AP CM YS Jagan Review Meeting On Department Of Urban Development - Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో గుంతలులేని రోడ్లు కనిపించాలి: సీఎం జగన్‌

Published Mon, May 9 2022 12:41 PM | Last Updated on Mon, May 9 2022 6:18 PM

CM YS Jagan Review Meeting On Department Of Urban Development - Sakshi

పట్టణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  సోమవారం సమీక్ష చేపట్టారు.

సాక్షి, అమరావతి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  సోమవారం సమీక్ష చేపట్టారు. మున్సిపల్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ శాఖ పరిధిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించిన సీఎం.. అధికారులు ఇచ్చిన నివేదికలు, ఇతర సమాచారం మేరకు పలు కీలక సూచనలు చేశారు.  


ప్రతి నియోజకవర్గంలో ఎంఐజీ లేఅవుట్లు:
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక ఎంఐజీ లే అవుట్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం వైఎస్‌ జగన్‌.. ఆ లే అవుట్స్‌ ఆదర్శనీయంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఇంకా..
 లే అవుట్స్‌ నియమాలు, నిబంధనలు, ప్రమాణాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి.
 లే అవుట్స్‌ చూసి ఇతరులు స్ఫూర్తిని పొందాలి. 
న్యాయవివాదాలు, ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా క్లియర్‌ టైటిల్స్‌ వినియోగదారులకు ఉండాలి.
జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ (ఎంఐజీ లేఅవుట్స్‌) కోసం ఇప్పటివరకూ 82 అర్బన్‌ నియోజకవర్గాల్లో సుమారు 6791 ఎకరాల గుర్తింపు.
శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, శ్రీ సత్యసాయి, తిరుపతిలో..  864.29 ఎకరాల్లో లే అవుట్‌ పనులు.. మే చివరినాటికి సిద్ధం చేస్తామని వెల్లడించిన అధికారులు.

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ :
తడిచెత్త, పొడిచెత్త, ప్రమాదకర వ్యర్థాలు అంటే ఏంటి? అనే విషమయంపై ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి.
ఏ కలర్‌ డబ్బాలో ఏ చెత్త వేయాలి అనే విషయంపై కరపత్రాలను ప్రతి ఇంటికీ పంచాలి.
ఇప్పటికే 1.12 కోట్ల చెత్త డబ్బాలను పంపిణీచేశామని అధికారులు వివరించారు.
మరో 8 లక్షల చెత్త డబ్బాలను మే 22 నాటికల్లా పంపిణీ చేస్తామన్నారు.
2,426 ఆటోలు ఇప్పటికే క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయి. మిగిలినవి  ఈనెలాఖరు నాటికి అందుబాటులోకి వస్తాయన్న అధికారులు.
1,123 ఈ–ఆటోలు కూడా జూన్‌ నాటికి అందుబాటులోకి వస్తాయి.
గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లు డిసెంబరు నాటికి పూర్తయ్యేలా కార్యాచరణ.

ప్రతి ఇంటికీ ప్రతిరోజూ తాగునీరు:
ప్రతిరోజూ  ప్రతి ఇంటికీ తాగునీరు అందాలి.
దీనిపై సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి.
ఇది జరుగుతోందా? లేదా? అన్నదానిపై ఎప్పటికప్పుడు సమాచారం రావాలి. తద్వారా దీనివల్ల వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

టిడ్కో ఇళ్లపై సమీక్ష:
 గత ప్రభుత్వం రోడ్లు, తాగునీరు, మురుగునీటి శుద్ధిలాంటి లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేకుండా టిడ్కో ఇళ్లు ప్లాన్‌ చేశారు. కానీ, ఈ ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టింది.
పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, తాగునీటికోసం వాటర్‌ ట్యాంకులు, మురుగునీటి శుద్ధి సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది.
మంచి జీవన ప్రమాణాలు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు. 
టిడ్కో ఇళ్ల మీద సుమారుగా..  రూ.5, 500 కోట్లు ఈ మూడేళ్లలో ఖర్చుచేసింది ప్రభుత్వం.

రోడ్లపై దృష్టి:
కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో  రోడ్లపై దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలు. 
ఎక్కడ చూసినా గుంతలులేని రోడ్లు కనిపించాలి. 
► నాడు – నేడు కింద బాగు చేసిన రోడ్లను హైలెట్‌ చేయాలి.
జూన్‌నాటికి రోడ్ల పనులు పూర్తిచేస్తామని అధికారులు.. సీఎం జగన్‌కు వివరణ ఇచ్చారు. 

అమరావతి ప్రాంతంలో పనులపై సీఎం సమీక్ష:
కరకట్ట రోడ్డు విస్తరణ పనులు వేగవంతం అయ్యాయని అధికారులు సమీక్షలో పేర్కొన్నారు.
ఇప్పటికే విద్యుత్‌ స్తంభాలను తొలగించడంతో పనులు వేగవంతం అవుతాయని చెప్పారు.
సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు (ఇ–3)పైన కూడా దృష్టిపెట్టామని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌ అధికారుల క్వార్టర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

విశాఖ మెట్రోరైల్‌ ప్రాజెక్టుపైనా సీఎం సమీక్ష:
  విశాఖ మెట్రోరైల్‌ ప్రాజెక్టు కోసం వనరుల సమీకరణపై చర్చ. 
సమారు 75 కిలోమీటర్ల మేర మెట్రో రైల్‌ ప్రతిపాదనలు.
 మెట్రోరైల్‌ ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశం.
ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులో భాగంగా కోచ్‌ల డిజైన్, దీంతోపాటు స్టేషన్లలో ఉండే సౌకర్యాలు తదితర వివరాలు సమగ్రంగా సమర్పించాలని సీఎం జగన్ ఆదేశం.
 పర్యావరణహిత విధానాలకు పెద్దపీట వేయాలని అధికారులకు సూచన.  

జగనన్న మహిళా మార్ట్‌లపై సీఎం సమీక్ష:
మహిళా స్వయం సహాయక సంఘాలతో నడుస్తున్న మహిళా మార్ట్‌లు. 
► ప్రస్తుతం నడుస్తున్న మహిళా మార్ట్‌లను వివరించిన అధికారులు.
విజయవంతంగా నడుస్తున్నాయన్న అధికారులు.. వీలైనన్ని మహిళా మార్ట్‌లను నెలకొల్పాలని సూచించిన సీఎం జగన్‌.


చదవండి: వెటర్నరీ ల్యాబ్‌ల ఏర్పాటు ఘనత సీఎం జగన్‌దే 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement