urban development
-
మేయర్ అనే కాదు.. మహిళా అని కూడా చూడకుండా..
-
పేదింటికి కేంద్రం చేయూత రెట్టింపు!
సాక్షి, హైదరాబాద్: పట్టణాభివృద్ధి సంస్థల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచటంతో చాలా గ్రామాలు ‘పట్టణ పరిధి’లోకి చేరటంతో పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం ద్వారా కేంద్రం అందించే సాయం రెట్టింపు కానుంది. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గ్రామీణ ప్రాంత యూనిట్ కాస్ట్ రూ.72 వేలుగా ఉండగా, పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్ రూ.1.5 లక్షలుగా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో మూడొంతులకు పైగా గ్రామ పంచాయతీలు పట్టణాభివృద్ధి సంస్థల జాబితాలోకి వెళ్లాయి. గతంలో 9 పట్టణ ప్రాంత అభివృద్ధి సంస్థలు ఉండగా, వాటి సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 28కు పెంచింది. ఫలితంగా వేల సంఖ్యలో గ్రామ పంచాయతీలు ‘పట్టణ’ పరిధిలోకి చేరనున్నాయి. దీంతో వీటికి పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్ ప్రకారం నిధులు అందుతాయి. రెండో దశలోనూ పాత యూనిట్ కాస్ట్లే..చాలా రాష్ట్రాల్లో పేదల ఇళ్ల నిర్మాణ పథకం యూనిట్ కాస్ట్ రూ.2.5 లక్షలుగా ఉంటోంది. పట్టణ ప్రాంతాల్లో కేంద్రం ఒక్కో ఇంటికి రూ.1.5 లక్షలు ఇస్తుంటే, మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే సరిపోయేది. కానీ తెలంగాణ ప్రభుత్వం యూనిట్ కాస్ట్ను రూ.5 లక్షలుగా ఖరారు చేసింది. ఇది రాష్ట్ర ఖజానాపై అతిపెద్ద భారం మోపనుంది. పీఎంఏవై పథకం మొదటి దశ కాలపరిమితి తీరిపోవటంతో, కేంద్రం రెండో దశకు శ్రీకారం చుడుతోంది.ఇందులో పట్టణ ప్రాంత ఇళ్ల యూనిట్ కాస్ట్ను రూ.2.25 లక్షలకు పెంచుతారనే ప్రచారం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన యూనిట్ కాస్ట్లో 45 శాతం కేంద్రమే భరించినట్టవుతుందని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది. కానీ కేంద్రం ఆ యూనిట్ కాస్ట్ను పెంచకుండా, గతంలో ఉన్న రూ.1.5 లక్షలే కొనసాగించాలని నిర్ణయించింది. అలాగే గ్రామీణ ప్రాంత యూనిట్ కాస్ట్ కూడా రూ.72 వేలుగానే ఉంది. గ్రామీణ యూనిట్లకు పట్టణ కాస్ట్ దక్కేలా..కేంద్రం నుంచి గ్రామీణ యూనిట్ కాస్ట్ రూ.72 వేలు మాత్రమే అందితే, ఆ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి కొంతైనా ఊరట దక్కేలా వ్యూహరచన చేసిన ప్రభుత్వం.. సింహ భాగం గ్రామాలకు పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్ (రూ.1.5 లక్షలు) దక్కేలా పట్ణణాభివృద్ధి సంస్థల సంఖ్యను పెంచేసింది. దీంతో ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు ‘పట్టణ’ పరిధిలోకి రానున్నాయి. తద్వారా వాటికి ‘పట్టణ’ యూనిట్ కాస్ట్ ప్రకారం నిధులు అందే అవకాశం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కేవలం గృహనిర్మాణ పథకానికే పరిమితం కాకుండా, కొన్ని ఇతర పథకాలకు కూడా లబ్ధి చేకూర్చనుండటం గమనార్హం.సాయంపై స్పష్టతకు మరింత సమయంరాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన ఆరు నెలల తర్వాత కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అప్పటికే రాష్ట్రంలో పథకాల ప్రకటన జరిగిపోయింది. కేంద్రంలోని కొత్త ప్రభుత్వం పథకాలను సమీక్షించుకుంటూ మార్పు చేర్పులు చేసేసరికి మరింత ఆలస్యం అయింది. ఫలితంగా కేంద్రం నుంచి ఎంత సాయం అందుతుందో రాష్ట్రానికి ఇప్పటికీ స్పష్టత రాలేదు. తాజాగా పట్టణాభివృద్ధి సంస్థల పెంపు నేపథ్యంలో, ఎన్ని పట్టణ ప్రాంత ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనుందో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాల్సి ఉంది.అంటే తాజా నిర్ణయం మేరకు పట్టణ ప్రాంత ఇళ్ల సంఖ్యను తేల్చాల్సి ఉంది. ఆ మేరకు త్వరలో క్షేత్రస్థాయి సర్వే చేసి వివరాలు క్రోడీకరించి కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. కేంద్రం ఎన్ని యూనిట్లను మంజూరు చేస్తుందో ఆ తర్వాతే తేలుతుంది. అప్పుడే కేంద్రం నుంచి వచ్చే సాయంపై స్పష్టత వస్తుంది. కానీ గతంతో పోలిస్తే ఆ సాయం భారీగా పెరుగుతుందని మాత్రం తేలిపోయింది. -
కొత్తగా 13 జిల్లా పట్టణాభివృద్ధి సంస్థలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 13 పట్టణాభివృద్ధి సంస్థలు (అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ఏర్పాటు చేసింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (యూడీఏ)లకు తోడు వనపర్తి, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, నిర్మల్, నాగర్కర్నూల్, మంచిర్యాల, మహబూబాబాద్, కొత్తగూడెం, కామారెడ్డి, కాగజ్నగర్, జోగుళాంబ గద్వాల, ఆదిలాబాద్ జిల్లాల పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం రోడ్ నెట్వర్క్, తాగునీరు, ఉపాధి అవకాశాలు, శాటిలైట్ టౌన్íÙప్ల అభివృద్ధి తదితర మౌలిక సదుపాయాల కల్పన కోసం జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలు, గ్రామాలను ఈ యూడీఏల పరిధిలోకి తీసుకువచ్చారు. వీటితోపాటు కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్, స్తంభాద్రి (ఖమ్మం), మహబూబ్నగర్, వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిని పెంచారు. ఈ మేరకు ఆయా యూడీఏల పరిధిలోనికి వచ్చే మున్సిపాలిటీలు, గ్రామాలను ఈ ఉత్తర్వుల్లో నోటిఫై చేశారు. -
‘ప్రగతి’ బాటలో పొదుపు మహిళ
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంత స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి మహిళా స్వయంశక్తితో ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన తోడ్పాటు సత్ఫలితాలనిస్తోంది. వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం అందించిన నిధులతో అక్క చెల్లెమ్మలు స్వయం ఉపాధి మార్గాలపై దృష్టి పెట్టారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అండగా నిలిచి ‘పొదుపు’ మహిళలకు దిశానిర్దేశం చేస్తోంది. మెప్మా మిషన్ డైరెక్టర్ వి.విజయలక్ష్మి వారికి అవసరమైన శిక్షణ ఇవ్వడంతో పాటు అవసరమైన నిధులను సమకూర్చి విజయం దిశగా ప్రోత్సహిస్తున్నారు గత నాలుగున్నరేళ్లల్లో వివిధ పథకాల ద్వారా 25 లక్షల మంది పట్టణ ప్రాంత పొదుపు సంఘాల్లోని మహిళలతో జగనన్న మహిళా మార్టులు, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్లను నెలకొల్పి అద్భుత ఫలితాలను సాధించారు. దీంతోపాటు మహిళలు తయారు చేసే చేతి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించేందుకు ఈ–కామర్స్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు పొదుపు మహిళలతో పరిశ్రమలు నెలకొల్పేందుకు ‘మెప్మా’ ముందడుగు వేసింది. పర్యావరణహితంగా సరికొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తూ మహిళలతో ‘ప్రగతి యూనిట్లు’ ఏర్పాటు దిశగా కార్యాచరణ చేపట్టారు. ఏ పరిశ్రమ స్థాపించాలి? మూలధనం, శిక్షణ లాంటి అంశాలపై చర్చించేందుకు మెప్మా ఎండీ తాజాగా సంఘాల లీడర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. 25 లక్షల మంది సభ్యులుగా ఉన్న పట్టణ సమాఖ్యలకు చెందిన టీఎల్ఎఫ్ రిసోర్స్ పర్సన్లు, సమాఖ్య అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు (ఆఫీస్ బేరర్స్) దాదాపు 700 మంది పాల్గొన్న ఈ సదస్సులో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోని మహిళా సంఘాలు తీర్మానాలు చేసిన ప్రాజెక్టులపై చర్చించారు. రాష్ట్రంలోని 123 యూఎల్బీల్లోని పట్టణ మహిళా సంఘాలు సంఘటితంగా సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా ఎండీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. 9 పట్టణాల్లోని జగనన్న మహిళా మార్టుల ద్వారా ఆగస్టు వరకు రూ.25 కోట్ల వ్యాపారం చేసినట్లు లబ్ధిదారులు వివరించారు. 110 యూఎల్బీల్లో ప్రతినెలా ఒకరోజు ఏర్పాటు చేసే అర్బన్ మార్కెట్ ద్వారా ఒక్కోచోట సగటున రూ.30 వేల నుంచి రూ.40 వేల దాకా వ్యాపారం చేస్తున్నట్టు తెలిపారు. వీటితోపాటు ఆస్పత్రులు, మార్కెట్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 140 మెప్మా ఆహా క్యాంటీన్ల ద్వారా సంఘాల సభ్యులు ఆదాయం పొందుతున్న తీరును, వాటికున్న డిమాండ్ను సదస్సులో పంచుకున్నారు. వ్యాపారం చేసుకుంటున్నాం గతంలో బ్యాంకు రుణం వస్తే డబ్బులు పంచుకుని ఇంట్లో ఖర్చు చేసేవాళ్లం. ఇప్పుడు బ్యాంకు రుణాలు ఇప్పించడంతోపాటు వ్యాపారం దిశగా ‘మెప్మా’ ప్రోత్సహిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగున్నరేళ్లుగా అన్ని పథకాలు అందుతున్నాయి. బ్యాంకులు మాకు పిలిచి మరీ రుణాలు ఇస్తు న్నాయి. ఈ డబ్బులతో సంఘాల్లోని సభ్యులు తమకు నైపుణ్యం ఉన్న అంశంలో వ్యాపారం చేస్తున్నారు. స్థిరమైన ఆదాయం వస్తోంది. వ్యాపార ఆలోచన ఉంటే మెప్మా శిక్షణనిచ్చి ప్రోత్సహిస్తోంది. – పి.కృష్ణకుమారి, నరసరావుపేట మహిళలకు అండగా సీఎం మహిళా సాధికారత అంటే ఇన్నాళ్లూ మాకు తెలియదు. ఇంటికే పరిమితమైన మమ్మల్ని సీఎం జగన్ ప్రగతి వైపు అడుగులు వేయించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆర్థికంగా ఎదుగుతున్నాం. తిరుపతిలో జగనన్న మహిళా మార్ట్ ఏర్పాటు చేసుకున్నాం. పెద్దపెద్ద మార్ట్లతో పోటీ పడి వ్యాపారంలో లాభాలు పొందుతున్నాం. నవరత్నాల పథకాలను ప్రధానంగా మహిళల కోసమే అమలు చేస్తున్నారు. – ప్రతిమారెడ్డి, తిరుపతి ఆహా క్యాంటీన్తో ఉపాధి గతంలోనూ పట్టణ మహిళా పొదుపు సంఘాలు ఉన్నా పావలా వడ్డీ రుణాలు తప్ప మిగతావి పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక రుణాలు మంజూరు చేయడంతో పాటు అవగాహన ఉన్న రంగంలో వ్యాపారం దిశగా ప్రోత్సహించి ఆదాయ మార్గాన్ని కూడా చూపించింది. మెప్మా ప్రోత్సాహంతో ఆహా క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక్కపూటకు అన్ని ఖర్చులు పోను రూ.1,000 లాభం వస్తోంది. – శ్యామల, అమలాపురం గత ప్రభుత్వంలో మోసపోయాం ఎన్నో ఏళ్లుగా పొదుపు సంఘంలో సభ్యురాలిగా ఉన్నా ఏనాడు ఆర్థికంగా బాగున్నది లేదు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పడంతో సభ్యులు ఎంతో ఆశతో రుణాలు చెల్లించడం ఆపేశారు. దాంతో బ్యాంకు మా సంఘాన్ని డిఫాల్టర్గా ప్రకటించింది. ఈ ప్రభుత్వం వచ్చాక వాటిని చెల్లిస్తూ వ్యాపారం దిశగా ప్రోత్సహించింది. ఇప్పుడు బ్యాంకులు పొదుపు సంఘాలకు రూ.20 లక్షల వరకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. – షేక్ ఫాతిమా, నరసరావుపేట ప్రతి రూపాయీ మాకే.. గత ప్రభుత్వంలో పట్టణ మహిళా పొదుపు సంఘాల పేరుతో చాలా వరకు బోగస్ సంఘాలు ఉండేవి. మాకు రావాల్సిన నిధులు వారికే పోయేవి. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి సంఘాన్ని, ప్రతి సభ్యురాలి వివరాలను ఆన్లైన్ చేశారు. దీంతో బోగస్ సంఘాలు పోయాయి. ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి ఇప్పుడు నేరుగా సంఘాలకే అందుతోంది. శిక్షణనిచ్చి మున్సిపల్ స్థలాల్లో వ్యాపారాలు పెట్టిస్తున్నారు. మమ్మల్ని ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నారు. – మీనాక్షి, విజయవాడ మహిళా సాధికారతే లక్ష్యం మెప్మాలోని సభ్యులు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది. ఇప్పటికే జగనన్న మహిళా మార్టులు, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్ల నిర్వహణతో మహిళలు విజయం సాధించారు. అనుకున్న దానికంటే మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. గతంలో మహిళా పొదుపు సంఘాలకు రుణాలు ఇవ్వాలంటే బ్యాంకులు ఎంతో ఆలోచించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. మహిళల్లో అద్భుతమైన వ్యాపార దక్షత ఉంది. వారు తయారు చేసే చేతి వస్తువులు, ఆహార పదార్థాలను ఈ–కామర్స్ సైట్ల ద్వారా విక్రయించేలా ప్రణాళిక రూపొందించాం. మహిళల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. వారిని మరో మెట్టు ఎక్కించేందుకు మెప్మా ద్వారా తయారీ యూనిట్లు కూడా నెలకొల్పే ఏర్పాట్లు చేస్తున్నాం. ఉచితంగా శిక్షణనిచ్చి ఆర్థిక సాయం చేసి వ్యాపార యూనిట్లు పెట్టిస్తాం. పట్టణ ప్రగతి యూనిట్లు నెలకొల్పే దిశగా సాయం అందిస్తాం. – వి.విజయలక్ష్మి, మెప్మా మిషన్ డైరెక్టర్ -
వీధి కుక్కలన్నింటికీ ‘స్టెరిలైజేషన్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో వీధికుక్కల నియంత్రణ కోసం పకడ్బందీ కార్యాచరణ చేపట్టాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. హైదరాబాద్లోని అంబర్పేట్లో వీధి కుక్కల దాడిలో చిన్నారి ప్రాణం కోల్పోయిన ఘటన కలకలం రేపడం, దీనితోపాటు రాష్ట్రవ్యాప్తంగా కుక్కకాటు ఘటనలు జరుగుతుండటంతో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన ఆదేశాల మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్రవ్యాప్తంగా 129 మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ సహా 13 కార్పొరేషన్లలో చేపట్టాల్సిన చర్యలపై యాక్షన్ ప్లాన్ను రూపొందించింది. ఈ కార్యాచరణకు తగినట్టుగా చర్యలు చేపట్టాలని రాష్ట్రంలోని అన్ని పురపాలికల కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. మార్గదర్శకాలు ఇవీ.. ► అన్ని పట్టణాలు, నగరాల్లో 100 శాతం వీధి కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు (స్టెరిలైజేషన్) చేయాలి. ► వీధికుక్కలకు సంబంధించిన ఫిర్యాదులకు అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా స్పందించాలి. ► కుక్కలను పట్టుకునే బృందాలను, వాహనాల సంఖ్యను పెంచాలి. ► వీధికుక్కలు అధికంగా ఉన్న ప్రాంతాలు, కుక్కకాటు ఘటనలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి స్థానిక కాలనీలు, బస్తీ సంఘాల సహకారంతో చర్యలు చేపట్టాలి. ► మాంసాహార దుకాణాలు, ఫంక్షన్హాల్స్, హాస్టళ్లు ఉన్న చోట మాంసపు వ్యర్థాలను, మిగిలిన ఆహారాన్ని వీధికుక్కలు తిరిగే చోట్ల పడేయకుండా చర్యలు చేపట్టాలి. ► వీధికుక్కల నియంత్రణకు స్వయం సహాయక బృందాలు, పారిశుధ్య సిబ్బంది, మెప్మా సిబ్బంది సేవలను వినియోగించుకోవాలి. ► వీధికుక్కల విషయంలో ఎలా ప్రవర్తించాలనే దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. దీనిపై ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కరపత్రాలను పంపిణీ చేయాలి. ► అన్ని పట్టణాలు, నగరాల్లో ప్రజలను చైతన్యపరచాలి. ► వేసవి కాలంలో వీధికుక్కల ఆగడాలను తగ్గించేందుకు తగిన సంఖ్యలో నీటి తొట్లను ఏర్పాటు చేయాలి. -
పట్టణాభివృద్ధికి నిధులివ్వండి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పట్ట ణాల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, వరంగల్తోపా టు ఇతర మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు లేదా ప్యాకేజీ ఇవ్వాలన్నారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు కేటాయించాలని ఆదివారం ఒక ప్రకటనలో కేంద్రాన్ని కోరారు. పట్టణాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను గుర్తుచేశారు. టీఎస్ బీ పాస్, మున్సి పాలిటీల సంఖ్య పెంపు, పచ్చదనం పెంపునకు 10% బడ్జెట్ కేటాయింపు వంటి అంశాలను ప్రస్తావించారు. హైదరాబాద్లో రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చేపట్టిన ఎస్ఎన్డీపీ, ఎస్ఆర్డీపీ వంటి ప్రాజెక్టులను గుర్తుచేశారు. మెర్సర్ క్వాలిటీ ఇండెక్స్లో వరుసగా ఆరోసారి హైదరాబాద్ అత్యుత్తమ నగరంగా నిలిచిందని, వరల్డ్ గ్రీన్సిటీ అవార్డు లభించింద న్నారు. దేశ గౌరవ, ప్రతిష్టలను విశ్వవేదికలపై సగర్వంగా నిలబెడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన బాధ్యత మోదీ ప్రభుత్వంపై ఉందని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే అయిన నేపథ్యంలో తెలంగాణకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రూ.6,250 కోట్లతో 31 కిలోమీటర్ల మేర నిర్మించే ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో ప్రాజెక్టుకు సూత్రప్రాయ అంగీకారాన్ని తెలిపి, ఆర్థికంగా మద్దతు ఇవ్వాలి. హైదరాబాద్లో 20 కిలోమీటర్ల మేర నిర్మించే మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టంకు ఖర్చయ్యే రూ.3,050 కోట్లలో 15% మూలధన పెట్టుబడిగా రూ.450 కోట్లు కేటాయించాలి. హైదరాబాద్ మెట్రో రైల్కు ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న వయబిలిటీ గ్యాప్ ఫండింగ్లోని రూ.254 కోట్లు విడుదల చేయాలి. హైదరాబాద్సహా ఇతర మున్సిపాలిటీల్లో రూ.3,777 కోట్లు ఖర్చయ్యే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, బయోమైనింగ్ వంటి ప్రాజెక్టుల కోసం కనీసం 20 శాతం అంటే రూ.750 కోట్లు కేటాయించాలి. హైదరాబాద్లో ఎస్టీపీలు, మురుగునీటి సరఫరా నెట్వర్క్కు ఖర్చయ్యే రూ.8,684 కోట్లలో మూడోవంతును కేంద్రం భరించాలి. ఎస్ఎన్డీపీకి రూ.240 కోట్లు కేటాయించాలి. హైదరాబాద్లో పారిశుధ్యం మెరుగు కోసం రూ.400 కోట్ల మేర స్వచ్ఛ్ భారత్ మిషన్ నిధులివ్వాలి. ఎస్ఆర్డీపీ రెండోదశ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, స్కైవేలు తదితరాలకు రూ.3,450 కోట్లు ఇవ్వాలి. హైదరాబాద్లో 104 లింకు రోడ్ల వ్యయంలో మూడోవంతు అనగా రూ.800 కోట్లు కేంద్రం భ రించాలి. జాతీయ రహదారి 65పై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రూ.500 కోట్లు కేటాయించాలి. తెలంగాణ శానిటేషన్ హబ్కు రూ.100 కోట్లు సీడ్ ఫండింగ్ ఇవ్వడంతోపాటు జీహెచ్ఎంసీ మూడో విడత మున్సిపల్ బాండ్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. -
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం
-
పట్టణ సర్వే సిబ్బందికి మరో దఫా శిక్షణ
సాక్షి, అమరావతి: పట్టణాల్లోని ఆస్తుల సమగ్ర సర్వే కోసం పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇచ్చిన మునిసిపల్ అధికారులు నవంబర్ 1 నుంచి సర్వే చేపట్టాలని భావించారు. సర్వే విధానంపై సిబ్బందికి గల అనుమానాలను నివృత్తి చేసేందుకు మంగళవారం 400 మందికి శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రతి యూఎల్బీ నుంచి ముగ్గురు చొప్పున రాష్ట్రంలోని 123 యూఎల్బీల నుంచి సిబ్బంది హాజరు కానున్నారు. సర్వే పనుల కోసం వివిధ విభాగాల అధికారులతో ఇప్పటికే ప్రత్యేకంగా ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్(పీఎంయూ)ను ఏర్పాటు చేయడంతోపాటు, ఆయా కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో సైతం పీఎంయూలను ఏర్పాటు చేయడంతో పాటు పరిపాలనాధికారిని కూడా నియమించారు. మంగళవారం జరిగే శిక్షణలో పీఎంయూ అధికారితో పాటు వార్డు పరిపాలనా కార్యదర్శి, ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొననున్నారు. ప్రజల ఆస్తులను సర్వేచేసి, సరిహద్దులను గుర్తించి హక్కుదారుకు సమగ్రమైన వివరా లతో కూడిన హక్కుపత్రం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్షా పథకం’ ప్రవేశపెట్టింది. మొత్తం 123 యూఎల్బీల్లోను 38 లక్షల ఆస్తులు ఉన్నాయని, సర్వేలో మరో పది శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. వారం, పది రోజుల్లో క్షేత్ర స్థాయి పరిశీలన సర్వేలో ప్రతి వార్డు నుంచి ఆరుగురు సిబ్బంది చొప్పున మొత్తం 20 వేలమంది పాలుపంచుకునేలా చర్యలు తీసుకున్నారు. వారం, పది రోజుల్లో క్షేత్ర స్థాయి సర్వే ప్రక్రియ ప్రారంభించాలని యోచిస్తున్న అధికారులు మ్యాపింగ్, రికార్డుల పరిశీలనలో తలెత్తే సమస్యలపై వివరించనున్నారు. ఇప్పటికే నాలుగు దఫాలుగా వివిధ స్థాయిల్లో వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలతో పాటు ఇతర మునిసిపల్ సిబ్బందికి మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ ఇచ్చారు. ఈసారి వారికి రికార్డుల ప్రకారం ఆస్తుల గుర్తింపు, మునిసిపాలిటీ పరిధి మ్యాపింగ్తో పాటు, ప్రతి వార్డు మ్యాప్, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్, ఆర్ఎస్ఆర్, టీఎస్ఆర్, కేఎంఎల్ ఫైల్స్ పరిశీలనపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 123 నగర, పురపాలక సంఘాల్లో సమీప గ్రామాలు విలీనమయ్యాయి. విలీనమైన వాటిలో 648 రెవెన్యూ గ్రామాలున్నాయి. పకడ్బందీగా సర్వే చేపట్టాలని నిర్ణయించామని పట్టణ ఆస్తుల సర్వే ప్రత్యేకాధికారి సుబ్బారావు ‘సాక్షి’కి తెలిపారు. -
AP: జగనన్న హరిత నగరాలకు శ్రీకారం
సాక్షి,అమరావతి: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాలు పచ్చదనంతో కొత్త శోభను సంతరించుకోనున్నాయి. పర్యావరణ సమతుల్యాన్ని సాధించేందుకు, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ప్రభుత్వం ‘జగనన్న హరిత నగరాలు’కు శ్రీకారం చుట్టింది. మంగళవారం పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడులో దీనికి సంబంధించిన నమూనాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. అక్కడే జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ పైలాన్ను కూడా సీఎం ఆవిష్కరించారు. తొలి విడతలో 45 పట్టణ స్థానిక సంస్థలను(యూఎల్బీ) జగనన్న హరిత నగరాలు కార్యక్రమం కోసం ఎంపిక చేశారు. పచ్చదనం పెంపుతో పాటు వాల్ పెయింటింగ్ తదితర పనులు చేపట్టి.. ఉత్తమ విధానాలను అనుసరించిన 10 పట్టణాలు, నగరాలకు ‘గ్రీన్ సిటీ చాలెంజ్’ కింద రూ.కోటి చొప్పున రూ.10 కోట్లను బహుమతిగా ఇవ్వనున్నారు. ఇందుకు అవసరమైన చర్యలను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖతో పాటు ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ సంస్థలు చేపట్టాయి. రూ.78.84 కోట్లతో పచ్చందం.. మొదటి విడతలో ఉన్న 45 యూఎల్బీల్లోని రోడ్లకు ఇరువైపులా, మధ్యనున్న మీడియన్స్లలో మొక్కలు నాటనున్నారు. ఆయా ప్రాంతాల్లోని మట్టి, వాతావరణం, నీటి వనరుల లభ్యత ఆధారంగా బతికే వివిధ జాతులకు చెందిన 54 రకాల మొక్కలను ఎంపిక చేసి పెంచనున్నారు. రహదారి వెడల్పును బట్టి ఐదు రకాలుగా విభజించి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పచ్చదనం, సుందరీకరణ పనులకు రూ.78.84 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. తొలకరి ప్రారంభం నుంచి ఆగస్టు 12లోగా ఈ పనులు పూర్తి చేయాలని ఆయా మునిసిపాలిటీలకు ఆదేశాలు జారీ చేశారు. మొక్కలు నాటిన అనంతరం పర్యవేక్షణ బాధ్యతను సంబంధిత పట్టణ స్థానిక సంస్థలకు అప్పగిస్తారు. అనంతరం ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్కు చెందిన క్వాలిటీ కంట్రోల్ బృందం 3 నెలలకు ఒకసారి పరిశీలించి.. మొక్కల సంరక్షణకు అవసరమైన సూచనలిస్తుంటుంది. సీఎం పర్యటన సాగిందిలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి.. గుంటూరు చుట్టుగుంట సెంటర్లోని సభావేదికకు చేరుకున్నారు. డాక్టర్ వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా అందజేసిన ట్రాక్టర్లను, హర్వెస్టర్లను జెండా ఊపి ప్రారంభించారు. మధ్యాహ్నం పల్నాడు జిల్లా కొండవీడుకు చేరుకుని జిందాల్ ప్లాంటు సమీపంలో ఏర్పాటు చేసిన ‘జగనన్న హరిత నగరాలు’ నమూనాను ఆవిష్కరించారు. ఆ తర్వాత జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తిరిగి తాడేపల్లికి చేరుకున్నారు. -
తెలంగాణ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్, ఆ ప్రాంతంలోని ఇళ్లకు భారీ డిమాండ్!
సాక్షి, హైదరాబాద్: అర్బన్ డెవలప్మెంట్ మీద ప్రభుత్వం దృష్టిసారించింది. ఓఆర్ఆర్తో జిల్లా కేంద్రాలకు, మెట్రో రైల్తో ప్రధాన నగరంలో కనెక్టివిటీ పెరిగింది. సిటీలో పెద్ద ఎత్తున ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గింది. దీంతో అందుబాటు ధరలు ఉండే శివారు ప్రాంతాలలో సైతం గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆఫీస్లు పునఃప్రారంభం కావటంతో ఇప్పటికే ఉన్న కంపెనీలతో పాటూ కొత్తవి విస్తరణ చేపట్టాయి. దీంతో ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీ పెరిగింది. ఇది రానున్న రోజుల్లో గృహాల డిమాండ్ను ఏర్పరుస్తుందని ఎస్ఎంఆర్ బిల్డర్స్ సీఎండీ రాంరెడ్డి అభిప్రాయపడ్డారు. సాధారణంగా హైదరాబాద్లో ఏటా 30–40 వేల గృహాలు డెలివరీ అవుతుంటాయి. మరో 70–75 వేల యూనిట్లు వివిధ దశలో నిర్మాణంలో ఉంటాయి. అయితే ఈ ఏడాది అదనంగా 1.5 – 2 లక్షల యూనిట్ల అవసరం ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం నగరంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న యూనిట్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపారు. దీంతో నాణ్యమైన నిర్మాణం, పెద్ద సైజు యూనిట్లకు డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమ హైదరాబాద్తో పాటూ షాద్నగర్, శంకర్పల్లి, చేవెళ్ల, ఆదిభట్ల, నాగార్జున్ సాగర్ రోడ్, శ్రీశైలం జాతీయ రహదారి మార్గంలో డిమాండ్ కొనసాగుతుందని వివరించారు. మేడ్చల్, షామీర్పేట మార్గంలో ప్రక్క జిల్లాల పెట్టుబడిదారులు చేపట్టే విక్రయాలే ఉంటాయని తెలిపారు. యాదాద్రిని చూపించి వరంగల్ రహదారి మార్కెట్ను పాడుచేశారని పేర్కొన్నారు. ► నిర్మాణ సంస్థలు ఒకరిని మించి మరొకరు ఆకాశహర్మ్యాలు అని ఆర్భాట ప్రచారానికి వెళ్లకూడదు. అంత ఎత్తులో ప్రాజెక్ట్ను చేపట్టే ఆర్థ్ధిక స్థోమత, సాంకేతికత, సామర్థ్యం ఉన్నాయా అనేది విశ్లేషించుకోవాలి. అంతే తప్ప పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు తొందరపాటు గురైతే తనతో పాటు కొనుగోలుదారులూ నిండా మునిగిపోతారు. నిర్మాణ అనుమతులు వచ్చాక ప్రాజెక్ట్లను లాంచింగ్, విక్రయాలు చేయాలి. దీంతో డెవలపర్, కస్టమర్, బ్యాంకర్, ప్రభుత్వం అందరూ హ్యాపీగానే ఉంటారు. బిల్డర్ ప్రొఫైల్ను పరిశీలించకుండా, తక్కువ ధర అనగానే తొందరపడి కొనుగోలు చేయవద్దు. -
రాష్ట్రంలో గుంతలులేని రోడ్లు కనిపించాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ శాఖ పరిధిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించిన సీఎం.. అధికారులు ఇచ్చిన నివేదికలు, ఇతర సమాచారం మేరకు పలు కీలక సూచనలు చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఐజీ లేఅవుట్లు: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక ఎంఐజీ లే అవుట్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం వైఎస్ జగన్.. ఆ లే అవుట్స్ ఆదర్శనీయంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఇంకా.. ► లే అవుట్స్ నియమాలు, నిబంధనలు, ప్రమాణాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి. ► లే అవుట్స్ చూసి ఇతరులు స్ఫూర్తిని పొందాలి. ► న్యాయవివాదాలు, ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా క్లియర్ టైటిల్స్ వినియోగదారులకు ఉండాలి. ► జగనన్న స్మార్ట్ టౌన్షిప్ (ఎంఐజీ లేఅవుట్స్) కోసం ఇప్పటివరకూ 82 అర్బన్ నియోజకవర్గాల్లో సుమారు 6791 ఎకరాల గుర్తింపు. ► శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, శ్రీ సత్యసాయి, తిరుపతిలో.. 864.29 ఎకరాల్లో లే అవుట్ పనులు.. మే చివరినాటికి సిద్ధం చేస్తామని వెల్లడించిన అధికారులు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ : ► తడిచెత్త, పొడిచెత్త, ప్రమాదకర వ్యర్థాలు అంటే ఏంటి? అనే విషమయంపై ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. ► ఏ కలర్ డబ్బాలో ఏ చెత్త వేయాలి అనే విషయంపై కరపత్రాలను ప్రతి ఇంటికీ పంచాలి. ► ఇప్పటికే 1.12 కోట్ల చెత్త డబ్బాలను పంపిణీచేశామని అధికారులు వివరించారు. ► మరో 8 లక్షల చెత్త డబ్బాలను మే 22 నాటికల్లా పంపిణీ చేస్తామన్నారు. ► 2,426 ఆటోలు ఇప్పటికే క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయి. మిగిలినవి ఈనెలాఖరు నాటికి అందుబాటులోకి వస్తాయన్న అధికారులు. ► 1,123 ఈ–ఆటోలు కూడా జూన్ నాటికి అందుబాటులోకి వస్తాయి. ► గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు డిసెంబరు నాటికి పూర్తయ్యేలా కార్యాచరణ. ప్రతి ఇంటికీ ప్రతిరోజూ తాగునీరు: ► ప్రతిరోజూ ప్రతి ఇంటికీ తాగునీరు అందాలి. ► దీనిపై సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి. ► ఇది జరుగుతోందా? లేదా? అన్నదానిపై ఎప్పటికప్పుడు సమాచారం రావాలి. తద్వారా దీనివల్ల వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. టిడ్కో ఇళ్లపై సమీక్ష: ► గత ప్రభుత్వం రోడ్లు, తాగునీరు, మురుగునీటి శుద్ధిలాంటి లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేకుండా టిడ్కో ఇళ్లు ప్లాన్ చేశారు. కానీ, ఈ ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టింది. ► పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, తాగునీటికోసం వాటర్ ట్యాంకులు, మురుగునీటి శుద్ధి సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. ► మంచి జీవన ప్రమాణాలు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు. ► టిడ్కో ఇళ్ల మీద సుమారుగా.. రూ.5, 500 కోట్లు ఈ మూడేళ్లలో ఖర్చుచేసింది ప్రభుత్వం. రోడ్లపై దృష్టి: ► కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రోడ్లపై దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు. ► ఎక్కడ చూసినా గుంతలులేని రోడ్లు కనిపించాలి. ► నాడు – నేడు కింద బాగు చేసిన రోడ్లను హైలెట్ చేయాలి. ► జూన్నాటికి రోడ్ల పనులు పూర్తిచేస్తామని అధికారులు.. సీఎం జగన్కు వివరణ ఇచ్చారు. అమరావతి ప్రాంతంలో పనులపై సీఎం సమీక్ష: ► కరకట్ట రోడ్డు విస్తరణ పనులు వేగవంతం అయ్యాయని అధికారులు సమీక్షలో పేర్కొన్నారు. ► ఇప్పటికే విద్యుత్ స్తంభాలను తొలగించడంతో పనులు వేగవంతం అవుతాయని చెప్పారు. ► సీడ్ యాక్సెస్ రోడ్డు (ఇ–3)పైన కూడా దృష్టిపెట్టామని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుపైనా సీఎం సమీక్ష: ► విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు కోసం వనరుల సమీకరణపై చర్చ. ► సమారు 75 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రతిపాదనలు. ► మెట్రోరైల్ ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశం. ► ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులో భాగంగా కోచ్ల డిజైన్, దీంతోపాటు స్టేషన్లలో ఉండే సౌకర్యాలు తదితర వివరాలు సమగ్రంగా సమర్పించాలని సీఎం జగన్ ఆదేశం. ► పర్యావరణహిత విధానాలకు పెద్దపీట వేయాలని అధికారులకు సూచన. జగనన్న మహిళా మార్ట్లపై సీఎం సమీక్ష: ► మహిళా స్వయం సహాయక సంఘాలతో నడుస్తున్న మహిళా మార్ట్లు. ► ప్రస్తుతం నడుస్తున్న మహిళా మార్ట్లను వివరించిన అధికారులు. ► విజయవంతంగా నడుస్తున్నాయన్న అధికారులు.. వీలైనన్ని మహిళా మార్ట్లను నెలకొల్పాలని సూచించిన సీఎం జగన్. చదవండి: వెటర్నరీ ల్యాబ్ల ఏర్పాటు ఘనత సీఎం జగన్దే -
పట్టణ సేవలకు ఏడీబీ రూ.2,625 కోట్ల రుణం
న్యూఢిల్లీ: భారత్లో పట్టణ సేవల పురోగతికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) 350 మిలియన్ డాలర్ల (రూ.2,625 కోట్లు)ను రుణంగా ఇవ్వనుంది. మెరుగైన సేవలను అందించేందుకు వీలుగా ప్రభుత్వాలు సంస్కరణలను చేపట్టడంతోపాటు.. పనితీరు ఆధారితంగా పట్టణ పాలకమండళ్లకు నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖకు ఈ కార్యక్రమం అమలు విషయంలో ఏడీబీ సలహా, మద్దతు సేవలను అందించనుంది. ఇందుకు సంబంధించిన రుణ ఒప్పందంపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రా, ఏడీబీ భారత్ డైరెక్టర్ టకియో కొనిషి సోమవారం సంతకాలు చేశారు. విధాపరమైన సంస్కరణలను అమలు చేయడంలో, పెట్టుబడుల ప్రణాళికల రూపకల్పనకు సంబంధించి పట్టణ పాలక మండళ్లకు ఏడీబీ తన సేవలను అందిస్తుంది. వాతావరణం మార్పులు, పర్యావరణ, సామాజిక భద్రతా చర్యలను కూడా సూచిస్తుందని ప్రభుత్వం నుంచి విడుదలైన ప్రకటన తెలియజేసింది. అసోంలో నైపుణ్య యూనివర్సిటీకి సాయం అసోంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఏడీబీ మరో 112 మిలియన్ డాలర్లను రుణంగా ఇవ్వనుంది. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను బలోపేతం చేసేందుకు యూనివర్సిటీ ఏర్పాటు మార్గం చూపుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించి ఏడీబీతో ఒప్పందంపై సంతకం చేసినట్టు ప్రకటించింది. -
రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: సీఎం జగన్
-
రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ ‘క్లాప్’ కార్యక్రమంపైనా కూడా సీఎం సమీక్షించారు. క్లాప్ కార్యక్రమంపై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలందించారు. మున్సిపాలిటీ, నగరాల్లో రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆర్ అండ్ బి శాఖతో సమన్వయం చేసుకుని కార్యాచరణ రూపొందించాలని.. పట్టణాలు, నగరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వర్షాకాలం ముగియగానే రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం తెలిపారు. కన్స్ట్రక్షన్, డిమాలిషన్ వేస్ట్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. విశాఖ, విజయవాడ, తిరుపతిల్లో ఇప్పటికే ప్లాంట్లు ఉన్నాయని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురంల్లో కూడా ఇలాంటి ప్రాజెక్టులు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ►గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సన్నద్ధం కావాలని సీఎం ఆదేశాలు ►దీనివల్ల ప్రతి 2వేల జనాభాకు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసు వస్తుందన్న సీఎం ►ప్రజలకు అత్యంత చేరువలో సేవలు లభిస్తాయి: ►దీంతోపాటు.. ఆ గ్రామ, వార్డు సచివాలయాల్లో పరిధిలో భూములపై తగిన పర్యవేక్షణ ఉంటుంది ►దీనివల్ల ఆక్రమణలు, అన్యాక్రాంతాలకు ఆస్కారం ఉండదన్న సీఎం ►అర్హులైన పేదలందరికీ కూడా 90 రోజుల్లో ఇంటి స్థలాలను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్న సీఎం ►పేద కుటుంబాలు ఇంటి స్థలం కోసం మధ్యవర్తులతో పాటు, ఇతరులమీదో, ఇతర మార్గాలమీద ఆధారపడాల్సిన అవసరంలేని పరిస్థితిని తీసుకొచ్చామన్న సీఎం ►అలాగే ఉల్లంఘనలు, ఆక్రమిత ప్రాంతాల్లో కనీస సదుపాయాలులేని పరిస్థితి ఉండకూడదనే భారీ ఎత్తున 30 లక్షలకుపైగా ఇళ్ల స్థలాలు మంజూరు చేశాం ►దీంతో పాటు, 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించామన్న సీఎం ►దీనికోసం పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాం ►అర్హులైన వారు రాజమార్గంలో పట్టా తీసుకునే పరిస్థితిని మనం సృష్టించాం: ►ఇకపై అక్రమ ప్రాంతాల్లో, ఆక్రమిత ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకునే వారిని నెట్టివేసే పరిస్థితులను పూర్తిగా తీసివేశాం ►పేదవాడికి ఇంటి స్థలం లేదని మన దగ్గరకు వచ్చినప్పుడు అర్హుడైతే 90 రోజుల్లోగా వెంటనే ఇంటిపట్టాను మంజూరుచేసే కార్యక్రమం చేస్తున్నాం: విశాఖపట్నంలో చేపట్టనున్న పలు అభివృద్ధి ప్రాజెక్టులపైనా సీఎం సమీక్ష ►బీచ్కారిడార్, మల్టీలెవర్ కార్పార్కింగ్, నేచురల్ హిస్టరీ పార్క్, మరియు మ్యూజియం, బీచ్ కారిడార్ ప్రాజెక్టులపై సీఎం సమీక్ష ►టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం సమీక్ష ►నిర్దేశించుకున్న షెడ్యూలు ప్రకారం టిడ్కోఇళ్లు పూర్తికావాలన్న సీఎం ►అదే సమయంలో మౌలిక సదుపాయాల కల్పనపైనా దృష్టిపెట్టాలన్న సీఎం ►మొదటివిడతలో భాగంగా చేపట్టిన 38 లొకేషన్లలో 85,888 ఇళ్లలో సుమారు 45వేలకుపైగా ఇళ్లు మూడు నెలల్లోగా, మిగిలిన ఇళ్లు డిసెంబర్లోగా అప్పగిస్తామన్న అధికారులు ►లబ్ధిదారులకు ఇళ్లుఅప్పగించేటప్పుడు పూర్తిగా అన్నిరకాల వసతులతో ఇవ్వాలన్న సీఎం ► మౌలికసదుపాయాలు విషయంలో రాజీ పడొద్దన్న సీఎం వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్ నిర్మాణంపైనా సీఎం సమీక్ష ►విజయవాడ, గుంటూరు, నెల్లూరుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తిచేయడానికి కార్యాచరణ సిద్ధంచేయాలని సీఎం ఆదేశం ►గత ప్రభుత్వం హయాంలో ఈ ప్రాజెక్టులను అసంపూర్తిగా విడిచిపెట్టారని సమావేశంలో ప్రస్తావన ►మూడు ప్రాంతాల్లో ట్రీట్మెంట్ప్లాంట్లకు పొల్యూషన్ కంట్రోల్బోర్డు సిఫార్సులు ►లేకపోతే నదులు కలుషితం అవుతున్నాయని ఆందోళన ►ఈ నేపథ్యంలో మూడు చోట్ల వెంటనే ట్రీట్ మెంట్ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ►మంగళగిరి – తాడేపల్లి, మాచర్ల, కర్నూలులో ట్రీట్మెంట్ప్లాంట్ల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం పులివెందులలో పైలట్ ప్రాజెక్టుగా మహిళా మార్ట్ ►మహిళా మార్ట్ నిర్వహణపై సీఎం అభినందనలు ►మహిళా సంఘాల సహాయంతో మార్ట్ నిర్వహణ బాగుందన్న సీఎం ►మార్ట్లో మహిళలను భాగస్వాములుగా చేయడం బాగుందన్న సీఎం ►తక్కువ ధరలకూ వారికి అందుబాటులో సరుకులు అందడం బాగుందన్న సీఎం ►ఒక్కో మహిళ నుంచి రూ.150ల చొప్పున 8వేలమంది మహిళా సంఘాల సభ్యులనుంచి సేకరించి, ఆ డబ్బుతో మార్టు పెట్టామన్న అధికారులు ►మెప్మా దీనిపై పర్యేవేక్షణ చేస్తుందన్న అధికారులు ►మెప్మా ఉత్పత్తులు కూడా ఈ మార్ట్లో ఉంచామన్న అధికారులు ►మార్ట్ నిర్వహణ పనితీరుపై నిశిత పరిశీలన చేసి.. మిగతాచోట్ల కూడా అలాంటి ప్రయత్నాలు చేయాలన్న సీఎం ఈ సమీక్షా సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఏఎంఆర్డీఏ కమిషనర్ పి లక్ష్మీ నరసింహం, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి వి రామ మనోహరరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఎం ఎం నాయక్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
Jagananna Smart Town Scheme: మధ్యతరగతి ప్రజలకు శుభవార్త
సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో ఇళ్ల స్థలాల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో వైఎస్ జగన్ ప్రభుత్వం మధ్యతరగతి వర్గాలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. నగరాలు, పట్టణాల్లోని మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ప్రణాళికా బద్ధంగా ఇళ్ల స్థలాలు సమకూర్చే జగనన్న స్మార్ట్ టౌన్షిప్ల (ఎంఐజీ – మిడిల్ ఇన్కం గ్రూప్ లేఔట్లు) నిర్మాణం, లబ్ధిదారుల ఎంపికకు బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. జగనన్న స్మార్ట్ టౌన్షిప్లలో ప్లాట్లకు ఉన్న డిమాండ్ను తెలుసుకోవడం కోసం నిర్వహించిన ప్రాథమిక సర్వేకు అపూర్వ స్పందన లభించింది. ఈ పథకం కింద ప్లాట్ పొందడానికి 3.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. స్మార్ట్ టౌన్ షిప్ లే ఔట్లు అన్నీ ఒకే విధంగా ఉండేలా నిర్మాణాలు చేపట్టబోతున్నారు. లాభాపేక్ష లేకుండా అన్ని వసతులతో అభివృద్ధి చేసిన లేఔట్లను ప్రభుత్వం లబ్ధిదారులను సరసమైన ధరలకు అందించనుంది. లేఔట్లకు భూసేకరణ, ప్లాట్ల నిర్మాణం, లబ్ధిదారుల ఎంపిక.. ఇలా ప్రతి దశలో పారదర్శకతతో వ్యవహరిస్తుంది. జిల్లా స్థాయి కమిటీల నుంచి వచ్చిన స్థలాల వివరాలు, లేఔట్ల ఏర్పాటు, ఇతర ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీ స్క్రూటినీ చేసి ఆమోదిస్తుంది. జిల్లాల్లో స్మార్ట్ టౌన్లకు అవసరమైన భూమిని అంచనా వేయడం, మార్గదర్శకాల మేరకు భూమిని గుర్తించడం, ప్లాట్లను నిర్మించడం జిల్లా కమిటీల బాధ్యత అని పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని సౌకర్యాలతో లేఔట్లు ► డిమాండ్కు అనుగుణంగా 150, 200, 240 చదరపు గజాల్లో మూడు కేటగిరీల్లో ప్లాట్లు. ► లేఔట్లలో 60 అడుగులు బీటీ, 40 అడుగులు సీసీ రోడ్లతో పాటు ఫుట్పాత్ల నిర్మాణం. నీటి నిల్వ, సరఫరాకు అనుగుణంగా ఏర్పాట్లు. ► అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, ఎలక్ట్రికల్, కేబుల్, వీధి లైట్లు, పార్క్లు, ఇతర వసతుల కల్పన. ► నగరాలు, పట్టణాల్లోని మార్కెట్ విలువ, లేఔట్కు చుట్టుపక్కల ఉన్న ఇతర లేఔట్ల ధరలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర స్థాయి కమిటీ ధర నిర్ణయిస్తుంది. ► అనంతరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల నుంచి ధరల్లో మార్పులు చేర్పులు చేస్తూ ప్రతిపాదనలు అందితే రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదిస్తుంది. ఇవీ అర్హతలు ► ఒక కుటుంబానికి ఒకే ప్లాట్ ► ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా వార్షిక ఆదాయం రూ.18 లక్షల లోపు ఉండాలి. ► 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. ► లబ్ధిదారుడు ఏపీలో నివసిస్తూ ఉండాలి. ► ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ప్లాట్ల కేటాయింపు ఇలా.. ► డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) రూపొందించిన వెబ్సైట్లో ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. లేదా స్థానిక వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ► ప్లాట్ అమ్మకం ధరపై 10 శాతం మొత్తాన్ని దరఖాస్తు సమయంలో ఆర్టీజీఎస్/ఎన్ఈఎఫ్టీ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. ► లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయిస్తారు. దరఖాస్తుదారుడు ప్లాట్ పొందలేకపోతే లాటరీ అనంతరం నెల రోజులకు దరఖాస్తు సమయంలో చెల్లించిన 10 శాతం మొత్తాన్ని వెనక్కు ఇస్తారు. చెల్లింపులు ఇలా.. ► ప్లాట్ పొందిన దరఖాస్తుదారులు వాయిదా పద్ధతిలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో చెల్లించిన 10 శాతం మొత్తాన్ని మినహాయించి మిగిలిన మొత్తం చెల్లించాలి. ► అగ్రిమెంట్ కుదుర్చుకున్న నెల రోజులకు 30 శాతం, ఆరు నెలలలోపు మరో 30 శాతం, ఏడాది లోపు మిగతా 30 శాతం చెల్లించాలి. ఒక నెలలోపు ప్లాట్ అమ్మకం మొత్తాన్ని చెల్లించిన వారికి 5 శాతం రాయితీ ఇస్తారు. వాయిదా చెల్లించడంలో ఆలస్యం అయితే 0.5 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. -
పట్టణాభివృద్ధిలో భారత్కు జపాన్ చేయూత
న్యూఢిల్లీ: పట్టణాభివృద్ధిలో జపాన్ సహకారం పొందేందుకు భారత్ ముందడుగు వేసింది. ఈ మేరకు రెండు దేశాల మధ్య సహకార ఒప్పందం (ఎంఓసీ) కుదుర్చుకునేందుకు బుధవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు వెలువడిన ఒక అధికార ప్రకటన ప్రకారం భారత్ తరఫున గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ, అలాగే జపాన్ తరఫున భూ, మౌలిక, రవాణా, పర్యాటక మంత్రిత్వశాఖల ప్రతినిధులు ఎంఓసీపై సంతకాలు చేయనున్నారు. నిజానికి పట్టణాభివృద్ధికి సంబంధించి రెండు దేశాలూ 2007లో ఒక అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. దీని స్థానంలో తాజాగా ఎంఓసీ రానుంది. ఉపాధి కల్పనకూ అవకాశాలు అర్బన్ ప్లానింగ్, స్మార్ట్ సిటీల అభివృద్ధి, చౌక ధరల గృహ నిర్మాణం, పట్టణ వరద నివారణా నిర్వహణ, పారిశుధ్యం, వేస్ట్ వాటర్ నిర్వహణ, పట్టణ రవాణా, విపత్తు నిర్వహణ వంటి కీలక అంశాలపై రెండు దేశాలూ మున్ముందు సహకరించుకోనున్నాయి. ఇందుకు సంబంధించి చేపట్టే ప్రాజెక్టుల వల్ల యువతకు కూడా ఉపాధి అవకాశాలు భారీగా లభిస్తాయి. సహకారం విషయంలో వ్యూహం, కార్యక్రమాల అమలు వంటి కార్యకలాపాలకు సంయుక్త కార్యాచరణ బృందం (జేడబ్ల్యూజీ) కూడా ఏర్పాటవుతుంది. ఏడాదికి ఒకసారి జేడబ్ల్యూజీ సమావేశమవుతుంది. ఈ సమావేశం ఒక ఏడాది భారత్లో జరిగితే మరో సంవత్సరం జపాన్లో జరుగుతుంది. ఒకసారి సంతకాలు పూర్తయిన తర్వాత ఐదేళ్లు ఎంఓసీ అమల్లో ఉంటుంది. కాగా, పట్టణాభివృద్ధికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో మాల్దీవులతో జరిగిన ఎంఓయూపై కూడా క్యాబినెట్ సమీక్షించింది. -
పట్టణ ప్రగతిపై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష..
సాక్షి, నల్గొండ: విద్యుత్ తీగల కింద నిర్మించ తలపెట్టిన భవన నిర్మాణాలకు అనుమతులు రావని.. ప్లాట్లు కొనుగోలు చేసేటప్పుడే కొనుగోలు దారులు దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. ఆదివారం నల్గొండలో పట్టణ ప్రగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో కూడా ఇలాంటి అనుమతులు లేవన్నారు. ప్రస్తుతం ఇళ్ల మీద విద్యుత్ తీగల తొలగింపుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని వెల్లడించారు. పట్టణ ప్రగతిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్ తీగల తొలగింపుకు అంచనాలు సిద్ధం చేస్తున్నామన్నారు. అందుకు అవసరమైన నిధులు కేటాయించడానికి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. -
విజయవాడకు కొత్త రూపు!
సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడ రూపురేఖలు మారిపోనున్నాయి. నగరాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో సిటీ స్వరూపం మార్చేందుకు వీలుగా రూట్మ్యాప్ను రూపొందిస్తోంది. సుమారు రూ.100 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేయాలని సంకల్పించింది. ఇందుకు సంబంధించిన జీఓను కూడా సర్కారు విడుదల చేసింది. ప్రధానంగా రోడ్ల అభివృద్ధితోపాటు నగర సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. క్రీడా సౌకర్యాలు మెరుగుపర్చడం.. సీవేజి ట్రీట్మెంట్ ప్లాన్లను ఏర్పాటుచేయడం.. పార్కుల అభివృద్ధి.. మున్సిపల్ పాఠశాలల్లో సౌకర్యాలు, సీసీ రోడ్ల అభివృద్ధిపై దృష్టిపెట్టింది. అలాగే, నగర వాసులను ఎంతగానో అలరిస్తున్న ఫుడ్కోర్టు ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ రహదారిని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దనున్నారు. ఇవేకాక.. మరిన్ని కార్యక్రమాల రూపకల్పనకు కూడా అధికారులు ప్రణాళిక రచిస్తున్నారు. డివిజన్ల సంఖ్య పెంపు అలాగే, నగరంలోని డివిజన్ల సంఖ్య కూడా పెరగనుంది. 1981లో బెజవాడ పురపాలక సంఘం విజయవాడ నగరపాలక సంస్థగా మారింది. అప్పట్లో నగరంలో 40 డివిజన్లు ఉండేవి. ఆ తర్వాత పునరి్వభజనతో అవి 44కు పెరిగాయి. అనంతరం 59 అయ్యాయి. తాజాగా, మరోసారి డివిజన్ల పునరి్వభజన చేయాలని సర్కారు నిర్ణయించడంతో ఆ సంఖ్య 64కు చేరుకునే అవకాశం ఉంది. పురపాలక శాఖ ఆదేశాల మేరకు నగర జనాభాకు అనుగుణంగా ఈ డివిజన్ల పునరి్వభజన జరగనుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం విజయవాడ నగర జనాభా 13.60 లక్షలు ఉన్నా.. 2011 జనాభా (10.45 లక్షలు) లెక్కల ప్రకారమే అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నారు. మరోవైపు.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు డివిజన్ల పునరి్వభజన ముసాయిదాను సిద్ధంచేశారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది డివిజన్ల స్వరూప జాబితాను ప్రకటించనున్నారు. ప్రస్తుత నగర స్వరూపం ఇదీ.. -
ప్రగతిలో పట్టణాలదే ప్రముఖపాత్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రగతిలో పట్టణాలు ప్రముఖపాత్ర పోషిస్తున్నాయని పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర జనాభాలో ప్రస్తుతం 43 శాతం మంది పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని, అతి కొద్దికాలంలో ఇది 50 శాతం దాటుతుందని అన్నారు. పట్టణీకరణ, జనాభా అవసరాలకు అనుగుణంగా పట్టణాభివృద్ధి సంస్థ(యూడీఏ)లు పనిచేయాల్సి ఉందని అన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్లను రూపొందించాలని ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో పట్టణాభివృద్ధి సంస్థల చైర్మన్లు, అధికారులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ తయారు చేయడం యూడీఏల ప్రాథమిక విధి అని, ఈ దిశగా కార్యాచరణ ప్రారంభించాలన్నారు. వరంగల్ పట్టణాభివృద్ధి సంస్థ తయారు చేసిన మాస్టర్ ప్లాన్ ప్రచురణకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో అవలంభించిన విధివిధానాల అధ్యయనానికి శుక్రవారం డీటీసీపీ, పురపాలక శాఖ అధికారులతో సమావేశం కావాలని అన్నారు. స్వయం సమృద్ధే లక్ష్యం.. పట్టణాభివృద్ధి సంస్థలు స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని, ఇందుకోసం ల్యాండ్ పూలింగ్–అభివృద్ధి విధానం తదితర మార్గాలను అనుసరించాలన్నారు. సొంతంగా ఆర్థిక వనరులను సమకూర్చుకునే దిశగా పట్టణాభివృద్ధి సంస్థలు కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు, అటవీ భూములతో కూడిన భూనిధి వివరాలను సేకరించాలన్నారు. హెచ్ఎండీఏ వినూత్న ఆలోచనలు, విధానాలతో సమర్థవంతంగా పనిచేస్తోందని, మిగతా సంస్థలూ వీటిని అమలు చేయాలన్నారు. కొత్త పురచట్టం నేపథ్యంలో హెచ్ఎండీఏ, పట్టణాభివృద్ధి సంస్థల చట్టాల్లో తీసుకురావాల్సిన మార్పుచేర్పులపై నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. సమావేశంలో పట్టణాభివృద్ధి సంస్థల చైర్మన్లు మర్రి యాదవరెడ్డి(వరంగల్), రామకృష్ణారావు(కరీంనగర్), రవీందర్రెడ్డి(సిద్దిపేట), ప్రభాకర్రెడ్డి(నిజామాబాద్), పట్టణాభివృద్ధి సంస్థల అధికారులు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ పాల్గొన్నారు. -
అలాంటి పరిస్థితి మనకొద్దు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కొద్దిపాటి వర్షానికే ప్రజలు నరకయాతన పడుతున్నారని.. ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. వర్షాకాలంలో నగర ప్రజల జీవనం దుర్భరంగా మారుతోందని.. వర్షాకాలంలో ముంబై, చెన్నై లాంటి నగరాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నామని.. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదని అధికారులకు సూచించారు. కాల్వలు, ప్రవాహాలకు అడ్డంగా నిర్మాణాల వలన సమస్యలను కొనితెచ్చుకున్నట్లేనన్నారు. పైగా వాటికి చట్టబద్ధత ఉండదని.. ఎప్పటికీ పట్టా కూడా రాదని.. చట్టాలు దీనికి అంగీకరించవన్నారు. నదీ పరీవాహక ప్రాంతాలకు భంగం కలగకుండా చూడాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పనపై సుదీర్ఘ చర్చ.. నగరాలు, మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రణాళికలపై సీఎం జగన్ సుదీర్ఘంగా చర్చించారు. తాగునీరు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, వ్యర్థాల తొలగింపు, మురుగునీటి శుద్ధి, పర్యావరణ పరిరక్షణ ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. వీటి కోసం కొనసాగుతున్న ప్రాజెక్టులు, చేపట్టాల్సిన కొత్త పనులపై అధికారులతో సీఎం సమీక్షించారు. ప్రతి మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉండాలని.. మురుగునీటి శుద్ధి ఉండాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉండాలని.. ఇవన్నీ ఉండేలా ప్రతి మున్సిపాలిటీకి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి పైపులైన్లు డ్రైనేజీతో సంబంధం లేకుండా చూసుకోవాలని.. పట్టణాలు, నగరాల్లో వ్యర్థాల సేకరణ సరిగ్గా ఉండడం లేదన్నారు. ఆ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. వార్డు, గ్రామ సచివాలయ వ్యవస్థను పూర్తిగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. తాగునీరు, డ్రైనేజి, ఇళ్లు, కరెంటు, రేషన్ కార్డు, పెన్షన్, ఆరోగ్యశ్రీపై గ్రామ, వార్డు సచివాలయాలు దృష్టిపెట్టాలన్నారు. ఏ సమస్య వచ్చినా.. వెంటనే తక్షణమే పరిష్కారం అయ్యేవిధంగా ఉండాలన్నారు. మోడల్ మున్సిపాలిటీలుగా తాడేపల్లి, మంగళగిరి తాడేపల్లి, మంగళగిరిలను మోడల్ మున్సిపాలిటీలుగా రూపొందించడంపై సమావేశంలో చర్చ జరిగింది. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, తాగునీటి వసతి, రోడ్ల అభివృద్ధి కోసం ప్రతిపాదనలపై సీఎం చర్చించారు. ప్రస్తుతం ఉన్న వసతులు, పెంచాల్సిన సదుపాయాలపై వివరాలు అడిగారు. తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో ఇళ్లులేని పేదలకు గృహాలు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. తాడేపల్లిలో కనీసం 15 వేల ఇళ్లు ఇవ్వాలన్నారు. నిర్మించే ఇళ్ల సముదాయాల వద్ద కనీస మౌలిక సదుపాయాలకూ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని, ఉగాది నాటికి అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సూచించారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు, కరెంటు, వీధిలైట్లు కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని.. తాడేపల్లి మున్సిపాలిటీలో 100 పడకల ఆస్పత్రికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కృష్ణానది కట్టమీద, కరకట్టలోపల, కాల్వ గట్ల మీద ఉంటున్న వారికి ఇళ్ల నిర్మాణంపై సమావేశంలో సుదీర్ఘ చర్చించిన సీఎం.. వారికి శాశ్వతంగా సమస్య పరిష్కరించాలన్నారు. ఉగాది నాటికి అందరికీ ఇళ్లు.. ఇళ్ల నిర్మాణం కింద ప్రస్తుతం ఇస్తున్న సెంటున్నర కాకుండా కనీసం 2 సెంట్లు విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, కోరుకున్న ప్రాంతంలోనే ఇళ్ల నిర్మాణం చేసి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణ, నదీ చట్టాలను పటిష్టంగా అమలు చేయడంతో పాటు వీటి కారణంగా పేదలు, సామాన్యులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. ఉగాది నాటికి పట్టాలు ఇవ్వడమే కాకుండా మంచి డిజైన్లలో వారికి ఉచితంగా ఇళ్లు కట్టి ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ భూముల్లో సుదీర్ఘ కాలంగా ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని సూచించారు. బకింగ్ హాం కెనాల్ కాలుష్యం కాకుండా చూడాలని.. కాల్వ గట్లపై మొక్కలను విస్తారంగా పెంచాలన్నారు. పేదలకు మంచి సౌకర్యాలు కల్పించడం ద్వారానే ఆదర్శ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దడానికి సాధ్యమవుతాయని, మున్సిపల్ ఆఫీసుల్లో లంచాల వ్యవస్థ లేకుండా నియంత్రించాలన్నారు. ఏ పౌరుడు, బిల్డరు కూడా లంచం ఇచ్చి పనులు చేయించుకునే పరిస్థితి ఉండకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. (చదవండి: అక్టోబరు 4న వైఎస్సార్ వాహన మిత్ర ప్రారంభం) -
అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పట్టణాభివృద్ధిలో విశేష అనుభవం ఉన్న ఆరుగురితో కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తుందని చెప్పారు. శుక్రవారం విజయవాడలో మున్సిపల్ కమిషనర్ల వర్క్షాపు ముగింపు కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఇటీవల నియమితులైన వార్డు వలంటీర్లు, రానున్న సచివాలయ వ్యవస్థను వాడుకుని పట్టణ ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి కమిషనర్లు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా పేదలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. పురపాలక విభాగాల్లో అధికారులతో సమన్వయం చేసుకుని ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. మున్సిపల్ స్కూళ్లలో విద్యాప్రమాణాల పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మంచినీటి కుళాయిల ఏర్పాటు, రక్షిత మంచినీటి సరఫరా, వీధిలైట్ల నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్పందన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. సమీక్షల్లో వాస్తవాలనే అధికారులు వివరించాలని, అవాస్తవ గణాంకాలతో మభ్యపరిచే ప్రయత్నం చేయొద్దన్నారు. మున్సిపల్ శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న మున్సిపల్ నిధులతో పాఠశాలల మరమ్మతులు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడదామన్నారు. మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ విద్యాప్రమాణాల మెరుగుకు ప్రత్యేక కార్యాచరణను అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. వర్క్షాపులో మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఎంఏలు, మెప్మా పీడీలు, ఇంజనీర్లు, మధ్యాహ్నం జరిగిన సమావేశంలో ఏపీటిడ్కో ఎండీ దివాన్, ఈఎన్సీ చంద్రయ్య, డీటీసీపీ రాముడు, స్వచ్ఛ ఆంధ్రా కార్పొరేషన్ ఎండీ సంపత్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ట్విట్టర్లో టాప్!
నగర పౌరులు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న పోస్టులకు ఉన్నత స్థాయిలోని వారూ తమ తప్పును ఒప్పుకోక తప్పని పరిస్థితి. కొద్దినెలల క్రితం శేరిలింగంపల్లి జోన్లో పర్యటన సందర్భంగా మేయర్ వాహనం నో పార్కింగ్ ఏరియాలో ఆపడాన్ని ఫొటో తీసి ట్విట్టర్లో ఉంచారు. దీంతో ఆయన చలానా చెల్లించారు. ఇటీవల జీహెచ్ఎంసీ కమిషనర్ కారు వేగంగా ప్రయాణం చేసినందుకు ట్రాఫిక్ విభాగం జారీ చేసిన చలాన్లు పెండింగ్లో ఉండటం ట్విట్టర్లో హల్చల్ సృష్టించింది. దీంతో కమిషనర్ చలానా సొమ్ము చెల్లించడంతోపాటు ఇకపై వేగంగా నడపొద్దంటూ డ్రైవర్లను హెచ్చరించారు. సాక్షి, హైదరాబాద్: ఇలా వివిధ సమస్యలపై ఫిర్యాదులు చేయడానికి నగరవాసులు ట్విట్టర్ను ప్రధాన వేదికగా చేసుకుంటున్నారు. దేశంలోనే అత్యధిక మంది ఫాలో అవుతున్న సంస్థల్లో జీహెచ్ఎంసీ తొలి స్థానంలో ఉంది. ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ)లో భాగంగా జీహెచ్ఎంసీ ఈ–ఆఫీస్ను అమల్లోకి తెచ్చింది. అలాగే భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ, బర్త్ సర్టిఫికెట్లనూ ఆన్లైన్లోనే నిర్వహిస్తోంది. ఇక ఫిర్యాదుల కోసం ‘మైజీహెచ్ఎంసీ’యాప్ను అందుబాటులోకి తెచ్చి.. ట్విట్టర్ అకౌంట్ను ప్రారంభించింది. జీహెచ్ఎంసీతో పాటు మేయర్, కమిషనర్, జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఆయా విభాగాధిపతులకు సైతం ట్విట్టర్ ఖాతాలున్నాయి. జీహెచ్ఎంసీకి వివిధ మాధ్యమాలతోపాటు ట్విట్టర్ ద్వారా ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయి. జీహెచ్ఎంసీ ట్విట్టర్ను ఫాలో అవుతున్నవారు లక్ష మంది కంటే ఎక్కువే ఉండటం గమనార్హం. తమ ఈ ఫిర్యాదులను జీహెచ్ఎంసీ అకౌంట్తోపాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మేయర్ రామ్మోహన్, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ కమిషనర్ల ఖాతాలకు కూడా పోస్ట్ చేస్తున్నారు. ఫిర్యాదు ఎప్పుడు పోస్ట్ చేసిన తేదీ, సమయంతో సహా తెలుస్తుండటంతో అధికారులు వీలైనంత త్వరగా స్పందించి.. పరిష్కరిస్తున్నారు. దేశంలోని మిగతా నగరాల కంటే జీహెచ్ఎంసీని ట్విట్టర్లో ఫాలో అవుతున్నవారే ఎక్కువ. నగరంలోని ఇతర ప్రభుత్వ విభాగాలతో పోల్చిచూసినా, జీహెచ్ఎంసీనే ఎక్కువ మంది అనుసరిస్తున్నారు. కాగా, కార్పొరేషన్ ఫేస్బుక్ను ఫాలో అవుతున్నవారు 47,087 మంది ఉన్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. ఈజ్ ఆఫ్ డూయింగ్లో భాగంగా ట్విట్టర్తోపాటు జీహెచ్ఎంసీ ఫేస్బుక్, మైజీహెచ్ఎంసీ యాప్, ఈ–మెయిల్స్, ప్రజావాణి ద్వారా అందే ఫిర్యాదులతోపాటు నేరుగా నాకందే వాటిని కూడా పరిష్కరిస్తున్నాం. – దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ బెంగళూర్, పుణే తదితర నగరాల కంటే జీహెచ్ఎంసీకి ఎక్కువ మంది ఫాలోవర్లు ఉండటం అభినందనీయం. ఎక్కువ మంది సోషల్ మీడియాను వాడుతుండటమే కాక సమస్యల పరిష్కారానికి కూడా వినియోగించుకుంటున్నారు. – అరవింద్కుమార్, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ -
ఏపీలో కొలువుల జాతర... 1,26,728 పోస్టులకు నోటిఫికేషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ కనివినీ ఎరుగని రీతిలో ఒకే విడతలో 1,26,728 ప్రభుత్వోద్యోగ నియామకాలకు సంబంధించిన రెండు నోటిఫికేషన్లు శుక్రవారం రాత్రి విడుదలయ్యాయి. గ్రామ సచివాలయాల్లో 95,088 ఉద్యోగాలకు పంచాయతీరాజ్ శాఖ.. పట్టణ వార్డు సచివాలయాల్లో 31,640 ఉద్యోగాలకు పట్టణాభివృద్ది శాఖ నోటిఫికేషన్లను వేర్వేరుగా జారీచేశాయి. శనివారం ఉ.11 గంటల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఆగస్టు 10వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. సెప్టెంబరు ఒకటవ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తారు. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన రోజునే గ్రామ, వార్డు స్థాయిలో సచివాలయాల వ్యవస్థను కొత్తగా ఏర్పాటుచేసి, ప్రతి సచివాలయంలో పనిచేసేందుకు 10 నుంచి 12 మంది చొప్పున నియమించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో 11,158 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాలను ఏర్పాటుచేస్తున్నారు. వైద్య ఆరోగ్య, రెవెన్యూ, పోలీస్ తదితర 11 ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ మొత్తం 22 రకాల ఉద్యోగాలను సర్కారు భర్తీచేస్తుంది. మూడు ప్రత్యేక వెబ్సైట్ల ద్వారా.. కాగా, ఆయా ఉద్యోగాలకు అర్హులైన నిర్యుదోగ యువత నుంచి అన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించేందుకు gramasachivalayam. ap. gov. in, vsws. ap. gov. in, wardsachivalayam. ap. gov. in అనే మూడు ప్రత్యేక వెబ్సైట్లను సిద్ధంచేశారు. శనివారం ఉ.11 గంటల నుంచి ఇవి దరఖాస్తుదారులకు అందుబాటులోకి వస్తాయని పంచాయతీరాజ్, పట్టణాభివృద్ది శాఖ అధికారులు చెబుతున్నారు. నిర్ణీత ఫార్మాట్లో దరఖాస్తు ఫారం, 22 రకాల ఉద్యోగాలకు వేర్వేరుగా ఏ ఉద్యోగానికి ఏయే విద్యార్హతలు, వయో పరిమితి, ఎంపిక విధానం, రాత పరీక్షకు సంబంధించిన సిలబస్ వంటి వివరాలను ఆయా వెబ్సైట్లలోనే అందుబాటులో ఉంచుతారు. రెండంచెల పరీక్ష విధానం.. అన్ని రకాల ఉద్యోగాల భర్తీకి రెండంచెల పరీక్ష విధానం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి ఉద్యోగానికి 150 మార్కులకు రెండు పేపర్ల విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కింగ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టనున్నారు. గ్రామ సచివాలయాల్లో పనిచేయడం కోసం భర్తీచేసే వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీసు, వేల్పేర్ మరియు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులకు ఉదయం 75 మార్కులకు జనరల్ నాలెడ్జిలో, సాయంత్రం 75 మార్కులకు రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అంశాలపై పరీక్ష నిర్వహిస్తారు. అలాగే, ఏఎన్ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, విలేజీ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజీ హార్టికల్చర్ అసిస్టెంట్, విలేజీ సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు ఉదయం 50 మార్కులకు జనరల్ నాలెడ్జిపై.. సాయంత్రం వంద మార్కులకు రీజనింగ్, మెంటల్ ఎబిలిటీతో పాటు ఆయా ఉద్యోగానికి సంబంధించిన అంశాలపై పరీక్ష ఉంటుంది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజీ కాగా, ఇప్పటికే ఆయా శాఖల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తూ నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు వారికి అర్హత ఉండి రాత పరీక్షకు హాజరైతే.. అలాంటి అభ్యర్థులకు వెయిటేజీ ఇవ్వాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఒక్కో ఉద్యోగానికి ఆ శాఖలో ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఈ వెయిటేజీ వేర్వేరుగా ఉంటుంది. 9,359 లైన్మెన్ పోస్టుల భర్తీ కూడా. ఇదిలా ఉంటే.. 9,359 ఎనర్జీ అసిస్టెంట్ (లైన్మెన్) ఉద్యోగాల భర్తీకి కూడా వేరుగా నోటిఫికేషన్ రానుంది. విద్యుత్ డిస్కంలు దీనిని జారీచేస్తాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గ్రామ సచివాలయాల్లో పనిచేసేందుకు 5,573 గ్రామ ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులను, వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు 3,786 వార్డు ఎనర్జీ సెక్రటరీ పోస్టులను డిస్కంలు వేరుగా భర్తీచేస్తాయి. ప్రభుత్వ ఉద్యోగ నియామక నిబంధనలకు, డిస్కం ద్వారా చేపట్టే ఉద్యోగ నియామకాల తీరు వేర్వేరు కావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఈ నోటిఫికేషన్ కూడా ఒకట్రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గ్రామ సచివాలయాల సంఖ్య పెంపునకు ప్రతిపాదన మొదట 11,114 గ్రామ సచివాలయాలను ఏర్పాటుచేయాలని సర్కారు నిర్ణయించగా.. తాజాగా ఆ సంఖ్యను 11,158కు పెంచాలని కోరుతూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలో మొదట ప్రతిపాదించిన వాటి కన్నా కొన్ని అదనంగా గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. -
