ముడు’ ఎలాంటి మైల్స్టోన్ అయ్యిందో.. వరుణ్ తేజ్ కెరీర్లో ‘గని’ అలా మైల్స్టోన్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఓ మంచి సినిమా చేసే ప్రయత్నం చేశాం’’ అన్నారు అల్లు బాబీ. ‘‘వరుణ్ లేకపోతే ఈ సినిమా లేదు. సినిమా ఎలా వస్తుందని అల్లు అర్జున్గారు ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నారు. అల్లు అరవింద్గారు మంచి గైడ్లైన్స్ ఇస్తారు’’ అన్నారు సిద్ధు ముద్ద. ఏపీ ఎన్ ఫోర్స్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ ప్రభాకర్, ‘గని’ చిత్రబృందం పాల్గొంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పురంధేశ్వరి, పవన్ కల్యాణ్ పై మంత్రి అవంతి సీరియస్
-
6 వేలకు పైగా ఎకరాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు: మంత్రి అవంతి శ్రీనివాస్
-
పురంధేశ్వరి, పవన్ కల్యాణ్పై మంత్రి అవంతి సీరియస్..
సాక్షి, విశాఖ: విశాఖ జిల్లాలో భూ సేకరణపై పిల్ కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూ సేకరణకు చర్యలు చేపట్టిందన్నారు. దీంతో విశాఖ జిల్లాలో లక్షా 84 వేల మందికి లబ్ధి చేకూరనుందని అన్నారు. అనకాపల్లి, భీమిలి, విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్తో పాటు గాజువాక ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ద్వారా ఆర్థికంగా బలోపేతం అవుతారని పేర్కొన్నారు. భూ సేకరణతో 6,116 ఎకరాల్లో ఒక్కొక్కరికి 70 గజాలు ఇళ్ల స్థలం దక్కుతుందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన ఆలోచనల్లో మార్పు తెచ్చుకుంటే మంచిదని హితవు పలికారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని అడ్డుకోవాలని టీడీపీ కుట్రలు చేసినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం అభివృద్ధిలో దూసుకువెళ్తున్నారని ప్రశంసించారు. విద్య, వైద్యానికి వైఎస్ఆర్సీపీ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇళ్ల స్థలాలతో పాటు నిర్మాణానికి ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. ఈ క్రమంలో బీజేపీ నాయకురాలు దగ్గుపాటి పురంధేశ్వరిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఏపీ అప్పుల గురించి పురంధేశ్వరి మాట్లాడుతున్నారు. కేంద్రం అప్పులు చేయడం లేదా.. విభజన హామీల అమలుపై బీజేపీ నాయకులు, ఆమె చేసున్న కృషి ఏమిటి..? స్టీల్ ప్లాంట్ విషయంలో అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తున్నాం. ఇప్పటికే సీఎం రెండు సార్లు కేంద్రానికి లేఖ రాశారు. పురంధేశ్వరికి చిత్త శుద్ది ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాలి. పవన్ కల్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నిజంగా పవన్ కల్యాణ్కు ఏపీపై శ్రద్ధ ఉంటే కేంద్రంపై స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేయవచ్చు కదా’ అని అవంతి సూటిగా ప్రశ్నించారు. -
కావాలనే ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నారు: అవంతి శ్రీనివాస్
-
వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధిపై హత్యాయత్నం
సాక్షి,విశాఖపట్నం: నిత్యం ప్రజల మధ్య ఉండే వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబుపై హత్యా యత్నం జరిగిందన్న వార్త తెలుసుకొని స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అప్పటి వరకు ఆయనతో తిరిగిన అనుచరులు, ఆయనను చూసిన స్థానికులు శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో నిశ్చేష్టులయ్యారు. ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో గతంలో ఇటువంటి సంఘటనలు జరిగిన దాఖలాలు లేవు. గవరపేటలో ఉన్న తన ఇంటి నుంచి సాయంత్రం 5.30 గంటల సమయంలో బైక్ పై ఒంటరిగా ఆయన బయలుదేరారు. శారదానది అవతల పొలాల్లో నిర్మించుకుంటున్న అతిథి గృహానికి వెళుతుండగా.. సమీపంలో నది వంతెన అవతలకు చేరే సరికి గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చే శాడు. మెడపై కత్తితో నరకడానికి ప్రయత్నించగా బుల్లిబాబు తన చేతులతో అడ్డుకున్నారు. దీంతో చేతి వేళ్లు రెండు తెగిపడ్డాయి. మరో రెండు వేళ్లకు తీ వ్రగాయమైంది. తలపైన కూడా బలమైన గాయం తగిలింది. చేతిని అడ్డుపెట్టకపోతే మెడపై తగిలి ప్రాణానికి ప్రమాదం జరిగి ఉండేదని సమాచారం. సంఘటన అనంతరం అగంతకుడు పరారయ్యాడు. ఈ ప్రాంతంలో కొద్ది రోజులుగా కొత్త వ్యక్తులు తచ్చాడుతున్నట్టు స్థానికులు చెప్పారు. రెక్కీ నిర్వహించి, పకడ్బందీగా పథకం ప్రకారం హత్యకు యత్నించినట్టు తెలుస్తోంది. సమాచారం తెలిసిన వెంటనే ఎస్ఐ సురేష్కుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. కశింకోటలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న బుల్లిబాబు ఇంటికి అభిమానులు వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. నిందితుడి గుర్తింపు కంచిపాటి నాగ ఉదయ్ సాయి హత్యాయత్నానికి పాల్పడినట్టు గుర్తించి అతనిపై కేసు నమోదు చేశామని అనకాపల్లి సీఐ జి. శ్రీనివాసరావు శుక్రవారం రాత్రి విలేకరులకు తెలిపారు. ఈ సంఘటనలో ఒకరే హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పారు. సాయి భార్య గ్రామ వలంటీర్గా గతంలో పనిచేసేవారు. ఆమెను ఇటీవల తొలగించారు. ఇందుకు బుల్లిబాబు కారణమని అపోహతో హత్యాయత్నానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నారు. పరామర్శించిన ఎమ్మెల్యే అమర్, రత్నాకర్ అనకాపల్లి టౌన్: బుల్లిబాబు చికిత్స పొందుతున్న ప్రైవేటు ఆస్పత్రికి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకుడు దాడి రత్నాకర్ హుటాహటిన వెళ్లారు. ఆయన పరి స్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ ఆస్పత్రికి తరలించారు. పార్టీ నేతలు మందపాటి జానకీరామరాజు, గొర్లి సూరిబాబు బుల్లిబాబును పరామర్శించారు. చదవండి: చిట్టీ డబ్బులు అడిగినందుకు .. ఒంటిపై పెట్రోల్ పోసి.. మంత్రి ముత్తంశెట్టి పరామర్శ ఆరిలోవ: విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ సీనియర్ నేత మల్ల బుల్లిబాబు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు. బుల్లిబాబు ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడ వైద్యులను అడిగి తెలుసుకొన్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. -
మాజీ సైనికులకు అండగా సీఎం జగన్: హోం మంత్రి సుచరిత
సాక్షి, విశాఖపట్టణం: మాజీ సైనికులకు ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి సుచరిత తెలిపారు. రక్షణ శాఖ మాజీ ఉద్యోగులకు రాయితీ ద్వారా పరిశ్రమలు.. స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పాకిస్తాన్పై భారత్ విజయానికి సూచికగా చేపట్టిన స్వర్ణ విజయ్ వర్ష్ జ్యోతిని శుక్రవారం ఆర్కే బీచ్లోని విక్టరీ ఎట్ సీ వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తూర్పు నౌకదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అజెంద్ర బహుదుర్ హోంమంత్రికి అందజేశారు. నాటి విజయంలో భాగస్వాములైన నేవీ సిబ్బందిని మంత్రి సత్కరించారు. స్వర్ణ విజయ్ వర్ష్ జ్యోతిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖలో నేవీ అవసరాలు తీర్చడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారని తెఉలిపారు. భారత్ రక్షణలో విశాఖ తీరం కీలకమని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సైనికులు నాటి యుద్ధ జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు. చదవండి: ‘భీమ్లా నాయక్’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా? చదవండి: ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ వ్యాఖ్యాతగా పాలమూరువాసి -
పేద ప్రజల పాలిట దేవుడు వైఎస్ఆర్
-
సింహాచలం: కేంద్ర పర్యాటక అభివృద్ధి సంస్థ బృందం పర్యటన
సాక్షి, విశాఖపట్నం: సింహాచలంలో కేంద్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రతినిధులు శుక్రవారం పర్యటించారు. కేంద్ర ప్రతినిధులతో ప్రసాదం పథకంపై పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ చర్చించారు. ఆలయంలో యజ్ఞశాల నిర్మాణం తలపెట్టామని అవంతి శ్రీనివాస్ తెలిపారు. దర్శనం కోసం వచ్చిన భక్తుల కోసం వెయిటింగ్ హాల్ నిర్మాణం చేయాలని నిర్ణయించామన్నారు. గిరి ప్రదక్షిణ కోసం ఒక మట్టి రోడ్తో ట్రాక్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామన్నారు. పర్యాటక శాఖ సహాయ కార్యదర్శి ఎస్ ఎస్ వర్మ మాట్లాడుతూ, ఈ పథకం పర్యాటక శాఖ పర్యవేక్షిస్తోందన్నారు. పరిశీలన పూర్తయ్యాక డీపీఆర్ పనులు పూర్తి చేస్తామని ఎస్.ఎస్.వర్మ తెలిపారు. -
సింహాచలం: ‘అన్యాక్రాంతమైన భూములను వెనక్కి తీసుకుంటాం’
విశాఖ: టీడీపీ హయాంలోనే సింహాచలం భూములు అన్యాక్రాంతమయ్యాయి.. దీనిలో అధికారుల పాత్ర ఉండటంతో చర్యలు తీసుకున్నాం అని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. అన్యాక్రాంతమైన భూములను వెనక్కి తీసుకుంటాం అన్నారు. రుషికొండ రిసార్ట్స్పై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అవంతి మండిపడ్డారు. కొత్తవి కట్టేందుకు పాత రిసార్ట్స్ తొలగిస్తే.. టీడీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఇప్పుడున్నవాటి స్థానంలో వరల్డ్ క్లాస్ రిసార్ట్స్ నిర్మిస్తాం అన్నారు. కొత్త రిసార్ట్స్ కోసం మొదటి దశలో రూ.92 కోట్లు.. రెండో దశలో రూ.72 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి అని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. -
ఆయన జీవితమే సంగీతం: అవంతి శ్రీనివాస్
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచ ప్రజల భాష సంగీతం. మనసును కదిలించేది, మనిషిలో చైతన్యాన్ని రగిలించేది సంగీతం. కర్ణాటక సంగీత చరిత్రలో మంగళంపల్లి బాలమురళీకృష్ణతో పోల్చదగిన ప్రతిభావంతుడు మరొకరులేరని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. సిరిపురం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో మంగళవారం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి సందర్భంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక సంగీతంలోనే కాదు.. భారతీయ శాస్త్రీయ సంగీతంలోనే అంతటి విలక్షణ కళాకారుడు లేరని పేర్కొన్నారు. కీర్తిధన సంపాదనలో ఆరోహణే తప్ప అవరోహణ ఎరుగని గొప్ప కళాకారుడన్నారు. ఆ గొప్ప కళామేధావి తెలుగువారు కావడం గర్వకారణమని ఆయన చెప్పారు. రాబోయే తరాలకు బాలమురళీకృష్ణ గొప్పతనాన్ని తెలియజేయాలన్నారు. కలెక్టర్ వి.వినయ్చంద్ మాట్లాడుతూ పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని, ఆ మరిమళమే బాలమురళీకృష్ణ అని పేర్కొన్నారు. అంతటిగొప్ప కళాకారుడు జయంత్యుత్సవాల్లో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. కళాకారులు వంకాయల వెంకటరమణమూర్తి, డాక్టర్ పంతుల రమ, ఎం.శ్రీనివాస నరసింహామూర్తి, కె.సరస్వతి, గురువిల్లి అప్పన్న, డాక్టర్ మండపాక శారద, ధనవాడ ధర్మారావు, డాక్టర్ బీకేడీ ప్రసాద్, ధనుంజయ పట్నాయక్లను మంత్రి ముత్తంశెట్టి, కలెక్టర్ వినయ్చంద్ సత్కరించారు. అంతకుముందు మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజన, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జునరావు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు పి.అరుణ్బాబు, కల్పనా కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
పాపికొండల విహారయాత్ర ప్రారంభం..
