review meeting
-
వారికే ఇందిరమ్మ ఇళ్లలో తొలి ప్రాధాన్యం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: అత్యంత నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లలో తొలి ప్రాధాన్యం ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులకు పెద్దపీట వేస్తామన్నారు. పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖ బలోపేతం చేస్తామని.. లబ్ధిదారు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతి ఇస్తామని సీఎం తెలిపారు.‘‘ఇళ్ల విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయడంతో పాటు అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలి. ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలి. ఏ దశలోనూ లబ్ధిదారుకు ఇబ్బంది కలగవద్దని.. అదే సమయంలో శాఖపరంగా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలి. ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి’’ అని అధికారులను సీఎం ఆదేశించారు. -
రుణాల పంపిణీపై బ్యాంకర్లతో సమీక్ష
వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, పశుపోషణ, పాడి పరిశ్రమ..వంటి విభిన్న విభాగాలకు అందించే రుణాల పంపిణీ పురోగతిని కేంద్రం సమీక్షించింది. కేంద్ర ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి నాగరాజు ఈమేరకు అధికారులతో చర్చించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డ్, రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన బ్యాంకర్ల కమిటీతో సమావేశం నిర్వహించారు.రుణాలతో ఉపాధి అవకాశాలు పెంపుప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నిర్ణయించిన లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నాగరాజు బ్యాంకర్లకు సూచించారు. ఈ రంగాలకు అందించే రుణ పంపిణీని మెరుగుపరచడంలో బ్యాంకులకు సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. వ్యవసాయ వృద్ధి కోసం దాని అనుబంధ రంగాలను ప్రోత్సహించాలన్నారు. దానివల్ల గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. కాబట్టి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో రుణ పంపిణీ పెంచాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్ పంపిణీని నిర్ధారించడానికి ప్రాంతీయ స్థాయి సమావేశాలు నిర్వహించాలని బ్యాంకులను ఆదేశించారు.ఇదీ చదవండి: ట్రంప్-బైడెన్.. ఎవరి హయాంలో భారత్ వృద్ధి ఎంత?రుణ పంపిణీపై ప్రభుత్వం దృష్టిచేపల పెంపకందారులను గుర్తించి వారికి కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ) పథకం ద్వారా లబ్ధి చేకూర్చేందుకు సహకరించాలని చెప్పారు. అందుకోసం రాష్ట్ర విభాగాలు, ఇతర సంఘాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సులువుగా రుణాలు అందించేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని నొక్కి చెప్పారు. -
భేటీలతో మోదీ బిజీ బిజీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అధికార యంత్రాంగంతో సమీక్షలు నిర్వహించారు. మూడోసారి అధికారంలోకి వస్తే ‘100 రోజుల అజెండా’లో చేయాల్సిన పనులపై చర్చించారు.వరస సమీక్షలు రేమాన్ తుపాను బీభత్సం, సహాయక చర్యలు తదితరాలపై మోదీ సమీక్ష జరిపారు. దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో పౌరుల మరణానికి కారణనమైన హీట్వేవ్పై సమీక్ష జరిగింది. ఆస్పత్రుల్లో సరిపడ పడకలు, వైద్యులు, వైద్యసిబ్బంది, ఔషధాల లభ్యతపై చర్చించారు. జూన్ ఐదో తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. అన్నింటికన్నా ముఖ్యమైనదిగా భావిస్తున్న ‘100 రోజుల అజెండా’పై విడిగా మరో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారంలోకి రాగానే చేపట్టాల్సిన పనుల పురోగతిపై ప్రధాని అధికారులను ఆరాతీశారు. తొలి 100 రోజుల్లో ఎలాంటి పనులు చేస్తే బాగుంటుందో సలహాలు, సూచనలు ఇవ్వాలని గతంలో మంత్రిమండలి సభ్యులను మోదీ ఆజ్ఞాపించడం తెల్సిందే. ఫైర్, ఎలక్ట్రిక్ సేఫ్టీ ఆడిట్లు చేయండి ఎండలు, వేడి వాతావరణం కారణంగా భవనాల్లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగి అగి్నప్రమాదాలకు దారి తీయకుండా ఎప్పటికప్పుడు ఫైర్, ఎలక్ట్రిక్ సేఫ్టీ ఆడిట్లను చేయాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. అధిక ఉష్ణోగ్రతల ధాటికి అటవీప్రాంతాల్లో కార్చిచ్చు ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అటవీశాఖ అధికారులకు సూచనలు చేశారు. ‘ మిజోరం, అస్సాం, మణిపూర్, త్రిపుర, మేఘాలయలో రేమాల్ తుపాను బాధితులకు అండగా ఉంటామని మోదీ భరోసా ఇచ్చారు’ అని కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ భేటీల్లో పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణపై సీఎస్ సమీక్ష
-
అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు. అంగన్వాడీల్లో పౌష్టికాహారం దుర్వినియోగం జరగకుండా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణాలపై దృష్టిసారించాలన్న సీఎం.. మొదటి ప్రాధాన్యతగా తీసుకుని భవన నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదీ చదవండి: జీహెచ్ఎంసీ ప్రక్షాళన.. 14 మంది అధికారులపై వేటు -
Kurnool: ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి
కర్నూలు(సెంట్రల్): నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లాఎన్నికల అధికారి/కలెక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఎన్నికల నిర్వహణ సన్నద్ధత, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, ఆరోగ్య శ్రీ యాప్ డౌన్లోడ్, కులగణన సర్వే తదితర అంశాలపై ఆమె రిటర్నింగ్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో జేసీ నారపురెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తహసీల్దార్లు, ఎంపీడీఓల పాత్ర కీలకమన్నారు. ఈక్రమంలో త్వరగా మండలాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వచ్చే 10–15 రోజుల్లో మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి నివేదిక పంపాలన్నారు. సెక్టార్ ఆఫీసర్లు, బీఎల్ఓలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఎన్నికల అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఎన్నికల పనులతోపాటు ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై కూడా దృష్టి సారించాలన్నారు. కిందిస్థాయి సిబ్బంది మీద ఆధారపడకుండా రిటర్నింగ్ అధికారి హ్యాండ్బుక్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఇతర నియమాలను తప్పనిసరిగా చదివి అవగాహన పెంచుకోవాలన్నారు. సెక్టార్ ఆఫీసర్లతో మాట్లాడుకొని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన, పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి చేరేందుకు అవసరమైన రూట్మ్యాప్లు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై సమీక్షలు చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కులగణన సర్వే 88 శాతం పూర్తి జిల్లాలో కులగణన సర్వే 88 శాతం పూర్తయిందని, బుధవారంలోపు 90 శాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓలను కలెక్టర్ సృజన ఆదేశించారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో సర్వేను వేగవంతం చేయించాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీలో రాష్ట్రంలో కర్నూలు జిల్లా టాప్లో ఉందన్నారు. కానీ ఆరోగ్యశీ యాప్ను డౌన్లోడ్ చేయించడంలో మాత్రం జిల్లా దిగువ స్థానంలో ఉన్నట్లు చెప్పారు. బుధవారంలోపు ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్లో పురోగతి సాధించేలా చూడాలన్నారు. ఆరోగ్య సురక్ష క్యాంపులకు సంబంధించి వలంటీర్లతో సర్వేను వేగవంతం చేయించాలన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో ఇచ్చిన స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 9వ తేదీలోపు పూర్తయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జేసీ నారపురెడ్డి మౌర్య, కర్నూలు నగర పాలక కమిషనర్ భార్గవ్తేజ, ఆదోని సబ్కలెక్టర్ శివనారాయన్ శర్మ, డీఆర్వో కె.మధుసూదన్రావు, కర్నూలు, పత్తికొండ ఆర్డీఓలు ఎం.శేషిరెడ్డి, రామలక్ష్మి, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరు: సీఎం జగన్
గుంటూరు, సాక్షి: జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతో సమావేశమయ్యారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. జనవరిలో 3, ఫిబ్రవరిలో 1, మొత్తంగా నాలుగు ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నామని, ఎక్కడాకూడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి కార్యక్రమానికి ప్రీలాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాలు ఉంటాయి. అవి సక్రమంగా నడిచేలా కలెక్టర్లు షెడ్యూల్ చేసుకోవాలి. జనవరి నుంచి వైఎస్సార్ పెన్షన్ కానుక రూ.3 వేలకు పెంచుతాం. రూ.3 వేలకు పెన్షన్ పెంచుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నాం. విశ్వసనీయతకు ఈ ప్రభుత్వం మారు పేరు అని రుజువు చేస్తున్నామని సీఎం చెప్పారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. ►జనవరి 1 నుంచి 8వ తారీఖు వరకూ పెన్షన్ల పెంపు కార్యక్రమం జరుగుతుంది ►2019లో మన ప్రభుత్వం రాకముందు ఎన్నికలకు 2 నెలల ముందు వరకూ పెన్షన్ కేవలం రూ.1000 మాత్రమే ఇచ్చేవారు ►మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2,250 లు చేశాం ►ఆ తర్వాత ఇప్పుడు రూ.3 వేల వరకూ పెంచుకుంటూ వచ్చాం ►గత ప్రభుత్వంలో నెలకు రూ.400 కోట్ల మాత్రమే సగటున పెన్షన్లకోసం ఖర్చు చేసేవారు ►ఇవాళ మన ప్రభుత్వ హయాంలో నెలకు సుమారు రూ.1950 కోట్ల ఖర్చు చేస్తున్నాం ►మన రాకముందు ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు పెన్షన్ల సంఖ్య 39 లక్షలు అయితే ఇవాళ పెన్షన్ల సంఖ్య దాదాపు 66 లక్షలు ►ప్రతి అడుగులోనూ కూడా ఏ లబ్ధిదారు మిగిలిపోకూడదు, ప్రతి ఒక్కరికీ కూడా మంచి జరగాలి, ఎవ్వరూ కూడా ఇబ్బందులు పడకూడదని.. ఎప్పుడూ లేని విధంగా వాలంటీర్ – సచివాలయ వ్యవస్థను గ్రామస్థాయిలో తీసుకు వచ్చాం ►ఒకటో తారీఖు అది ఆదివారమైనా, పండుగైనా సరే .. పొద్దునే వాలంటీర్ చిక్కటి చిరునవ్వుతో పెన్షన్ను ఇంటివద్దే ఇచ్చే పరిస్థితిని, మార్పును తీసుకురాగలిగాం ►ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఈ మార్పును తీసుకురాగలిగాం: ►ఈ మార్పును ఎలా తీసుకు రాగలిగాం? ఇంత మంచి ఎలా చేయగలిగాం? అన్నది ప్రతి గడపకూ తెలియజేయాల్సిన అవసరం ఉంది ►రెండో కార్యక్రమం జనవరి 19న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం ►మూడో కార్యక్రమం వైఎస్సార్ ఆసరాలో భాగంగా జనవరి 23 నుంచి 31 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ►నాలుగోది వైయస్సార్ చేయూత కార్యక్రమం.. ఇది ఫిబ్రవరి 5 నుంచి 14వరకూ కొనసాగుతుంది ►ఈ నాలుగు కార్యక్రమాలను ప్రభుత్వం చాలా ప్రతిష్ట్మాత్మకంగా నిర్వహిస్తుంది ►అర్హత ఉండీ ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయిన సందర్భాల్లో .. మరలా రీవెరిఫికేషన్ చేసి, వారికి పథకాలు వర్తింపు చేసే బై యాన్యువల్ కార్యక్రమం జనవరి 5న జరుగుతుంది: ►ఈ కార్యక్రమం జరిగే లోపే వెరిఫికేషన్ పూర్తి చేసిన దాదాపు 1.17 లక్షల పెన్షన్లు ఒకటో తారీఖు నుంచే ఇస్తారు ►66,34,742మందికి సుమారు రూ.1968 కోట్లకుపైగా పెన్షన్ల రూపంలో అందుతాయి ►మన ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది ►క్రెడిబులిటీకి అర్ధం చెబుతూ ఈ ప్రభుత్వం పనిచేస్తోంది ►ఈ సందేశం ప్రతి ఒక్కరికీ చేరాలి ►పెన్షన్ల పెంపు కార్యక్రమం జనవరి 1వ తేదీనే ప్రారంభమవుతుంది ►ఇందులో భాగంగా నేను కూడా 3వ తారీఖున కాకినాడలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను ►అవ్వాతాతలు వేచిచూసే పరిస్థితి లేకుండా 1వ తారీఖునే ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది ►ప్రజా ప్రతినిధులు అందరూ కూడా పెన్షన్ కానుక కార్యక్రమంలో భాగస్వాములు కావాలి ►ఎమ్మెల్యేలు ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి ►8 రోజులపాటు పెంచిన పెన్షన్లతో పెన్షన్ కానుక కార్యక్రమం జరుగుతుంది ►ఏయే మండలాల్లో ఏయే రోజుల్లో జరుగుతుందన్న దానిపై షెడ్యూలు చేసుకోవాలి పెన్షన్తోపాటు నా తరపున లేఖను కూడా లబ్ధిదారులకు అందించాలి అలాగే నేను ఇచ్చే వీడియో సందేశం కూడా లబ్ధిదారులకు చేరవేయాలి ►ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు, ఉత్సాహవంతులు, లైక్ మైండ్స్.. ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలి ►ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో నిర్వహించాలి ►రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా అవ్వాతాతలను ఈ విధంగా పట్టించుకున్న ప్రభుత్వం లేదు ►వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్నాం ►వాళ్ల కోసం పట్టించుకునే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలాంటి ఏర్పాటు గతంలో ఎప్పుడూ లేదు ►దేశంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ డబ్బు ఎక్కడా ఇవ్వలేదు ►మనం చెప్పిన మాటను నెరవేర్చాలా మన ప్రభుత్వం కృతనిశ్చయంతో అడుగులు వేసింది ►ఇచ్చిన హామీని మనసా వాచా అమలు చేయడానికి ఎంతగా కష్టపడ్డామో, ఎంత గొప్పగా చేయగలుగుతున్నామో అందరికీ తెలిసిందే ►ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలను ప్రతి లబ్ధిదారులకు తెలియాలి ►ఈ పెన్షన్ కార్యక్రమం కోసం ఏడాదికి దాదాపు రూ.23 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం ►కాని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అంకిత భావంతో అవ్వాతాతలకు అండగా నిలబడేందుకు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాం వైఎస్సార్ ఆసరా... ►2019లో మన ప్రభుత్వం రాకముందు పొదుపు సంఘాలన్నీ పూర్తిగా కుదేలైపోయాయి ►ఏ గ్రేడ్, బి గ్రేడ్ సంఘాలు పూర్తిగా కనుమరుగైపోయి సీ గ్రేడ్, డీ గ్రేడ్గా సంఘాల్లో చేరిన పరిస్థితి ►18శాతం పైచిలుకు అక్కౌంట్లు అన్నీ కూడా అవుట్ స్టాండింగ్, ఎన్పీఏల స్థాయిలోకి వెళ్లిపోయాయి ►గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది ►మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి చేయూత నిచ్చి ఆసరా, సున్నావడ్డీ, చేయూత, అమ్మ ఒడి పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం: ►మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారితను సాధించగలిగాం ►క్రమం తప్పకుండా ప్రతి ఏటా లబ్ధిదారులకు అందించగలిగాం ►అందుకనే ఈరోజు పొదుపు సంఘాల్లో ఎన్పీఏలు కేవలం 0.3 శాతానికి చేరాయి: ►అక్క చెల్లెమ్మలకు ఇంతగా తోడు ఉండి నడిపించిన ప్రభుత్వం మనది ►ఒక్క ఆసరా కోసమే రూ.25,570 కోట్లు ఖర్చు చేశాం ►మూడు విడతలుగా ఇప్పటికే రూ.19,195 కోట్లు ఇచ్చాం ►నాలుగో విడతగా.... చివరి ఇన్స్టాల్మెంట్ కింద సుమారు రూ.6,400 కోట్లు ఇస్తున్నాం ►జనవరి 23న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ►ఇది కూడా జనవరి 23 నుంచి 31వ తారీఖు వరకూ కొనసాగుతుంది ►ఈ కార్యక్రమం ద్వారా 78.94 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు ►మహిళల్లో సుస్థర జీవనోపాధి కల్పించాలన్నదే ఆసరా, చేయూత పథకాల ఉద్దేశం ►ఇందులో భాగంగానే అనేక మల్టీ నేషనల్, ప్రముఖ కంపెనీలతో టై అప్ చేయించాం ►బ్యాంకులతో టై అప్ చేయించాం ►స్వయం ఉపాధి పథకాల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు చూడగలుగుతాం: ►ప్రీలాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాల్లో మహిళలు, మహిళా సంఘాల్లో అవగాహన కల్పించాలి ►ఆసరా, చేయూత కార్యక్రమాల లబ్ధిదారులకు ఇది చాలా అవసరం : ►మహిళా సంఘాలు తీర్మానాలు చేసుకుంటే ఆసరా కింద ఇచ్చే డబ్బు గ్రూపు ఖాతాల నుంచి వారి వ్యక్తిగత ఖాతాల్లోకి వెళ్తుంది: వీడియోల రూపంలో విజయ గాథలు ►పెన్షన్ కానుక, ఆసరా, చేయూత లబ్ధిదారుల విజయగాధలను వీడియోల రూపంలో పంపాలి ►ఇలా పంపిన వాటిలో అత్యుత్తమమైన వాటికి బహుమతులు ఇస్తాం ►ఇవి మరికొందరిలో స్ఫూర్తిని పెంచుతాయి: ►ఏ రకంగా ఈ పథకాలు, కార్యక్రమాలు వారి జీవితాలను మార్చాయో ఈ వీడియోల ద్వారా తీసుకోవాలి ►ఈ పథకాల ద్వారా మహిళల్లో వచ్చిన మార్పులను ఈ వీడియోల ద్వారా తీసుకోవాలి ►ఉత్తమమైన వాటికి సచివాలయాల స్ధాయిలో రూ.10వేలు, మండల స్థాయిలో రూ.15వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20వేలు, జిల్లా స్థాయిలో రూ.25వేలు బహుమతిగా ఇస్తాం ►ఫిబ్రవరి 15–16 ప్రాంతంలో ఉత్తమ సేవలు అందించినందుకు వాలంటీర్లకు సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు ఇస్తాం ►వాటితోపాటు లబ్ధిదారులపై రూపొందించివాటిలో ఉత్తమ వీడియోలు పంపినవారికి అవార్డులు ►ఆసరా కార్యక్రమాలన్నీ ఉత్సవ వాతావరణంలో జరగాలి ►ఇందులో మహిళా సంఘాల కార్యకలాపాలు తెలియజేసే స్టాల్స్ను కూడా ఏర్పాటు చేయాలి వైఎస్సార్ చేయూత కార్యక్రమం... ►ఫిబ్రవరి 5 నుంచి 14 వరకూ వైయస్సార్ చేయూత కార్యక్రమం జరుగుతుంది ►గతంలో ఆంధ్రరాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు ►ఇప్పటివరకూ రూ.14,129 కోట్లు ఇచ్చాం ►ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో అట్టడుకు వర్గాల్లో వారికి తోడుగా నిలబడ్డమే కాకుండా, వారికి జీవనోపాధి చూపించే దిశగా ఈ కార్యక్రమం చేస్తున్నాం ►45 ఏళ్ల పైబడ్డ ఉన్న మహిళలకు ఏడాదికి రూ.18,750లు ఇచ్చాం ►26 లక్షల మందికి పైగా అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తున్నాం ►ఈ పథకంలో ఇప్పటివరకు యూనిక్ లబ్ధిదారులు 31,23,466 మంది ఉన్నారు ►ఈ పథకం వారి జీవితాల్లో ఏరకంగా మార్పులు తీసుకు వచ్చిందో తెలియజెప్పాలి ►చివరి విడతద్వారా 26,39,703 మంది లబ్ధి పొందారు ►అదే విధంగా మహిళల జీవనోపాథి మార్గాలపై వారిలో మరింత అవగాహన కల్పించి, వారికున్న అవకాశాలనుకూడా వివరించాలి ►ఈ కార్యక్రమంలో కూడా నా తరపున లేఖను కూడా లబ్ధిదారులకు అందించాలి ►అలాగే నేను ఇచ్చే వీడియో సందేశం కూడా లబ్ధిదారులకు చేరవేయాలి జనవరి 19 – అంబేద్కర్ విగ్రహం ప్రారంభం. ►జనవరి 19 విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తున్నాం ►19 ఎకరాల్లో రూ.404 కోట్లతో 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం ►సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నాం ►సచివాలయం స్థాయి నుంచి రాష్ట్రస్థాయివరకూ ప్రతి అడుగులోనూ సామాజిక న్యాయ నినాదం వినిపించాలి ►ప్రతి సచివాలయం పరిధిలోకూడా సమావేశాలు పెట్టి, అవగాహన కలిగించాలి ►ప్రతి సచివాలయం నుంచి 5 మందిని 19న జరిగే అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలి ►ప్రతి మండల కేంద్రం నుంచి ప్రత్యేకమైన బస్సులు నడుపుతాం ►సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణలో వాళ్లూ భాగస్వామ్యులయ్యేటట్టు చేయాలి ►గ్రామ స్థాయిలో మనం గొప్ప వ్యవస్థను తీసుకు వచ్చాం ►గ్రామ స్వరాజ్యం తీసుకు వచ్చాం ►ఇదొక గొప్ప మార్పు ►దీనికి మద్ధతు తెలిపే కార్యక్రమాలు జరగాలి ►ఈ మార్పునకు ప్రతిరూపంగా అంబేద్కర్ విగ్రహం నిలుస్తుంది -