పట్టణాభివృద్ధికి రూ.55 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పురపాలికల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.55 వేల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నగరాలు, పట్టణాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆ మేరకు మూడేళ్ల ప్రణాళికలతో పనులు చేపడతామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పురపాలక శాఖ 2017–18లో సాధించిన పురోగతిపై నివేదికతో పాటు ఈ ఏడాది చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రణాళికలను బుధవారం మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హెచ్ఎండీఏ పరిధిలో 13 శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ఔటర్ రింగ్రోడ్డు చుట్టూ వాటర్ రింగ్ మెయిన్ (నీటి పైపులైను) నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. రహదారుల నిర్వహణను మూడేళ్ల పాటు కాంట్రాక్టర్లే చూసేలా త్వరలో కొత్త విధానం తీసుకొస్తున్నామని చెప్పారు. మెట్రో రైలు, మిషన్ భగీరథ, ఎస్సార్డీపీ, కమాండ్ కంట్రోల్ వ్యవస్థల కోసం పనులన్నీ ఏకకాలంలో జరుగుతుండటంతో రోడ్ల విషయంలో కాస్త ఇబ్బంది ఉందని, ఈ పనులు పూర్తయితే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. రహదారులను తవ్విన సంస్థలే వాటిని పునరుద్ధరించాల్సి ఉన్నా, అనుకున్న రీతిలో జరగట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2023 నాటికి పట్టణ జనాభా 50 శాతం దాటుతుందని పేర్కొన్నారు. ఉపాధి, విద్య, మెరుగైన జీవన ప్రమాణాల కోసం జరిగే వలసలతో పట్టణీకరణ పెరుగుతోందని, ఇందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించడం సవాలుగా మారిందన్నారు. ఒక్క రోజులో సాధ్యం కాదు.. ‘విశ్వనగరం ఒక్క రోజులో కాదు.. రోమ్ నగరాన్ని కూడా ఒక్క రోజులో నిర్మించలేదు’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దశల వారీగా హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇతర ప్రభుత్వ శాఖలతో పోలిస్తే పురపాలక శాఖ కృతజ్ఞత లభించని (థ్యాంక్లెస్) పనులు చేస్తోందని, విపక్షాలు విమర్శించడం సరికాదన్నారు. సరిగ్గా పనులు చేస్తే ప్రశంసలు రావని, ఏవైనా ఇబ్బందులు కలిగితే మాత్రం వెంటనే విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 74 పురపాలికలుండగా, వచ్చే నెల నుంచి మరో కొత్త 68 మున్సిపాలిటీలు మనుగడలోకి వస్తాయని చెప్పారు. దీంతో రాష్ట్రంలో పురపాలికల సంఖ్య 142కు పెరుగుతుందన్నారు. పురపాలక శాఖ నివేదికలోని ముఖ్యాంశాలు ఈ ఏడాది చివర్లోగా మెట్రో రెండో విడత ప్రాజెక్టు డీపీఆర్. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు త్వరలో తుది రూపం. 44 పురపాలికల్లో రూ.460 కోట్లతో టీయూఎఫ్ఐడీసీ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయల కల్పన. టీయూఎఫ్ఐడీసీ ఆధ్వర్యంలో పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు మరో రూ.1,460 కోట్ల పనులకు అనుమతులు. పలు పట్టణాల్లో 52 ఆధునిక శ్మశాన వాటికల నిర్మాణం. రూ.150 కోట్లతో 3 వేల ఖాళీ స్థలాల్లో పార్కుల నిర్మాణం. పట్టణాల్లో 203 మాంసాహార, శాఖాహార మార్కెట్ల నిర్మాణం. 2013–14లో జీహెచ్ఎంసీ ఆదాయం రూ.747 కోట్లు కాగా ప్రస్తుతం రూ.1450 కోట్లకు చేరింది. మున్సిపల్ బాండ్ల విషయంలో జీహెచ్ఎంసీ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. హైదరాబాద్లో ఏప్రిల్లోగా లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తి. కొల్లూరు వద్ద 15,600 ఇళ్లతో అతిపెద్ద టౌన్షిప్ నిర్మాణం జరుగుతోంది. ఒక్కో ఇంటికి రూ.9 లక్షల వ్యయం. హైదరాబాద్లో 500 బస్తీ దవాఖాల ఏర్పాటు. ప్రతి 5 వేల జనాభాకు ఒక దవాఖానా. -
పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): రాష్ట్రంలో నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల రూపు రేఖలు మార్చేందుకు అభివృద్ధి పనుల కోసం ప్రత్యేకంగా రూ.1003 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ అధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. నగర పాలక సంస్థ, మున్సిపాలిటీలకు గతంలో మంజూరు చేసిన ప్రత్యేక నిధులు లేదా పన్ను రూపేణ వచ్చిన, ఫైనాన్స్ కమిషన్ నిధుల జోలికి వెళ్లకుండా ప్రత్యేక నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిధులను కలెక్టర్లకు మంజూరు చేస్తామన్నారు. పట్టణాలు, నగరాల ప్రధాన కూడళ్ల వద్ద రోడ్ల నిర్మాణాలు, పార్కుల ఏర్పాటు పనులను గుర్తించి ఈనెల 31లోగా ప్రతిపాదనలు పంపాలన్నారు. మున్సిపాల్టీలకు ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల సూచనలు, సలహాలతో ప్రజలు కోరుకునే విధంగా ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నుడా) ప్రకటించిన జిల్లాలోని మున్సిపాల్టీల మాస్టర్ ప్లాన్ తప్పనిసరిగా ఉండాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా 15వేల జనాభా గల గ్రామాలను నగర పంచాయతీలుగా, మున్సిపాలిటీలుగా ప్రకటించనున్న నేపథ్యంలో రాష్ట్రంలో మున్సిపాలిటీల సంఖ్య 145కు చేరుకుంటుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో మిషన్ భగీరథ, అండర్ డ్రెయినేజీ పనులు సమాంతరంగా వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాన్ఫరెన్స్లో జేసీ రవీందర్ రెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి, నగర పాలక కమిషనర్ జాన్ సాంసన్, అధికారులున్నారు. -
పట్టణాభివృద్ధికి మరిన్ని నిధులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులు చేపట్టేందుకు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీయూఎఫ్ఐడీసీ) ద్వారా మరిన్ని నిధులు అందిస్తామని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో మంగళవారం ఆయన సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, పట్టణాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని తెలిపారు. 39 శాతం రాష్ట్ర జనాభా పట్టణ ప్రాంతాల్లో ఉందని, త్వరలో కొత్త పురపాలికల ఏర్పాటుతో ఇది 45 శాతానికి పెరగనుందన్నారు. పట్టణాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. పట్టణాల్లోని మౌలిక వసతులు మెరుగుపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కొత్త జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణాలను ప్రణాళికాబద్ధంగా పక్కా రోడ్డు మ్యాపుతో అభివృద్ధి చేయాల్సిన అవసరముందని జిల్లా కలెక్టర్లకు సూచించారు. పట్టణాలకు టీయూఎఫ్ఐడీసీ ద్వారా ఇస్తున్న నిధులు నిర్ణీత గడువులోగా వినియోగించుకునే విధంగా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణాల్లోని జంక్షన్ టు జంక్షన్ రోడ్ల అభివృద్ధి, మోడల్ మార్కెట్లు, శ్మశాన వాటికలు, పార్కుల నిర్మాణం తదితర కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వీటిని పూర్తి చేస్తే పట్టణాల్లో గుణాత్మక మార్పు వస్తుందన్నారు. ఒక్కో పట్టణాన్ని దత్తత తీసుకోండి.. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఒక్కో పట్టణాన్ని దత్తత తీసుకోవాలని కేటీఆర్ కోరారు. కలెక్టర్లు జిల్లా స్థాయిలో పర్యవేక్షిస్తే పట్టణాల అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయన్నా రు. ప్రస్తుతం ఇస్తున్న టీయూఎఫ్ఐడీసీ నిధు లు పురపాలికలకు మార్గాల్లో వచ్చే నిధులకు అదనంగా వచ్చే నిధులని మంత్రి తెలిపారు. వీటితో చేపట్టే పనులను పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖ పర్యవేక్షిస్తుందని చెప్పారు. ఈ పనుల వివరాలను నెలాఖరులోగా అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పనులను పర్యవేక్షించాలన్నారు. పనుల పురోగతిపై ప్రతి వారం సమీక్ష నిర్వహించాలన్నారు. -
31వ వరకు అభ్యంతరాల స్వీకరణ
సాక్షి, యాదాద్రి : యాదాద్రి వైటీడీఏను ప్రత్యేక అభివృద్ధి ప్రాంతంగా తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ చట్టం 1975 ప్రకారంగా గుర్తించిన 7 గ్రామాల్లో ఏవేని అభ్యంతరాలు, ఆక్షేపణలు మాస్టర్ప్లాన్కు వ్యతిరేకతలు ఉంటే ఈనెల 31వ తేదీ లోపు తెలియజేయాలని జాయింట్ కలెక్టర్ రవినాయక్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైటీడీఏ అధికారులు, మాస్టర్ప్లాన్ పరి« దిలోని గ్రామాల సర్పంచ్లు, ఈఓపీఆర్డీలకు సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజలు ఈనెల 31వ తేదీ వరకు ఫిర్యాదుల ఇవ్వవచ్చన్నారు. వీటిని జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వానికి పంపి తగు చర్యతీసుకుం టామని తెలిపారు. అనంతరం వైటీడీఏ అభివృద్ధిపై ఏఏ గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో టౌన్ప్లానింగ్ అధికారులు ప్రజంటేషన్ చేశారు. సమావేశంలో వైటీడీఏ సెక్రటరీ సాయిరాం, వైటీడీఏ చీఫ్ ప్లానింగ్ అధికారి ఆర్.హరిప్రసాద్, టౌన్ప్లాన్ అధికారి సుష్మిత, జిల్లా పంచాయతీ అధికారి భిక్షం పాల్గొన్నారు. -
గతి తప్పిన నగరాభివృద్ధి
విశ్లేషణ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు దాదాపు సగం పట్టణీకరణ చెందాయి. అయినా 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో మూడో వంతు మాత్రమే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. నగరాలు మరింత వృద్ధి చెందుతున్నాయి, చిన్న పట్ట ణాలు నగరాలుగా మారుతున్నాయి. అయినా మనకు నగరాల నిర్మాణంపై సుస్పష్టమైన అవగాహన లేదు. స్వాతంత్య్రానంతరం చండీగఢ్, భువనేశ్వర్, గాంధీనగర్, కాండ్లా నగరాలను నిర్మించారు, ప్రపం చంలోనే అతి పెద్ద కొత్త నగరం నవీ ముంబై నిర్మా ణంలో ఉంది. ఇక అమరావతి నగర నిర్మాణం కొత్త ప్రాజెక్టు. అయినా దేశవ్యాప్తంగా పట్టణాల నిర్వహణ అధ్వానంగానే ఉంది. ‘ప్రణాళిక’ అని పిలిచేది ఉన్నా, మనం మాత్రం ‘అభివృద్ధి’ వైపే కొట్టుకుపోతున్న ట్టుంది. ముంబైలో దాదాపు ఒక ఏడాదిగా కొత్త కట్టడాల నిర్మాణాన్ని హైకోర్టు నిషేధించింది. నిర్మాణ క్రమంలో పోగుబడే రాళ్లూరప్పలు తదితరాలను తరలించే మార్గ మేదీ ఆ నగరానికి లేదు మరి. ముంబైకి ఆనుకుని ఉన్న థానేలో కూడా అలాంటి ఆంక్షే ఉంది. ఆ నగరం నీటి సరఫరా సమస్యను పరిష్కరించలేకపోవడం అందుకు కారణం. ఆ నగర పాలక వ్యవస్థ నీటి సరఫరాపైగాక ఇతర అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరిస్తోంది, అదీ నగర కేంద్రితమైనదే. ఢిల్లీలోని చాలా విస్తృత ప్రాంతాలకు పైపుల ద్వారా నీటి సరఫరా సదుపాయం లేదు. కాబట్టి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయడానికి ఆ నగరానికి జల్ బోర్డ్ ఉంది. హైదరాబాద్ పరిస్థితీ అదే. బిల్డర్–డెవలపర్లు పాటించాల్సిన నిర్దిష్ట ప్రమాణాలు ఉన్నాయి. కానీ, పౌర పరిపాలనా సంస్థలు మాత్రం తమ బాధ్యతను విస్మరిస్తాయి. నీటి సరఫరా, నిర్మాణ పనుల వల్ల పోగుబడే చెత్తను తరలించడం వంటివి తాము పట్టించుకోవాల్సినవేనని వారు భావిస్తున్నట్టు కన బడదు. తప్పనిసరిగా చెత్తను సేకరించుకు వెళ్లడం సహా ఇలాంటి విషయాలలోని లోటుపాట్లు ఒక నగరం లేదా పట్టణంలో ఉండేవారికి ఎవరికైనా చిర్రెత్తించేవే. కొన్ని పట్టణాలు, నగరాలలోపల నామమాత్రపు బస్సు సర్వీసులు సైతం లేవు. దీంతో ప్రైవేటు వాహ నాలతో రోడ్లు కిక్కిరిసివుంటాయి. అన్ని విధాలా తగి నంతగా సంతృప్తికరంగా ఉన్న ఒక్క నగరమైనా కనబడటం కష్టమే. అయినా ప్రజలు గుంపులు గుంపు లుగా బతుకు తెరువుల కోసం నగరాలకు, పట్టణా లకు ఎగబడతారే తప్ప, జీవించడానికి అవి సము చితమైనవని మాత్రం కాదు. వారు పట్టణ ప్రాంతా లను విస్తరింపచేయడమే కాదు, అధ్వానంగా మారు స్తారు. ఇక యూరోపియన్ పట్టణాలు, నగరాలతో సరితూగే వాటి గురించి మాట్లాడనవసరమే లేదు. ఈ నేపథ్యం నుంచి చూస్తే, ‘స్మార్ట్ సిటీ’ అనే భావన ఓ చిన్న బ్యాండ్ ఎయిడ్ పట్టీ లాంటిదే. ఎంతో కొంత ఉపయోగకరమే కాబట్టి వాటిని ఆహ్వానించా ల్సిందే గానీ, అది సరిపోదు. ఏ అంశానికి సంబం ధించి నగరాలు, పట్టణాలు డిమాండు కంటే వెనుకబడి ఉండరాదు. పేరుకుపోయిన పాత పనులు దిగ్భ్రాంతి కరమైనంత భారీ ప్రమాణంలోనివి. పెద్ద నగర ప్రాజెక్టులో భాగమైన నవీ ముంబైలో మూడో వంతు మురికివాడలే. ఆ నగరం విషయంలో ఏదీ సజావుగా సాగు తున్నట్టు అనిపించదు. ఏం చేసినా గానీ అది డిమాం డు–సప్లయి రేఖ కంటే వెనుకబడే ఉంటుంది. చాలా వరకు నగరాలు, పట్టణాలలో సేకరించని చెత్త, పాద చారుల హక్కులకు తిలోదకాలిచ్చేస్తూ ఫుట్పాత్లపై వ్యాపారాలు, వీధులను ముంచెత్తే ట్రాఫిక్ నత్తనడక సాగుతుండటం, రోడ్ల మీద గుంతలు, మురికి వాడలే గాక గూడు కరువు కావడం, అందుబాటులో లేని వసతి సదుపాయాలు కనీసంగా ఉండే ప్రతికూలాం శాలు. అయినా మనది వేగంగా పట్టణీకరణ సాగుతున్న దేశం. ఈ లోటుపాట్లన్నీ అసలు నగరాలకు స్వాభావిక మైనవే అన్నట్టు ఉంటుంది పరిస్థితి. మన ప్రణాళికా రచన, విధానాల అమలు ఎంత అధ్వానంగా ఉంటాయో ఇది వేలెత్తి చూపుతుంది. ఆర్థికపరమైన ప్రతిబంధకాల వంటి కారణాలు కూడా ఉండవచ్చు గానీ... అవినీతి, అధ్వానమైన అమలు అనే రంధ్రా లను పూడ్చుకోగలిగితే ఆ సమస్యను సులువుగా అధిగమించవచ్చు. చివరకు ఇదంతా కలసి ప్రజా జీవితంలో కానరాకుండా పోయిన నిజాయితీ వద్దకు చేరుస్తాయి. విపత్కరమైన ఈ క్షీణత కొనసాగడాన్ని అను మతించడానికి పౌరులు సుముఖంగా ఉండటం మరిం తగా ఆందోళనకలిగించే అంశం. అయినా పట్టణాలు, నగరాలు వృద్ధి చెందుతూనే ఉంటాయి. గతానుభ వంపై ఆధారపడి పౌరులలో నెలకొన్న నిరాశావాదం, సుపరిపాలన కొరవడటం కొనసాగుతూ ఉండటం, పౌరులకు ఇంతకంటే మెరుగైనదానికి దేనికీ అర్హత లేదని, ఇప్పటికే వారికి చాలా చేసేశామని పాలక వర్గా లలో ఉన్న విశ్వాసాల పర్యవసానమిది. కాబట్టి ఇక మార్పు దేనికి? వ్యాసకర్త: మహేష్ విజాపృకర్ సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ :mvijapurkar@gmail.com -
పార్టీలకతీతంగా పట్టణాభివృద్ధికి కృషి
ఆదిలాబాద్ కల్చరల్ : పార్టీలకతీతంగా పట్టణాభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగురామన్న అన్నారు. ఆదివారం మున్సిపల్ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అన్ని మతాల మతగురువులతో మంత్రోచ్ఛరణలతో పూజలు చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పట్టణాభివృది్ధకి రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ జిల్లా పర్యాటనలో భాగంగా విడుదల చేయాల్సి ఉన్న నిధులు ఆయన పర్యాటన రద్దుతో విడుదల చేస్తున్నట్లు చెప్పారు. అందరం కలిసికట్టుగా పట్టణాభివృది్ధకి పాటుపడాలని చెప్పారు.మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీశ మాట్లాడుతూ ప్రభుత్వం పట్టణాభివృద్ధికి అన్ని రకాలుగా పాటుపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ దామోదర్రెడ్డి, జిల్లా ఎస్పీ శ్రీనివాస్, మున్సిపల్ వైస్చైర్మన్ ఫరూక్ అహ్మద్, జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు అందే శ్రీదేవి, ధోని జ్యోతి, జహీర్రంజానీ, మెస్రం కృష్ణ, బండారి సతీష్, గండ్రత్రాజేందర్, బాషం నర్సింగ్, సందపుష్ప, ప్రకాష్ ఉన్నారు. -
మాస్టర్ ప్లాన్
మార్చి 4న నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు జూన్ 2న ఔటర్ పనులకు శంకుస్థాపన డిప్యూటీ సీఎం కడియం, మంత్రి కేటీఆర్ నిర్ణయం గ్రేటర్ వరంగల్ అభివృద్ధిపై సమీక్ష వరంగల్ : వరంగల్ మహానగరాన్ని అభివృద్ధి చేసేందుకు రూపొందించిన ప్రణాళికలను త్వరగా ఆచరణలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నగర అభివృద్ధికి కీలకమైన మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు గడువు నిర్ణయించారు. మార్చి 4న వరంగల్ మహానగరం మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మునిసిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్రోడ్డు నిర్మాణ పనులను వచ్చే జూన్ 2న మొదలుపెట్టాలని నిర్ణయించారు. వరంగల్ మహానగరం అభివృద్ధి కార్యక్రమాలపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మున్సిపల్ మంత్రి కేటీఆర్ హైదరాబాద్లోని సచివాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘వరంగల్ మహానగరం అభివృద్ధికి అవసరమైన మాస్టర్ ప్లాన్ను వెంటనే రూపొందించాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న మాస్టర్ ప్లాన్ 1971లో రూపొంచిందించి. మహానగరం అభివృద్ధికి దోహదపడేలా ఇది లేదు. కొత్త మాస్టర్ప్లాన్పై కసరత్తు చేయాలి. మార్చి 4న మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్ను విడుదల చేయాలి. కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించే వరకు భవన నిర్మాణ అనుమతులలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవద్దు. భూగర్భ డ్రెయినేజీ, రేడియల్ రోడ్లు, స్లి్పట్ రోడ్లు, పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్, వినోద కేంద్రాలు ఉండేలా మాస్టర్ ప్లాన్ ఉండాలి. ఏడాదిలోపు సమగ్రమైన మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. వరంగల్ నగర అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నా... పనుల్లో జాప్యం జరుగుతోంది. అధికా>రులు ఇప్పటికైనా శ్రద్ధ పెట్టాలి. వరంగల్ ఔటర్ రింగ్రోడ్డు పనులపై ఏడాదిగా చెబుతున్నా పనులు జరగడం లేదు. ఈ పనులపై వెంటనే షెడ్యూల్ సిద్ధం చేయాలి. జూన్ 2న ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభించాలని నిర్ణయించాము. అప్పటిలోపు అవసరమైన భూసేకరణ, డీపీఆర్ పనులు పూర్తి చేయాలి. 2018 నాటికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళిక ఉండాలి. 72 కిలోమీటర్ల పొడవుతో నిర్మించే ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రతి 20 కిలో మీటర్లకు ఒక విశ్రాంతి కేంద్రం, రేడియల్ రోడ్లు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వసతులను ఏర్పాటు చేసేలా ప్రణాళిక ఉండాలి. టెండర్లు పిలిచేలోపే మొత్తం భూసేకరణ జరగాలి. భూసేకరణ విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి’ అని అధికారులకు ఇద్దరు మంత్రులు ఆదేశాలు జారీచేశారు. ఔటర్ రింగ్రోడ్డు, మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై సమీక్ష కోసం ప్రతి నెలా వరంగల్లో సమావేశం జరగాలని నిర్ణయించారు. బుధవారం జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష కోసం మార్చి 4న సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బి.వి.పాపారావు, గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్యేలు డి.వినయభాస్కర్, అరూరి రమేశ్, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎం.యాదవరెడ్డి, మున్సిపల్ శాఖ కార్యదర్శి నవీన్మిట్టల్, రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ రవీందర్రావు, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ శృతిఓజా తదితరులు పాల్గొన్నారు. -
ఏకపక్షంగా ఉండం..