సాక్షి, తూర్పుగోదావరి : గత 21 నెలలు గా నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర తిరిగి ప్రారంభమైంది. గోదావరి నదికి హారతి ఇచ్చి పాపికొండల విహారయాత్ర ను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. పాపికొండల విహారయాత్రకు వెళ్లే టూరిజం బోట్ల ట్రయిల్ రన్లో మంత్రి అవంతి పాల్గొన్నారు. కచ్చులూరు దుర్ఘటన, కొవిడ్ పరిస్థితుల కారణంగా పాపికొండల టూరిజం 21 నెలలుగా నిలిపి వేసినట్లు మంత్రి తెలిపారు. రేపటి నుంచి పాపికొండల బోటింగ్కు బుకింగ్స్ ప్రారంభం అవుతాయని చెప్పారు. ఈ సందర్భంగా గండిపోచమ్మ అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు. చదవండి: పులిచింతల ప్రాజెక్ట్ వద్ద మరో వివాదం -
విశాఖలో వందలాది ఎకరాలు కబ్జా చేశారు: మంత్రి అవంతి
-
కోవిడ్ కేర్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి ఆళ్ల నాని
సాక్షి, విశాఖపట్నం: షీలానగర్లో కోవిడ్ కేర్ సెంటర్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శుక్రవారం ప్రారంభించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో 300 ఆక్సిజన్ బెడ్లు కలిగిన కోవిడ్ కేర్ సెంటర్ను ఎంపీ విజయసాయిరెడ్డి ఏర్పాటు చేశారు. ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా కోవిడ్ కేర్ సెంటర్: మంత్రి ఆళ్ల నాని 30 మంది వైద్యులు, 90 మంది నర్సులతో ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశారని మంత్రి ఆళ్ల నాని అన్నారు. ప్రగతి భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమం అని అభినందించారు. ప్రస్తుత పరిస్థితిలో ఆక్సిజన్ అవసరం చాలా ఉందని.. ఆక్సిజన్ సరఫరాకి సంబంధించి పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. ఆస్పత్రుల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరగవన్నారు. ప్రతి బెడ్కు ఒక్కో సిలిండర్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కోవిడ్ కేర్ సెంటర్.. అత్యున్నత ప్రమాణాలతో వైద్య సదుపాయాలు: ఎంపీ విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ఎంత ఖర్చైనా వెనుకాడకుండా ప్రభుత్వం వైద్యం అందిస్తోందని.. అత్యున్నత ప్రమాణాలతో వైద్య సదుపాయాలు కల్పిస్తోందన్నారు. ఆక్సిజన్ వైఫల్యం వల్ల కోవిడ్ బాధితులు ఇబ్బంది పడకూడదన్నదే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రగతి భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోవిడ్ బాధితులకు పౌష్టికాహారం అందిస్తామని తెలిపారు. కోవిడ్ కేర్ సెంటర్లో పెషెంట్ల అటెండెన్స్ డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లో అన్ని రక్షణ చర్యలు ఏర్పాటు చేశామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. చదవండి: ఆటలే అస్త్రాలు: కరోనాతో ‘ఆడుకుంటున్నారు..’ YS Jagan: సీఎం జగన్ లేఖతోనే కదలిక -
సీఎం వైస్. జగన్ అందిస్తున్న పాలనపై ప్రజలు విశ్వాసం ఉంచారు: మంత్రి అవంతి శ్రీనివాస్
-
ప్రైవేటీకరణ నిర్ణయం రద్దయ్యే వరకు ఉద్యమానికి మద్దతు
-
మోదీ పేరు ఎత్తితే బాబుకు వణుకు పుడుతోంది
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ అంశం రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిందని తెలిపారు. తమకు తెలిసి జరుగుతోందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రధాని అపాయింట్మెంట్ ఇస్తే అన్ని పక్షాలను తీసుకెళ్లి సమస్య వివరిస్తామని తెలిపారు. తాము కేంద్రంతో రాజీ పడితే పార్లమెంట్లో ఎందుకు ప్రశ్నిస్తామని అన్నారు. పార్లమెంట్లో బలం ఉంటే ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, కేంద్రాన్ని విమర్శించకుండా తమపై విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. ప్రైవేటీకరణ నిర్ణయం రద్దయ్యేవరకు ఉద్యమానికి మద్దతుగా ఉంటామని వెల్లడించారు. సబ్బంహరి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. సబ్బంహరికి సిగ్గుంటే టీడీపీకి రాజీనామా చేయాలని, విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని కాకుండా అడ్డుకోవాలని యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పార్టీలో సబ్బంహరి ఎలా ఉంటారని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో చెప్పాలని నిలదీశారు. పార్లమెంట్లో విశాఖ స్టీల్ప్లాంట్ అంశంపై ప్రశ్నించానని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. కేంద్ర వైఖరిని తెలుసుకునేందుకు ప్రశ్నించినట్టు తెలిపారు. టీడీపీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారని, వాళ్లెవరైనా ప్రశ్నించారా అని మండిపడ్డారు. టీడీపీ హయాంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీజం పడిందన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ప్రైవేటీకరణపై ప్రశ్నించాలన్నారు. స్టీల్ ప్లాంట్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో పోరాడుతామని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు దిగజారి మాట్లాడుతున్నాడని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. స్టీల్ప్లాంట్ పరిరక్షణకు సీఎం జగన్మోహన్రెడ్డి కట్టుబడి ఉన్నారని గుర్తుచేశారు. త్యాగాల పునాదులపై విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మించారని, ప్రధాని మోదీ పేరు ఎత్తితే చంద్రబాబుకు వణుకు పుడుతోందన్నారు. చదవండి: ప్రైవేటీకరించవద్దు.. నిర్ణయం మార్చుకోండి: సీఎం జగన్ చదవండి: భగ్గుమన్న స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం -
సీఎం జగన్కు విశాఖ అంటే ఎంతో ఇష్టం..
సాక్షి, విశాఖ: సీఎం జగన్మోహన్రెడ్డికి విశాఖ నగరంపై ప్రత్యేక మమకారం ఉందని, ఈ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఆయన ప్రత్యేక ప్రణాళికలు కలిగి ఉన్నారని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖ కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయడానికి ఎవరు ఎన్ని అడ్డంకులు కలిగించినా వెనక్కు తగ్గేది లేదని, విశాఖ రాజధాని కావడం తధ్యమని ఆయన స్పష్టం చేశారు. విశాఖను రాజధానిగా వ్యతిరేకించిన చంద్రబాబు, అతని తనయుడు లోకేశ్ బాబుకు విశాఖలో పర్యటించే అర్హత లేదని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు కార్మిక సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంద్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్మిక సంఘాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా నిలవడంతో బంద్ విజయవంతమయ్యిందన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలతో టీడీపీ ఖేల్ ఖతం అవుతుందన్న ఆయన.. ఆ పార్టీని ఆల్ బెవర్స్ అండ్ డెకాయిట్స్ పార్టీ(ఏబీసీ పార్టీ) అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన హయాంలో తప్పుడు డాక్యుమెంట్లతో అనుయాయులకు విలువైన భూములు కట్టబెట్టడాన్ని ఆయన ప్రస్థావించారు. త్వరలో విశాఖలో లక్షా 90 వేల మందికి సీఎం చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో బంద్ విజయవంతం.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపట్టిన బంద్కు ప్రభుత్వ సహకారం తోడవడంతో బంద్ విజయవంతమైందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. విశాఖ ఉక్కుకు మద్దతుగా ప్రధానికి లేఖ రాసేందుకు కూడా చంద్రబాబుకు ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. వైయస్సార్సీపీకి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అవుతుందని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పొస్కో ఏపీకి రావడం నిజమే కానీ.. ప్రభుత్వం కృష్ణ పట్నం, భావనపాడులో పరిశ్రమ ఏర్పాటు చేయాలని సూచించిందన్నారు. ఓట్ల కోసం చంద్రబాబు గల్లి గల్లి తిరుగుతున్నారని, మా నాయకుడు జగన్మోహన్రెడ్డికి ఆ అవసరం లేదని పేర్కొన్నారు. సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజలే స్వచ్ఛందంగా తమకు ఓటేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలేవైనా రిజల్ట్ ఎప్పుడూ వైఎస్సార్సీపీ అనుకూలంగానే వస్తుందన్నారు. -
‘ఉక్కు’ ఉద్యమం ఉధృతం..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ప్లాంట్ కోసం ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. ప్రైవేటీకరణపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ ఎదుట కార్మికులు శుక్రవారం రిలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే నాగిరెడ్డి సంఘీభావం తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కార్మికుడు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. స్టీల్ప్లాంట్పై జేఏసీ.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. ఈనెల 18న స్టీల్ ప్లాంట్ ఆవిర్భావ దినోత్సవాన్ని బహిష్కరించిన జేఏసీ.. ఈ నెల18నే స్టీల్ప్లాంట్ పరిరక్షణ దినోత్సవంగా ప్రకటించింది. గాజువాకలో ఈనెల 18న కార్మికుల బహిరంగ సభ నిర్వహించడానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సన్నాహాలు చేస్తోంది. స్టీల్ప్లాంట్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందన్నారు. అమరుల త్యాగాలు తెలియకుండా మాట్లాడటం బాధాకరమన్నారు. స్టీల్ప్లాంట్ విషయంలో కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. (చదవండి: ప్రైవేటీకరణకు బీజం పడింది చంద్రబాబు హయాంలోనే..) ఓటర్లకు మంత్రం.. టీడీపీ క్షుద్ర తంత్రం! -
నిమ్మగడ్డ తీరుపై సర్వత్రా విస్మయం
సాక్షి, అమరావతి: ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్కుమార్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు కరోనా ఉధృతి కొనసాగుతుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు జారీ చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాజకీయ దురుద్దేశంతోనే ఆయన ఇలాంటి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిమ్మగడ్డ నిర్ణయంపై మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, శ్రీరంగనాథరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఎజెండాతోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని మండిపడ్డారు. ఇందులో కుట్రకోణం దాగుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం: కన్నబాబు ‘‘కరోనా సెకండ్ వేవ్ ఉందని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ నిమ్మగడ్డ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు. నిమ్మగడ్డ ఎవరి డైరెక్షన్లో నిర్ణయాలు తీసుకుంటున్నారో అందరికీ తెలుసు. ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం. ఈ ఎన్నికల షెడ్యూల్ వెనక కుట్ర కోణం ఉంది’’ అని మంత్రి కన్నబాబు అన్నారు. ఇక నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని మంత్రి శ్రీరంగనాథరాజు విమర్శించారు. ‘‘ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల షెడ్యూల్ ఇవ్వడమేంటి. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం ఎలా సాధ్యం’’ అని ఆయన ప్రశ్నించారు. అదే విధంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘నిమ్మగడ్డ రమేష్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదు. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా’’ అని మండిపడ్డారు.(చదవండి: సుప్రీం కోర్టు, హైకోర్టు ఉత్తర్వులు బేఖాతర్) నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ జారీ చేసిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఎస్ఈసీ నిమ్మగడ్డ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు చెప్పిందే ఆయన చేస్తున్నారు. కరోనా కేసులు తక్కువగా ఉన్నప్పుడు నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో యంత్రాంగమంతా నిమగ్నమై ఉంది. ఇలాంటి సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. నిమ్మగడ్డ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. ఇక నిమ్మగడ్డ ఒక సామాజికవర్గం కోసమే పనిచేస్తున్నట్లు ఉందని కరణం ధర్మశ్రీ విమర్శించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని విజ్ఞప్తి చేశారు. అనంత వెంకటరామిరెడ్డి స్పందిస్తూ.. నిమ్మగడ్డ చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అభ్యర్థనను ఎస్ఈసీ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలను కాదని నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. -
‘రొయ్య మీసాలతో భయపెట్ట లేరు’
సాక్షి, విశాఖపట్నం: ఇళ్ల స్థలాల పట్టాల్లో అవినీతి జరిగిందంటూ టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అవాస్తవాలను.. నిజాలుగా ఎల్లో మీడియా ద్వారా గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. (చదవండి: ‘ఆయనైతే చేతులెత్తేసే వారు..’) ‘‘టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చరిత్ర అంతా నేరమయం. దొంగ ఓట్లతో ఆయన గెలిచారు. వెలగపూడికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. మీ రొయ్య మీసాలతో భయపెట్ట లేరని’’ ధ్వజమెత్తారు. చంద్రబాబుకు విశాఖ ప్రజలు ఓట్లు, సీట్లు కావాలి కానీ, పరిపాలన రాజధాని మాత్రం ఆయనకు అవసరం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ భూముల్లోనే విశాఖ పరిపాలన రాజధాని నిర్మాణం జరుగుతుందని.. పరిపాలన రాజధానిగా మరింత అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. పేదలకిచ్చే ఇళ్ల పట్టాలను కోర్టుల్లో కేసులు ద్వారా అడ్డుకోవద్దని చంద్రబాబుకు హితవు పలికారు.(చదవండి: ఉందిలే మంచి కాలం..) విశాఖ నగర ప్రజలకు గజం 30 వేలు ధర పలుకుతున్న ధరతో 15 లక్షలు విలువైన భూమి ఒక్కో లబ్ధిదారులకు సీఎం వైఎస్ జగన్ అందిస్తున్నారని తెలిపారు. రూ. 900 కోట్లతో విశాఖ తూర్పు నియోజకవర్గంలో సీఎం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఓటమి చెందినా.. పార్టీలకతీతంగా ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. 43 వేల బెల్టు షాపులు రద్దు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. -
‘ఒకేసారి 16 వేల ఇళ్ల పట్టాలు పంపిణీ’
సాక్షి, విశాఖపట్నం: ఒకేసారి 16 వేల ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. భీమిలీ నియోజకవర్గంలో మధురవాడలో నవరత్నాలు పేదలందరికి ఇళ్లు కార్యక్రమాన్ని మంత్రి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయ సాయిరెడ్డి, మంత్రి శ్రీరంగనాథ్ రాజు, ఎంపీ ఎంవీవీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణలు పాల్గొని పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 31 లక్షల ఇళ్లు ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్లను కాకుండా ఊళ్లను ఏర్పాటు చేస్తున్నారన్నారు. అర్హతే ఆధారంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని, పార్టీలకు అతీతంగా ఇళ్లు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కళ్లున్న కబోదని, సీఎం వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందని ఇళ్ల పట్టాల్లో అవినీతి జరిగిందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఇళ్ల పట్టాల విషయంలో జిల్లాలో ఎక్కడైన అవినీతి జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్దమని, చంద్రబాబు కోర్టులకు వెళ్లి పేదలకు ఇళ్ల పట్టాలు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసిన ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతామని అవంతి పేర్కొన్నారు. -
ముక్కోటి ఏకాదశి: తిరుమలలో ప్రముఖులు
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ఉదయం అభిషేకం అనంతరం ఆలయ ఆర్చకులు వైకుంఠ ద్వారాలు తెరిచారు. ఉదయం నాలుగు గంటలకు దర్శనం ప్రారంభం అవ్వగా.. సామాన్య భక్తులు, వీఐపీలు దర్శనాల కోసం క్యూకట్టారు. శుక్రవారం కావడంతో అభిషేకం అనంతరం దర్శనాలు మొదలయ్యాయి. దీంతో తిరుమల క్షేత్రం వైకుంఠాన్ని తలపిస్తోంది. కాగా వైకుంఠ ఏకాదశి పర్వ దినాన పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇందు మల్హోత్రా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గా ప్రసాద్ రావు దర్శించుకున్నారు. అలాగే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు బాలినేని శ్రీనివాస్రెడ్డి, అవంతి శ్రీనివాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎంపీలు వేమారెడ్డి ప్రభాకర్ రెడ్డి, మిధున్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాదవ్, మోపిదేవి వెంకటరమణ, ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్ ఆదిత్యనాధ్, జస్టిన్ సీవీ నాగార్జున్ రెడ్డి, ఏపీ హైకోర్టు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, తెంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, హైకోర్టు న్యాయమూర్తి వెంకటరమణ, జస్టిస్ ఈశ్వరయ్య, తెలంగాణ హైకోర్టు జస్టిస్ అమర్ నాథ్ గౌడ్, తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, తెలంగాణ కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్, సర్కార్ వారి పాట చిత్రం డైరెక్టర్ పరుశురామ్, తదితరులు శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. సునీల్ దియోధర్ మాట్లాడుతూ... వైకుంఠ ఏకాదశికి టీటీడీ అద్భుతమైన దర్శన ఏర్పాట్లు చేసిందన్నారు. దేవాలయాల నిర్వహణలో టీటీడీ దేశంలోని అన్నీ ఆలయాలకు ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. కోవిడ్ నిబంధనలు అమలు చేస్తూ అద్భుతమైన దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీకి ధన్యవాదాలు తెలిపారు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వీఐపీలు క్రమ శిక్షణతో శ్రీవారిని దర్శించుకున్నారన్నారు. అనుకున్న సమయం కంటే ముందుగానే సర్వ దర్శనం ప్రారంభిస్తున్నామన్నారు. భక్తులందరూ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు ఈ సందర్భంగా ఆలయ అదనపు ఈవో మాట్లాడుతూ.. సాధారణ భక్తులకు గంటన్నర ముందే వైకుంఠద్వార దర్శనం కల్పించినట్లు తెలిపారు. ఉ. 9 గంటలకు అనుకున్నామని కానీ 7.30 గంటలకే ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. పరిస్థితిని అంచనా వేసి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఏర్పట్లు చేసినట్లు, సర్వదర్శనం టిక్కెట్ల పెంచినట్లు పేర్కొన్నారు. సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కేటాయించగలుగుతున్నామన్నారు. ప్రముఖులు సహకరించడంతో సాధారణ భక్తులకు ఎక్కువ సమయం లభించిందన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా రెండు వేలు, దాతలకు రెండు వేలు, వీఐపీలకు మూడు వేల మందికి టికెట్లు కేటాయించామన్నారు. -
పరిస్థితులు చక్కబడ్డాకే స్థానిక ఎన్నికలు..