స్పీడ్ పెంచిన సీఎం రేవంత్.. ఇక GHMC, HMDA వంతు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఇప్పటికే పలు శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సమీక్షలు నిర్వహించారు. ఇక, తాజాగా కొత్త ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్పై ఫోకస్ పెట్టింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏపై సమీక్ష చేపట్టనుంది. అయితే, గ్రేటర్ హైదరాబాద్పై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నెల 25వ తేదీ తరువాత జీహెచ్ఎంసీ-హెచ్ఎండీఏపై కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్ష చేపట్టనుంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ-హెచ్ఎండీఏ పరిధిలో రిపోర్టు తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్, పెండింగ్ పనుల లిస్ట్పై బల్దియా కసరత్తు మొదలు పెట్టింది. ఇక, హెచ్ఎండీఏ పరిధిలో ఓఆర్ఆర్ టెండర్లు, భూముల వేలంతో పాటు పెండింగ్ పనుల లిస్ట్ను అధికారులు సిద్దం చేస్తున్నారు. మరోవైపు, ఆదాయ మార్గాల్లో భాగంగా రెండింటిపై ప్రభుత్వం సమీక్ష చేపట్టనుంది. ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి వద్దే మున్సిపల్ శాఖ ఉన్న విషయం తెలిసిందే. -
మేడిగడ్డపై అంత నిర్లక్ష్యమా.. మంత్రి ఉత్తమ్ సీరియస్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించి మేడిగడ్డ పనులపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అయితే, మేడిగట్ట బ్యారేజ్ పనులు చేసిన ఎల్ అండ్ టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్వీ దేశాయ్, ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సమీక్షలో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్..‘అంత పెద్ద ప్రాజెక్ట్లో ఎలా నాసిరకం పనులు చేసారు. ఇంత నాణ్యత లేకుండా ఎలా చేసారని నిలదీశారు. ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి మా ప్రమేయం లేదు అని తప్పించుకోవాలంటే ఊరుకోమని హెచ్చరించారు. ప్రజా ధనాన్ని వృథా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవ్వరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టు ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని, తప్పు చేసిన వారు తపించుకోవాలని చూస్తే న్యాయ పరంగా, చట్ట పరంగా చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. -
నిబంధనలు సడలించి న్యాయం చేస్తాం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: మిచౌంగ్ తుపాను కారణంగా ఏపీలో దెబ్బతిన్న పంటలపై, రంగుమారిన వరి ధాన్యం కొనుగోలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అలాగే ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకుంటుందన్న భరోసా వాళ్లకు కల్పించాలని ఈ సందర్భంగా ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేలు, అధికారులతో సీఎం జగన్ అన్నారు. అవసరమైతే కొన్ని నిబంధనలు సడలించైనా రైతులకు న్యాయం చేయాలని సూచించారాయన. ‘‘రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోంది. ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. ఇదే విషయాన్ని రైతు సోదరులందరికీ తెలియజేసి, వారిలో భరోసాను నింపాలి. ధాన్యం కొనుగోలు విషయంలో లిబరల్గా ఉండాలి. కొన్ని నిబంధనలు సడలించి అయినా రైతులకు న్యాయం చేయాలి’’ అని సీఎం జగన్ అన్నారు. రైతుల వద్దనున్న ధాన్యాన్ని కొనుగోలుచేసి మిల్లులకు పంపే బాధ్యతను పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకుంటుంది. ఆర్బీకేల వారీగా ఈ కొనుగోళ్లు జరుగుతాయి అని అన్నారాయన. ఆ సమయంలో ‘రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభించారా?’ అని అధికారులను సీఎం జగన్ ఆరా తీశారు. ఈ నెల 11 నుంచి 18 వరకు ఎన్యూమరేషన్ జరుగుతోందని, 19 నుంచి 22 వరకు సోషల్ ఆడిట్ కోసం ఆర్బీకేలలో లిస్ట్లు అందుబాటులో ఉంచుతామని అధికారులు సీఎం జగన్కు నివేదించారు. -
తెలంగాణలో డ్రగ్స్ మాట వినపడొద్దు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం పలు కీలక విభాగాలపై సమీక్ష చేపట్టారు. ఉదయం నుంచి ఆయన ఐదు కీలక శాఖలపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో డ్రగ్స్ మాట వినపడొద్దని అన్నారు. ప్రతినెల నార్కోటిక్ బ్యూరోపై రివ్యూ చేస్తామని తెలిపారు. వ్యవసాయం, నార్కోటిక్ అండ్ డ్రగ్స్, ఎక్సైజ్, టీఎస్పీఎస్సీ, సింగరేణిలపై రేవంత్రెడ్డి సుదీర్ఘంగా సమీక్ష చేశారు. మరోసారి టీఎస్పీఎస్సీపై సమీక్ష నిర్వహించినున్నట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై కూడా సమావేశంలో దృష్టిపెట్టాలి
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి ... రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్