రాజకీయాలకతీతంగా నగరాభివృద్ధి అందరి అభిప్రాయాలూ పరిగణనలోకి.. అభివృద్ధి, సుందరీకరణల్లో వెనుకడుగు లేదు మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సిటీబ్యూరో: నగరాభివృద్ధే లక్ష్యంగా... రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగుతున్నామని మునిసిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. గ్రేటర్లోని అభివృద్ధి కార్యక్రమాలపై గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరానికి చెందిన మంత్రులతోపాటు వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగిన ఈ సమావేశం అనంతరం వివరాలను విలేకరులకు వెల్లడించారు. మొత్తం 390 కి.మీ.ల మేర నాలాలుండగా 216 కి.మీ.ల మేర సర్వే పూర్తరుుందని, ఇప్పటి వరకు 8239 అక్రమ నిర్మాణాలను గుర్తించినట్లు తెలిపారు. నాలాల ఆధునికీకరణలో రీ డిజైన్ చేయడం, నాలాల లోతు పెంచడం తదితర ప్రత్యామ్నాయలన్నీ పరిగణనలోకి తీసుకొని తొలగించాల్సిన ఇళ్ల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తామన్నారు. 169 చెరువుల్లో పూడికతీత తదితర పనులతో వాటిల్లో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రెండుమూడు నెలలకోమారు ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. తదుపరి సమావేశాలు జనవరి 3 లేదా 4వ తేదీల్లో, తిరిగి ఫిబ్రవరిలో 25 లేదా 26 తేదీల్లో జరుగుతాయన్నారు. సంవత్సరం పొడవునా నాలాల్లో డీసిల్టింగ్ నిర్వహించే కార్యక్రమం జనవరి నుంచి మొదలవుతుందన్నారు. ఈ పనులకు ఎక్కువ లెస్తో కాంట్రాక్టు దక్కించుకుంటున్నవారు పనులు చేయడం లేరని, ఇకపై పారదర్శకంగా పనులు నిర్వహిస్తామన్నారు. నాలాల ఆధునికీకరణ తదితర నిర్మాణాల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రీకాస్ట్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తామన్నారు. నిర్మాణ పనులు లేక కూలీలకు ఇబ్బందిగా ఉన్నందున రెండు పడకల ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామన్నారు. దాదాపు 15 వేల ఇళ్లకు టెండర్లను 7వ తేదీన తెరవనున్నట్లు చెప్పారు. అసంపూర్తిగా మిగిలిన దాదాపు 30 వేల జేఎన్ఎన్యూఆర్ఎం, వాంబే ఇళ్లకు రూ. 300 కోట్లతో మౌలిక సదుపాయాల పనులు వెంటనే చేపట్టనున్నట్లు తెలిపారు. శివార్లలో రూ. 2 వేల కోట్లతో 2700 కి.మీ.ల మేర తాగునీటి పథకానికి పైప్లైన్ పనులకు రోడ్లు తవ్వాల్సి ఉందని చెబుతూ, పునరుద్ధరణ పనులకు టెండర్లు పూర్తయ్యాకే రోడ్లుతవ్వుతామన్నారు.ఇళ్ల నిర్మాణానికి, బస్ షెల్టర్లు, పబ్లిక్ టాయ్లెట్లు తదితర పనులకు అన్నిపార్టీల వారూ తమ పూర్తి సహకారమందిస్తామన్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి నిధులు సైతం కేటారుుస్తామని ముందుకొచ్చారన్నారు. జీహెచ్ఎంసీ, జలమండలి సమన్వయంతో పనులు చేయాలని సూచించామని, ఆయా పనుల వద్ద వాటి వివరాలు తెలిపే బోర్డులను కచ్చితంగా ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. పెట్రోలు బంకులతో సహ నగరంలో 900 పబ్లిక్ టాయ్లెట్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జీహెచ్ఎంసీకి రావాల్సిన నిధులు, ఇతరత్రా అంశాలపై విసృ్తతంగా చర్చించామన్నారు. విలేకరుల సమావేశంలో బీజేపీ, ఎంఐఎంల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మొత్తం ఎనిమిది అంశాలపై విసృ్తతంగా చర్చించారు. ఇంకా.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి క్లియర్ టైటిల్ ఉన్న ప్రాంతాల గురించి వివరాలివ్వాల్సిందిగా ఎమ్మెల్లేలను కోరారు. అవసరమైతే అదనపుఇళ్ల నిర్మాణం. హైదరాబాద్ యూనిట్గా కేటారుుంపులు. ఎస్సార్డీపీ, రోడ్ల విస్తరణకు సంబంధించి 489 పనులకు రూ. 75 కోట్లతో చేపట్టిన పనుల్లో 260 పనులు పూర్తి. ఈ వారంలో 105 పనులు ప్రారంభం.షామీర్పేట,జూబ్లీబస్స్టేషన్, ఉప్పల్, రోడ్డునెంబర్ 45లలో నాలుగు స్కైవేలు ఎస్సార్డీపీ మొదటిదశలో నిర్మాణం. 54 జంక్షన్లలో అభివృద్ధి పనులు. చార్మినార్ పాదచారుల పథకం ఏళ్లతరబడి పూర్తికాకపోవడంపై సమావేశంలో కేటీఆర్ అసహనం. విలేకరుల సమావేశంలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలా మాట్లాడుతూ... డీఆర్సీ లేని కొరత ఈ సమావేశంతో తీరిందన్నారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్అలీ, మంత్రులు నారుుని నరసింహారెడ్డి, తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్, ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, అధికారులు నవీన్మిట్టల్, జనార్దన్రెడ్డి, దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు. నిధులేవీ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీ రావాల్సిన నిధులు వృత్తిపన్ను వాటా, ఇతరత్రా గ్రాంట్లు రాకపోవడంపై సమావేశంలో ఎమ్మెల్సీజాఫ్రి ప్రశ్నించిన ట్లు తెలిసింది. తననియోజకవర్గంలో జరిగే పనుల్లో తనకు ఆహ్వానం లేకపోవడంపై ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వాదనకు దిగినట్లు తెలిసింది. -
వాహ్..విశాఖ
- టాప్టెన్ మున్సిపాలిటీలు,కార్పొరేషన్లలో విజయవాడకు దక్కని చోటు - మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ నివేదికలో వెల్లడి సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో ఉత్తమంగా నిలిచిన పది మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల జాబితాలో విశాఖపట్నం కార్పొరేషన్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో తాత్కాలిక రాజధాని విజయవాడ చోటు దక్కించుకోలేకపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నగరం నుంచే పరిపాలన నడిపిస్తున్నా పరిస్థితిలో మార్పురాలేదు. సేవలు, సౌకర్యాల్లో చిన్న పట్టణాల స్థాయిని కూడా విజయవాడ అందుకోలేకపోయింది. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 97 మున్సిపాలిటీల్లో టాప్ టెన్ జాబితాను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఇటీవల ప్రకటించింది. అందులో విశాఖపట్నం కార్పొరేషన్ మొదటి స్థానంలో నిలవగా, అనంతపురం జిల్లాలోని హిందూపురం మున్సిపాలిటీ రెండో స్థానంలో, పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు మున్సిపాలిటీ మూడో స్థానంలో నిలిచాయి. నాలుగో స్థానంలో గుంటూరు కార్పొరేషన్, ఐదో స్థానంలో గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట, ఆరో స్థానంలో నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, ఏడో స్థానంలో అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, ఎనిమిదో స్థానంలో తూర్పుగోదావరిలోని అమలాపురం, తొమ్మిదో స్థానంలో ప్రకాశం జిల్లా చీరాల, పదో స్థానంలో అనంతపురం జిల్లాలోని గుంతకల్ నిలిచాయి. 11 అంశాలకు వంద మార్కులిచ్చి ఎక్కువ మార్కులు వచ్చిన టాప్ పది మున్సిపాలిటీలను ఎంపిక చేశారు. విశాఖపట్నం కార్పొరేషన్కు 53.09 శాతం మార్కులురాగా, హిందూపురం మున్సిపాలిటీకి 50.88, కొవ్వూరు మున్సిపాలిటీకి 49.94 మార్కులొచ్చాయి. సేవలు, సౌకర్యాలు చెత్తే.. తాత్కాలిక రాజధాని వీటి స్థాయిని కూడా అందుకోలేక చతికిలబడింది. ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించడం, చెత్తను డంపింగ్ యార్డులకు తరలించడం, ఆస్తి పన్ను వసూళ్లు, సిటిజన్ చార్టర్ అమలు, ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను పరిష్కరించడం, ఆర్థిక పరిస్థితి, స్కూళ్లలో ఐఐటీ ఫౌండేషన్, వ్యక్తిగత, ఉమ్మడి మరుగుదొడ్ల ఏర్పాటు-నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు నిర్వహణ, టౌన్ప్లానింగ్ కార్యకలాపాలు, డ్వాక్రా గ్రూపులకు రుణాలు, స్కిల్ డెవలప్మెంట్, గ్రీనరీ ఏర్పాటులో పని తీరును బట్టి మార్కులిచ్చారు. ఈ అంశాల్లో దేనిలోనూ విజయవాడ కార్పొరేషన్కు మార్కులు వచ్చే పరిస్థితి లేదు. చెత్త నిర్వహణ అధ్వానంగా తయారవడంతో స్థానికుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. విజ్ఞప్తుల పరిష్కారంలోనూ కార్పొరేషన్ బాగా వెనుకబడింది. మిగిలిన అన్ని విషయాల్లోనూ అంతంత మాత్రంగానే ఉంది. కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి మరీ దారుణం. మొన్నటివరకూ జీతాలిచ్చే పరి స్థితి కూడా లేదు. అన్నింట్లో వెనుకబడిన తాత్కాలిక రాజధాని టాప్టెన్ జాబితాలో చోటు దక్కించుకోవడం అత్యాశే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
లెక్కలు కాదు..పక్కాగా ఉండాలి
మూసీ పర్యటనలో అధికారులను కోరిన మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై {పశ్నల వర్షం తత్తరపాటుకు గురైన మున్సిపల్ శాఖ అధికారులు సిటీబ్యూరో : ‘మహా నగర అభివృద్ధికి సంబంధించి మేం విధానపరమైన నిర్ణయాలు తీసుకొనేందుకు అవగాహన కావాలి. మూసీకి గత వైభవం తెచ్చేందుకు మీరు చెప్పాల్సింది ఏమంటే... నగరంలో ఏ ప్రాంతం నుంచి ఎంత సీవరేజి వ స్తోంది..? గతంలో ఎంత ఫ్లో ఉండేది... ? ఇప్పుడెంత పెరిగింది ..? ఏం చేస్తే ప్రయోజనం ఉంటుందో... మీరు గైడ్ చేయండి. వివిధ నాలాల్లో ఎంత సీవరేజీ వస్తోందో లెక్కించకుండా పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏంటీ..? అని మునిసిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ప్రశ్నించారు. దుర్గం చెరువు వద్ద 5ఎంఎల్డి ఎస్టీపీ ఉండగా, అక్కడ 25ఎంఎల్డి సీవరేజీ వస్తోంది.. దాన్ని నేరుగా చెరువులో కలుపుతున్నారు. దీనివల్ల ఏం ప్రయోజనం అని మంత్రి నిలదీయడంతో అధికారులు తత్తరపాటుకు గురయ్యారు. మూసీ పర్యటనలో భాగంగా అంబర్పేట లోని 339 ఎంఎల్డి ఎస్టీపీ (సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్)ను సోమవారం మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా జలమండలి అధికారులు సీవరేజ్ నెట్వర్క్పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ 100శాతం మురుగునీటిని శుద్ధి చేసేందుకు మనవద్ద వ్యవస్థ ఉందా..? అని ప్రశ్నించారు. ఫలానా నగరంలో ఇలాంటి వ్యవస్థ ఉంది. హైదరాబాద్లో కూడా అమలు చేస్తే బాగుంటుందంటూ చెప్పాలని కోరడంతో ఎవరూ నోరు విప్పలేదు. బార్సిలోనాలో స్లార్మ్వాటర్ డ్రైన్లు అభివృద్ధి చేశారని మంత్రి చెబుతూ మన నగరంలో 51 నాలాలు ఉన్నాయని, ఎంత వాటర్ ఫ్లో అవుతోంది. ఓపెన్ నాలాలు ఎన్ని..? క్లోజ్డ్ నాలాలు ఎన్ని ఉన్నాయి..? ఎక్కడెక్కడ ఎస్టీపీలు నిర్మించాలో సూచించాలనడంతో అధికారులు నీళ్లు నమిలారు. నగరంలో నాలాలు ఆక్రమణలకు గురైనందున వర్షాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈపీటీఆర్ అధికారి కల్యాణ్ చక్రవర్తి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నగరంలో కొత్తగా 10చోట్ల ఎస్టీపీల నిర్మాణానికి ప్లాన్స్ చేశామని అధికారులు తెలిపారు. అనంతరం జీహెచ్ఎంసీ అధికారులు నాగోలు నుంచి ఓఆర్ఆర్ ఈస్ట్ వరకు రూ.6వేల కోట్ల అంచనాతో సిద్ధం చేసిన ప్రతిపాదనలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. దీనిని పరిశీలించిన మంత్రి మూసీలో పిల్లర్లు వేసి పైన 26కి.మీ. దూరం రివర్ బెల్ట్లో స్కైవే నిర్మించేలా జీహెచ్ఎంసీ ప్లాన్ చేసిందని, దీనివల్ల పర్యావరణ పరంగా ఇబ్బందులేవీ లేవా అని ఆరా తీశారు. సుప్రీం కోర్టు సూనలను అధ్యయనం చేశాకే ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. మూసి దిగువ ప్రాంతంలో వాగుల అనుసంధానంపై ఇరిగేషన్ విభాగం అధికారులను అడిగారు ఆరాతీశారు. మూసీ సుందరీకరణకు నీళ్లు ఉండాలని, ఎగువ భాగంలో నీళ్లు ఆపితే కింద ప్రాంతాలైన నల్గొండ జిల్లాలో ఇబ్బందులు పడతారని, ఎంత ఫ్లో ఉంటే కిందకు నీళ్లు వెళతాయి..? రబ్బర్ డ్యాంలు ఎన్ని ఉండాలి..? అక్కడ ఎంత నీరు స్టోరేజీ ఉండాలి అని ప్రశ్నించగా, అధికారుల నుంచి సమాధానం లేకపోవడంతో ప్రస్తుతం ఉప్పల్ భగత్ వద్ద 3.3కి.మీ స్ట్రెచ్ రెడీగా ఉందని, 1కి.మీ. మేర అభివృద్ధి చేసి అక్కడ ఎంత మేర నీళ్లు ఉండాలో ప్రయోగాత్మకంగా పరిశీలించాలని ఆదేశించారు. అయితే... మూసీలో అత్తాపూర్ వద్ద తొలి ప్రయోగం చేద్దామని జీహెచ్ఎంసీ కమిషనర్ సూచించగా నెల రోజుల్లో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. మూసీ వెంట సువాసనలు వచ్చే మొక్కలను నాటి అభివృద్ధి చేయాలని హెచ్ఎండీఏ అర్భన్ ఫారెస్ట్రీ అధికారులకు ఆదేశించారు. మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు విషయంలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, జలమండలి, ఇరిగేషన్ విభాగాలు సమన్వయంతో పనిచేసి నెల రోజుల్లో నివేదికను సిద్ధం చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. పర్యటన సాగిందిలా... బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు కార్యాలయం నుంచి ఉదయం 10.30 గంటలకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, మేయర్ రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి, ఇరిగేషన్ విభాగాల అధికారులు మూసీ పరివాహక ప్రాంత పర్యటనకు బయలు దేరారు.తొలుత నాగోలు సమీపంలోని మూసీ బ్రిడ్జి వద్దకు 11.30గం.లకు చేరుకొని అక్కడ హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన ఉప్పల్ భగత్ లేఅవుట్ను సందర్శించారు. అనంతరం దిగువనే ఉన్న మూసీ నదిని పరిశీలించి అక్కడ సుందరీకరణకు గల అవకాశాలపై అధికారులను అడిగి తెలుసుకొన్నారు. 12 గం.లకు అంబర్పేటలోని 339 ఎంఎల్డి ఎస్టీపీని సందర్శించారు.2.30గం.లకు తారామతి బారాదరికి చేరుకొని అక్కడ భోజనం ముగించాక 3.30గంటలకు మీడియాతో మాట్లాడారు. సరిగ్గా 4.గం.లకు బయలుదేరి బాపూ ఘాట్ వద్ద మూసీనది-ఈసీ నది కలిసే ప్రాంతాన్ని సందర్శించారు. -
సగం స్థానాలు మహిళలకే
జీహెచ్ఎంసీ వార్డుల రిజర్వేషన్ల నోటిఫికేషన్ జారీ ♦ మహిళల(జనరల్)కు 44, బీసీలకు 50, ఎస్సీలకు 10, ♦ ఎస్టీలకు 2, రిజర్వు కానివి 44 ♦ అన్ని కేటగిరీలు కలిపి మహిళలకు 75 వార్డుల కేటాయింపు సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ జారీకి కొద్దిసేపు ముందు ప్రభుత్వం జీహెచ్ఎంసీ వార్డుల రిజర్వేషన్లను వెల్లడించింది. ఈ మేరకు మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ శుక్రవారం జీవో (నంబర్ 25)ను జారీ చేసింది. ఈ జీవో వెలువడిన దాదాపు గంటన్నర వ్యవధిలో ఎన్నికల షెడ్యూల్ను జారీ చేశారు. గ్రేటర్లోని మొత్తం 150 వార్డులకు(డివిజన్లకు)గాను స్థానిక సంస్థల్లో మహిళల కోటాగా 50 శాతం రిజర్వేన్లను వారికి వర్తింపజేస్తూ, ఆయా వర్గాలకు వార్డులను ఖరారు చేశారు. మొత్తం 150 వార్డులకు గాను మహిళ(జనరల్)కు 44, బీసీలకు 50, ఎస్సీలకు 10, ఎస్టీలకు 2 వార్డులు రిజర్వు చేశారు. ఇవిపోను ఓపెన్ కేటగిరీలో 44 వార్డులు కేటాయించారు. మహిళలకు 75 సీట్లు.. మహిళల కోటాలో భాగంగా 75 సీట్లు వారికి దక్కేందుకు జనరల్లో 44 వార్డులు, బీసీల్లో 25 వార్డులు , ఎస్సీల్లో 5 వార్డులు, ఎస్టీల్లో 1 వార్డు చొప్పున కేటాయించారు. వార్డుల వారీగా రిజర్వేషన్లు ఎస్టీ జనరల్(1): డివిజన్ నంబర్-46 (ఫలక్నూమా) ఎస్టీ మహిళ(1): 16 (హస్తినాపురం) ఎస్సీ జనరల్(5): 1 (కాప్రా), 4 (మీర్పేట్ హెచ్బీ కాలనీ), 62(జియాగూడ), 133 (మచ్చబొల్లారం), 135(వెంకటాపురం) ఎస్సీ మహిళ(5): 60(రాజేంద్రనగర్), 90 (కవాడిగూడ), 142(అడ్డగుట్ట), 144(మెట్టుగూడ), 147(బన్సీలాల్పేట్) బీసీ జనరల్(25): 3(చర్లపల్లి), 29 (చావ్నీ), 39(సంతోష్నగర్), 43(చాంద్రాయణగుట్ట) 48(శాలిబండ), 51(గోషామహల్), 52(పురానాపూల్), 53(దూద్బౌలి), 54(జహనూమా), 55(రామ్నస్పురా), 56 (కిషన్బాగ్), 58(శాస్త్రీపురం), 64(దత్తాత్రేయనగర్), 65(కార్వాన్), 69(నానాల్నగర్) , 70(మెహిదీపట్నం), 71(గుడిమల్కాపూర్), 83(అంబర్పేట్), 88(భోలక్పూర్), 103 (బోరబండ), 112(రామచంద్రాపురం), 113 (పటాన్చెరు), 125(గాజులరామారం), 126 (జగద్గిరిగుట్ట), 127(రంగారెడ్డి నగర్) బీసీ మహిళ(25): 9(రామాంతపూర్), 26 (ఓల్డ్మలక్పేట్), 34(తలాబ్చంచల్), 35 (గౌలీపుర), 37(కుర్మగూడ, 41(కంచన్బాగ్), 42(బార్కాస్), 47(నవబ్సాహెబ్కుంట), 49 (ఘాన్సీబజార్), 57(సులేమాన్నగర్), 61(అత్తాపూర్), 63(మంగళ్హాట్), 67(గోల్కొండ) , 68(టోలీచౌకీ), 72(ఆసిఫ్నగర్), 73(విజయనగర్కాలనీ), 74(అహ్మద్నగర్), 75(రెడ్హిల్స్), 76(మల్లేపల్లి), 82(గోల్నాక), 86 (ముషీరాబాద్), 101(ఎర్రగడ్డ), 128(చింత ల్),146(బౌద్దనగర్), 148(రాంగోపాల్పేట్) విమెన్ జనరల్(44): 2(డాక్టర్ ఎ.ఎస్.రావునగర్), 6(నాచారం), 7(చిలుకానగర్), 8(హబ్సీగూడ) , 10(ఉప్పల్) , 11(నాగోల్), 19(సరూర్నగర్), 20(ఆర్కేపురం), 24(సైదాబాద్), 25(మూసారాంబాగ్), 28(అజాంపుర) , 33(మోఘల్పురా), 38(ఐఎస్ సదన్), 66(లంగర్హౌజ్), 78(గన్ఫౌండ్రీ), 79(హిమాయత్నగర్), 80(కాచిగూడ), 81(నల్లకుం ట), 84(బాగ్అంబర్పేట్), 85(అడిక్మెట్), 89(గాంధీనగర్) , 91(ఖైరతాబాద్), 92(వెంకటేశ్వరకాలనీ), 97(సోమాజిగూడ), 98(అమీర్పేట్), 100(సనత్నగర్), 109(హఫీజ్పేట్) , 110(చందానగర్) , 111(భారతీనగర్), 115(బాలాజీనగర్), 116(అల్లాపూర్), 122(వివేకానంద్నగర్ కాలనీ), 130(సుభాష్నగర్), 131(కుత్బుల్లాపూర్), 132(జీడిమె ట్ల), 134(అల్వాల్), 136(నేరేడ్మెట్), 137(వినాయక్నగర్), 138(మౌలాలి), 141(గౌతంనగర్),143(తార్నాక),145(సీతాఫల్మండి), 149(బేగంపేట్),150(మోండామార్కెట్). అన్రిజర్వ్డ్(44): 5(మల్లాపూర్), 12(మన్సూరాబాద్), 13(హయత్నగర్), 14(బీఎన్రెడ్డి నగర్), 15(వనస్థలీపురం), 17(చంపాపేట్), 18(లింగోజీగూడ), 21(కొత్తపేట్), 22(చైతన్యపురి), 23(గడ్డి అన్నారం), 27(అక్బర్బాగ్), 30(డబీర్పురా), 31(రెయిన్బజా ర్), 32(పత్తర్గట్టి), 36(లలితాబాగ్), 40(రియాసత్నగర్), 44(ఉప్పుగూడ), 45(జంగంమెట్), 50(బేగంబజార్), 59(మైలార్దేవుపల్లి), 77(జాంబాగ్), 87(రాంనగర్), 93 (బంజారాహిల్స్), 94(షేక్పేట్), 95(జూబ్లీహిల్స్), 96(యూసఫ్గూడ), 99(వెంగళ్రావునగర్), 102(రహమత్నగర్), 104(కొండాపూర్),105(గచ్చిబౌలి), 106(శేరిలింగంపల్లి), 107(మాదాపూర్), 108(మియాపూర్), 114(కేపీహెచ్బీ కాలనీ), 117(మూసాపేట్), 118(ఫత్తేనగర్), 119(ఓల్డ్బోయిన్పల్లి), 120 (బాలానగర్), 121(కూకట్పల్లి), 123(హైదర్నగర్), 124(ఆల్వీన్కాలనీ), 129(సూరారం), 139(ఈస్ట్ఆనంద్బాగ్), 140 (మల్కాజిగిరి). -