సాక్షి, విశాఖపట్నం: కరోనా పరిస్థితులు చక్కబడ్డాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. శనివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందన్నారు. ఎవరితో సంప్రదించాలో వారితో చర్చించి మూడు రాజధానులపై నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. చంద్రబాబు నాయుడు జీవితమే కుట్రలమయం అని ధ్వజమెత్తారు. పోలీస్ అధికారి కింద పడిపోతే వైఎస్సార్సీపీ కార్యకర్త సహాయం చేస్తే.. దాడి చేశారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: ‘సీఎం జగన్ లక్ష్యాన్ని సాధించారు’) చంద్రబాబుకు ఆ దమ్ము,ధైర్యం లేదు: అవంతి శ్రీనివాస్ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ కేసీఆర్, వైఎస్ జగన్ తమ వాదం కోసం రాజీనామాలు చేసి, తమ ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించారు. చంద్రబాబు కూడా వైఎస్ జగన్ లాగే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయాలన్నారు. రాజీనామాలపై వైఎస్ జగన్కి ఉన్న దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. అమరావతిలో తన భూములు ధరలు తగ్గిపోతాయని చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు ఎప్పుడో మరిచిపోయారని అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.(చదవండి: టీడీపీ జాతీయ పార్టీనా?: ఎమ్మెల్యే వంశీ) -
‘సీఎం జగన్ లక్ష్యాన్ని సాధించారు’
సాక్షి, విశాఖపట్నం: ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాధించారని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఈ నెల 21న సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా శనివారం పోర్ట్ స్టేడియంలో ‘వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంట్’ షెడ్యూల్, థిమ్ సాంగ్, జెర్సీని విడుదల చేశారు. ఆయనతో పాటు మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. (చదవండి: టీడీపీ జాతీయ పార్టీనా?: ఎమ్మెల్యే వంశీ) ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ క్రీడలతో మానసికోల్లాసం పెరుగుతుందన్నారు. యువతను అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో మంచి క్రికెట్ క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 20 రోజులు పాటు జరగనున్న ఈ పోటీల్లో 422 టీంలు పాల్గొంటాయని వెల్లడించారు. ప్రతి ఏడాది ‘వైఎస్సార్ క్రికెట్ కప్’ పోటీలు ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. (చదవండి: ‘అమరావతి ఉద్యమం ఒక ఫేక్’) ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21 నుంచి విశాఖపట్నంలో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ సన్నాహక సభ ఈరోజు అక్కయ్యపాలెంలోని పోర్టు స్టేడియంలో జరిగింది. ఈ సభకు సంబంధించిన దృశ్యాలు. pic.twitter.com/PNqBbkLjjG — Vijayasai Reddy V (@VSReddy_MP) December 19, 2020 -
వారం రోజుల్లో కొత్త టూరిజం పాలసీ: మంత్రి అవంతి
సాక్షి, విజయవాడ: భవాని ఐల్యాండ్ను ఈ నెల 10వ తేదీన తిరిగి ప్రారంభిస్తామని టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వారం రోజుల్లో కొత్త టూరిజం పాలసీని తీసుకువస్తున్నట్లు చెప్పారు. బోటింగ్కు ఇప్పటికే అనుమతినిచ్చామని, ప్రకాశం బ్యారేజీ గేట్లు మూసివేసిన తరువాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి వస్తుందన్నారు. పాపికొండలకు తప్ప అన్ని చోట్లకు బోటింగ్కు అనుమతినిచ్చామని చెప్పారు. బోటింగ్ జరిగే చోట కమాండ్ కంట్రోల్ రూం పని చేస్తుందని, గతంలో జరిగిన ఘటనలు దృష్టిలో ఉంచుకొని అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. రాబోయే రోజుల్లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అవంతి చెప్పారు. చదవండి: నాడు భయమేసింది.. నేడు సంతోషంగా ఉంది: పెద్దిరెడ్డి -
పర్యాటక ప్రాంతాల్లో బోట్ల ఆపరేషన్: మంత్రి
సాక్షి, విజయవాడ: అన్ని పర్యాటక ప్రాంతాల్లో బొట్ల ఆపరేషన్ ప్రారంభిస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం సిద్దంగా 196 బొట్లు ఉన్నాయని, వాటి ప్రారంభానికి అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. వరద పరిస్థితులను బట్టి బొట్లను అందుబాటులోకి తెస్తామని, పర్యాటక ప్రాంతాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెఇపారు. విశాఖలో బంగ్లాదేశ్ షిప్ వచ్చిందని, అందులో రెస్టారెంట్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. విశాఖ, విజయవాడ, హుస్సేన్ సాగర్ కలిపి కొత్త బొట్లను పర్యాటక ప్రాంతాల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. కోవిడ్ వల్ల జరిగిన నష్టాన్ని మళ్ళీ భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తామని, ఆన్లైన్లో యోగా, ఇంగ్లీష్ శిక్షణ ఇస్తున్నామన్నారు. అంతేగాక రూ. 2 కోట్ల 20 లక్షలతో ఒంగోలులో స్టేడియం నిర్మించామని ఆయన తెలిపారు. వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్ను రూ. 3 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ధి చేస్తామని అవంతి పేర్కొన్నారు. విశాఖ బీచ్రోడ్లో కోడి రామ్మూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, విశాఖఆర్కే బీచ్ను మరింత అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రివర్ టూరిజంకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ను చంద్రబాబు ఎటిఎంలా వాడారని, ప్రధానమంత్రి కూడా చంద్రబాబు అవినీతిని విమర్శించారన్నారు. బాబు పోలవరం ప్రాజెక్టుపై రాజకీయం చేయడం తగదని, వరదల సమయంలో కూడా సీఎం జగన్ సమర్థవంతంగా పని చేశారన్నారు. వరదలు వస్తే ఇంత వేగంగా రైతులకు పరిహారం ఇచ్చిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూసారా అని మంత్రి వ్యాఖ్యానించారు. -
బీచ్ వెంబడి 30 వేల కొబ్బరి మొక్కలు..
సాక్షి, విశాఖపట్నం: ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రమంతటా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టనున్నట్టు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ప్రగతి భారత్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ట్రస్ట్ సభ్యులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విజయసాయి రెడ్డితో పాటు మంత్రి అవంతి శ్రీనివాసరావు, పలువురు పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఏడాది క్రితం విశాఖ కేంద్రంగా సేవా కార్యక్రమాలు ప్రారంభించిన ప్రగతి భారత్ ట్రస్ట్ దశల వారీగా తన సేవలను రాష్ట్రమంతటా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా విశాఖ, భీమిలి బీచ్ అందంగా తయారు చేయడానికి 30 వేల కొబ్బరి మొక్కలు నాటడానికి ప్రణాళికలు రూపొందించినట్లు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. విశాఖ కేంద్రంగా ప్రగతి భారత్ ట్రస్ట్ చేపట్టిన సేవా కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు అధికారులు కొనియాడారు. కరోనా సమయంలో పేద ప్రజలకు ట్రస్ట్ అన్ని రకాలుగా సహాయపడిందని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. -
అభిమానం లేదు, రాజకీయం కోసమే..
-
వెంకన్న సన్నిధిలో పలువురు ప్రముఖులు
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి, గజల్ శ్రీనివాస్ వంటి ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘కుటుంబ సమేతంగా స్వామి వారి ఆశీస్సులు పోందడం చాలా సంతోషంగా ఉంది. ఎన్ని సార్లు దర్శించుకున్న, ఎన్ని సార్లు చూసిన తనివి తీరని ఒక దివ్యమంగళ స్వరూపం స్వామి వారిది. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. త్వరగా వ్యాక్సిన్ రావాలని స్వామి వారిని కోరుకున్నాను. ఏపీలో కరోనాతో ఒక పక్క.. వరదలతో మరో పక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా సమయంలో కూడా స్వామి వారిపై భక్తితో తిరుమలకు వచ్చి ఆయన ఆశీస్సులు పోందడం ఆనందదాయకం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మరింత శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు సాయం చేయమని స్వామి వారిని వేడుకున్నాను. గతంలో లాగానే తిరుమలకు వచ్చే పర్యాటకులకు బ్రహ్మోత్సవాల అనంతరం దర్శనం కల్పిస్తాం’ అన్నారు. (చదవండి: శ్రీవారికి కానుకగా బంగారు శఠారి) వకుళ మాత ఆలయ నిర్మాణం చాలా సంతోషం: గజల్ శ్రీనివాస్ భారత్ సేవ్ టెంపుల్స్లో భాగంగా మా చిరకాల కోరిక వకుళ మాత ఆలయం నిర్మాణం జరడం చాలా సంతోషంగా ఉంది అన్నారు గజల్ శ్రీనివాస్. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాతృత్వంతో వకుళ మాత ఆలయం రూపకల్పన జరగడం చాలా ఆనందం. కరోనా సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ స్వచ్చ తిరుమలను అందంగా తీర్చి దిద్దిన టీటీడీని అభినందిస్తున్నాను. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రండి’ అని కోరారు. (చదవండి: ఆయన్ని చూస్తుంటే వైఎస్సార్ గుర్తుకు వచ్చారు) విపత్తుల నుంచి ప్రజలను కాపాడాలని కోరాను: కోన రఘుపతి కరోనా, ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలందరిని కాపాడాలని స్వామి వారిని వేడుకున్నాను అన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. ‘వేంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరిపై ఉంది. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు. కరోనా సమయంలో టీటీడీ ఏకాంతంగా స్వామి వారి వాహన సేవలు నిర్వహించినప్పటికి ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తోంది’ అని తెలిపారు. -
రైతులకు ఉపయోగపడే విధంగా సీఎం నిర్ణయం
సాక్షి, విశాఖపట్నం: తాండవ షుగర్ ఫ్యాక్టరీలో మంగళవారం మంత్రులబృందం రైతులతో సమావేశమయ్యింది. తాండవ షుగర్ ఫ్యాక్టరీపై రైతుల అభిప్రాయాలను మంత్రుల బృందం అడిగి తెలుసుకుంది. అనంతరం మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి. సీఎం జగన్ చంద్రబాబులాగా ఎన్నికల కోసం పనిచేయరు. షుగర్ పరిశ్రమల్లో స్థితిగతులు ప్రత్యక్షంగా తెలుసుకోమని సీఎం కమిటీ వేశారు. రైతులకు నష్టం చేయడం కోసం కమిటీ వేయలేదు. మీరు చెప్పిన అభిప్రాయాలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం. అందరికి మేలు జరిగే నిర్ణయం సీఎం జగన్ తీసుకుంటారు’ అని వెల్లడించారు. అనంతరం పరిశ్రమల శాఖ మంత్రి గౌతం రెడ్డి మాట్లాడుతూ, ‘ రాష్ట్రంలో 12 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. రైతులకు ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకోమని సీఎం చెప్పారు. రైతులకు సీఎం జగన్ మేలు చేస్తారు. రైతులకు మేలు జరగాలన్నదే సీఎం జగన్ ఉద్దేశం’ అని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, ‘నాన్న ఒక అడుగు ముందుకు వేస్తే నేను రెండు అడుగులు ముందుకు వేస్తానని సీఎం జగన్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు అన్యాయం జరిగింది. రైతులకు మంచే జరుగుతుంది. మీ అభిప్రాయాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాం’ అని పేర్కొన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి ఉన్నపుడు రైతులకు మేలు జరిగింది. రైతులకు సీఎం జగన్ ఏం చేశారో, చంద్రబాబు ఏం చేశారో అందరికి తెలుసు. రైతుల అభిప్రాయాలన్నింటిని సీఎం దృష్టికి తీసుకువెళ్తాం. రైతులకు మేలు చేయాలన్నదే సీఎం జనగ్ ఆలోచన. టీడీపీ హయాంలో చెరుకు రైతులకు బకాయి ఉన్న రూ.54 కోట్లును సీఎం జగన్ విడుదల చేశారు’ అని చెప్పారు. ఎంపీ వంగ గీత మాట్లాడుతూ, ‘ షుగర్ పరిశ్రమల స్థితిగతులు తెలుసుకోవాలని సీఎం కమిటీ వేశారు. నష్టం వస్తే ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై కమిటి చర్చిస్తోంది. చరిత్రలో ఎన్నడూలేని విధంగా చెరుకు రైతులకు బకాయిలు చెల్లించారు. రైతులకు మేలు జరగేలా మంత్రుల కమిటీ నిర్ణయం ఉంటుంది’ అని అన్నారు. చదవండి: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ -
శ్రీకాంత్కు మంత్రి అవంతి పరామర్శ
సాక్షి, విశాఖ : శిరోముండనం బాధితుడు శ్రీకాంత్ను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆదివారం పరామర్శించారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు శ్రీకాంత్ ఇంటికి వెళ్లారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దళితులపై దాడులను ప్రభుత్వం సహించదని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఘటన జరిగిన తీరుతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. ప్రభుత్వం అన్ని రకాలుగా శ్రీకాంత్ కు బాసటగా ఉంటుందని భరోసా ఇచ్చారు. (చదవండి: తలబిరుసు.. లెక్కలేనితనం..) సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన లో దళితులు, బలహీన వర్గాలకు పూర్తిస్థాయి న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున శ్రీకాంత్కు లక్ష రూపాయల నగదు, సొంత ఇల్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఉన్న పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు కూడా తన సొంత నగదు రూ.50 వేలను శ్రీకాంత్కు అందజేశారు. ఈ ఘటనలో ఇప్పటికే నిందితులు ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారని మంత్రి అవంతి తెలిపారు. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న నూతన్ నాయుడు భార్య మధు ప్రియతో పాటు మిగతా వారికి న్యాయస్థానం రెండువారాలు రిమాండ్ విధించింది. -
సీఎం జగన్ ఆదేశాలతో విధుల్లోకి..
సింహాచలం (పెందుర్తి): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో ఇటీవల తాత్కాలికంగా నిలిపివేసిన ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నన్నట్టు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ఇటీవల దేవస్థానం ఆదాయం ఘననీయంగా పడిపోయిందన్నారు. జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. దానికారణంగా కొందరు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందిని తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. దీంతో వారు పడిన ఇబ్బందులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, ఆయన మానవతా దృక్పథంతో స్పందించి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రిని ఆదేశించారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితోపాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, దేవస్థానం చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు, దేవస్థానం ట్రస్ట్బోర్డు సభ్యులకు కూడా కృతజ్ఞతలు చెబుతున్నానని తెలిపారు. ఈ సందర్భంగా తిరిగి విధుల్లో చేరిన సిబ్బంది ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దేవస్థానం ఈవో డి.భ్రమరాంబ, ట్రస్ట్బోర్డు మెంబర్లు వారణాసి దినేష్రాజ్, సూరిశెట్టి సూరిబాబు, కోరాడ లక్ష్మణ్కుమార్, దాడి దేవి, సిరిపురపు ఆషాకుమారి, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. రాజకీయాలొద్దు దేవస్థానం విషయంలో రాజకీయాలొద్దని అన్ని రాజకీయపార్టీలకు మంత్రి అవంతి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. దేవస్థానం భూములను లీజులకిచ్చే నిర్ణయం కొత్తగా మేమేదో తీసుకున్నట్టు ప్రచారం చేయడం తగదన్నారు. అసలు గతంలో దేవస్థానం భూములను లీజులకిచ్చిందెవరని ప్రశ్నించారు. దేవస్థానంతో ముడిపడి ఉన్న పంచగ్రామాల భూసమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని మంత్రి ముత్తంశెట్టి తెలిపారు. ముత్తంశెట్టి తొలుత ఆలయ బేడాప్రదక్షిణ చేసి స్వామికి పూజలు నిర్వహించారు. కప్పస్తంభానికి మొక్కుకున్నారు. పరిపాలన రాజధానిగా విశాఖను ఎవరు ఆపలేరు బీచ్రోడ్డు (విశాఖ తూర్పు) : విశాఖలో పరిపాలన రాజధానిని ఎవరూ ఆపలేరని మంత్రి ముత్తంశెట్టి స్పష్టం చేశారు. తాత్కాలికంగా అడ్డంకులు సృష్టించినా అంతిమ విజయం ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా విశాఖ పరిపాలనా రాజధాని కాకుండా ఆపలేరన్నారు. -
తొట్లకొండకు ముప్పు: ఖండించిన అవంతి
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న స్టేట్ గెస్ట్ హౌస్కు, తొట్లకొండకు ఎటువంటి సంబంధం లేదని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ నిర్మాణం వల్ల తొట్లకొండకి ఎటువంటి ముప్పు లేదని, చంద్రబాబుతో పాటు కొన్ని పచ్చమీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలని ఖండిస్తున్నామన్నారు. చారిత్రాత్మక కట్టడాల పరిరక్షణకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విశాఖపట్నంలో మంత్రి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ధనం వృధాగా ఖర్చు కాకూడదనే ప్రభుత్వ గెస్ట్ హౌస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. తిరుపతి, విశాఖ, విజయవాడలలో గెస్ట్ హౌస్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదించిందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, విశాఖపై అడుగడుగునా విషం చిమ్ముతున్న చంద్రబాబు.. ఆయన హయాంలో ఒక్క గెస్ట్ హౌస్ అయినా కట్టారా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రొటోకాల్ పేరుతో రూ. 23 కోట్లు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఇకపై కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు కూడా..) చంద్రబాబుకు దళితుల గురించి మాడ్లాడే అర్హతే లేదని మంత్రి అవంతి పేర్కొన్నారు. రాష్ట్రంలో వరదలు వచ్చినా, ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగినా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కనిపించరని ఎద్దేవా చేశారు. మరోవైపు పవన్ కల్యాణ్ ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయనకు అమరావతిపై ప్రేమ ఉంటే గాజువాక నుంచి ఎందుకు పోటీ చేశారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కావాలి, గానీ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకూడదా? అని నిలదీశారు. గాజువాక ప్రజల ఓట్లు వేయించుకుని విశాఖకి పరిపాలనా రాజధానిని పవన్ కళ్యాణ్ ఎలా వ్యతిరేకిస్తారన్నారు. ఇక తొట్లకొండ ఎక్కడుందో తెలియకుండా ఎలా మాట్లాడతారని రఘురామకృష్ణంరాజును ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర గురించి మాడ్లాడేటపుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. ఆయనకు నిజంగా దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు. రాజుకు పలుకుబడుంటే నరసాపురం-కోటిపల్లి రైల్వేలైన్ కోసం ప్రయత్నించాలని సూచించారు. అనవసర విషయాలలో జోక్యం చేసుకోవద్దని రఘురామకృష్ణంరాజుకు అవంతి హితవు పలికారు. (చంద్రబాబుకు సామినేని సవాల్..) -
పర్యాటకానికి చిరునామాగా మారాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేవారికి అనువుగా నూతన పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఏపీ టూరిజం ఆన్లైన్ ట్రేడ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ను ప్రారంభించారు. అనంతరం పర్యాటకశాఖపై సమీక్ష నిర్వహించారు. పాలసీలో మార్పులు చేర్పులపై అధికారులకు సీఎం జగన్ సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్కు తగిన స్థానం కల్పించాలన్నారు. రాజస్థాన్తో ధీటుగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలని పేర్కొన్నారు. ఆతిథ్య రంగంలో సుప్రసిద్ధ కంపెనీల భాగస్వామ్యం తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 12 నుంచి 14 పర్యాటక ప్రాంతాల అభివృద్ది చేయాలని తెలిపారు. అరకులో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. (చదవండి: నవరత్నాల అమలులో మరో ముందడుగు) ‘‘హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో మంచి కాలేజీ పెట్టాలి. ఈ కాలేజీ నుంచి బయటకు వస్తే తప్పనిసరిగా ఉద్యోగం వస్తుందనే విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఏపీటీడీసీ ప్రాపర్టీస్,లోన్స్ విషయంలో ప్రభుత్వ డబ్బు దుర్వినియోగం కావొద్దు. సగం పూరైన ప్రాజెక్ట్లు ముందు పూర్తి చేయాలని’’ సీఎం జగన్ ఆదేశించారు. సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు: అవంతి శ్రీనివాస్ సమీక్షా సమావేశం అనంతరం పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ 12 ప్రాంతాల్లో 7 స్టార్ హోటల్స్, ఇంటర్నేషనల్ స్థాయి హోటల్స్ త్వరలోనే రానున్నాయని పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ ఓపెన్ చేస్తాం. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక కృషి చేసున్నాం. కోవిడ్ వల్ల హోటల్స్, రిసార్ట్స్ నష్టపోయాయి. వారందరూ రాయితీల కోసం వినతి పత్రాలు ఇచ్చారు. దీనిపై సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. విజయవాడ బాపు మ్యూజియం త్వరలోనే ప్రారంభిస్తాం. శిల్పారామాలను కూడా పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేస్తాం. సెప్టెంబర్ నుంచి టూరిస్టులను అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని’’ మంత్రి తెలిపారు. -
లోకేష్ మాటలు వినటం మానకుంటే..
సాక్షి, విజయవాడ: ఫోన్ టాపింగ్ పేరుతో చంద్రబాబు కొత్త కుట్రకోణానికి తెరలేపారని అవంతి శ్రీనివాస్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ కొత్త పథకం పెట్టినప్పుడల్లా కొత్త ఆరోపణతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు పన్నాగం పన్నుతున్నారని మండిపడ్డారు. పథకాలకు వస్తున్న ఆదరణతో తమకు పుట్టగతులుండవన్న నిరాశతో చంద్రబాబు ఉన్నారని, అభద్రతాభావంతో మంచి పనులకు అడ్డుతగులుతూ అభాసుపాలవుతున్నారని ఎద్దేవా చేశారు. ‘జేబు మీడియాను అడ్డుపెట్టుకొని అసత్య ఆరోపణలతో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారు. ఫోన్ టాపింగ్పై ఆధారాలు ఉంటే ఇవ్వమని డీజీపీ కోరినా ఎందుకు ఇవ్వలేదు? దుర్మార్గుడని తిట్టిన నోటితోనే ప్రధాని మోదీని ఇప్పుడు చంద్రబాబు పొగుడుతున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం చంద్రబాబు. అన్నిప్రాంతాలు ఓట్లేస్తేనే మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యానని చంద్రబాబు మర్చిపోయారు. ఒక ప్రాంతానికి, ఒక వర్గానికే పరిమితమయ్యి తన స్థాయిని తగ్గించుకున్నారు. సొంతంగా ఆలోచించినంతకాలం చంద్రబాబు రాజకీయం బాగుండేది. కొడుకు లోకేష్ ఆలోచనలతో పనిచేసి 23 సీట్లకు పార్టీ స్థాయిని దిగజార్చారు. లోకేష్ మాటలు వినటం మానకుంటే ఆ సంఖ్య మూడుకు పడిపోవటం ఖాయం’ అని అన్నారు. బాపు మ్యూజియంలో 11 కోట్లతో జరుగుతున్న పనులను బుధవారం మంత్రి అవంతి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బాపు మ్యూజియంలో శిలా సంపద చాలా ఉంది. అత్యంత అరుదుగా దొరికే ప్రాచీన వస్తువులను మనం ఇక్కడ చూడొచ్చు. పూర్వీకులు మనకిచ్చిన సంపద మన సంస్కృతి సంప్రదాయాలు. మన భవిష్యత్ తరాల వారికి ఈ ప్రాచీన సంపదను అందించాలి. మ్యూజియంను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం. త్వరలోనే ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి ఆయన చేతుల మీదుగా ప్రారంభిస్తాం. విజయవాడ వస్తే ప్రతిఒక్కరూ బాపు మ్యూజియంను సందర్శించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం’ అని తెలిపారు. చదవండి: మోడల్ హౌస్ను పరిశీలించిన సీఎం జగన్ -
టూరిస్టులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
సాక్షి, సచివాలయం: కరోనా కారణంగా పర్యాటక ప్రాంతాలన్నీ బోసిపోయాయి. అయితే సెప్టెంబర్ మొదటివారం నుంచి పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు అనుమతినిస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 20న పర్యాటక రంగ నూతన పాలసీని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. త్వరలో సింహాచల దేవస్థానంలో 'ప్రసాద్' పథకం పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. కొండపల్లి ఫోర్ట్, బాపు మ్యూజియంలను సీఎం జగన్ ప్రారంభిస్తారు పేర్కొన్నారు. తొట్లకొండలో బుద్ధుని మ్యూజియం, మెడిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. జాతీయస్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు వైఎస్ఆర్ క్రీడా పురస్కారాలు అందజేస్తామన్నారు. పీపీఈ పద్ధతిలో రాష్ట్రంలో మూడు ఇంటర్నేషనల్ స్టేడియంలను ఏర్పాటు చేస్తామని అవంతి తెలిపారు. చదవండి: ‘హైదరాబాద్లో దాక్కుని తప్పుడు ఆరోపణలా..’ -
ఒక్క ఎమ్మెల్యే గెలిచినా మంత్రి పదవికి రాజీనామా
బీచ్ రోడ్డు (విశాఖ తూర్పు): ‘మూడు రాజధానులు రిఫరెండంగా విశాఖలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి.. వారిలో ఒక్కరు గెలిచినా పదవికి రాజీనామా చేస్తా’ అని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్.. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సవాల్ విసిరారు. విశాఖలో మంత్రి శనివారం మీడియాతో ఏమన్నారంటే.. ► చంద్రబాబు మాటలకు, చేతలకు పొంతన ఉండదు. ► దమ్ముంటే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మాటకు కట్టుబడాలి. ► విశాఖకు రాజధాని వద్దు అన్నందుకే చంద్రబాబును అక్కడ కాలుమోపనీయని విషయం గుర్తుంచుకోవాలి. ► అమరావతిని అభివృద్ధి చేస్తే లోకేష్ను అక్కడి ప్రజలు ఎందుకు ఓడించారో చెప్పాలి. ► విశాఖ వచ్చిన కంపెనీలన్నింటినీ అమరావతికి తరలించాలని ఆదేశించడంతో అవి వెనక్కుపోయాయి. ► కాగా, లక్ష కోట్లు ఖర్చు చేసి అమరావతిని నిర్మించే కంటే రూ.30 వేల కోట్లతోనే మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయొచ్చని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. -
హిందూస్థాన్ షిప్యార్డ్ మృతుల కుటుంబాలకు భారీ పరిహారం
-
వారం రోజుల్లో పర్యాటకులకు అనుమతి