యాదాద్రి : త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. బుధవారం ఉప్పల్లోని ట్రాఫిక్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన భునవగిరి జోన్ సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి అంశంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, పోలింగ్ కేంద్రాల వివరాలు తెలిసి ఉండాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాలకు సామగ్రి తీసుకెళ్లే రూట్ను చెక్ చేసుకోవాలని, చెక్పోస్టుల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. సమస్యలు సృష్టించేవారిపై నిఘా ఉంచాలి అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గతంలో జరిగిన ఎన్నికల్లో సమస్యలు సృష్టించిన వారిపై నిఘా ఉంచాలని పోలీసు అధికారులకు సీపీ సూచించారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్, హిస్టరీ షీట్ ఉన్నవారిని బైండోవర్ చేయాలన్నారు. సోషల్ మీడియా ద్వారా పంపే సందేశాలు, వీడియోలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందజేయాలని కోరారు. ప్రశాంతమైన వాతావరణలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ సీపీ అంబర్ కిషోర్, డీసీపీ రాజేష్ చంద్ర, రాచకొండ ట్రాఫిక్ డీసీసీ–1 అభిషేక్ మహంతి, మల్కాజిగిరి డీసీపీ ధరావత్ జానకి, ఎస్ఓటీ డీసీపీ–1 గిరిధర్, మహేశ్వరం డీసీపీ శ్రీని వాస్, ఎస్బీ డీసీపీ బాలస్వామి, సెబర్ క్రైమ్ డీసీపీ అనురాధ, అడ్మిన్ డీసీపీ ఇందిరా, ఎల్పీనగర్ డీసీపీ సాయిశ్రీ, ట్రాఫిక్ డీసీపీ–2 శ్రీనివాసులు, ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉషావిశ్వనాథ్, క్రైమ్ డీసీపీ అరవింద్, అడిషనల్ డీసీపీలు పాల్గొన్నారు. -
భూగర్భ గనులను కాపాడాలి
మంచిర్యాల: భూగర్భ గనులను కాపాడాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్లోని ఆర్కే న్యూటెక్ గనికి పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో బుధవారం శ్రీరాంపూర్లోని సీఈఆర్ క్లబ్లో పునః ధ్రువీకరణ కింద ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, నిజామాబాద్ కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ జి.లక్ష్మణ్ హాజరయ్యారు. సభకు హాజరైన వారి అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు. చాలామంది వక్తలో సభలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. సింగరేణిలో భూగర్భ గనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, జీవితకాలం దగ్గరపడ్డ గనుల్లోని నిక్షేపాలను అన్వేషించి వెలికితీత ద్వారా జీవిత కాలం పెరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. భూగర్భ గనులతోనే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, సింగరేణి గనుల వల్ల జరిగే కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత కంపెనీపై ఉందని, ఇందుకోసం మరిన్ని చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సింగరేణి సీఎస్ఆర్ నిధులు, శ్రీరాంపూర్ డీఎంఎఫ్టీ నిధులను సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లోనే ఖర్చు చేయాలని, కానీ సింగరేణికి సంబంధం లేని ప్రాంతాలకు తరలించారని తెలిపారు. శ్రీరాంపూర్ ప్రాంతంలో ఆర్కే 6 గని పరిసరాల్లో సింగరేణి ప్రత్యేక శ్మశానవాటిక ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ నుంచి కే.సురేందర్రెడ్డి, ఏఐటీయూసీ నుంచి ఎస్కే బాజీసైదా, ముస్కె సమ్మయ్య, ఐఎన్టీయూసీ నుంచి జే శంకర్రావు, బీఎంఎస్ నాయకులు పేరం రమేశ్, హెచ్ఎమ్మెస్ నేత తిప్పారపు సారయ్య, సీఐటీయూ నాయకులు భాగ్యరాజ్ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఎన్విరాన్మెంట్ జీఎం జేవీఎల్ గణపతి, ఏరియా ఎస్ఓటు జీఎం రఘుకుమార్, ఓసీపీ పీఓలు పురుషోత్తంరెడ్డి, శ్రీనివాస్, ఏజెంట్లు రాముడు, డీజీఎం(పర్సనల్) అరవిందరావు, ఏరియా ఎన్విరాన్మెంట్ హనుమాన్గౌడ్ పాల్గొన్నారు. అభ్యంతరాలు పరిష్కరిస్తాం.. సభలో వక్తలు పేర్కొన్న అభ్యంతరాలను పరిశీలించి కంపెనీ పరిధిలో ఉన్న వాటిని తప్పనిసరిగా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. ఏరియా పరిధిలోని అంశాలను వెంటనే పరిష్కరిస్తాం. సింగరేణి అభివృద్ధి చెందితే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు పరిసర గ్రామాల్లో చేసుకొనే వీలుంది. –బీ.సంజీవరెడ్డి, జీఎం, శ్రీరాంపూర్ ప్రభుత్వానికి నివేదిస్తాం ఈ సభలో వక్తలు పేర్కొన్న అభ్యంతరాలు, సమస్యలను కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో రికార్డు చేయించడం జరిగింది. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. సింగరేణితోనే ఈ ప్రాంతంలో అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి సంస్థను కాపాడుకోవాలి. – సబావత్ మోతీలాల్, జిల్లా అదనపు కలెక్టర్ -
లక్ష్యం సాధిస్తే రూ.40 వేల కోట్ల టర్నోవర్
గోదావరిఖని: దేశవ్యాప్తంగా బొగ్గుకు తీవ్రమైన డిమాండ్ ఏర్పడుతోందని, మిగిలిన ఆర్నెల్లలో రోజూ కనీసం 2.10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి సంస్థ సీ అండ్ ఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్లో అన్నిఏరియాలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. వచ్చేఏడాది మార్చి చివరికల్లా 72 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని అధిగమించాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఆర్నెల్లలో వర్షాలతో కొంతఇబ్బంది కలిగినా అన్నిఅవరోధాలు అధిగమిస్తూ గతేడాది బొగ్గు రవాణాలో 12 శాతం వృద్ధి, ఉత్పత్తిలో 7శాతం, ఓవర్బర్డెన్ తొలగింపులో 15 శాతం వృద్ధి సాధించడంపై హర్షం వ్యక్తంచేశారు. ఈఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆర్నెల్లు కీలకమని పేర్కొన్నారు. ఈ క్రమంలో అన్నిఏరియాలకు అవసరమైన యంత్రాలు, అనుమతులు, ఓబీ కాంట్రాక్టులు ఇప్పటికే సమకూర్చామన్నారు. ఇకపై వర్షప్రభావం ఉండే అవకాశం లేదన్నారు. ఓపెన్కాస్ట్ల్లో నిలిచిన నీటిని బయటకు తోడేయాలని, బొగ్గు ఉత్పత్తి, ఓవర్ బర్డెన్ తొలగింపును మరింత వేగవంతం చేయాలని సూచించారు. లక్ష్యాలు సాధిస్తే రూ.3,500కోట్ల లాభాలు ఈఏడాది నిర్దేశిత 72మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే.. లక్ష్యానికి అనుగుణంగా రవాణా చేసే అవకాశం ఉందని సీఎండీ తెలిపారు. తద్వారా రూ.40 వేల కోట్ల టర్నోవర్, సుమారు రూ.3,500 కోట్ల లాభాలు సాధించే అవకాశం ఉందని తెలిపారు. అంకిత భావంతో పనిచేయాలి సింగరేణి ఉద్యోగులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేదఫా రూ.1,750 కోట్ల వేజ్బోర్డు ఎరియర్స్ చెల్లించామని, సీఎం ప్రకటించినట్లు 32శాతం లాభాల బోనస్ రూ.711 కోట్లు కూడా దసరా పండుగకు ముందే విడుదల చేయనున్నామని పేర్కొన్నారు. దీపావళి బోనస్ను పండుగకు ముందే కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. కంపెనీపై విశ్వాసం, విధుల్లో అంకితభావంతో కార్మిక, అధికారులు, సమష్టిగా కృషి చేయాలని కోరారు. లక్ష్యాల అధిగమించిన సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు బొగ్గు ఉత్పత్తి, రవాణాలో సింగరేణి నిర్దేశిత లక్ష్యాలు సాధించిందని శ్రీధర్ అన్నారు. ఈ ఏడాది బొగ్గు రవాణా లక్ష్యం 307 లక్షల టన్నులు కాగా 330 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి, 7 శాతం వృద్ధిని నమోదు చేసిందని వివరించారు. గతేడాది ఇదే సమయం కన్నా 12శాతం అధికమని పేర్కొన్నారు. సమావేశంలో డైరెక్టర్లు ఎన్.బలరాం, సత్యనారాయణరావు, వెంకటేశ్వర్రెడ్డి, అధికారులు సరేంద్రపాండే, అల్విన్, ఎం.సురేశ్, రమేశ్ పాల్గొన్నారు. -
జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం విశిష్టమైనది: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలన్న సీఎం.. అర్బన్ ప్రాంతాల్లో కూడా డిజిటల్ లైబ్రరీలను తీసుకురావాలన్నారు. చేయూత కింద స్వయం ఉపాధి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్న సీఎం.. లబ్ధిదారులు తొలి విడత డబ్బు అందుకున్నప్పుడే స్వయం ఉపాధి కార్యక్రమానికి అనుసంధానం చేస్తే ఆ మహిళకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ‘‘గ్రామీణాభివృద్ధి శాఖ కింద చేపట్టే ఉపాధి కార్యక్రమాలపై నిరంతరం సమీక్ష చేయాలి. ఆ కార్యక్రమాల పనితీరుపై మదింపు చేసేందుకు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నివేదికల ఆధారంగా ఆ యూనిట్లు విజయవంతంగా నడిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలి’’ అని సీఎం సూచించారు. చదవండి: విశాఖలో సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే.. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం విశిష్టమైనది, ప్రతి గ్రామ సచివాలయంలో సర్వేయర్ను నియమించడంవల్ల ఈ ప్రాజెక్టు సజావుగా ముందుకు సాగుతోంది. అలాగే గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు కూడా ప్రారంభించిన ఘనత మన రాష్ట్రానికే దక్కుతుంది. జగనన్న కాలనీలపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. మౌలిక సదుపాయాలు దగ్గరనుంచి ప్రతి అంశంలోనూ ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. జగనన్న కాలనీలను ఆహ్లాదంగా, పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలి. లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నందున మౌలిక సదుపాయాలు విషయంలో రాజీ పడొద్దు. అపరిశుభ్రతకు ఈ కాలనీలను నిలయంగా మారకూడదు. అందుకనే కాలనీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.‘‘స్వయం ఉపాధి కార్యక్రమాల్లో మహిళలకు చేయూతనిచ్చి నడిపించడం అన్నది చాలా కీలకం. ఆగస్టు 10న మహిళలకు సున్నావడ్డీ కార్యక్రమం నిర్వహించాలి’’ అని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశానికి సీఎస్ జవహర్రెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
AP: ఎస్ఐపీబీ ఆమోదం పొందిన ప్రాజెక్టులపై సీఎస్ సమీక్ష
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుకు సంబంధించి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించిన ప్రాజెక్టుల ప్రగతిని శనివారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్ రెడ్డి పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఎస్ఐపీబీ ఆమోదం పొందిన ప్రాజెక్టులన్నీ వేగవంతంగా ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వీటి ప్రగతిపై ప్రతి 15 రోజులకు నివేదిక సమర్పించాలని పరిశ్రమల శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్ను సీఎస్ ఆదేశించారు. నెలకు ఒకసారి ఈ అంశంపై సమీక్షిస్తానని సీఎస్ అన్నారు. అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పరిశ్రమలకు సంబంధించి చేసుకున్న అవగాహనా ఒప్పందాలపై సీఎస్ సమీక్షించారు. ఆ సమ్మిట్లో పరిశ్రమల శాఖకు సంబంధించి వివిధ కంపెనీల ద్వారా 3 లక్లల 41వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో 2 లక్షల 38 వేల మందికి ఉపాధి కల్పించే 107 అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకోగా ఇప్పటికే కొన్ని కంపెనీలు, పరిశ్రమలకు ముఖ్యమంత్రి స్వయంగానూ, వర్చువల్గానుశంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారని చెప్పారు చదవండి: బాబు అండ్ బ్యాచ్ ఓవరాక్షన్.. నిర్మల సీతారామన్ చెప్పింది విన్నారా? డిశంబరు నెలాఖరులోగా మరో 36 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఇంకా పరిశ్రమలు ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస చర్యలు తదితర అంశాలపై సీఎస్ అధికారులతో సమీక్ష జరిపారు. అంతకు ముందు రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ కే.ప్రవీణ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్ఐపీబీలో ఆమోదించిన ప్రాజెక్టులు వాటి ప్రగతిని వివరించారు. అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో చేసుకున్న అవగాహనా ఒప్పందాలు ఆయా కంపెనీల ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలను వివరించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జేడీ రామలింగేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు. -
వర్షాలు, వరదలపై సీఎం జగన్ సమీక్ష
-
నియోజక వర్గ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించిన తానేటి వనిత
-
వర్షాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష...
-
రైతుల పంట ఉత్పత్తులకు భరోసా
వైఎస్సార్ చేయూత, ఆసరా వంటి పథకాలను వినియోగించుకుని లబ్ధి పొందుతున్న మహిళల ద్వారా సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించి వారి స్వయం ఉపాధికి ఊతమివ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఆరు వేల మైక్రో యూనిట్లు పెట్టేందుకు చర్యలు తీసుకోవాలి. మార్కెట్తో సమన్వయం చేసుకుంటూ ఇతర పంటల్లో కూడా మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా నిరోధించేలా అడుగులు ముందుకు వేయాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : రైతులు పండించిన ప్రతి పంటకు కనీస మద్దతు ధర దక్కేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్కరిపైనా ఉందని, ప్రభుత్వం నిర్ధేశించిన కనీస మద్దతు ధర కంటే తక్కువగా ఏ ఒక్క రైతూ పంట ఉత్పత్తులను అమ్ముకోడానికి వీల్లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, కంపెనీలు ఎవరైనా సరే.. కనీస మద్దతు ధర చెల్లించిన తర్వాతే రైతుల నుంచి పంట ఉత్పత్తులు సేకరించేలా చూడాలన్నారు. డిమాండ్ లేదనో మరే కారణంతోనైనా మద్దతు ధర దక్కకుండా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏపీ ఎంఎస్పీ యాక్టు–2023 తీసుకురావాలని చెప్పారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల్లో జరుగుతోన్న వివిధ కార్యక్రమాల పురోగతిపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం ప్రకటించే ఎమ్మెస్పీ ధీమా కల్పించేలా ఈ చట్టం ఉండేలా చూడాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకే కాకుండా ఆక్వా, డెయిరీ రైతుల ఉత్పత్తులకు కూడా రక్షణ కల్పించేలా ఈ చట్టాన్ని రూపొందించాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. మార్కెటింగ్లో ఆర్బీకేల ప్రమేయం ►విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు.. వేటిలోనూ నకిలీ, కల్తీ లేకుండా నివారించడంలో ఆర్బీకేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అదే రీతిలో మార్కెటింగ్లో కూడా ఆర్బీకేల ప్రమేయం ఉండాలి. పంటల సాగు, బీమా కల్పన, ధాన్యం కొనుగోలులో ఆర్బీకేలు ఇప్పటికే రైతులను చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి. ►ధాన్యం సేకరణలో ఆర్బీకేల ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేశాం. కనీస గిట్టుబాటు ధరలు రాని ఏ పంట కొనుగోళ్లలో అయినా ఆర్బీకే జోక్యం చేసుకుంటుంది. మిగిలిన పంటల కొనుగోలు కూడా ఆర్బీకే కేంద్రంగా జరిగేలా చూడాలి. ఏ రకమైన కొనుగోళ్లకు అయినా ఆర్బీకే కేంద్రం కావాలి. డ్రోన్ టెక్నాలజీ విస్తృతం ►వ్యవసాయ రంగంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలి. డ్రోన్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయ రంగంలో బహుళ ప్రయోజనాలు పొందాలి. ఇప్పటికే సూక్ష్మ ఎరువులు, పురుగు మందుల వినియోగం లాంటి కార్యక్రమాలు డ్రోన్ల ద్వారా చేస్తున్నాం. ఇదే కాకుండా డ్రోన్ల ద్వారా భూసార పరీక్షలు చేయించే పరిస్థితిని తీసుకురావాలి. తద్వారా ఆర్బీకే స్థాయిలో భూసార పరీక్షలు జరిగేలా చూడాలి. ►భూసార పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించడమే కాకుండా, ఎప్పటికప్పుడు డ్రోన్ల ద్వారా తెలుసుకునే పరిస్థితి వస్తే ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ను సమర్థవంతంగా అమలు చేసే అవకాశం ఉంటుంది. పైగా సేకరించే డేటాలో కచ్చితత్వం ఉండేందుకు అవకాశం ఉంటుంది. ►సాగులోనే కాదు పంట దిగుబడులపై అంచనాలకు కూడా డ్రోన్లను వినియోగిస్తున్నారు. వరి దిగుబడులను డ్రోన్ల సాయంతో అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మిగిలిన పంటల విషయంలో కూడా ఇదే తరహా ప్రయోజనాలు డ్రోన్ టెక్నాలజీ ద్వారా పొందేలా చూడాలి. బహుళ ప్రయోజనకారిగా డ్రోన్లను వినియోగించు కోవడం వల్ల వ్యవసాయ రంగానికి, రైతులకు మరింత మేలు జరుగుతుంది. వీడియోల ద్వారా సాగులో శిక్షణ ►10 వేల ఆర్బీకేల్లో 10 వేల డ్రోన్ల ద్వారా వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావాలి. సాగులో శిక్షణ కార్యక్రమాలపై మరిన్ని వీడియోలు రూపొందించి ఆర్బీకే ఛానెల్ ద్వారా మరింతగా రైతులకు చేరువ చేయాలి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సాధ్యమైనంత ఎక్కువ మంది కౌలుదారులకు సీసీఆర్సీ కార్డులు జారీ చేయాలి. వీరికి రైతు భరోసా అందేలా చర్యలు తీసుకోవాలి. ►వైఎస్సార్ ఉచిత పంటల బీమా దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఈ నాలుగేళ్లలో ఇప్పటి వరకు 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.5 కోట్లు పరిహారంగా అందించాం. రబీ సీజన్కు సంబంధించి పంటల బీమా పరిహారాన్ని అక్టోబర్లో ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. పంటల ఆధారంగా పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ► జిల్లాల్లో స్థానికంగా పండే పంటల ఆధారంగా ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు దిశగా కృషి చేయాలి. నియోజకవర్గాల వారీగా మ్యాపింగ్ చేయాలి. ఫుడ్ ప్రాసెసింగ్ విషయంలో మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాధ్యమైనంత త్వరగా ఈ యూనిట్లను అందుబాటులోకి తీసుకురావాలి. ► రెగ్యులర్ మార్కెట్కే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్కు అనుకూలమైన వంగడాలను ఉద్యానవన పంటల్లో ప్రోత్సహించాలి. గత నాలుగేళ్లలో 4.34 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటల నుంచి ఉద్యానవన పంటల వైపు మళ్లింపు జరిగింది. ఏటా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి. ► తరచూ ధరల్లో తీవ్ర హెచ్చు తగ్గులకు గురయ్యే టమాటా, ఉల్లి లాంటి పంటల ప్రాసెసింగ్పై ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ పంటల సాగు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టేందుకు చర్యలు తీసుకోవాలి. ఆయా జిల్లాల్లో మహిళలతో నడిచేలా సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లను తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ► ఇందుకోసం అవసరమైన వ్యవసాయ ఉపకరణాలు, డ్రైయింగ్ ప్లాట్ ఫామ్లతో పాటు ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. గోడౌన్లు, కలెక్షన్ సెంటర్లు, కోల్డ్ రూమ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి. వీటి వల్ల పంట ఉత్పత్తుల జీవితకాలం పెరుగుతుంది. రైతులకు మంచి ధరలు వస్తాయి. ఉద్యానవన పంటలకు ఈ మౌలిక సదుపాయాలు ఎంతగానో అవసరం. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ఏపీ అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ సలహాదారు ఐ.తిరుపాల్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, ఉద్యాన శాఖ కమిషనర్ ఎస్ఎస్ శ్రీధర్, ఏపీ మార్క్ఫెడ్ ఎండీ రాహుల్ పాండే, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్బాబు, ఏపీడీడీసీఎఫ్ ఎండీ అహ్మద్ బాబు, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రేపు సీఎం జగన్ పోలవరం పర్యటన..