‘చారిత్రాత్మక’ బాధ్యతల నుంచి హెచ్ఎండీఏ ఔట్
సాక్షి, హైదరాబాద్: చారిత్రాత్మక కట్టడాలు/ప్రాంతాల పరిరక్షణ బాధ్యతల నుంచి హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)ను రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి గోపాల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఏపీ అర్బన్ డవలప్మెంట్ ఆథారిటీ చట్టంలో చారిత్రాత్మక ప్రాంతాల సంరక్షణకు సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవు. అయినప్పటికీ 1995లో అప్పటి ప్రభుత్వం జీవో 542 ద్వారా ఈ బాధ్యతలను హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థ(హుడా)కు అప్పగించింది. తదనంతరం హెచ్ఎండీఏ చట్టంలో 13వ నిబంధనగా చారిత్రాత్మక కట్టడాల పరిరక్షణ చేరిపోయింది. అయితే, 13వ నిబంధన.. ఏపీ అర్బన్ డవలప్మెంట్ ఆథారిటీ చట్టంతో సంబంధం లేదని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వొకేట్ జనరల్ తేల్చి చెప్పడంతో తాజాగా చట్టం నుంచి ఈ నిబంధనను ప్రభుత్వం తొలగించింది. -
ఎట్టకేలకు ‘పుర’ ఫైళ్ల కదలిక
50కి పైగా ఆమోదించిన సీఎం జీహెచ్ఎంసీ సీఈ వీఆర్ఎస్ తిరస్కృతి హైదరాబాద్ : ముఖ్యమంత్రి కార్యాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పెండింగ్ ఫైళ్లకు ఎట్టకేలకు మోక్షం లభిస్తోంది. సీఎం కె.చంద్రశేఖర్రావు సోమవారం 50కి పైగా పెండింగ్ ఫైళ్లపై నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాలంలో సీఎంఓ నుంచి పురపాలక శాఖకు ఒకటీ రెండు ఫైళ్లు తిరిగి రావడం అరుదైన విషయంగా మారగా... ఒకేసారి 50 ఫైళ్లపై సీఎం సంతకాలు పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. పరిశ్రమల స్థాపన కోసం భూ వినియోగ మార్పిడి అనుమతులు కోరుతూ టీఎస్-ఐపాస్కు వచ్చిన దరఖాస్తులతో పాటు పురపాలక శాఖలోని కొందరు అధికారుల పదోన్నతులు, బదిలీలు, వైద్య బిల్లుల చెల్లింపులు, కారుణ్య నియామకాలకు సంబంధించిన పదుల సంఖ్యలో ఫైళ్లు సీఎం ఆమోదం పొంది పురపాలక శాఖకు తిరిగి చేరుకున్నాయి. నిజామాబాద్కు మునిసిపల్ కమిషనర్.. ఆర్నెల్ల కిందటి ఓ ప్రతిపాదనకు మోక్షం లభించడంతో మంగళవారం నిజామాబాద్మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్గా నాగేశ్వర్, అదనపు కమిషనర్గా విశ్వనాథంకు పోస్టింగ్ కేటాయిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలలుగా నాగేశ్వర్ పోస్టింగ్ లేక ఖాళీగా ఉన్నారు. ఆరేళ్ల కింద తల్లిదండ్రులిద్దరూ చనిపోగా అనాథగా మారిన యువతి ప్రియాంక కారుణ్య నియామకం కింద జల మండలిలో తండ్రి ఉద్యోగాన్ని త్వరలో పొందనున్నారు. దాదాపు ఏడాది నిరీక్షణ తర్వాత ఈ ఫైల్కు మోక్షం లభించింది. కొందరు ఉద్యోగుల వైద్య బిల్లుకు సంబంధించిన ైఫైళ్లు సైతం ఏడాది తర్వాతే ఆమోదం పొందాయి. ఇదిలా వుండగా, జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఇంతియాజ్ అహమ్మద్ స్వచ్ఛంద పదవి విరమణ కోసం నెల రోజుల కింద పెట్టుకున్న దరఖాస్తును సీఎం కేసీఆర్ తిరస్కరించారు. ప్రభుత్వ సర్వీసులో కొనసాగాలని ఇంతియాజ్కు సూచించినట్లు సమాచారం. కొండలా పేరుకుని.. సీఎం సొంత శాఖల్లో పురపాలక, పట్టణాభివృద్ధి ఒకటి. సీఎం సంతకం కోసం పురపాలక శాఖ నుంచి వెళ్తున్న ఫైళ్లు సీఎంఓలోనే పేరుకుపోతుండడంతో పెండింగ్ ఫైళ్ల సంఖ్య వేలల్లో వుంది. వివిధ శాఖలకు సంబంధించి 6,500కు పైగా ఫైళ్లు పెండింగ్లో ఉండగా, అందులో సగం పురపాలక శాఖకు సంబంధించినవేనని సమాచారం. సీఎంఓలో పురపాలక శాఖను పర్యవేక్షిస్తున్న ముఖ్యకార్యదర్శి నర్సింగ్రావు పెండింగ్ ఫైళ్ల విషయంలో చొరవ తీసుకోవడం లేదని విమర్శలున్నాయి. -
గడువు.. 60 రోజులు
సాక్షి, హైదరాబాద్: అక్రమ భవనాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకాలు అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలోని అక్రమ కట్టడాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి గోపాల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చివరిసారిగా(వన్టైం) అక్రమాల క్రమబద్ధీకరణ జరుపుతున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. దరఖాస్తు చేసుకోడానికి 60 రోజుల గడువు విధించింది. లే అవుట్ల క్రమబద్ధీకరణ 2015 అక్టోబర్ 28 నుంచి అమల్లోకి రాగా.. భవనాల క్రమబద్ధీకరణ మాత్రం నవంబర్ 3 నుంచి అమల్లోకి రానుంది. కటాఫ్ కీలకం.. క్రమద్ధీకరణకు కటాఫ్గా 2015 అక్టోబర్ 28వ తేదీని ఖరారు చేశారు. ఈ కటాఫ్ లోపు రిజిస్ట్రరైన లే అవుట్లు/ప్లాట్లతో పాటు నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించనున్నారు. అయితే 1985 జనవరి 1కి ముందు నాటి భవనాలకు మినహాయింపు కల్పించారు. 1985 జనవరి 1 నుంచి 2015 అక్టోబర్ 28 లోపు నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణ తప్పనిసరి. కటాఫ్ తేదీ నిర్ధారణ కోసం లే అవుట్లు/ప్లాట్ల విషయంలో సేల్స్ డీడ్ రిజిస్ట్రేషన్ తేదీని మాత్రమే పరిగణలోకి తీసుకోనున్నారు. కటాఫ్ లోపు నిర్మితమైన భవనాలను గూగుల్ మ్యాప్స్లోని ఉపగ్రహ చిత్రాల ఆధారంగా గుర్తిస్తారు. క్రమబద్ధీకరించుకోకుంటే కూల్చివేతే.. క్రమబద్ధీకరించుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించినా ఉపయోగించుకోకుండా నేరాన్ని కొనసాగిస్తున్నట్లు పరిగణించి భారీ జరిమానాలను విధించనున్నారు. స్థానిక పురపాలికలు క్రమబద్ధీకరించుకోని భవనాల కూల్చివేత, ఇతర తీవ్ర చర్యలకు ఉపక్రమించనున్నాయి. సదరు భవనం ఉన్న స్థలంలో తదుపరి నిర్మాణాలకు సైతం అనుమతులు నిరాకరించనున్నారు. ఇక అక్రమ లే అవుట్లకు సాధారణ కేటగిరీ కింద నల్లా కనెక్షన్, డ్రైనేజీ, సీవరేజీ సేవలను నిలిపేయనున్నారు. అక్రమ లే అవుట్ల రిజిస్ట్రేషన్లు జరగకుండా రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన నిషేధిత జాబితాలో చేర్చనున్నారు. అక్రమ లే అవుట్లలో భవనాల నిర్మాణాలకు అనుమతులు నిరాకరించడంతో పాటు ఒకవేళ నిర్మిస్తే కూల్చివేయనున్నారు. దరఖాస్తు తర్వాత కూడా నిర్మాణాలను కొనసాగిస్తే దరఖాస్తును తిరస్కరించడంతో పాటు వసూలు చేసిన ఛార్జీలను జప్తు చేసుకోనున్నారు. చార్జీల మోత... గతంతో పోల్చితే క్రమబద్ధీకరణ చార్జీలు 40-70 శాతం వరకు పెరిగాయి. క్రమబద్ధీకరణ చార్జీలకుతోడుగా అభివృద్ధి రుసుం సైతం చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలోనే కనీసం 50 శాతం చార్జీలను లేదా రూ.10 వేలను డీడీ రూపంలో తొలుత చెల్లించాలి. భవనం/లే అవుట్ మార్కెట్ విలువపై 20-100 శాతం వరకు అభివృద్ధి రుసుంను విధించనున్నారు. లే అవుట్ల విషయంలో చదరపు మీటర్కు రూ.200-750 వరకు క్రమబద్ధీకరణ చార్జీలను వసూలు చేయనున్నారు. భవనాల విషయంలో చదరపు మీటర్కు వ్యక్తిగత నివాస భవనాలపై రూ.15-200 వరకు, వాణిజ్య భవనాలపై రూ.30-400 వరకు చార్జీలను విధించనున్నారు. బహుళ అంతస్తుల భవనాలు/అపార్ట్మెంట్లు/ప్లాట్ల విషయంలో చార్జీలు భారీగా ఉండనున్నాయి. కాగా, మురికి వాడల్లోని ప్లాట్లను మాత్రం స్థల విస్తీర్ణంతో సంబంధం లేకుండా ప్రతి చదరపు మీటరుకు రూ.5 రుసుంతో క్రమబద్ధీకరించనున్నారు. అక్రమాలపై క్రిమినల్ కేసులు: తలసాని రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. న్యాయ నిపుణుల సలహాతో ఈ మేరకు భవన నిర్మాణ చట్టాన్ని సవరించాలని కోరామన్నారు. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి గోపాల్తో కలిసి సోమవారం సచివాలయంలో అక్రమ కట్టడాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. తన నేతృత్వంలోని అధ్యయన కమిటీ అందజేసిన నివేదికలోని సిఫారసుల ఆధారంగానే ప్రభుత్వం క్రమబద్ధీకరణ ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. అక్రమ లే అవుట్లు, భవనాలను కట్టడి చేసేందుకు ఈ కింది సిఫారసులు చేశామన్నారు. ► టౌన్ ప్లానింగ్ విభాగానికి ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం న్యాయ సలహా తీసుకోవాలి ► అక్రమ లే అవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయరాదు ► అక్రమ కట్టడాలను అరికట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ విభాగం/ఫ్లయింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేయాలి ► భవన నిర్మాణ అనుమతులు, లే అవుట్ల అనుమతులకు సింగిల్ విండో విధానం తేవాలి ► భవిష్యత్తులో వెలిసే అక్రమ నిర్మాణాల నుంచి ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లు, నీటి బిల్లులను మూడింతలు వసూలు చేయాలి. ► భవన నిర్మాణ నిబంధనలను సరళీకరించాలి -
మాకేంటి?
- నాలుగున్నర లక్షలతో రోడ్డు వేస్తున్నావ్. నాలుగు వేలు ఇస్తే ఎలా? ఫైవ్ పర్సంట్ ఇవ్వాల్సిందే. లేదంటే రోడ్డు పనులు జరగనీయను. (కాంట్రాక్టర్కు ఓ అధికార పార్టీ కార్పొరేటర్ బెదిరింపు) - స్టాండింగ్ కమిటీ అంటే ఎంతో కొంత అందుతుంది - అనుకున్నాం. ఏడాది కావొస్తుంది ఒక్క రూపాయీ రాలేదు. అజెండాలోని తీర్మానాలను తల ఊపి వచ్చేందుకే ఈ పదవి ఉన్నట్లుంది. అబ్బే ఇదేం బాగోలా. స్టాండింగ్ కమిటీ చైర్మన్ నేనైతే ఇలా ఉండేది కాదబ్బా. (స్టాండింగ్ కమిటీ సభ్యురాలి అభిప్రాయం..) - టీడీపీలో కాసుల గోల - ఏడాదైనా రూపాయి సంపాదన లేదంటున్న కార్పొరేటర్లు - మేయర్కు తలనొప్పి - అభివృద్ధి పనులకు అడ్డంకి ఇలా.. టీడీపీలో కాసుల గోల మొదలైంది. పైసల కోసం అధికార పార్టీ కార్పొరేటర్లు రోడ్డెక్కుతున్నారు. నగరాభివృద్ధికి అడ్డుపడుతూ పంచాయితీలు పెడుతున్నారు. పాలన ఆరంభించి ఏడాది పూర్తయినా పైసా ముట్టలేదని కొందరు బహిరంగంగానే విమర్శిస్తుండగా.. ఈ పంచాయితీలను పరిష్కరించలేక మేయర్ తలపట్టుకుంటున్నారు. విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో అధికార పార్టీ కార్పొరేటర్లు కొందరు పైసలే పరమావధిగా అందినకాడికి దండుకుంటుంటే.. మరి కొందరు చేతికేమి అందక లబోదిబోమంటున్నారు. ‘లక్షలు ఖర్చుచేసి అధికారంలోకి వచ్చాం. కనీసం వాటినైనా సంపాదించుకోకపోతే ఎలా?’ అనే ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే టౌన్ప్లానింగ్ను అడ్డం పెట్టుకుని నలుగురు కార్పొరేటర్లు దందా చెలాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అభివృద్ధి పనుల్లోనూ పర్సంటేజ్ల కోసం చేయి చాస్తుండటంతో వసూళ్ల గుట్టురట్టవుతోంది. కార్పొరేషన్లో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి రూ.30 కోట్లు కేటాయించారు. వీటితో 59 డివిజన్లలో 300 పనులు చేపట్టారు. ప్రస్తుతం అవి నిర్మాణ దశలో ఉన్నాయి. పర్సంటేజ్ విషయంలో తేడా రావడంతో ఓ కార్పొరేటర్ రోడ్డు పనులు నిలుపుదల చేయాల్సిందిగా కాంట్రాక్టర్ను ఆదేశించారు. సంబంధిత అధికారి చెబితే కానీ తాను నిలుపుదల చేయనని కాంట్రాక్టర్ స్పష్టం చేశారు. ఈ సమాధానానికి ఫీలైన సదరు కార్పొరేటర్ మేయర్ కోనేరు శ్రీధర్ వద్ద పంచాయితీ పెట్టినట్లు తెలిసింది. అభివృద్ధి పనులు జరగనివ్వాలని, వ్యక్తిగత స్వార్థంతో అడ్డుకుంటే ప్రజల్లో చెడ్డపేరు వస్తుందని మేయర్ ఆ కార్పొరేటర్కు హితవు చెప్పినట్టు భోగట్టా. ఈ విషయం బయటకు పొక్కడంతో ఇదే ధోరణి ప్రదర్శిద్దామనుకుంటున్న మరికొందరు కార్పొరేటర్లు వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. పట్టించుకోకపోతే ఎలా.. ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో కొందరు కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవినే ఓ మహిళా కార్పొరేటర్ టార్గెట్ చేశారనే ప్రచారం జరుగుతోంది. నిబంధనల ప్రకారం మేయరే స్టాండింగ్ కమిటీకి చైర్మన్గా వ్యవహరించాలి. ప్రస్తుతం అదే విధానం కొనసాగుతోంది. నిబంధనలపై అవగాహన లేని ఆ కార్పొరేటర్ రూ.25 లక్షలు ఖర్చు చేసైనా స్టాండింగ్ కమిటీ చైర్మన్ అవుతా.. అనడంతో తోటి కార్పొరేటర్లు ఆశ్చర్యపోయారు. భవానీపురం మహ్మదీయ కో-ఆపరేటివ్ సొసైటీ (దర్గా భూములు), శ్రీకనకదుర్గా లే అవుట్ వ్యవహారంలో కొందరు కార్పొరేటర్లకే మేయర్ ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నించారన్నది అసమ్మతి కార్పొరేటర్ల ఆరోపణ. భారీ డీల్స్ చేసినప్పుడైనా తమను పట్టించుకోకపోతే ఎలా? అని వారు వాపోతున్నారు. స్టాండింగ్ కమిటీ నిర్ణయాల్లో సైతం తమను డమ్మీలను చేసి మేయరే కథ నడిపించేస్తున్నారని కార్పొరేటర్ ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. పదవులపై కన్ను ఏడాది పాలన పూర్తవడంతో ఆశావహులు కొందరు పదవులపై కన్నేశారు. డెప్యూటీ మేయర్, ఫ్లోర్లీడర్, స్టాండింగ్ కమిటీ సభ్యులుగా అవకాశాలను దక్కించుకునేందుకు పొలిటికల్ గాడ్ఫాదర్స్ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. తూర్పు నియోజకవర్గానికి మేయర్, సెంట్రల్కు డెప్యూటీ మేయర్, పశ్చిమకు ఫ్లోర్లీడర్ పదవుల్ని గతంలో కేటాయించారు. మేయర్ను ఇప్పట్లో మార్చే ఆలోచనలో అధిష్టానం లేదని సమాచారం. దీంతో మిగిలిన పదవుల్ని దక్కించుకోవడం కోసం కార్పొరేటర్లు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 44వ డివిజన్కు చెందిన కాకు మల్లిఖార్జున యాదవ్ డెప్యూటీ మేయర్, 28వ డివిజన్కు చెందిన యదుపాటి రామయ్య ఫ్లోర్లీడర్ పదవుల్ని ఆశిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మల్లిఖార్జున యాదవ్ మూడు నియోజకవర్గాల నుంచి కార్పొరేటర్ల మద్దతు కూడగడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజాసమస్యల పరిష్కారం మాటెలా ఉన్నా అధికార పార్టీ కార్పొరేటర్లు కాసులు, పదవులపై దృష్టిసారించడం హాట్ టాపిక్గా మారింది. -
పట్టణాభివృద్ధి శాఖ ఉద్యోగులకూ 60 ఏళ్లే...
సాక్షి, హైదరాబాద్: అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల పరిధిలో పనిచేసే ఉద్యోగులకు కూడా పదవీ విరమణ వయసు 58 ఏళ్లనుంచి 60 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు పురపాలకశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో భాగంగా కేపిటల్ రీజియల్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ), తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా), విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వుడా), పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పుడా) పరిధిలోని ఉద్యోగులందరికీ పదవీ విరమణ వయస్సు మిగతా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నట్టే 60 ఏళ్లు ఉంటుంది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలలో పనిచేస్తున్న సుమారు 600 మంది ఉద్యోగులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. పలు పర్యాయాలు పదవీ విరమణ వయసు పెంపుపై వినతి పత్రాలు ఇచ్చామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని మున్సిపల్ ఉద్యోగుల సంఘం నేత వర్మ పేర్కొన్నారు. -
పీఠాలు కదలాల్సిందే..!