సాక్షి, అమరావతి: అన్ని జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాల్లో వారం రోజుల్లో పర్యాటకులకు అనుమతిస్తామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. పర్యాటక ప్రాంతాలన్నిటినీ మళ్ళీ అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. టూరిజం హోటళ్లను కూడా తెరుస్తున్నామని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన సచివాలయం నుంచి మాట్లాడుతూ.. ఆగస్టు 15 నుంచి అన్ని చోట్ల నుంచి బోట్లు తిరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. టూరిస్ట్ బస్సులను కూడా వారం రోజుల్లో సిద్ధం చేస్తామని తెలిపారు. త్వరలోనే జిమ్లను సైతం రాష్ట్రంలో ప్రారంభిస్తామన్నారు. టెంపుల్ టూరిజంను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. (రాష్ట్రంలో పెట్టుబడులపై అమెజాన్తో చర్చలు) 'ప్రసాద్' స్కీం ద్వారా సింహాచలం దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే శ్రీశైలంలో 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. త్వరలోనే 4 క్రీడా వికాస కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. ప్రతిభ గల పేదల పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, అందులో భాగంగా గతేడాది 3 కోట్లు పేద క్రీడాకారులకు అందించగా, ఈ ఏడాది మరో 3 కోట్లను కేటాయించారని తెలిపారు. పీవీ సింధు అకాడమీకి విశాఖపట్నంలో భూములు కేటాయిస్తామని అవంతి శ్రీనివాస్ తెలిపారు. (వైఎస్ జగన్ భిక్షతోనే మీరు ఎంపీ అయ్యారు..) -
ఏపీలో తెరుచుకోనున్న పర్యాటక ప్రాంతాలు
-
అమ్మవారి ఆశీసులతో మానవాళిదే విజయం
సాక్షి, విజయవాడ: మహమ్మారి కరోనాకు, మానవాళికి జరుగుతున్న పోరులో కచ్చితంగా మనుషులే విజయం సాధిస్తారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. కరోనా సమాచారంలో ప్రభుత్వం పారదర్శకత పాటిస్తోందని.. అధిక సంఖ్యలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం వల్లే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. వైరస్ సోకినా ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మహమ్మారి నుంచి కోలుకోవచ్చని తెలిపారు. పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ శుక్రవారం దుర్గమ్మవారిని దర్శించుకున్నారు.(అభివృద్ధికి టీడీపీ అవరోధం: అవంతి) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా బారి నుంచి ప్రజలను కాపాడాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు తెలిపారు. కోవిడ్-19 కట్టడికై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తాను సైతం ప్రతినెలా పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. టెస్టులు చేయించుకోవడంలో ఎలాంటి ఇబ్బంది, తప్పు లేదన్నారు. కరోనా సోకినంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదని సరైన జాగ్రత్తలు, ఆత్మస్థైర్యంతో దానిని జయించవచ్చని పేర్కొన్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో కేసులు తగ్గుముఖం పడుతాయన్న అవంతి.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రతీ విషయాన్ని తప్పు పట్టడం సరికాదని హితవు పలికారు. -
‘మద్యం, ఇసుకలో అడ్డగోలుగా అవినీతి’
సాక్షి, విశాఖపట్నం: చట్టం ముందు అందరూ సమానమేనని, అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక, మద్యం విషయంలో అడ్డగోలుగా అవినీతి చేశారని పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో ఎలాంటి వివక్షత ఉండదన్నారు. భీమిలిలోని జరిగిన భూ కంభకోణాన్ని ఆధారాలతో సహా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఇచ్చామన్నారు. ఆయన దీనిపై ‘సిట్’ విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. దేవాలయాల విషయంలో టీడీపీ రాజకీయం చేస్తోందని, గో సంరక్షణే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. (చదవండి: సాక్షి ఎఫెక్ట్: డొంక కదులుతుంది!) -
ఏపీలో 25 కోట్ల మొక్కలు నాటేందుకు శ్రీకారం
-
విశాఖ బీచ్ కోతని అరికట్టేందుకు..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలను పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖ ఆర్కే బీచ్లో కోతని అరికట్టేందుకు జీవీఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సన్ రే రిసార్ట్స్తో కలిసి స్కేవోలా టకాడా మొక్కలు నాటే ప్రక్రియ గురువారం ప్రారంభమయింది. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి బీచ్ రోడ్డులో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, కలెక్టర్ వినయ్చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన, సన్రే రిసార్ట్స్ ఎండీ రాజబాబు తదితరులు పాల్గొన్నారు. (దొంగే దొంగా.. దొంగా అంటున్నాడు!) విజయసాయిరెడ్డి మాట్లాడుతూ నౌపాక మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయని, బీచ్లో మొక్కలు నాటడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. విశాఖలో ఉష్ణోగ్రత తగ్గేందుకు ఈ మొక్కలు దోహద పడతాయన్నారు. నగరంలో 2 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించామని వెల్లడించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యాటకులకు స్వర్గధామం విశాఖ అని, రాబోయే రోజుల్లో నౌపాక మొక్కలు పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయన్నారు. -
విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో 108,104 వాహానాల ప్రారంభం
-
సాక్షి ఎఫెక్ట్: డొంక కదులుతుంది!
నెల్లూరు (టౌన్): ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నెల్లూరు డివిజన్లో అవినీతి, అక్రమాల డొంక కదులుతోంది. నెల్లూరు డివిజన్ కార్యాలయంలో దివ్యాంగురాలైన సీనియర్ అసిస్టెంట్ ఉషారాణిపై డిప్యూటీ మేనేజర్ దాడి ఘటన తర్వాత ఇక్కడి కార్యకాలపాలపై సాక్షిలో వరుస కథనాలు వచ్చాయి. దీంతో స్పందించిన ఆ శాఖ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ విచారణకు ఆదేశించారు. టూరిజం శాఖ నెల్లూరు డివిజన్లో జరుగుతున్న అవినీతి కార్యకలాపాలపై విచారించి వెంటనే నివేదిక సమరి్పంచాలని ఆ శాఖ ఎండీ ప్రవీణ్కుమార్ను ఆదేశించారు. రెండు రోజుల్లో విచారణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ►ఇప్పటికే సీనియర్ అసిస్టెంట్ ఉషారాణిపై జరిగిన దాడి ఘటనపై ఏపీ టూరిజం శాఖ జీఎం సుదర్శన్ను విచారణాధికారిగా నియమించారు. ఆయన మూడు రోజులుగా నెల్లూరులో ఉండి దాడి ఘటనకు సంబంధించి వివరాలను ఆరా తీస్తున్నారు. ►దాడి ఘటనపై సమగ్ర విచారణ చేయాలని కలెక్టర్ శేషగిరిబాబు జిల్లా దివ్యాంగుల శాఖ ఏడీ నాగరాజకుమారిని నియమించారు. ఈ ఇద్దరి విచారణలతో పాటు అవినీతి అక్రమాలపై మరో కమిటీ ఏర్పాటు కానుండటంతో ఆ శాఖ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. అక్రమాలెన్నో.. ఏపీ టూరిజం నెల్లూరు డివిజన్ పరిధిలో కొన్నేళ్లుగా జరుగుతున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ►ప్రధానంగా ఆ శాఖకు సంబంధించి హోటళ్లలో నిత్యావసర సరుకులు, కూరగాయలు తదితర వస్తువులు కొనుగోళ్లు, గదుల బుకింగ్లో జరిగిన లొసుగులు, తడ హరిత హోటల్లో జరిగిన విందు తదితర అంశాలపై విచారణ జరగనుంది. ►ఆ శాఖ పరిధిలో జరిగిన కాంట్రాక్ట్ పనులు, వాటిల్లో నాణ్యత తదితర అంశాలను కూడా పరిశీలించనున్నారు. ►ఈ నేపథ్యంలో కొనుగోళ్లన్నీ అకౌంట్స్ విభాగం ఆధ్వర్యంలో జరిగాయా లేక సొంతంగా జరిగాయా అనే విషయాన్ని నిగ్గు తేల్చనున్నారు. ►బోటింగ్ యూనిట్లు నిర్వహణపైన విచారణ కమిటీ ఆరా తీసే అవకాశం కనిపిస్తుంది. ►హోటల్ గదుల బుకింగ్కు సంబంధించి గతంలో పలు అక్రమాలు చోటు చేసుకున్న సందర్భంలో బాధ్యులను బదిలీలతో సరిపెట్టారు. ►ఇప్పుడు వాటి గుట్టును కూడా విచారణ కమిటీ వెలికి తీయనుంది. ►మరొక వైపు నెల్లూరు హరితా హోటల్ ఆవరణలోని డివిజన్ కార్యాలయంలో నెలకొన్న విభేదాలు, వర్గపోరుపైన విచారణ కమిటీ దృష్టి పెట్టనుంది. ►గతంలో ఓ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేయడం, మరో ఉద్యోగి సహచర ఉద్యోగినిపై కుర్చీ విసరడానికి దారి తీసిన పరిస్థితి, కార్యాలయంలో క్రమశిక్షణ పరిస్థితులపై విచారణ కమిటీ ఆరా తీయనుంది. ►విజిలెన్స్, డివిజనల్ మేనేజర్ తదితర ఉన్నతాధికారుల కదలికలను యూనిట్ల మేనేజర్లు, సిబ్బందికి ఎప్పటికప్పుడు సమాచారం అందించే ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని విచారిస్తే గుట్టు మొత్తం బయట పడుతుందని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు. ►ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి గతంలో తిరుపతికి బదిలీ చేసినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో తన పలుకుబడిని ఉపయోగించుకుని తిరిగి నెల్లూరుకు వచ్చి నెల్లూరు డివిజన్ మొత్తాన్ని శాసిస్తున్నాడు. సాక్షి కథనాలతో కలకలం ఏపీ టూరిజంలో జరుగుతున్న అక్రమాలను సాక్షి వెలుగులోకి తేవడంతో ఆ శాఖలో కలకలం రేగుతోంది. విచారణ జరిగితే ఎవరెవరికి ముప్పు ఉందో అనే అంశంపై ఆ శాఖ ఉద్యోగులు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. తడలో హరిత హోటల్లో జరిగిన విందుపై డివిజనల్ మేనేజర్ తూతూ మంత్రంగా విచారణ చేపట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ►అప్పట్లో బాధ్యుడైన అధికారిని సస్పెండ్తో సరిపెట్టగా కేవలం రెండు నెలల్లోనే తిరిగి పోస్టింగ్ తెచ్చుకుని చిత్తూరు జిల్లాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంబంధిత తడ హోటల్ మేనేజర్ను సస్పెండ్ చేశారు. ►గతంలో నెల్లూరు డివిజన్ కలిసి ఉన్న తిరుపతి డివిజన్లోని హార్స్లీ హిల్స్లోని హరితా హోటల్లో గదుల బుకింగ్లో జరిగిన మాయాజాలం, కడప, తిరుపతిల్లో ప్రొవిజన్స్ కొనుగోళ్లు జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అధికారులు విచారించి నివేదిక సమరి్పచినా గత ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. ►అయితే ఈ నివేదికలపై కూడా ప్రస్తుత ఎండీ ప్రవీణకుమార్ విచారణకు ఆదేశించనున్నట్లు తెలిసింది. ►విచారణ కమిటీ నిష్పక్షపాతంగా విచారణ జరిగితే ఏపీ టూరిజంలో జరుగుతున్న అక్రమాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. -
అడ్డగోలు విమర్శలు చేస్స్తున్నారు:అవంతి
-
13 జిల్లాల్లో డి ఎడిక్షన్ సెంటర్లు ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో డి ఎడిక్షన్ సెంటర్లు ప్రారంభించామని, విశాఖ కేజీహెచ్లో కూడా డి ఎడిక్షన్ సెంటర్ను మొదలు పెట్టామని మంత్రి అవంతి శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. విశాఖలో ఆయన మీడియతో మాట్లాడుతూ...‘ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దివంగత మహానేత రాజశేఖర రెడ్డి లక్షలాది మందికి ప్రాణదానం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా లక్షలాది మందికి ఆరోగ్య శ్రీ అందిస్తున్నారు. రాష్ట్రంలో 11 లక్షల మందికి పైగా ఆరోగ్యశ్రీ లబ్ధిదారులున్నారు. వారికి ప్రభుత్వం త్వరలోనే సేవలనందించనుంది. ఆరోగ్య శ్రీ ఒక్క ఏపీలోనే కాక చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాలకు కూడా వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డయాలసిస్ చేసుకున్న ప్రతి కిడ్నీ రోగికి ప్రభుత్వం 10 వేల రూపాయలు అందిస్తుంది. విద్య, వైద్య రంగంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. గతంలో నిర్లక్ష్యానికి గురైన 108, 104 సేవలకు తిరిగి పూర్వ వైభవం తీసుకువస్తున్నాం. విశాఖ జిల్లాలో 41 కొత్త 108 అంబులెన్సులు, 104 కోసం 27 మొబైల్ టీంలు ఏర్పాటు చేశాం అని అవంతి తెలిపారు. ('బాబు.. విగ్రహం కళ్లలోకి చూసే దండ వేశావా') ఇంకా ఆయన మాట్లాడుతూ... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి పేదవాడికి వైద్యసేవలు అందించాలన్నదే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచన అని తెలిపారు. త్వరలోనే సీఎం జగన్ చేతుల మీదుగా పాడేరులో మెడికల్ కాలేజ్ శంఖుస్థాపన జరుగుతుందని అవంతి చెప్పారు. కరోనా కట్టడి కోసం సేవలందిస్తున్న పోలీసులకు, వైద్యులకు అభినందనలు తెలిపారు. విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు 31113 మందికి కరోన పరీక్షలు చేయడమైందని చెప్పారు. కోవిడ్ను ఎదుర్కోవడానికి 80 వేల పీపీఈ కిట్లు, 49వేల ఎన్95 మాస్క్లు, 7 లక్షల 3 వేల సర్జికల్ మాస్క్లు, 2 లక్షల 40 వేల గ్లౌజ్లు, 436 ధర్మా మీటర్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. పాడేరుతో పాటు అనకాపల్లిలో కూడా వైద్యకళాశాల ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని, అందుకు సంబంధించిన స్థల సమీకరణ కూడా పూర్తి అయ్యిందని తెలిపారు. త్వరలోనే ఇవి కార్యరూపం దాల్చనున్నాయి అని వెల్లడించారు. (మోదీ, జగన్ మధ్య సత్సంబంధాలు: రామ్మాధవ్) -
‘మహానాడులో ఓటమి విశ్లేషించుకుంటే బాగుండేది’
సాక్షి, విశాఖపట్నం: అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 90 శాతం హామీలు నెరవేర్చిన ఘనత తమ ప్రభుత్వానిదని మంత్రి అవంతి శ్రీవివాస్ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చదువుతోనే పేదల జీవితాల్లో మార్పులొస్తాయని నమ్మి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘అమ్మ ఒడి’ ప్రారంభించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఒడి పథకంలో తల్లుల ఖాతాల్లో రూ. 6500 కోట్లు జమ చేశామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నాడు-నేడు పేరుతో కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. జగనన్న గోరుముద్ద పేరుతో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. జగనన్న వసతి దీవెన, విద్యా కానుక పేరుతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్ది అని గుర్తుచేశారు. (తొలి ఏడాది నుంచే విద్యారంగానికి ప్రాధాన్యత) దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర ప్రదేశ్లో మాత్రమే ఒకటి నుంచి పీజీ వరకు ఉచితంగా చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. అవినీతి రహిత పరిపాలనతో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని చెప్పారు. రెండు నెలల తర్వాత రాష్ట్రానికి వచ్చిన చంద్రబాబు మహానాడులో ప్రజలని మభ్యపెడుతూ మాడ్లాడారని మండిపడ్డారు. తప్పులు పక్కవాళ్లపైకి తోసేయడం చంద్రబాబుకి అలవాటని దుయ్యబట్టారు. పోలవరం పేరుతో చంద్రబాబు చేసిన అవినీతిని మరిచిపోయారని ఎద్దేవా చేశారు. కేంద్రం పోలవరంపై లెక్కలు అడిగితే బాబు తప్పించుకోలేదా అని ప్రశ్నించారు. బాబు అవినీతి తారస్ధాయికి చేరుకోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ తెగతెంపులు చేసుకోవడం నిజం కాదా అని అవంతి శ్రీవివాస్ నిలదీశారు. ('ఇంకెక్కడి తెలుగుదేశం.. దూరమై ఏడాదైంది') అధికారంలో ఉన్న అయిదేళ్లూ చేసిన అక్రమాలు, దారుణాలు మరిచిపోయారా అని మంత్రి అవంతి శ్రీవివాస్ రావు ధ్వజమెత్తారు. మహానాడు ద్వారా ఓటమిపై విశ్లేషించుకుంటే బాగుండేదన్నారు. ఇప్పటికీ మీరు వ్యవస్ధలను మేనేజ్ చేయడం ద్వారా కుట్ర రాజకీయాలకి పాల్పడ్డారని మండిపడ్డారు. సింగపూర్లా మారుద్దామనుకున్న అమరావతిలో లోకేష్ ఎందుకు ఓడిపోయాడో విశ్లేషించుకోవాలని హితవు పలికారు. సీఎం వైఎస్ జగన్పై, తమ ప్రభుత్వంపై మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ప్రజలు దేశ చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్ధాయిలో 151 సీట్లు తమకు ఎందుకిచ్చారో తెలుసుకోవాలన్నారు. బాబు చేసిన అక్రమాలు, అవినీతి తట్టుకోలేక ప్రజలు తిరస్కరించిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలు కరోనా కష్ట కాలంలో ఉంటే చంద్రబాబు ఎందుకు హైదరాబాద్లో ఉండి పోయారని అవంతి శ్రీవివాస్ ప్రశ్నించారు. చంద్రబాబు తన మైండ్ సెట్ మార్చుకోవాలని చెప్పారు. విశాఖలో ఒక్క గజం స్ధలం అవినీతి, భూ కుంభకోణం జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని, జరగకపోతే బాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పేదలకి ఇళ్ల స్ధలాలు ఇస్తుంటే బాబుకు ఎందుకు బాధని అవంతి శ్రీవివాస్ మండిపడడ్డారు. -
ప్రభుత్వానికి కంపెనీకంటే ప్రజలే ముఖ్యం
-
వారికి ఉచితంగా కోవిడ్ పరీక్షలు
సాక్షి, విశాఖపట్నం: సిటీలో మే 3 వరకు కంటోన్మెంట్ జోన్లో నిబంధనలు అమలవుతాయని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల కొనుగోళ్లు అమ్మకాలకి ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.కూరగాయలు అత్యవసరమైతే స్విగ్గీ ద్వారా అందించే సదుపాయం సిటిలో అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఇప్పటి వరకు 11,330 మందికి కరోనా పరీక్షలు నిర్వహించడం జరిగిందని వారిలో 22 మందిలో పాజిటివ్ లక్షణాలు ఉన్నాయన్నారు. ఛాతి ఆసుపత్రిలో శాంపిల్స్ పరీక్షిస్తున్నామని పాజిటివ్ వస్తే గీతం మెడికల్ కాలేజీకి వారిని తరలిస్తున్నామని అవంతి పేర్కొన్నారు. ఇప్పటి వరకు 11,265 మెడికల్ కిట్లు వచ్చాయని, అదనంగా ఇంకో 16 వేల ర్యాపిడ్ టెస్ట్ కిట్లు తెప్పిస్తున్నామని చెప్పారు. అత్యవసర సేవలు అందిస్తున్న ప్రతి ఉద్యోగికి ఉచితంగా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నమన్నారు. రెవిన్యూ, మీడియా ప్రతినిధులు తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని అవంతి సూచించారు. (కరోనా పరీక్షలు చేయించుకున్న విశాఖ ఎంపీ) -
టీడీపీ నేతలు ఇళ్లలో కూర్చుని...
-
ఒక కేసు దాచి వుంచినట్లు రుజువు చేస్తే...
-
‘కంటైన్మెంట్ జోన్ను కర్ఫ్యూ గా భావించొద్దు’
సాక్షి, విశాఖపట్నం: నగరంలోని అక్కయ్యపాలెం కంటైన్మెంట్ జోన్ లో అధికారులతో కలిసి మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, కలెక్టర్ వినయ్ చంద్ పర్యటించారు. ప్రజలతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువుల సరఫరాపై మంత్రులు ఆరా తీశారు. కంటైన్మెంట్ జోన్లో నిత్యావసరాల సరఫరాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. జిల్లాలోని ఏడు కంటైన్మెంట్ జోన్లలోని ఏడున్నర లక్షల జనాభాకి ఇంటికే సరుకులు అందిస్తున్నామని మంత్రులకు అధికారులు వివరించారు. (జీవితాలు, ఆర్థికం రెండూ ముఖ్యమే: ప్రధాని మోదీ) మీడియాను ఇబ్బంది పెట్టకూడదు.. ఈ సందర్భంగా మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కంటైన్మెంట్ జోన్లలో ప్రజలను ఇళ్లలోంచి బయటకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా ప్రత్యేకంగా మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వాలంటీర్ల ద్వారా ప్రజలకు ఇంటికే సరుకులు అందిస్తున్నామని చెప్పారు. బారికేడ్లు ఏర్పాటు చేసినా అంబులెన్స్లు తిరగడానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించామని పేర్కొన్నారు. కవరేజ్ కోసం వచ్చే మీడియాని ఇబ్బంది పెట్టకూడదని పోలీసులను ఆదేశించామన్నారు. లాక్ డౌన్ సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారని తెలిపారు. (ప్రధాని సూచించే వ్యూహంతో ముందుకు సాగుతాం) మరోమారు ఇంటింటి సర్వే.. ‘‘కరోనా నివారణకు క్షేత్ర స్థాయిలో జిల్లాలో అన్ని విభాగాల అధికారులు బాగా పని చేస్తున్నారు. కేసులు పెరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడంపై అధికారులను అభినందిస్తున్నాం. రేషన్ కార్డులు లేని పేదలకి 15 రోజులకు సరిపడా నిత్యవసర సరుకులు సరఫరా చేస్తాం. కంటైన్మెంట్ జోన్ అంటే కర్ఫ్యూ గా భావించొద్దు. ప్రజలు సహకరిస్తేనే కరోనాను తరిమికొట్టగలం. కంటైన్ మెంట్ జోన్ లో గర్భిణీలు ఎంత మంది ఉన్నారో సర్వే చేసి వారికి వైద్య సేవలు అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులని ఆదేశించాం. కంటైన్మెంట్ జోన్ పరిధిలో మరోమారు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని’’ మంత్రులు పేర్కొన్నారు. ఇంటింటి సర్వే లో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే.. వారికి పరీక్షలు చేస్తామన్నారు. కంటైన్మెంట్ జోన్ లో ప్రజలకి అందుబాటులో ముఖ్యమైన ఫోన్ నెంబర్లు ఉంచామని చెప్పారు. ఫోన్ చేసిన వెంటనే వాలంటీర్లు వారికి కావలసిన సరుకులు సరసమైన ధరలకే తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. విశాఖలో ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్న నలుగురిని డిశ్చార్జ్ చేశామని.. మరో 16 మంది కోలుకునేందుకు చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. కరోనా నివారణ కోసం ఏర్పాటు చేసిన 23 బృందాలు సమర్థవంతంగా పని చేస్తున్నాయని తెలిపారు. కంటైన్మెంట్ జోన్ లో ఇంటింటి సర్వే కోసం ప్రతి వంద మంది కి ఒక బృందం ఏర్పాటు చేశామని మంత్రులు పేర్కొన్నారు. -
నిరుపేదలకు ఆహారం అందించిన మంత్రి
-
జర్నలిస్టులు విశేష సేవలు అందిస్తున్నారు
-
రెండు రోజులలో కరోనా నిర్దారణ ల్యాబ్ ఏర్పాటు
-
ప్రజల సహకారం అవసరం
-
కరోనాపై అతి భయం, నిర్లక్ష్యం వద్దు: మంత్రి
సాక్షి, విశాఖపట్నం: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అతిగా భయపడోద్దని, అదే విధంగా అజాగ్రత్తగా కూడా ఉండొద్దని మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చారించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుండా చెందకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైల్వే,బస్సు స్టేషన్లలో స్కీనింగ్ నిర్వహించే విధంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పాడేరు, అరుకులో ఐసోలేషన్ వార్డులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. అంతేగాక ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. కరోనాపై పోలీస్ శాఖ అప్రమత్తం ఇక కరోనా వైరస్ నిర్ధారించే యంత్రం కేజిహెచ్ను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వివిధ రూపాల్లో ప్రజలకు అవగాహన కార్యాక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు కరోనా బారిన పడకుండా వ్యక్తిగతంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ.. నిన్న(బుధవారం) విశాఖ ఎయిర్పోర్టుకు వచ్చిన 185 మంది ప్రయాణికులకు కూడా హూమ్ క్వారంటైన్లో ఉంచుతున్నామని చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారమే కరోనా లక్షణాలు లేని వారిని వాళ్ళ ప్రాంతాలకు పంపిస్తున్నామన్నారు. ఇక ప్రస్తుతం జిల్లాలో ఆరు అనుమానిత కేసులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. (శానిటైజర్ తయారీకి కావాల్సినవి..) అలాగే విశాఖ పోర్టు చైర్మన్ కె. రామ్మోహనరావు కరోనా పై విశాఖ పోర్టులో అప్రమత్తంగా ఉన్నామన్నారు. ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి 59 నౌకలు విశాఖ తీరానికి వచ్చాయని, ఆ నౌకలలో సిబ్బందికి ప్రత్యేకంగా వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నౌకలు విశాఖ తీరానికి చేరుకోవడానికి 15 నాటికల్ మైళ్ల దూరం ముందే మాకు సమాచారం వస్తుందని, అందులో పనిచేస్తున్న విదేశీ సిబ్బందులేవరినీ బయటకి రాకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. షిప్లోని సిబ్బంధికి తామే ఆహారం అందిస్తున్నామని,ఇప్పటివరకు దాదాపు 1270 మంది సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా ప్రభావం లేదని నిర్ధారించికున్నామన్నారు. (కరోనా నివారణకు ఢిల్లీ కమిషనర్ ఆదేశాలు) చైనా, సింగపూర్ తదితర ప్రభావిత దేశాల నుంచి వచ్చిన 8 నౌకలను కూడా పూర్తిగా పరీక్షించామని, కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలుమేరకు కరోనాపై నిరంతరం అప్రమత్తత కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఇక వైద్య పరీక్షల నిమిత్తం పది మంది సిబ్బంది చొప్పున మూడు వైద్య బృందాలను ప్రత్యేకంగా స్క్రీనింగ్ నిర్వహించడానికి ఏర్పాటు చేశామన్నారు. వైద్య పరీక్షల తర్వాతే పోర్టులో లోడింగ్, అన్ లోడింగ్ చేస్తున్నామని, గతంలో షిప్లో అన్ లోడింగ్కు రెండు , మూడు రోజుల సమయం పట్టేదని.. ఇపుడు వైద్య పరంగా తీసుకుంటున్న జాగ్రత్తలతో వారం రోజుల వరకు సమయం పడుతోందని ఆయన అన్నారు. (తల్లి.. బిడ్డలు.. మధ్య కరోనా!) -
రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి
-
వైఎస్సార్సీపీ అభ్యర్ధుల ప్రకటన
-
జీవీఎంసీ ఎన్నికలు: వైఎస్సార్సీపీ రెండో జాబితా
సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 54 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు జీవీఎంసీ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల పేర్లను పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్, వైఎస్సార్సీపీ నేత దాడి వీరభద్రరావు శుక్రవారం ప్రకటించారు. (తొలి జాబితా కోసం క్లిక్ చేయండి) వైఎస్సార్సీపీ జీవీఎంసీ అభ్యర్థుల రెండో జాబితా విశాఖ నార్త్- డివిజన్లు 14వ డివిజన్ - కె.అనిల్కుమార్ 24వ డివిజన్ - పద్మారెడ్డి 26వ డివిజన్ - పీలా వెంకటలక్ష్మి 43వ డివిజన్ - పెద్దిశెట్టి ఉషశ్రీ 45వ డివిజన్ - కంపా హొనాక 48వ డివిజన్ - నీలి తిరుమలాదేవి 50వ డివిజన్ - వావిలాలపల్లి ప్రసాద్ 51వ డివిజన్ - రెయ్యి వెంకటరమణ 54వ డివిజన్ - చల్లా రజిని 55వ డివిజన్ - శశికళ విశాఖ ఈస్ట్- డివిజన్లు 10వ డివిజన్ - బొండా మాధవి 12వ డివిజన్ - అక్రమాని పుష్ప 17వ డివిజన్ - గేదెల లావణ్య 19వ డివిజన్ - సురడా వెంకటలక్ష్మి విశాఖ వెస్ట్- డివిజన్లు 56వ డివిజన్ - అదాటి శ్రీనివాసరావు 58వ డివిజన్ - జి.లావణ్య 59వ డివిజన్ - పూర్ణశ్రీ 61వ డివిజన్ - దాడి సూర్యకుమారి 62వ డివిజన్ - పల్లా లక్ష్మణరావు 63వ డివిజన్ - పిలకా రామ్మోహన్రెడ్డి 89వ డివిజన్ - దొడ్డి కిరణ్ 90వ డివిజన్ - చుక్కా ప్రసాద్రెడ్డి 41వ డివిజన్ - వై.ఫాతిమా రాణి విశాఖ సౌత్- డివిజన్లు 30వ డివిజన్ - పి.జ్యోతి. 34వ డివిజన్ - జి.గౌరి 36వ డివిజన్ - కె.స్వర్ణలత 39వ డివిజన్ - కొల్లి సింహాచలం భీమిలి 1వ డివిజన్ - అక్రమాని పద్మ 2వ డివిజన్ - సిహెచ్.కరుణాకర్రెడ్డి 3వ డివిజన్- ఎం.భారతి 4వ డివిజన్- ఏడుకొండలరావు 5వ డివిజన్- పి.వెంకటరమాదేవి 6వ డివిజన్ - డా.ప్రియాంక 7వ డివిజన్ - పోతుల లక్ష్మీ 98వ డివిజన్ - వై.వరాహ నరసింహం 65వ డివిజన్ - బి.నరసింహ పాత్రుడు 66వ డివిజన్- మహమ్మద్ ఇమ్రాన్ 70వ డివిజన్ - వి.రామచంద్రరావు 71వ డివిజన్- ఆర్.రామారావు 73వ డివిజన్ - బి.సుజాత 74వ డివిజన్ - టి.వంశీరెడ్డి 75వ డివిజన్- కె.భారతి 76వ డివిజన్ - బి.రమణ 78వ డివిజన్- జి.గోవిందరాజు 86వ డివిజన్- బి.సుబ్బారావు 87వ డివిజన్- పి.విజయలక్ష్మి పెందుర్తి 93వ డివిజన్- డి.అప్పలరాజు 94వ డివిజన్-ఎ.మురళీకృష్ణ 97వ డివిజన్ - జి.వెంకటలీలావతి 84 డివిజన్- పి.యశోద అనకాపల్లి 80వ డివిజన్ - కె.నీలిమ 81వ డివిజన్- పి.లక్ష్మీసౌజన్య 82వ డివిజన్- ఎం.సునీత 83వ డివిజన్ - జె.ప్రసన్నలక్ష్మి -
జీవీఎంసీ ఎన్నికలు: వైఎస్సార్సీపీ తొలి జాబితా
సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 48 మంది అభ్యర్థులతో కూడిన తొలిజాబితాను విడుదల చేసింది. ఈ మేరకు జీవీఎంసీ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల పేర్లను పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్, వైఎస్సార్సీపీ నేత దాడి వీరభద్రరావు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ... జీవీఎంసీ ఎన్నికల్లో కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జీవీఎంసీ వైస్సార్సీపీ అభ్యర్థుల తొలి జాబితా విశాఖ నార్త్ 44వ డివిజన్ - శ్రీనివాసరావు 25వ డివిజన్ - లీలావతి విశాఖ నార్త్ 46వ డివిజన్ - కె.సతీష్ 49వ డివిజన్ - అల్లు శంకరరావు విశాఖ ఈస్ట్ 9వ డివిజన్ - కె.స్వాతి 11వ డివిజన్- హరికుమార్ 15వ డివిజన్ - ఎన్.రేవతి 18వ డివిజన్ - ధనలక్ష్మి 20వ డివిజన్ - ఎన్.లక్ష్మి 21వ డివిజన్ - వంశీకృష్ణ 22వ డివిజన్- పి.గోవింద్ 23వ డివిజన్- జి.విజయసాయి 52వ డివిజన్ - జి.శ్రీధర్ 60వ డివిజన్ - డీవీ సురేష్ 91వ డివిజన్ - జ్యోత్స్న 92వ డివిజన్ - స్వర్ణలత శివదేవి విశాఖ వెస్ట్ 40వ డివిజన్ - నాగేశ్వరరావు, విశాఖ సౌత్ 27వ డివిజన్ - సర్వేశ్వర్రెడ్డి 29వ డివిజన్ నారాయణరావు 31వ డివిజన్ - బత్తిన నాగరాజు 32వ డివిజన్ రామరెడ్డి 33వ డివిజన్ - బచ్చినపల్లి లక్ష్మి 35వ డివిజన్ కనకనాథ్రెడ్డి 37వ డివిజన్ - వడ్డాది రాజు 38వ డివిజన్ - సత్యరూప వాణి *మిగిలిన అభ్యర్థుల పేర్లను త్వరలోనే వెల్లడిస్తారు. -
విశాఖలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ వేడుకలు
సాక్షి, విశాఖపట్నం: ఎన్నో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబడ్డారని.. టీడీపీతో కాంగ్రెస్ కుమ్మక్కై ఇబ్బందులు పెట్టినా వెనకడుగు వేయకుండా ప్రజల అండతో ముందుకు సాగారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.విశాఖ వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో మంత్రి అవంతి శ్రీనివాసరావు, దాడి వీరభద్రరావు, నగర అధ్యక్షులు వంశీకృష్ణ, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు ఎస్ ఏ రెహ్మాన్, చింతలపూడి వెంకటరామయ్య, తైనాల విజయ్ కుమార్, వెస్ట్ కన్వీనర్ మళ్ల విజయ ప్రసాద్, ప్రేమ్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాభినందనలు తెలిపారు. టీడీపీ కుట్రలను ఎదుర్కొని సీఎం జగన్ ప్రజల మన్ననలు పొందారని చెప్పారు. కార్యకర్తల కృషి వల్లే విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. పాదయాత్ర ద్వారా వైఎస్ జగన్ ప్రజల సమస్యలను తెలుసుకుని.. ప్రజల మన్ననలు పొంది అధికారంలోకి వచ్చామని తెలిపారు. (పదో వసంతంలోకి వైఎస్సార్ సీపీ, సీఎం జగన్ ట్వీట్) పేదల ప్రయోజనాలు కాపాడుతున్నాం.. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పేదల ప్రయోజనాలు కాపాడుతున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్ ముందుకెళ్తున్నారన్నారు. 9 నెలల పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుత పథకాలు ప్రవేశపెట్టామన్నారు. అమ్మఒడి, పేదలకు ఇళ్ల పట్టాలు వంటి సంక్షేమ పథకాలు చేపట్టామని పేర్కొన్నారు. బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. అన్ని వర్గాలను విజయపథం వైపు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతోనే సీఎం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని.. ప్రజల ఆమోదంతో తీసుకున్న నిర్ణయాన్ని ఏ శక్తి ఆపలేదని ఆయన స్పష్టం చేశారు. (బెస్ట్ సీఎం వైఎస్ జగన్) వైఎస్సార్సీపీ అత్యంత శక్తివంతంగా అవతరించింది.. 151 సీట్లలో గెలిచి వైఎస్సార్సీపీ అత్యంత శక్తివంతమైన పార్టీగా అవతరించిందని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రతి విషయాన్ని రెఫరెండం అనడం సరికాదన్నారు. ‘‘విశాఖ సిటీలోనే పేదలకు లక్షా 52వేల ఇళ్ల స్థలాలు కేటాయించాం. గతంలో ఏ సర్కార్ చేయని పనులు మా ప్రభుత్వం చేస్తోంది. వైఎస్సార్సీపీ నైతిక విలువలను పాటిస్తుంది. మా పార్టీలోకి రావాలంటే పదవులకు రాజీనామా చేయాలని’ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ అరాచకం సృష్టిస్తోంది.. అవినీతికి, అనైతికతకు మారు పేరుగా చంద్రబాబును అభివర్ణించారు. టీడీపీ నేతలు రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు దురుద్దేశంతోనే మాచర్ల వెళ్లారని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. బుద్దా వెంకన్న, బోండా ఉమ గొడవలు సృష్టించడానికే వెళ్లారని ఆరోపించారు. జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నేడు 48 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన మేయర్, డిప్యూటీ మేయర్, జడ్పీచైర్మన్,వైస్ చైర్మన్ పేర్లను ఎన్నికల అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటిస్తారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నేడు 48 స్థానాలకు జీవీఎంసీ అభ్యర్థులను ప్రకటిస్తామని.. మిగిలిన స్థానాలను రేపు(శుక్రవారం) ప్రకటిస్తామని తెలిపారు. ప్రజలు ఆనందంగా ఉండాలన్నదే లక్ష్యం: అవంతి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలన్నదే వైఎస్సార్సీపీ లక్ష్యమని మంత్రి అవంతి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ పార్టీ పెట్టి ఉండకపోతే రాష్ట్రంలో బడుగు వర్గాలు అనాథలయ్యేవారన్నారు. రాజ్యసభకు బడుగు వర్గాలకు చెందిన ఇద్దరిని పంపించారని తెలిపారు. చంద్రబాబు.. వర్ల రామయ్యకి గెలిచేటప్పుడు టిక్కెట్ ఇవ్వకుండా ఓడిపోయేటప్పుడు టిక్కెట్ ఇచ్చారని అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. -
వైభవంగా అరకు ఉత్సవాలు
-
‘అరకు.. ప్రకృతి ప్రసాదించిన వరం’
సాక్షి, విశాఖపట్నం: అరకు ప్రకృతి ప్రసాదించిన వరమని, ఆంధ్రప్రదేశ్లో అరుకు ఉండటం మన అదృష్టమని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. అరకు ఉత్సవాలను మంత్రి అవంతి శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే చెట్టిఫాల్గుణ, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, టూరిజం ఎండీ ప్రవీణ కుమార్, పాడేరు ఐడీడీఏ పీవో బాలాజీ, పాడేరు సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా అవంతి శ్రీనివాస్ సాంప్రదాయ ఉత్పత్తులు, ఆహార వంటకాల స్టాల్స్ను ప్రారంభించారు. (ముగిసిన సీఎం జగన్, ముకేష్ అంబానీ భేటీ) ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అరకు అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. డాక్టర్లు రాని పాడేరుకు ఏకంగా మెడికల్ కాలేజీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గిరిజనులు గొప్పగా దీవించాలన్నారు. ప్రజలు ముఖ్యమంత్రిని కావాలనుకుంటే త్వరలో విశాఖలోనే అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలను సమ్మక్క-సారక్క ఉత్సవాల తరహాలో నిర్వహిస్తామని తెలిపారు. గిరిజనులు దేవతగా భావించే కొండలను కాపాడుతూ బాక్సైట్ తవ్వకాల అనుమతులను సీఎం జగన్ రద్దు చేశారని ఆయన గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి గిరిజనులే పునాదులాన్నారు. పులకింతల అరకు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. గిరిజన సంప్రదాయాలను గౌరవిస్తూ పర్యాటక అభివృద్ధికి తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. అరకు ఉత్సవాలు గిరిజన సంస్కృతికి ఇచ్చే ప్రోత్సాహకమని ఆమె తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంత అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని భాగ్యలక్ష్మి కొనియాడారు. బాక్సైట్ తవ్వకాల జీవో 97 రద్దు, పాడేరులో మెడికల్ కాలేజీ ఏర్పాటు, సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, కురుపాంలో ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేశారని ఆమె తెలిపారు. కుదరకపోయినా ఓ కప్పు అరకు ఎమ్మెల్యే చెట్టిఫాల్గుణ మాట్లాడుతూ.. అరకు ఉత్సవాలతో మన్యానికి అందం వచ్చిందన్నారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని తెలిపారు. అరకు పరిసరాల్లో ఉన్న ఎన్నో జలపాతాలను అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. తనకు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్లో ప్రెగ్నెన్సీ ఉమెన్ హాస్టల్ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు. ఆంధ్రా ఊటి అరకు -
ఉత్తరాంధ్ర ప్రజలను బాబు అవమానిస్తున్నారు
-
ధీమా పెంచిన దీవెన
సాక్షి, విశాఖపట్నం: జగనన్న వసతి దీవెన! ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు తలపెట్టిన నవరత్నాల్లో ఇదొక హామీ! విద్యార్థుల ఉన్నత విద్యోన్నతే ఆయన ఉద్దేశం! ఒక్కరైనా ఉన్నత స్థాయికి ఎదిగితే వారి కుటుంబానికెంతో వెలుగు! పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటికే ‘అమ్మ ఒడి’ అమలైంది. వాస్తవానికి ఉన్నత విద్యాకోర్సులు చదివే వారికే వసతి, భోజన ఖర్చుల నిమిత్తం రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తానని పాదయాత్రలోనే జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. తద్వారా జిల్లాలో 1,05,709 మందికి లబ్ధి చేకూరుంది. వారికి జగనన్న వసతి దీవెన కార్డుల పంపిణీ కార్యక్రమం జిల్లాలో సోమవారం అధికారికంగా ప్రారంభమైంది. గ్రామ, వార్డు వలంటీర్లు మంగళవారం నుంచి ఇంటింటికీ వెళ్లి అందించనున్నారు. వారి తల్లుల బ్యాంకు ఖాతాలో మొత్తం రూ.99.26 కోట్లు జమ అయ్యింది. జగనన్న విద్యాదీవెన పథకం కింద అర్హులైన విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ (ఆర్టీఎఫ్) వర్తిస్తుంది. ఇక జగనన్న వసతిదీవెన పథకం విషయానికొస్తే ప్రతి విద్యారి్థకీ భోజనం, వసతి ఖర్చుల కోసం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం ఏటా రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ కోర్సును బట్టి అందిస్తుంది. తొలి విడతలో 6,802 మంది ఐటీఐ విద్యార్థులకు రూ.5 వేల చొప్పున రూ.3.40 కోట్లు, అలాగే 12,179 మంది పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.7,500 చొప్పున రూ.9.13 కోట్లు, డిగ్రీ ఆపై ఉన్నత విద్యాకోర్సులు చదివే 86,728 మంది విద్యార్థులకు రూ.10 వేల చొప్పున రూ.86.73 కోట్ల మేర వారి తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. జిల్లావ్యాప్తంగా సందడి... భీమిలి మినహా జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ సోమవారం జగనన్న వసతి దీవెన కార్డుల పంపిణీ కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది. విశాఖ నగర పరిధిలోని తూర్పు, దక్షిణ, ఉత్తర, పశి్చమ, గాజువాక నియోజకవర్గాల పరిధిలోని విద్యార్థులకు కార్డుల అందజేత కార్యక్రమాన్ని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు డీవీ రమణమూర్తి అధ్యక్షతన గురజాడ కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సృజన, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, వైఎస్సార్సీపీ నగర పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ ధ్యేయం అక్షరాంధ్రప్రదేశ్.. బీచ్రోడ్డు(విశాఖ తూర్పు): రాష్ట్రాన్ని అక్షరాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో సోమవారం ‘జగనన్న వసతి దీవెన’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ‘దీవెన’ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాష్ట్రం పేరు మొదట్లో ఉంటుందని.. చదువులో కూడా అదేస్థానంలో ఉండేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దేశంలో ఇంటర్ పూర్తి చేసి ఉన్నత చదువులకోసం 30 శాతం మంది వెళ్తుంటే.. మన రాష్ట్రంలో 25 శాతం మంది మాత్రమే వెళ్తున్నారన్నారు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. విద్యార్థి తనకు నచ్చిన కోర్సును ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసేలా ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో అమ్మవడి కోసం రూ.6500 కోట్లు, జగనన్న విద్య, వసతి దీవెన కోసం రూ.600 కోట్లు, ‘నాడు–నేడు’ కోసం రూ.7000 కోట్ల మేరకు బడ్జెట్ కేటాయించామన్నారు. బడ్జెట్లో నాలుగోవంతు విద్య కోసం కేటాయిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. పారీ్టలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల్ని అందిస్తున్నామని చెప్పారు. విద్య, వైద్యాన్ని పేదలకు చేరువచేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు అన్నారు. విశాఖను రాజధాని చేయాల్సిందే... అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది నేతలు రాజకీయం చేస్తున్నారని ఇది సరికాదని మంత్రి ముత్తంశెట్టి ఈ సందర్భంగా చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పథంలో ప్రయాణించాలంటే విశాఖను రాజధానిగా చేయడమే సరైనదని ఆయన అన్నారు. ఆ సమయంలో విశాఖను రాజధానిగా చేయాలని.. నినదిస్తూ సభా ప్రాంగణం హోరెత్తింది. భారం తగ్గించారు... మాకు ఇద్దరు అమ్మాయిలు. మొదటి అమ్మాయి సుప్రియను అతికష్టం మీద కళాశాలలో చదివిస్తున్నాం. రెండో అమ్మాయి చదువు సంగతి ఏమిటి.. అని ఆలోచిస్తున్న సమయంలో జగనన్న ఈ పథకంతో మాకు గొప్పభరోసా కలి్పంచారు. ఈ భరోసాతోనే ఈ ఏడాది రెండో అమ్మాయిని కళాశాలలో చేర్పించాం. ఆర్థికభారం లేకుండా ఇద్దరి ఆడపిల్లల్ని చదివించగలుగుతున్నామంటే అది సీఎం వైఎస్జగన్ చలవే. రుణపడి ఉంటాం. – పినిశెట్టి దేవి గొప్ప పథకం... వసతి దీవెన మా లాంటి కుటుంబాలకు చాలా ఉపయోగపడుతుంది. ఒక గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాకు ధైర్యాన్ని అందించారు. చదువుకోవాలని ఆకాంక్ష ఉంటే చాలు. ఇలాంటి ప్రభుత్వాల వలన ప్రజలకు మేలు జరుగుతుంది. హ్యాట్సాఫ్ టు జగనన్న. – కొల్లి కుమారి ఉన్నత చదువుకు.. నాడు ముఖ్యమంత్రి గా రాజశేఖరరెడ్డి చదువులకు రీయింబర్స్మెంట్ ఇచ్చి ప్రోత్సహిస్తే నేడు ఆయన కుమారుడు జగన్మోహనరెడ్డి హాస్టల్ ఖర్చులను సైతం ప్రోత్సాహంగా అందించి చదువును మరింతగా ప్రోత్సహించడం నిజంగా గొప్ప విషయం. మా అబ్బాయి పాలిటెక్నికల్ చదువుతున్నాడు. మాకు ట్రెజరీ నుంచి మెసేజ్ వచ్చింది. – గట్రెడ్డి రాణి, కొత్తకోట -