⇒ యూనిఫైడ్ సర్వీసు రూల్స్ అమలుకు సర్కార్ కసరత్తు ⇒ మంత్రి తుమ్మల అధ్యక్షతన కేబినెట్ సబ్కమిటీ ⇒ అర్బన్ డెవలప్మెంట్లోని వివిధ యాక్టుల సవరణకు నిర్ణయం ⇒ హెచ్ఎండీఏలో త్వరలో ఉద్యోగుల స్థానభ్రంశం సాక్షి, సిటీబ్యూరో : మున్సిపల్ పరిపాలనా విభాగం పరిధిలోని వివిధ శాఖలను ఒకే గొడుకు కిందకు తెస్తూ యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ను అమలోకి తేవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని వివిధ యాక్టులను సవరించాలని భావిస్తోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గతంలో ఉన్న యాక్ట్లనే అనుసరిస్తుండటం వల్ల హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ తదితర విభాగాల్లో పాతుకుపోయిన ఉద్యోగులను ఇతర విభాగాలకు బదిలీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయా విభాగాల్లో పాతుకుపోయిన అక్రమార్కులపై చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ విభాగాల్లోని కిందస్థాయి నుంచి అధికారుల వరకు బదిలీ చేసినా ఒక సెక్షన్ నుంచి మరో సెక్షన్కు మార్చడం మినహా ఇతర విభాగాలకు పంపలేని పరిస్థితి. దీంతో ఎలాంటి పరిస్థితుల్లోనూ నగరం విడిచి వేరే ఊరికి బదిలీ అయ్యేది లేకపోవడంతో అక్రమార్కులు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది. కొత్తగా యాదగిరిగుట్ట, గజ్వేలు పట్టణాలను డెవలప్మెంట్ అథార్టీలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున మున్సిపల్ పరిపాలనా విభాగం పరిధిలోని అన్ని శాఖల్లో ఏకీకృత సర్వీసు రూల్స్ అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా అర్బన్ డెవలప్మెంట్ పరిధిలోకి వచ్చే హెచ్ఎండీఏ (2008యాక్ట్), జీహెచ్ఎంసీ (2007 యాక్ట్), ఏపీ అర్బన్ డెవలప్మెంట్ (1975) యాక్ట్, ఏపీ టౌన్ ప్లాన్నింగ్ (1920) యాక్ట్, ఏపీ మున్సిపల్ (1964) యాక్టులను సవరించాలని సర్కార్ నిర్ణయించింది. దీనివల్ల మిడిల్, హయ్యర్ అధికారుల పరస్పర బదిలీలకు మార్గం సుగమం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్చంద్ర అధ్యక్షతన యూనిఫైడ్ సర్వీసుల కమిటీ ఏర్పాటు చేయడమేగాక, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని వివిధ యాక్టులను సవ రణకు సంబంధించి డ్రాఫ్టు బిల్లును రూపొందించే పనిలో నిమగ్నమైంది. దీనికి ఓ రూపం వచ్చాక ‘లా’ విభాగానికి పంపి, అనంతరం క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదంతో అసెంబ్లీలో పెడతారు. అక్కడ ఆమోదం పొందితే చట్టం అమల్లోకి వస్తుంది. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి వీలైతే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చకు పెట్టాలన్న ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అయితే... ఇందులో సాంకేతికంగా చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నందున ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చుననే వాదన కూడా విన్పిస్తోంది. కదలనున్న పీఠాలు ప్రభుత్వం ఏకీకృత సర్వీసు రూల్స్ను అమల్లోకి తెస్తే హెచ్ఎండీఏలో చాలా మంది ఉద్యోగుల పీఠాలు కదలనున్నాయి. ప్రధానంగా ప్లానింగ్ విభాగంలో అవినీతి, అక్రమాలపై ప్రభుత్వ చాలా సీరియస్గా ఉంది. గతంలో నీరబ్ కుమార్ కమిషనర్గా ఉన్న సమయంలో మహబూబ్నగర్ జిల్లా కొత్తూరులో ఓ ఎమ్మెన్సీ కంపెనీ తమ సంస్థను నెలకొల్పేందుకు భారీమొత్తంలో డబ్బులు వసూలు చేసిన విషయం బట్టబయలైంది. దీనిపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి సదరు కమిషనర్కు ఉద్వాసన పలికారు. అయితే... ఇందులో ప్రమేయం ఉన్న మరో ఇద్దరు అధికారులపై నిఘా ఉంచినట్లు సమాచారం. హెచ్ఎండీఏ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏసీబీ దాడులు జరగడంతో అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టింది. అయినా కొందరు అక్రమార్కులు తమ అక్రమ దందాను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు విజిలెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, టౌన్ప్లానింగ్ విభాగాల్లో అక్రమార్కుల జాబితా భారీగానే ఉండటంతో వారందరినీ కట్టడి చేసేందుకు ఇతర విభాగాలకు బదిలీ చేయడం ఒక్కటే మార్గమని సర్కార్ భావిస్తోంది. -
పట్టణాభివృద్ధికి మూడంచెల ప్రణాళికలు
మంత్రివర్గ ఉపసంఘం భేటీలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పురపాలన, పట్టణాభివృద్ధికి సంబంధించిన అంశాలపై మూడంచెల ప్రణాళికలను రచించనున్నారు. పట్టణాలు, నగరాల అభివృద్ధితో పాటు సుపరిపాలన కోసం తీసుకోవాల్సిన చర్యలు, పనులను పూర్తిచేయడానికి పట్టే సమయం ఆధారంగా ఆయా పనులను విభజించి స్వల్పకాలిక, మధ్య కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధ్యక్షతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం శుక్రవారం ‘న్యాక్’లో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రణాళికల తయారీకి 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. స్వల్ప కాలిక ప్రణాళికలను పురపాలక శాఖ సంచాలకుడు జనార్దన్ రెడ్డి, మధ్య కాలిక ప్రణాళికలను ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం చీఫ్ ఇంజనీర్ ఇంతియాజ్ అహమ్మద్, దీర్ఘకాలిక ప్రణాళికలను డీటీసీపీ సంచాలకుడు ఆనంద్ బాబు నేతృత్వంలోని బృందాలు రూపొందించనున్నాయి. పారిశుద్ధ్యం మెరుగుదల, ఘన వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛ భారత్ అమలు, శ్మశాన వాటికల నిర్మాణం, మురికి వాడల అభివృద్ధి, సూపర్ మార్కెట్ల తరహాలో కొత్త మార్కెట్ల నిర్మాణం, ఖాళీల భర్తీ, ఉచిత నల్లా కనెక్షన్లు, మునిసిపల్ చట్టాలు, నిబంధనల్లో సవరణలు, పురపాలికల పనుల టెండర్లు నిర్వహించే మునిసిపల్ ఇంజనీర్ల అధికార పరిమితుల పెంపు తదితర అంశాలతో ప్రణాళికలు తయారు చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. మళ్లీ ఈ నెల 24, 25, 26 తేదీల్లో వరుసగా సమావేశాలు నిర్వహించి స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికల్లోని ప్రతిపాదనలపై ఉప సంఘం తుది నిర్ణయం తీసుకొని, ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్రావు, పట్నం మహేందర్రెడ్డి, జోగు రామన్న, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి.గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ సమావేశంలో చర్చించిన విషయాలను మీడియాకు వెల్లడించవద్దని మంత్రులు అధికారులను ఆదేశించడంతో వారు నోరు విప్పేందుకు సాహసించలేదు. -
రాష్ట్రాలకు తగ్గట్టు కేంద్ర పథకాలు
- కేంద్ర మంత్రి వెంకయ్య - ‘జేఎన్ఎన్యూఆర్ఎం’ స్థానంలో కొత్త పథకం ఢిల్లీ: పట్టణాభివృద్ధికి సంబంధించి గత యూపీఏ ప్రభుత్వం అమలు చేసిన ‘జవహర్లాల్ నెహ్రూ పట్టణ నవీకరణ పథకం (జేఎన్ఎన్యూఆర్ఎం)’ పథకం పూర్తిగా లోపభూయిష్టమైనదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. పైస్థాయి (కేంద్రం)లో పథకాలు రూపొందించి, అమలుబాధ్యతను రాష్ట్రాలకు అప్పగించడం సరికాదని చెప్పారు. దీనికి స్వస్తిపలికి క్షేత్రస్థాయి సూచనల ఆధారంగా పట్టణాభివృద్ధికి కొత్త పథకాన్ని రూపొందించనున్నామని తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి, హౌసింగ్, పట్టణపేదరిక నిర్మూలన శాఖల బాధ్యతలు చేపట్టిన అనంతరం వెంకయ్యనాయుడు... ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ సిటీ, 2022 నాటికి అందరికీ ఇళ్లు వంటి పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అందులో భాగంగా శనివారం కోల్కతాలో పర్యటించారు కూడా. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు ఆదివారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ఇప్పటివరకు పట్టణాభివృద్ధి పథకాలను ఢిల్లీ(కేంద్రం)లో రూపొందించి, వాటిని అమలు చేయాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించేవారు. పైనుంచి కిందికి వచ్చే ఈ తరహా విధానం సరికాదు. అలా రూపొందించిన జేఎన్ఎన్యూఆర్ఎం పథకం నిర్మాణాత్మక లోపాలకు, ఆచరణలో రాష్ట్రాలు విఫలం కావడానికి ఇది కారణమైంది. అందువల్ల ఈ విధానానికి స్వస్తి పలికి.. క్షేత్రస్థాయి నుంచి వచ్చే సూచనలు, సలహాల ఆధారంగా పైన (కేంద్రం) పథకాలు రూపొందించే విధానానికి శ్రీకారం చుట్టనున్నాం..’’ అని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగానే రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామని.. స్మార్ట్ సిటీలు, అందరికీ ఇళ్లు వంటి పథకాలపై సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నామని తెలిపారు. అంతేగాకుండా పట్టణ పాలనను మరింత మెరుగుపర్చేందుకు, అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకొనేలా ‘ఎన్ఏఆర్ఈడీసీవో, ఐఆర్ఈడీఏ’ వంటి సంస్థలతో, ఐటీ కంపెనీలతో సంప్రదింపుల్లో ఉన్నామని వెల్లడించారు. జేఎన్ఎన్యూఆర్ఎం స్థానంలో తీసుకురానున్న కొత్త పథకానికి సంబంధించి బడ్జెట్ సమావేశాల్లోగా ప్రజా ప్రయోజనకర ప్రణాళికను రూపొందిస్తామని వెల్లడించారు. -
రూ.1,125కోట్లతో మండలి, అసెంబ్లీ
మంత్రాలయం లేదా సచివాలయ నిర్మాణానికి రూ. 1,001 కోట్లు రాజ్భవన్కు రూ. 90 కోట్లు సీఎం నివాసం, క్యాంపు ఆఫీసుకు రూ. 90 కోట్లు 2019 నాటికి కేపిటల్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి 2024 నాటికి మిగతా నిర్మాణాలన్నీ పూర్తి ప్రస్తుత మార్కెట్ రేట్ల ప్రకారం మున్సిపల్ శాఖ అంచనాలు సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని నిర్మాణంలో కేపిటల్ కాంప్లెక్స్ సెక్టార్ అత్యంత కీలకమైనదిగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తోంది. కేపిటల్ సెక్టార్ సుమారు 600 హెక్టార్లలో ఏర్పాటు చేయనున్నట్టు మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ప్రతిపాదించింది. తొలిదశ రాజధాని నిర్మాణంలో భాగంగా రంగాల వారీగా అయ్యే వ్యయంపై ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం అంచనాలను రూపొందించింది. కీలకమైన కేపిటల్ కాంపెక్ల్ నిర్మాణాన్ని 2019 నాటికి పూర్తిచేయాలని నిర్దేశించింది. రాజధానిలోని మిగతా రంగాల నిర్మాణాలను 2024 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేపిటల్ కాంప్లెక్స్లో శాసనసభ, శాసనమండలి, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, ప్రభుత్వ ఆఫీసులు, హైకోర్టు కాంప్లెక్స్, సిటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, రాష్ట్ర అతిథిగృహాలు, యుటిలిటీ బ్లాక్, సెక్యూరిటీ ఆవాసం ఉంటాయి. కాంప్లెక్స్ బ్లాకుల్లో ఒకదాని నుంచి మరోదానికి నడిచి వెళ్లేందుకు మార్గాలను ఏర్పాటు చేస్తారు. కేపిటల్ కాంప్లెక్స్కు దగ్గరలోనే ఉద్యోగులందరికీ ప్రభుత్వ గృహాల నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. కేపిటల్ కాంప్లెక్స్ బ్లాకులు వీలైనంత ఎక్కువ ఎత్తులో ఉంటాయి. రాష్ట్ర ప్రతిష్టను ప్రతిబింబించే విధంగా అత్యాధునిక వసతులతో, కళ్లు చెదిరిపోయేలా నిర్మించాలని సంకల్పించారు. అసెంబ్లీని తగినన్ని సీట్లతో పాటు రెండు ఆడిటోరియంలు, స్పీకర్, ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత, మంత్రులు, సీఎస్, ఇతర అధికారుల కార్యాలయాలతో నిర్మిస్తారు. ఎగ్జిబిషన్ హాల్, వెయిటింగ్ రూమ్, మీడియా రూమ్, సెక్యూరిటీ ఆఫీస్, సమావేశ మందిరం, మెడికల్ కేంద్రం, లైబ్రరీలతో పూర్తి హంగులతో అసెంబ్లీ నిర్మిస్తారు. అసెంబ్లీ, శాసనమండలి నిర్మాణాలకు 1,125 కోట్ల రూపాయల వ్యయమవుతుందని, అలాగే మంత్రాలయం లేదా సచివాలయ నిర్మాణానికి 1,001 కోట్ల రూపాయల వ్యయమవుతుందని, రాజ్భవన్, ముఖ్యమంత్రి నివాసం, క్యాంపు కార్యాలయాల నిర్మాణాలకు 90 కోట్ల రూపాయల చొప్పున ఖర్చవుతుందని అంచనా వేశారు. రాజధానిలో వివిధ రంగాల వసతులు, నిర్మాణాలకు మున్సిపల్ శాఖ రూపొందించిన అంచనాలివి.. (రూ.కోట్లలో) -
ఖమ్మంలో కూడా..
అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం ప్రధాన నగ రాలకు దీటుగా ఖమ్మం అభివృద్ధికి కసరత్తు కనిష్టంగా 10 కిలోమీటర్లు విస్తరించనున్న పరిధి భవన నిర్మాణాల్లో అడ్డగోలు అనుమతులకు ఇక చెక్.. సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ఖమ్మం నగరానికి మరిన్ని కొత్త హంగులు కల్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. గ్రేడ్-1 మున్సిపాలిటీ నుంచి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా... ఆ తర్వాత నగర కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన ఖమ్మం కంఠాన మరో అదనపు ఆభరణం జత కానుంది. ప్రధాన నగరాలకు దీటుగా అన్ని రంగాల్లో ఖమ్మాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఖమ్మం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా)ని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇప్పటికే కార్పొరేషన్ హోదాలో నలుమూలలా విస్తరించిన నగరానికి తోడు కుడా ఏర్పాటుతో నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్లలో మాత్రమే ఉన్న అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఖమ్మంలోనూ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతుండటంతో నగర ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. రెండు రోజుల క్రితం ప్రాథమికంగా సమావేశమైన జిల్లా ఉన్నతాధికారులు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రూపురేఖలు, విధి విధానాలు, దాని పరిధిని ఎంత మేరకు విస్తరించాలనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే 20 సంవత్సరాల్లో ఖమ్మం నగరం దాదాపు 10 కిలోమీటర్లకు పైగా విస్తరిస్తుందన్న అంచనాలతో ఖమ్మం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. నగరంలో ఏ ప్రాంతం నుంచి ఎంత మేరకు అర్బన్ అథారిటీని విస్తరింపచేయాలి, ఎన్ని కిలోమీటర్ల దూరాన్ని దీని పరిధిలోకి తీసుకురావాలి అనే అంశాలపై జియోగ్రాఫికల్ సర్వేకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఖమ్మం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడితే దాని పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో రోడ్లు, వాణిజ్య సముదాయాలు, భవనాల నిర్మాణాలకు అథారిటీ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో రహదారుల విస్తరణ చేపట్టకపోవడం, అందుకు పరిస్థితులు అనుకూలించకపోవడం, నగర నడిబొడ్డుతోపాటు శివార్లలోనూ నిబంధనలకు విరుద్ధంగా వందలాది అపార్ట్మెంట్లు ఏర్పడటం, వాటికి సరైన రహదారులు, లే అవుట్ల వంటి చట్టబద్ధమైన అనుమతులు లేకపోవడంతో కార్పొరేషన్కు ఆయా ప్రాంతాలలో వసతులు కల్పించడం తలకు మించిన భారంగా పరిణమించింది. ఖమ్మం నగర పాలక సంస్థలో విలీనం కాకముందు ఖానాపురం హవేలీ గ్రామ పంచాయతీ పరిధిలోని 1200 అపార్ట్మెంట్లు నిర్మించడం, వాటిలో అనేక అపార్ట్మెంట్లకు నిబంధనల మేరకు అనుమతులు లేకపోవడం వంటి అంశాలను మున్సిపల్, రెవెన్యూ అధికారులు గుర్తించారు. భవిష్యత్తులోనూ ఈ పరిస్థితి తలెత్తకుండా అథారిటీ పరిధిలోకి వచ్చే ప్రతి గ్రామంలో నిబంధనలకు అనుగుణంగా ఉండే భవనాల నిర్మాణానికి మాత్రమే అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఖమ్మం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఖమ్మం నగర పాలక సంస్థ సరిహద్దు ప్రాంతాల నుంచి 10 కిలోమీటర్ల పరిధికి పరిమితం చేయాలా..? 15 కిలోమీటర్ల వరకు విస్తరింపచేయాలా..? అనే అంశంపై సాంకేతికంగా సర్వే నిర్వహించి, వాటిలో వచ్చిన ఫలితాల ఆధారంగా విస్తరణ ఉంటుంది. ప్రస్తుతం ఖమ్మం నగరం 95 పాయింట్ స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఈ అథారిటీ ఏర్పడితే పాండురంగాపురం వరకు నగర పాలక సంస్థ పరిధిలో ఉండగా, అక్కడినుంచి 10 కిలోమీటర్లు అర్బన్ అథారిటీ పరిధిని విస్తరింపచేస్తే దాదాపు మంచుకొండ, బూడిదంపాడు వరకు కుడా పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్న నగర పాలక సంస్థ పరిధి కాక కొత్తగా ఖమ్మం డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి మరో 26 గ్రామాలు చేరే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేశారు. 15 కిలోమీటర్లు అయితే పండితాపురం వరకు, అలాగే హైదరాబాద్ ప్రధాన రహదారిలో అయితే జీళ్లచెర్వు వరకు, కోదాడ రహదారి వైపు గోకినేపల్లి, గువ్వలగూడెం వరకు, బోనకల్లు రహదారి వైపు జగన్నాధపురం ఆపై గ్రామాల వరకు, వరంగల్ రహదారివైపు దాదాపు తిరుమలాయపాలెం వరకు, వైరా రోడ్డులో కొణిజర్ల వరకు అర్బన్ అథారిటీ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ‘కుడా’ పరిధిలోకి ఈ గ్రామాలు వచ్చినా అక్కడ గ్రామ పంచాయతీల పాలన మాత్రం యథావిధిగానే కొనసాగుతుంది. గ్రామాల్లో ప్రధాన రహదారుల నిర్మాణం, వాణిజ్య భవనాల సముదాయానికి అనుమతులు, గృహ నిర్మాణాల అనుమతులు మాత్రం నూతనంగా ఏర్పడే కుడాయే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దీని పరిధిని ఎంతమేరకు పరిమితం చేయాలనే అంశాన్ని జియోగ్రఫికల్ సర్వే మాత్రమే తేల్చనుంది. ఈ సర్వే బాధ్యతను జిల్లా డిస్ట్రిక్ట్ టౌన్ కంట్రీ ప్లానింగ్ ( డీటీసీపీ) అధికారులకు అప్పగించారు. -
బల్దియాల్లో బాదుడు
శాతవాహన యూనివర్సిటీ : జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగరపంచాయతీల్లో ఆస్తిపన్ను పెంపునకు కార్యచరణ సిద్ధమవుతోంది. దాదాపు పుష్కర కాలం తర్వాత.. ఈ అక్టోబర్ నుంచే ఆస్తిపన్ను పెంచడానికి అనుమతివ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విషయం విదితమే. వీటికి పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శైలేంద్ర కుమార్జోషి ఇప్పటికే ఆమోద్రముద్ర వేశారని, ముఖ్యమంత్రి ఆమోదం తెలిపితే ఆస్తిపన్ను పెంపుఖాయమని అధికారులు చెబుతున్నారు. దీంతో జిల్లాలోని రెండు కార్పొషన్లు, నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగరపంచాయతీల్లో ఆస్తిపన్ను భారీగా పెరగనుంది. సర్కారు నుంచి ఉత్తర్వులు అందగానే కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతుందని అధికారులు చెబుతున్నారు. మున్సిపల్ చట్టాల ప్రకారం ప్రతీఐదేళ ్లకోసారి ఆస్తిపన్ను సవరించాల్సిఉంది. చివరిసారిగా నివాసాపై 12 ఏళ్ల క్రితం, నివాసేతర భవనాలపై ఏడేళ్ల క్రిత ం (2007)లో ఆస్తిపన్ను పెంచినట్లు అధికారులు వివరిస్తున్నారు. అవసరాలు, ఇతరత్రా వ్యయాలు భారీగా పెరిగినందున నగర, పురపాలక సంస్థలు ఆర్థిక సంక్షోభంలో పడిపోయాయి. ఇలాంటి క్రమంలో ఆస్తిపన్ను పెంపుతో ఆర్థికంగా సంస్థలను బలోపేతం చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలతో ఆగిన ప్రతిపాదన..! ఆస్తిపన్ను పెంపునకు గతంలోనే ఉత్తర్వులు వెలువరించేందుకు యత్నించగా, ఎన్నికలు, తదితర అనివార్య కారణాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. 2007లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారమే ఇప్పటి వరకు కమర్షియల్ భవనాలకు రివైజ్డ్ రేట్ల ప్రకారం ఆస్తిపన్ను విధించినట్లు సమచారం. భారీగా వడ్డన..? ఈసారి బల్దియాలోని ప్రజలపై ఆస్తిపన్ను భారీగానే పడనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పడిన నగర పంచాయతీలకు ఏప్రిల్, పాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రస్తుత పన్నులపై 40-50 శాతం ఆస్తిపన్ను పెరిగే అవకాశం ఉంది. 40శాతం ఆస్తి పన్ను పెంపుతో బల్దియాలపై పడే అదనపు భారం వివరాలు ఇవీ.. సంస్థ {పస్తుత అదనపు భారం ఆస్తి పన్ను (రూ.లలో) కరీంనగర్ కార్పొరేషన్ 11.50 లక్షలు 4.60 లక్షలు రామగుండం కార్పొరేషన్ 12 కోట్లు 4.80 కోట్లు జగిత్యాల మున్సిపాలిటీ 5 కోట్లు 2 కోట్లు కోరుట్ల మున్సిపాలిటీ 2.4 కోట్లు 81.60 లక్షలు మెట్పల్లి మున్సిపాలిటీటి 1.10 కోట్లు 44 లక్షలు సిరిసిల్ల మున్సిపాలిటీ 2.50 లక్షలు 1 కోటి పెద్దపల్లి నగరపంచాయతీ 2 కోట్లు 80 లక్షలు వేములవాడ నగరపంచాయతీ 72 లక్షలు 28.80 లక్షలు హుజూరాబాద్ నగరపంచాయతీ 60 లక్షలు 24 లక్షలు హుస్నాబాద్ నగరపంచాయతీ 1.40 కోట్లుల 59.20 లక్షలు జమ్మికుంట నగరపంచాయతీ 70 లక్షలు 28 లక్షలు -
ఇక మున్సిపల్ బాండ్ల లిస్టింగ్
స్టాక్ ఎక్స్చేంజీల్లో ట్రేడింగ్ ‘ముని బాండ్ల’పై సెబీ ముసాయిదా నిబంధనలు న్యూఢిల్లీ: పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పొదుపు మొత్తాలు ఉపకరించేలా చూసే దిశగా.. స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొత్తగా మున్సిపల్ బాండ్ల లిస్టింగ్, ట్రేడింగ్ మార్గదర్శకాలను ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి ముసాయిదా నిబంధనలను మంగళవారం వెల్లడించింది. వీటి ప్రకారం ‘ముని బాండ్స్’ (మునిసిపల్ బాండ్లు) జారీ చేసే సంస్థలు ఆర్థికంగా పటిష్టమైన ట్రాక్ రికార్డు కలిగి ఉండాలి. బాండ్ల వ్యవధి కనీసం మూడేళ్లు ఉండాలి. అలాగే, ఆయా సంస్థలు.. తాము దేని కోసం నిధులు సమీకరిస్తున్నాయో ఆ ప్రాజెక్టు వ్యయంలో కనీసం 20 శాతమైనా సొంతంగా పెట్టాల్సి ఉంటుంది. రిస్కు ఎక్కువగా ఇష్టపడని దేశీ ఇన్వెస్టర్లు ప్రస్తుతం ప్రధానంగా ఫిక్సిడ్ డిపాజిట్లు, చిన్న మొత్తాల పొదుపు ఖాతాలు లేదా బంగారంలో మాత్రమే ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనంగా ముని బాండ్స్ ఉపయోగపడగలవని సెబీ పేర్కొంది. వీటిపై సంబంధిత వర్గాలు జనవరి 30 లోగా తమ అభిప్రాయాలు తెలపాల్సి ఉంటుందని వివరించింది. పట్టణాభివృద్ధి శాఖ మార్గదర్శకాల ప్రకారం గరిష్టంగా 8 శాతం దాకా వడ్డీ రేటు ఇచ్చే బాండ్లను మాత్రమే పన్ను ప్రయోజనాలిచ్చే బాండ్లుగా ప్రకటించే వీలుంది. అయితే, 8 శాతం మాత్రమే స్థిర వడ్డీ రేటును ప్రతిపాదిస్తే బాండ్లపై ఇన్వెస్టర్లు పెద్దగా ఆసక్తి కనపర్చకపోవచ్చని సెబీలో భాగమైన కార్పొరేట్ బాండ్స్ అండ్ సెక్యూరిటైజేషన్ అడ్వైజరీ కమిటీ అభిప్రాయపడింది. దీన్ని బెంచ్ మార్క్ మార్కెట్ రేటుకు అనుసంధానించి చలన వడ్డీ రేటు ఉండేలా చూస్తే ప్రయోజనం ఉండగలదని భావిస్తోంది. ఇప్పుడు కూడా వివిధ మున్సిపల్ కార్పొరేషన్లు బాండ్లు జారీ చేస్తున్నప్పటికీ.. ఈ మార్గంలో సమీకరించిన మొత్తాలు కేవలం రూ. 1,353 కోట్లు మాత్రమే. 1997లో బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ తొలిసారిగా రూ. 125 కోట్ల విలువ చేసే బాండ్లను రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుతో జారీ చేసింది. ఆ తర్వాత 1998లో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రభుత్వ పూచీకత్తు లేకుండా రూ. 100 కోట్లు సమీకరించింది. హైదరాబాద్,వైజాగ్ సహా నాసిక్, చెన్నై, నాగ్పూర్ తదితర మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ఇలాంటి బాండ్లను జారీ చేశాయి. అయితే, ముని బాండ్లను స్టాక్ ఎక్స్చేంజీలో లిస్టింగ్ చేసేందుకు గానీ ట్రేడింగ్ చేసేందుకు గానీ ఇప్పటిదాకా అనుమతి లేదు. సాధారణంగా అమెరికా సహా సంపన్న దేశాల్లో మున్సిపల్ బాండ్లు బాగా ప్రాచుర్యంలోనే ఉన్నాయి. -
ఉడా మాయం