29 నుంచి ‘అరకు ఉత్సవ్’
సాక్షి, విశాఖపట్నం: గిరిజన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ నెల 29 నుంచి రెండు రోజుల పాటు అరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలోని సర్క్యూట్ హౌస్లో బుధవారం ‘అరకు ఉత్సవ్–2020’ పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అరకు ప్రాంతం పర్యాటకంగా ఎంతో ప్రాధాన్యత పొందిందని, ఈ ఉత్సవాల ద్వారా దేశ విదేశాలకు చెందిన మరింతమంది పర్యాటకులను ఆకర్షించేందుకు తగిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ ఉత్సవాలకు నోడల్ అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్ వ్యవహరిస్తారన్నారు. ఏజెన్సీలోని యువత ఎంతో ఆలోచనాశక్తి కలవారని, వారిలో ఉన్న ప్రతిభ, నైపుణ్యాలను వెలికితీసేందుకు ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెడుతోందని పేర్కొన్నారు. గిరిజన యువతకు పర్యాటక శాఖలో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఈ ఉత్సవాల్లో ఎగ్జిబిషన్ స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, డిపార్ట్మెంట్కు సంబంధించిన స్టాల్స్ 10 వంతున ఉంటాయన్నారు. అడ్వంచర్కు సంబంధించి పారామోటరింగ్ డే ట్రిప్, ఏటీవీ బైక్ రైడ్, రాప్లింగ్, జిప్ సైక్లింగ్, జోర్బింగ్, ట్రెక్కింగ్ తదితర క్రీడలు ఉంటాయన్నారు. ఏపీ ఐటీడీఏ బృందాలచే ట్రైబల్ ఫోక్ డాన్స్లు, క్లాసికల్ డ్యాన్స్లు, మ్యూజికల్ డ్యాన్స్ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. వాటితో పాటు గ్రామీణ క్రీడలైన కోకో, కబడ్డీ, విలువిద్య, వాలీబాల్, రంగోలి పోటీలు ఉంటాయని వివరించారు. పోటీల్లో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లతో పాటు నగదు బహుమతి, మెమొంటోలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు, అరకు ఎమ్మెల్యేలు కె.భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, జేసీ శివశంకర్, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శరగడం చిన అప్పలనాయుడు, పర్యాటక అధికారి పూర్ణిమాదేవి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: చైనా నుంచి క్షేమంగా ఇంటికి..) -
టూరిజం బోటింగ్ పునఃప్రారంభం
సాక్షి, విశాఖ: టూరిజం బోటింగ్ పున:ప్రారంభం అయింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రుషికొండ, హార్బర్ వద్ద నిర్వహిస్తున్న టూరిజం బోటింగ్ను పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదివారం ఉదయం రుషికొండ బీచ్ వద్ద బోటింగ్ను పునఃప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక బోట్లకు అనుమతులు ఇస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. పర్యాటకులకు స్వర్గధామమైన విశాఖలోని రిషికొండలో నాలుగు పర్యాటక బోట్లను మంత్రి ప్రారంభించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. పర్యాటక బోట్ల నిర్వాహకులు నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. స్పీడ్, జెట్ స్కీ బోట్లు, లైఫ్ గార్డుల శిక్షణ, పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు, బీమా సౌకర్యంతో జల విహారాన్ని ప్రారంభించారు. దీంతో పర్యాటకులకు నేటి నుంచి జల విహారం అందుబాటులోకి వచ్చింది. కాగా తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు పడవ ప్రమాదం తర్వాత బోట్ల రాకపోకలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. -
ఆయన నిర్ణయాలు విప్లవాత్మకం..సాహసోపేతం..
సాక్షి, విశాఖపట్నం: మధురవాడ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలను మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన, జేఏసీలు వేణుగోపాల్, శివశంకర్, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, నగర వైఎస్సార్సీపీ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. బొమ్మల కొలువు, పులివేషాలు, తప్పెటగుళ్ళు, డప్పు వాయిద్యాలు, హరిదాసు కోలాహలం తో మధురవాడ శిల్పారామం ప్రాంగణం సందడి గా మారింది. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 8 నెలల పరిపాలన కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. అభివృద్ధిలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం జగన్ ఆలోచన అని చెప్పారు. రాజకీయ లబ్ధికోసం రాజధాని ప్రజలను ప్రతిపక్ష నేత చంద్రబాబు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఉదయం లేచిందే మొదలు రాజకీయం కావాలని.. అదే బాటలో జనసేన అధినేత పవన్కల్యాణ్ కూడా నడుస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబును నమ్మొద్దని..ఆయనది వాడుకుని వదిలేసే నైజం అని..పవన్ను కూడా అలాగే చేస్తారని తెలిపారు. అమరావతి రైతులకు సీఎం జగన్ న్యాయం చేస్తారని వెల్లడించారు. అందరికి నవరత్నాలు.. ప్రజలందరికి నవరత్న పథకాలు అందించాలనే సంకల్పంతో సీఎం జగన్ ఉన్నారని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. సంక్రాంతి పండగ అంటే సంప్రదాయం గా తరతరాలుగా వస్తున్న ఆచారం అని పేర్కొన్నారు. ఆ ఆచారాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రతి ఇంట సంక్రాంతి.. ప్రజలంతా సంతోషంగా ఉండాలని సీఎం జగన్ భావిస్తున్నారని జీవీఎంసీ కమిషనర్ సృజన అన్నారు. ప్రతి ఇంటికి సంక్రాంతి ఆనందాన్ని తీసుకెళ్ళాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తెలిపారు. -
2051 లక్ష్యంగా వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళిక
సాక్షి, విశాఖపట్నం: 2051 లక్ష్యంగా దృక్పథ ప్రణాళిక సిద్ధం చేయడానికి విశాఖపట్నం మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) కసరత్తు ప్రారంభించింది. గురువారం నిర్వహించిన వీఎంఆర్డీఏ స్టేక్ హోల్డర్స్ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ,అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు రమణమూర్తి రాజు,నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు, జీవీఎంసీ కమిషనర్ సృజన, విశాఖ నార్త్ కన్వీనర్ కె రాజు పాల్గొన్నారు. వీఎంఆర్డీఏ పరిధిలో సూక్ష్మస్థాయి నుంచి పరిశీలన చేసి అభివృద్ధి చేయడంతో పాటు పాలసీ ఫ్రేమ్ వర్క్పై దృష్టి పెట్టానున్నారు. దృక్ఫథ ప్రణాళిక రెండేళ్లలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. మూడు రీజియన్ల ఫీడ్బ్యాక్తో ఆర్థిక వృద్ధికి పెద్దపీట,రాష్ట్ర విధానాలకు అనుగుణమైన నిర్మాణాత్మక ప్రణాళిక, సీఆర్జెడ్ రెగ్యులేషన్స్ పరిధిలో రెజీలియంట్ టెక్నాలజీలపై సమావేశంలో చర్చించారు. భావనపాడు,నక్కపల్లి, భీమిలిపట్నంలో వచ్చే గ్రీన్ఫీల్డ్ పోర్టులపై సమావేశంలో ప్రస్తావన కొచ్చాయి. అధికారులు, ప్రజా ప్రతినిధుల నుంచి నిర్మాణాత్మకమైన సలహాలను, సూచనలను వీఎంఆర్డీఏ స్వీకరించింది. -
28న విశాఖలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 28న విశాఖలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశాఖలో రూ.1290 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపనలు చేస్తారని వెల్లడించారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటన తర్వాత తొలిసారిగా విశాఖ వస్తున్న సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతగా 24 కిలోమీటర్ల దూరం మానవహారం నిర్వహిస్తామని పేర్కొన్నారు. విశాఖ ఉత్సవ్లో సీఎం పాల్గొంటారని చెప్పారు. గత ఐదు సంవత్సరాలు గా తాను విశాఖలో ఏ ప్రాపర్టీ విషయంలోనూ తాను అధికారుల పై ఒత్తిడి చేయలేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకునిపోతుందని.. తన పేరు ఉపయోగించుకుని భూముల సెటిల్మెంట్ కోసం ఎవరు వచ్చినా వారిపై క్రిమినల్ కేసులను పెట్టాలని ఆదేశించామన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో విశాఖలో భారీ కుంభకోణం జరిగిందని..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేనే ఉద్యమాలు చేశానని చెప్పారు. విశాఖలో తనకు త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ తప్పా తనకు మరో ఆస్తి లేదన్నారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి వెంచర్ లలో భాగస్వామ్యం పొందే ఆలోచన లేదని స్పష్టం చేశారు. విశాఖ ఉత్సవ్పై సమీక్ష... విశాఖ ఉత్సవ్ పై కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో కలెక్టర్ వినయ్ చంద్, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, శెట్టి పాల్గుణ, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే అదీప్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 25 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు.. కేవలం విద్య మాత్రమే కాకుండా ఉపాధి అవకాశాలను కల్పించాలని వైఎస్ జగన్ ప్రభుత్వ లక్ష్యమని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. గురువారం విశాఖలో ప్రగతి భారత్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, స్కిల్ డెవలప్మెంట్ కమిషన్ చైర్మన్ చల్లా మధుసూదన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మొత్తం 25 ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం ఆలోచన అని పేర్కొన్నారు. తిరుపతి, విశాఖలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్శిటీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. -
‘రాష్ట్ర విభజనకు కారణం అదే..’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమాన అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన చేశారని రాష్ట్ర పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ లు అన్నారు. శుక్రవారం విశాఖలో క్రెడాయ్ ప్రాపర్టీ షో ని ప్రారంభించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రకటనతో ఉత్తరాంధ్ర వాసులతో పాటు రాష్ట్ర ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని...మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఒక్కటే అభివృద్ధి చెందిందని...అందుకే రాష్ట్ర విభజనకు కారణమైందన్నారు. సీఎం నిర్ణయంతో అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకు సమాన స్థాయిలో అందుతాయన్నారు. మూడు రాజధానుల వల్ల ఎటువంటి సమస్యలు రావని...కావాలనే ప్రతిపక్షం ప్రతీ విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తోందని విమర్శించారు. వలసలు ఆగిపోతాయి.. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటుతో రియల్ ఎస్టేట్ రంగంతో పాటు అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని విశాఖ క్రెడాయ్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మూడు రాజధానులు మంచి ఆలోచన అని...సీఎం వైఎస్ జగన్ ప్రకటనను తాము స్వాగతిస్తున్నామని క్రెడాయ్ ప్రతినిధులు అన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వల్ల వెనుకుబాటుతనానికి గురైన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వలసలు ఆగిపోతాయని క్రెడాయ్ ప్రతినిధులు పేర్కొన్నారు.