ప్రశ్నార్థకంగా మారిన రూ.500 కోట్ల విలువైన స్థలాల భవిత రూ.160 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ప్రభుత్వానికే.. ఉడా ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలే సాక్షి, విజయవాడ : విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వీజీటీఎం ఉడా) కనుమరుగు కానుంది. ఉడాను రద్దు చేస్తూ మూడు, నాలుగు రోజుల్లో ప్రభుత్వం జీవో విడుదల చేయనుంది. ఉడా స్థానంలో రాజధాని క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీపీ) ఏర్పాటు కానుంది. దీంతో ఉడా ఉద్యోగుల భవితవ్యం, ఉడా స్థిరాస్తులు, కోట్ల రూపాయల నగదు నిల్వలు, ఉడాకు రావాల్సిన వందల కోట్ల బకాయిలు, ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, పదుల సంఖ్యలో ఉన్న ప్రతిపాదనలు.. ఇలా అన్ని అంశాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పలు ప్రాజెక్టుల ఫైళ్లు ఉడా వద్ద అనుమతుల కోసం పెండింగ్లో ఉన్నాయి. వీటన్నింటిపై స్పష్టత ఇవ్వకుండానే, సీఆర్డీపీ విధివిధానాలు ఖరారు చేయకుండానే సుదీర్ఘ చరిత్ర గల ఉడాను రద్దుచేయనుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 1978లో ప్రారంభం మున్సిపల్ చట్టం-1975 ప్రకారం 1978లో వీజీటీఎం ఉడా ఆవిర్భవించింది. అప్పట్లో విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి పట్టణాల పరిధిలోని సుమారు 1,670 చదరపు కిలోమీటర్ల మేరకే ఉడా కార్యకలాపాలు పరిమితమయ్యాయి. కాలక్రమేణా విజయవాడ, గుంటూరు నగరాలుగా మారాయి. ఉడా పరిధి కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఉడా పరిధిని 2012లో 7,067 చదరపు కిలోమీటర్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉడా పరిధిలోకి రెండు నగరపాలక సంస్థలు, 10 మున్సిపాలిటీలు, 1,520పైగా గ్రామాలు చేరాయి. ఉడా చేపట్టిన కొన్ని ప్రాజెక్టులు ఇవీ.. సుమారు 36 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఉడా తన పరిధిలోని పట్టణాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించింది. విజయవాడ, గుంటూరు నగరాల్లో ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్ల నిర్మాణం చేపట్టింది. పలు పార్కులను ఆధునికీకరించింది. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేసింది. విజయవాడలోని పాయకాపురంలో 1989లో 137 ఎకరాల విస్తీర్ణంలో ఉడా లేఅవుట్ వేసి ప్లాట్లు విక్రయించింది. వీటిలో ప్రస్తుతం ఉడా వద్ద 14 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. 1988-90 సంవత్సరాల్లో గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం నవులూరులో 390.38 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఈ భూమిలో 2000 సంవత్సరంలో అమరావతి టౌన్షిప్ పేరుతో భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేసింది. మొత్తం 285.17 ఎకరాల భూమిలో 1,327 ప్లాట్లు వేసి విక్రయించారు. అమరావతి టౌన్షిప్ మినహా 162.81 ఎకరాల భూమి ప్రసుత్తం ఉడా ఆధీనంలోనే ఉంది. ఈ రెండు వెంచర్లలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ఉడా ప్లాట్లు విక్రయించింది. అయితే వాటిని అభివృద్ధి చేయలేదు. రూ.160 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉడా వద్ద నగదు నిల్వలు కూడా భారీగా ఉన్నాయి. ఈ ఏడాది ఉడా వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి రూ.160 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. వీటిపై ఏటా సగటున రూ.12 కోట్ల వరకు వడ్డీ వస్తుంది. వీటితోపాటు వివిధ సేవలకుగానూ ప్రతి సంవత్సరం రూ.20 కోట్ల ఆదాయం వస్తుంది. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘూల నుంచి కూడా వివిధ రూపాల్లో ఏటా ఫీజులు వస్తుంటాయి. ఈ క్రమంలో 1992 నుంచి విజయవాడ నగరపాలక సంస్థ ఉడాకు రూ.70 కోట్లు బకాయి పడింది. ఉడా రద్దు అయితే ఈ బకాయి కూడా మాఫీ అయ్యే అవకాశం ఉంది. రూ.750 కోట్ల విలువైన ప్రాజెక్టులన్నీ బుట్టదాఖలే.. ఉడా ప్రతిష్టాత్మకంగా రూ.750 కోట్లతో పలు ప్రాజెక్టులు చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆయా ప్రతిపాదనలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. కొన్ని ప్రతిపాదనలపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు దృష్టిసారించారు. శాఖలవారీగా ప్రతిపాదనలను పంపించి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఉడా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కృష్ణా విజయసాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం డీపీఆర్ తయారీ దశలో ఉంది. ఉడా రద్దయితే ఈ ప్రాజెక్టులన్నీ తెరమరుగవుతాయని అధికారులు చెబుతున్నారు. ఉన్న స్థిరాస్తులు ఇవీ... వీజీటీఎం ఉడాకు ప్రస్తుతం భారీగా ఆస్తులు ఉన్నాయి. వాటి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.500 కోట్ల వరకు ఉంటుంది. అమరావతి టౌన్షిప్, పరిసర ప్రాంతాల్లో 162.81 ఎకరాల భూమి ఉంది. అక్కడ బహిరంగ మార్కెట్లో ఎకరం ధర రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఉంది. విజయవాడ గురునానక్ కాలనీలో 1,125 చదరపు గజాల స్థలం ఉంది. దీనివిలువ రూ.4.5 కోట్లు ఉంటుంది. విజయవాడ పాయకాపురం లే అవుట్లో మిగిలిన 14 ప్లాట్ల విలువ కూడా రూ.2 కోట్లకు పైగా ఉంటుంది. గన్నవరం ఎయిర్పోర్టు సమీపంలో 9 ఎకరాల భూమి ఉంది. దీని విలువ సుమారు రూ.70 కోట్ల వరకు ఉంటుందని అంచనా. వీటితోపాటు విజయవాడ, గుంటూరు, తెనాలి ప్రాంతాల్లో సొంత భవనాలు ఉన్నాయి. -
వందలకొద్ది ఫిర్యాదులు వస్తున్నాయి
తిరుపతి : తిరుపతిలో పారిశుధ్యంపై మంత్రి నారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం ఆయన పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ తిరుపతిలో పారిశుధ్యంపై వందలకొద్ది ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. దీనిపై అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించుకోవాలని, మరోసారి ఫిర్యాదులు వస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో పట్టణాల ఆధునీకరణకు ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని నారాయణ తెలిపారు. పట్టణ ప్రజల మౌలిక వసతులు మెరుగు పరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. పట్టణాల్లో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని నారాయణ స్పష్టం చేశారు. -
ఉద్యోగులపై వెంకయ్యనాయుడు సీరియస్
న్యూఢిల్లీ: నిర్మాణ్ భవన్ లో కేంద్ర పట్టాభివృద్ధిశాఖామంత్రి వెంకయ్యనాయుడు గురువారం ఉదయం ఆకస్మిక తనిఖీలు చేశారు. విధులకు ఉద్యోగులు ఆలస్యంగా హాజరవుతున్నారని సమాచారం అందుకున్న వెంకయ్య నిర్మాణ్ భవన్ లోని అన్ని విభాగాల్లో తనిఖీలు చేశారు. వెంకయ్య తనిఖీలు నిర్వహించిన సమయంలో ఎక్కువ సీట్లు ఖాళీగా కనిపించాయి. దాంతో ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులకు వెంకయ్య సీరియస్ గా క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది. గతంలో కూడా నిర్మాణ్ భవన్ లో వెంకయ్య తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
పట్టణాభివృద్ధికి పట్టం
ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్లను సూచికగా తీసుకోవాలి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి వ్యర్థాల సక్రమ వినియోగంపై దృష్టి పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధీర్కృష్ణ వెల్లడి విజయవాడ : కొత్త రాష్ట్రంలో పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు భారత ప్రభుత్వ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ సుధీర్కృష్ణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అనంతరం కొత్త రాష్ట్రంలో పట్టణాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ఆయన జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో స్థానిక ఉడా కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు నూతనంగా ఏర్పడిన సందర్భంలో ఆయా రాష్ట్రాల్లో నూతన రాజధాని, పట్టణాల ఆధునికీరణకు చేపట్టిన చర్యలను ఆంధ్ర రాష్ట్రంలో ఒక సూచికగా తీసుకోవాల్సి ఉంటుందని సమావేశంలో ఆయన చెప్పారు. రాష్ట్రం అభివృద్ధికి కోసం రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను పరిశీలించారు. భారత ప్రభుత్వ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అధికారి ఆర్.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉత్తరాఖండ్లో రాష్ట్ర పరిపాలనా కార్యాలయాన్ని 500 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొత్త రాజధాని ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఇతర అంశాలను విపులీకరించారు. వినియోగ రుసుంతో దుబారాకు చెక్ దుర్వినియోగం, దుబారాను అరికట్టేందుకు వినియోగ రుసుం వసూలు చేయాలని సుధీర్కృష్ణ సూచించారు. నగరపాలక సంస్థ, వివిధ మునిసిపల్, రాష్ట్రస్థాయి అధికారుల నుంచి మౌలిక సదుపాయాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు, తాగునీటి సరఫరా అంశాలపై చర్చించిన ఆయన మంచినీటికి వినియోగ రుసుం వసూలు చేయాలని చెప్పారు. అప్పుడే దుర్వినియోగాన్ని అరికట్టగలుగుతామన్నారు. వ్యర్థాలను రీసైక్లింగ్ విధానంలో వినియోగించుకోవడం ద్వారా పునరుత్పత్తి పద్ధతిలో ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. తెనాలి పట్టణంలో వంద రోజుల ప్రణాళికతో రూపొందించిన రీసైక్లింగ్ విధానాల అమలు తీరును మునిసిపల్ అధికారులు వివరించారు. వ్యర్థాల సక్రమ వినియోగ పద్ధతులపై ఈ ఏడాది జనవరి 28 నుంచి 30 వరకు నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి సమావేశ వివరాలను సుధీర్కృష్ణ ఈ సందర్భంగా వివరించారు. రీసైక్లింగ్ విధానంలో ఎంత ఖర్చు చేస్తే ఎంత ఆదాయం సమకూరింది అనే దానిపై స్పష్టమైన లెక్కలతో ముందుకు సాగాల్సిందిగా సూచించారు. 2031కి ఉడా జనాభా కోటీ 11 లక్షలు తెనాలి, విశాఖపట్నం, విజయవాడ నగరాలకు చెందిన అభివృద్ధి అంశాలు, 2011 జనాభా వివరాలు, 2031 నాటికి జనాభా అంచనాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా జిల్లాల అధికారులు వివరించారు. వీజీటీఎం ఉడా పరిధిలో 2031 నాటికి జనాభా కోటీ 11 లక్షలకు పెరిగే అవకాశం ఉందని ఉడా వైస్ చాన్సలర్ పి.ఉషాకుమారి తెలిపారు. పెరిగే జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మెట్రో రైలు ప్రతిపాదనలకు సంబంధించి రూపొందించిన నివేదికను అందించారు. గ్రేటర్ విశాఖపట్నం కమిషనర్ ఎంవీ సత్యనారాయణ, అడిషనల్ కమిషనర్ జానకి విశాఖపట్నంలోని మౌలిక సదుపాయాలు, రోడ్ల వసతి, మెట్రో రైలు సాధ్యాసాధ్యాలు ఇతర రవాణా సౌకర్యాలపై వివరాలు అందించారు. భారత ప్రభుత్వ రవాణా ప్రత్యేక అధికారి ఎన్కే సిన్హా, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్ టి.తిమ్మారెడ్డి, చీఫ్ ఇంజనీర్ జి.కొండలరావు, జిల్లా కలెక్టర్ ఎం.రఘునందనరావు, నగరపాలక సంస్థ కమిషనర్ సి.హరికిరణ్, వివిధ జిల్లాల, రాష్ట్రస్థాయి అధికారులు వై.మధుసూదనరెడ్డి, వి.పాండురంగారావు, ఎంవీఎస్ రెడ్డి, డి.వరప్రసాద్ పాల్గొన్నారు. ఉడా అభివృద్ధికి సహకరించండి డాక్టర్ సుధీర్కృష్ణను ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్ఫగుచ్ఛం అందించారు. ఉడా పరిధిలో అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఉడా అభివృద్ధికి సహకరించాల్సిందిగా ఆయన్ని కోరారు. -
అన్ని పార్టీలతో మంచి సంబంధాలున్నాయి: వెంకయ్య
తాను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టనున్నట్లు బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... పార్లమెంట్లో అన్ని అంశాలపై మంచి చర్చలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈరోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మొట్టమొదటి కేబినెట్ సమావేశం ఉందని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టోలో తామిచ్చిన హామీలన్ని నెరవేరుస్తామని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలతో తనకు మంచి సంబంధాలున్నాయని వెంకయ్య ఈ సందర్బంగా వివరించారు. దేశంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నరేంద్రమోడీ భారత దేశ 15వ ప్రధానమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీఏ కూటమీలోని పలువురు నాయకులు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎం.వెంకయ్యనాయుడుకు పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖను కేటాయించారు. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు రేపు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. వెంకయ్యనాయుడు కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. -
డీఎల్ఎఫ్కు సీబీఐ క్లీన్చిట్!
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్కు నిర్మాణ అనుమతుల కేసులో సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్కు సమీపంలోని స్థలంలో డీఎల్ఎఫ్ లగ్జరీ అపార్ట్మెంట్ సముదాయాన్ని నిర్మించడానికి అనుమతులివ్వడంపై దుమారం చెలరేగడం, భదత్రపరమైన ఆందోళనలు నెలకొనటంతో సీబీఐ దీనిపై ప్రాథమిక దర్యాప్తు (పీఈ) చేపట్టింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు (సీవీసీ) అందిన ఫిర్యాదుతో పట్టణాభివృద్ధి శాఖకు చెందిన కొందరు అధికారులపై గతేడాది జూలైలో సీబీఐ విచారణ ఆరంభించింది. ముఖ్యంగా డెయిరీ ఫార్మింగ్ కోసం ఉద్దేశించిన ఈ స్థలాన్ని అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం మార్చుకునేలా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చారనేది ఆరోపణ. అయితే, ఈ కేసులో ఎలాంటి నేరపూరిత అంశాలూ లేవని తేలినట్లు సీబీఐ అత్యున్నత స్థాయి వర్గాలు మంగళవారం వెల్లడించాయి. దీంతో విచారణను ముగిస్తున్నట్లు కూడా పేర్కొన్నాయి. డీఎల్ఎఫ్ పదేళ్ల క్రితం ఈకేఎస్పీఎల్ అనే సంస్థను కొనుగోలు చేసింది. దీంతో ఈకేఎస్పీఎల్కు రాష్ట్రపతి భవన్ సమీపంలో ఉన్న 22.9 ఎకరాల డెయిరీ ఫార్మ్ స్థలం కూడా డీఎల్ఎఫ్కు దక్కింది. ఈ స్థలంలో నాలుగంతస్తుల లగ్జరీ అపార్ట్మెంట్లను నిర్మించడానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. దీనిపై నమోదైన కేసులో ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం కూడా కంపెనీకి అనుకూలంగా తీర్పిచ్చింది. ప్రభుత్వానికి మార్పిడి చార్జీల కింద రూ.1,200 కోట్ల మొత్తాన్ని డిపాజిట్ చేయడంతో గ్రీన్ సిగ్నల్ లభించింది. మరోపక్క, ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు జరిపించేందుకు ప్రత్యేక దర్యాప్తు బందాన్ని(సిట్) ఏర్పాటు చేయటంపై దృష్టి సారించాలని బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. -
ప్రణాళికాబద్ధంగా పట్టణాల అభివృద్ధి
కలెక్టరేట్, న్యూస్లైన్: మున్సిపాలిటీలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పర్చాలని జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మంగళవారం మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమై మున్సిపాలిటీల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటా చెత్త సేకరించే విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నల్లగొండ మున్సిపాలిటీ పనితీరుపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల మంజూరుపై చూపిన శ్రద్ధ పారిశుద్ధ్యంపై చూపకపోవడం సరికాదని అధికారులకు హితవు పలికారు. డంపింగ్ యార్డులు లేనిచోట తహసీల్దార్లను సం ప్రదించి స్థలాలు సేకరించాలని సూచిం చారు. ఒకప్పుడు ఆదర్శ మున్సిపాలిటీగా ఉన్న సూర్యాపేటలో నేడు పారి శుద్ధ్యం కొరవడిందని అసహనం వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల గొట్టాలపై దోమల బెడద నివారించేందుకు నెట్లు ఏర్పాటు చేయాలని చెప్పి మూడు నెలలైనా చర్యలు తీసుకోకపోవడంపై కమిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎందుకు అమలు చేయలేదని వా రిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయా విషయాలపై వెంటనే మున్సిపల్ కమిషనర్లకు మెమోలు జారీ చేయాలని మెప్మా పీడీని ఆదేశించారు. మున్సిపాలిటీల్లో చేపట్టిన పనులన్నింటిపై విధిగా మూడో బృందంతో విచారణ చేయించాలని సూ చించారు. పట్టణ ప్రాంతంలో ఉన్న బాలకార్మికులను రెసిడెన్షియల్, కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాలు, బ్రిడ్జి కోర్సులలో చేర్పించాలని సూచిం చారు. ఆస్తి పన్ను, నీటి పన్నులను మార్చి నెలాఖరులోగా నూరుశాతం వసూలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, అధికారులు మొక్కుబడిగా సమావేశానికి హాజరైతే ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ ఆమోస్, నల్లగొండ ఆర్డీఓ జహీర్, మెప్మా పీడీ వెంకటేశ్వర్లు, జిల్లాఆడిట్ అధికారి సీహెచ్.వేణుగోపాల్రావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ అశ్విని, కమిషనర్లు పాల్గొన్నారు. -
నగరాభివృద్ధికి రూ. 100 కోట్లు ఇవ్వండి
సింధనూరు టౌన్, న్యూస్లైన్ : నగరాభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఎమ్మెల్యే బాదర్లి హంపనగౌడ కోరారు. ఆయన ఆదివారం స్థానిక బాలుర ప్రభుత్వ పీయూ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అధ్యక్షత వహించి మాట్లాడారు. నగరంలో డ్రెయినేజీ, రోడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పన దృష్ట్యా నిధులు మంజూరు చేయాలని మనవి చేశారు. సింధనూరు - మస్కి రహదారి అభివృద్ధికి కూడా రూ.100 కోట్లు అందించాలని కోరారు. ఈ సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని అన్నారు. మొదటి సారిగా రైతుల సముదాయానికి ప్రాధాన్యత కల్పించాలని, రాయచూరు, కొప్పళ, బళ్లారి జిల్లాలో మొత్తం 12 లక్షల ఎకరాలకు పైగా నీటిపారుదల భూములు ఉన్నాయని తెలిపారు. తుంగభద్రా జలాశయంలో 30 టీఎంసీల మేర పూడిక నిండి ఉందని, దీంతో ఎడమ కాలువకు రెండవ పంటకు నీరు లభించడం కష్టసాధ్యమని వెల్లడించారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు. తుంగభద్రా వరద నీటిని ఉపయోగించుకునే విధంగా పథకాలను రూపొందించాలన్నారు. ఈ పథకానికి సుమారు 6-8 వేల కోట్లు ఖర్చు అవుతుందని, ఏటేటా సమస్యలు తగ్గుముఖం అవుతాయని వెల్లడించారు. నగరంలో నెలకొన్న సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని కోరారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సింధనూరు విధానసభ నియోజకవర్గంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అధికార పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ లేరని, అయితే మొదటి సారిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో తనను ఎంపిక చేశారని, ప్రజల ఆశయాలకనుగుణంగా తగిన అభివృద్ధి పనులు చేపడతానని తెలిపారు. -
‘స్మార్ట్ సిటీ వరంగల్’ విన్నపం అందింది: కమల్నాథ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పట్టణమైన వరంగల్ను ‘స్మార్ట్ సిటీ’గా తీర్చిదిద్దాలన్న వినతి తమకు అందిందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కమల్నాథ్ గురువారం రాజ్యసభకు తెలిపారు. అయితే జేఎన్ఎన్యూఆర్ఎం కింద ప్రస్తుత దశలో దీన్ని చేపట్టలేమని కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్దన్రెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కమల్నాథ్ ఈ విషయం చెప్పారు. కాగా, హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్ వద్ద 9.053 ఎకరాల స్థలంలో ఎయిర్ఫోర్స్ నావల్ హౌసింగ్ బోర్డు(ఎఎఫ్ఎన్హెచ్బీ) మూడోదశ గృహనిర్మాణ ప్రాజెక్టు 2006 చివరినాటికే పూర్తికావాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల 2012 డిసెంబర్ నాటికి కొలిక్కివచ్చిందని రక్షణ మంత్రి ఆంటోనీ.. పాల్వాయి అడిగిన మరో ప్రశ్నకు బదులిచ్చారు. కరీంనగర్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ అధికారుల బృందం గత జూన్లో రామగుండం మండలం పాలకుర్తిలో నిరుపయోగంగా ఉన్న ఎయిర్స్ట్రిప్ను పరిశీలించినట్లు విమానయానశాఖ సహాయమంత్రి కె.సి.వేణుగోపాల్ సమాధానం చెప్పారు. -
ఆ ప్రాజెక్టులకు విఘాతం
సాక్షి, సిటీబ్యూరో : నగరాభివృద్ధికి దిశానిర్దేశం చేసే హెచ్ఎండీఏ ఇప్పుడు ‘మహా’ ఇరకాటంలో పడింది. నిధుల సముపార్జనలో భాగంగా 12 లేఅవుట్లలో 42 విడి ప్లాట్లను వే లానికి సిద్ధం చేసినా ప్రస్తుత రాజకీయ అనిశ్చితి కారణంగా పునరాలోచనలో పడింది. ప్రస్తుతం ప్లాట్లను వేలానికి పెడితే వివిధ ఉద్యమ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత పెల్లుబికే అవకాశం ఉండటంతో అధికారులు ఆ అంశాన్ని పూర్తిగా పక్కకు పెట్టేశారు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన రోజు నుంచి బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి, కొత్త లేఅవుట్స్ పర్మిషన్ కోసం ఒక్కటంటే ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం హెచ్ఎండీఏ అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకొన్న వారు కూడా నిర్దేశిత ఫీజు చెల్లించేందుకు ఆసక్తి చూపట్లేదు. ఎల్ఆర్ఎస్ కింద జోనల్ కార్యాలయాల నుంచి వచ్చే ఆదాయం కూడా స్తంభించిపోయింది. మొన్నటివరకు హెచ్ఎండీఏ ప్లాట్ల కోసం ఆరా తీసినవారు ఇప్పుడు ఆ ఛాయలకు కూడా రావట్లేదు. దీంతో గత 4 రోజులుగా హెచ్ఎండీఏ కార్యాలయం బోసిపోయి కన్పిస్తోంది. కొత్త వెంచర్ల మాట అటుంచితే... ఇప్పటికే నిర్మించిన అపార్టుమెంట్ల, పలు లేఅవుట్స్లోని ప్లాట్లు అమ్ముడుపోని పరిస్థితి ఎదురైందని బిల్డర్లు, రియల్టర్లు వాపోతున్నారు. ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్లు, వివిధ పర్మిషన్లు, భూ వినియోగం మార్పు, ల్యాండ్ లీజులు, కొత్తప్రాజెక్టుల కోసం నిత్యం అనేక మంది హెచ్ఎండీఏ కార్యాలయానికి వచ్చేవారు. అయితే... ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్ర విభజన వ్యవహారం ఏదో ఒకటి తేలాకే... కొత్త లేఅవుట్లు, గ్రూపు హౌసింగ్ ప్రాజెక్టుల గురించి ఆలోచిద్దామన్న నిర్ణయానికి రియల్టర్లు వచ్చారు. ప్రస్తుతం హెచ్ఎండీఏలో పెద్దగా హడావుడి లేకపోవడంతో కమిషనర్ నీరభ్కుమార్ ప్రసాద్ కూడా బేగంపేటలోని గ్రీన్ల్యాండ్స్ భవనానికే పరిమితమవుతున్నారు. ఏవైనా అత్యవసర ఫైళ్లు ఉంటే అక్కడికే తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. ఆ ప్రాజెక్టులకు విఘాతం నగరాభివృద్ధిలో భాగంగా పీపీపీ విధానంలో చేపట్టిన పలు ప్రాజెక్టులకూ విఘాతం ఎదురైంది. ప్రధానంగా బాటసింగారం, మంగళపల్లిలో లాజిస్టిక్ పార్కులు, మియాపూర్లో భారీ బస్టెర్మినల్ నిర్మాణాన్ని హెచ్ఎండీఏ తలపెట్టింది. టెండర్లో వీటిని దక్కించుకొన్న సంస్థలు ఆయా ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఇప్పుడు పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. అలాగే ఖానామెట్లో తలపెట్టిన సైన్స్ సిటీ, జవ హర్నగర్లో ప్రతిపాదించిన ఎడ్యుకేషనల్ హబ్లపై కూడా నీలినీడలు కమ్ముకొన్నాయి. ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్ను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ సంస్థలే కాదు... దేశీయ విద్యాసంస్థలు కూడా వెనుకడుగు వేస్తున్నాయి. జవహార్నగర్లో భూమి కావాలంటూ ఇటీవల హెచ్ఎండీఏను సంప్రదించిన సంస్థలు సైతం ఇప్పుడు మొహం చాటేస్తుండటం గమనార్హం. విభజన వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే వరకు హెచ్ఎండీఏతో ఎలాంటి ఒప్పందం చేసుకోవద్దని ఆయా సంస్థలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏ చేసిన ల్యాండ్ పూలింగ్ ప్రయోగం కూడా రాష్ట్ర విభజన ప్రకటనతో బెడిసికొట్టడం అధికారులకు మింగుడు పడకుండా ఉంది. ఆశలపై నీళ్లు అసలే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన హెచ్ఎండీఏ.. నగరంలోని 42 విడి ప్లాట్లను విక్రయించడం ద్వారా రూ.50 కోట్ల ఆదాయం సముపార్జించాలని భావించింది. గత ఏడాది మొత్తం 41 పాట్లు వేలానికి పెట్టగా 36 ప్లాట్లు అమ్ముడుపోయి సుమారు రూ.124 కోట్ల మేర ఆదాయం లభించింది. ఆ స్ఫూర్తితో వివిధ లేఅవుట్లలో మిగిలిపోయిన ప్లాట్లను వెలికితీసి అధికారులు వేలానికి సిద్ధం చేశారు. ఈ తరుణంలో రాష్ట్ర విభజన ప్రకటన హెచ్ఎండీఏ ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.