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(మంగళవారం) పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్బంగా పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం.. అధికారులతో ప్రాజెక్ట్పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఇది కూడా చదవండి: పబ్లిసిటీ కాదు.. బాధితులకు సేవచేయడం ముఖ్యం: మంత్రి అమర్నాథ్ -
పారిశ్రామిక రంగ ప్రగతిలో ఎంఎస్ఎంఈలది కీలక పాత్ర: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో వచ్చిన పెట్టుబడులపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా నంబర్ ఒన్ స్థానంలో నిలుస్తున్నామని అధికారులు వెల్లడించగా, జీడీఎస్డీపీలో రాష్ట్ర పారిశ్రామిక రంగం దాదాపు రూ.13లక్షల కోట్ల వాటా కలిగి ఉందని, పారిశ్రామికరంగం వాటా 21శాతం నుంచి 23శాతానికి పెరిగిందని స్పష్టం చేశారు. 2022 జనవరి – డిసెంబరు మధ్యకాలంలో రూ.45,217 పెట్టుబడులు వచ్చాయని వెల్లడించిన అధికారులు.. 2022-23లో రూ.1.6లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యాయని తెలిపారు.ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కొన్ని సూచనలు చేశారు. సీఎం వైఎస్ జగన్ కామెంట్స్ ►పారిశ్రామిక రంగ ప్రగతిలో MSMEలది కీలక పాత్ర ►ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కూడా ఈ రంగంలోనే ఉన్నాయి ►ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం మార్గదర్శకంగా వ్యవహరించాలి ►ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఉత్పత్తులు ఏంటి? వాటి ఉత్పత్తిని సాధించడానికి MSMEలకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం? ఉత్పత్తి అయిన వస్తువులకు అంతర్జాతీయంగా ప్రముఖ బహుళజాతి సంస్థలతో అనుసంధానం? ఈ మూడు అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి ► MSMEలకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందేలా చూడాలి ►పరిశ్రమల శాఖలో MSMEఎంఎస్ఎంఈలకోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి ►ఈ విభాగానికి ఒక కార్యదర్శిని కూడా నియమించాలి ►రాష్ట్రం నుంచి బహుళ ఉత్పత్తులు, బహుళ దేశాలకు ఎగుమతులు లక్ష్యంగా ముందుకు సాగాలి ఈ సమీక్షా సమావేశానికి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ప్రవీణ్ కుమార్, టూరిజం సీఈవో కన్నబాబు, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్, ఎన్ఆర్ఈడీసీఏపీ వీసీ అండ్ ఎండీ ఎస్.రమణా రెడ్డి, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్ర కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: బాధితులకు ఏపీ ప్రభుత్వ భరోసా -
టెన్త్ పేపర్ లీక్పై మంత్రి సబిత సీరియస్.. ఉద్యోగాలు పోతాయ్
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడే ఉద్యోగులను ఉద్యోగాల నుండి శాశ్వతంగా తొలగించనున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదని, ఈ విషయంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సబిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ దేవసేన, పోలీస్ రేంజ్ ఐ.జిలు షానవాజ్ కాసీం , చంద్రశేఖర్ రెడ్డి లు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలను చేపట్టిందని, ఈ పరీక్షల విషయంలో తమ స్వార్థ ప్రయోజనాలకై విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇంకా మిగిలిన నాలుగు పరీక్షల నిర్వహణ విషయంలో మరింత కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. ఈ పరీక్షల నిర్వహణలో దాదాపు 55 వేల మంది అధికారులు, సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారని, ఎట్టిపరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించవద్దని, పరీక్షల విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బందికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని సబితా స్పష్టంచేశారు. పరీక్షల నిర్వహణ అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఈ విషయంలో ఏవిధమైన అపోహలకు, అనుమానాలకు తావు లేదని మంత్రి పేర్కొన్నారు. పరీక్షా పేపర్ల రవాణా విషయంలో మరింత భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీ లను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను పటిష్టంగా అమలు చేయడంతోపాటు జిరాక్స్ షాప్లను మూసివేయించాలని అన్నారు. ఇంటర్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడంలో కృషిచేసిన అధికారులను మంత్రి అభినందించారు. చదవండి: పేపర్ లీక్ కాదు.. పరీక్ష మధ్యలో బయటకు వచ్చిందంతే!: వరంగల్ సీపీ -
వ్యవసాయంపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: వ్యవసాయ శాఖకు సంబంధించి వివిధ అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 15 నుంచి రబీ సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణ చేయడానికి అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అకాల వర్షాలు వల్ల పంట నష్టంపై ఎన్యుమరేషన్ స్ధితి గతులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఎన్యుమరేషన్ జరుగుతోందని, ఏప్రిల్ మొదటి వారంలో నివేదిక ఖరారు చేస్తామని, ఏప్రిల్ రెండో వారానికి నష్టపోయిన రైతుల జాబితాలను విడుదలచేస్తామని సీఎంకు అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని సీఎం జగన్ పేర్కొన్నారు. రబీ సన్నాహకాలపైన సీఎం సమీక్ష. ఇప్పటికే 100 శాతం ఇ-క్రాపింగ్ పూర్తైందని అధికారులు వెల్లడించారు. నాణ్యతలేని ఎరువులు, పురుగుమందులు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులు లేకుండా చూడాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు అందించేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని సీఎం పేర్కొన్నారు. ఇక్కడ జరిగే పొరపాట్లు వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉన్నందున ఈ కార్యక్రమంపై మరింత శ్రద్ధపెట్టాలని సీఎం సూచించారు. సీఎం ఆదేశాల మేరకు ఆర్బీకేల ద్వారానే నాణ్యమైన ఎరువులను పంపిణీ చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ఆర్బీకేల ద్వారా 2023–24లో 10.5లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పిన అధికారులు. ఎరువులతో పాటు ఏపీ ఆగ్రోస్ ద్వారా రైతులకు అవసరమైన స్థాయిలో పురుగుమందుల పంపిణీకి కూడా చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. నకిలీ, నాణ్యతలేని పురుగుమందులు లేకుండా చేయడానికి ఇది దోహదపడుతుందన్నారు. పొలంబడి శిక్షణ ♦పొలంబడి శిక్షణ కార్యక్రమాల వల్ల సత్ఫలితాలు వస్తున్నాయన్న అధికారులు ♦ఆర్బీకేల ద్వారా ఆయా రైతులకు ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ ఇస్తున్నామన్న అధికారులు ♦ఈ శిక్షణ కార్యక్రమాల వల్ల వరి, వేరుశెనగలో 15శాతం, పత్తిలో 12 శాతం, మొక్కజొన్నలో 5శాతం పెట్టుబడి ఖర్చులు తగ్గాయన్న అధికారులు ♦పత్తిలో 16శాతం, మొక్కజొన్నలో 15 శాతం, వేరుశెనగ 12 శాతం, వరిలో 9శాతం దిగుబడులు పెరిగాయన్న అధికారులు ♦పూర్తి సేంద్రీయ వ్యవసాయ పద్దతుల దిశగా అడుగులు వేయడానికి ఇది తొలిమెట్టు అన్న అధికారులు ♦26 ఎఫ్పీవో(ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్)లకు జీఏపి (గుడ్అగ్రికల్చర్ ప్రాక్టీస్) సర్టిఫికెట్ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్న అధికారులు వ్యవసాయ పరికరాల పంపిణీ ♦రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ షెడ్యూల్కు సీఎం గ్రీన్సిగ్నల్ ♦ యాంత్రీకరణ పెరిగేందుకు దోహదపడుతుందన్న సీఎం ♦ ఏప్రిల్లో ఆర్బీకేల్లోని 4225 సీహెచ్సీలకు యంత్రాల పంపిణీ ♦జులైలో 500 డ్రోన్లు, డిసెంబర్ కల్లా మరో 1500 డ్రోన్లు పంపిణీ ♦జులై లో టార్పాలిన్లు, జులై నుంచి డిసెంబర్ మధ్య మూడు విడతలుగా స్ప్రేయర్లు పంపిణీ మిల్లెట్స్ సాగుపై చర్యలు ♦రాష్ట్రంలో మిల్లెట్స్ సాగును ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం ఆదేశాలమేరకు అనేక చర్యలు తీసుకున్నామన్న అధికారులు ♦19 జిల్లాల్లో 100 హెక్టార్ల చొప్పున మిల్లెట్ క్లస్టర్లు పెట్టామన్న అధికారులు ♦3 ఆర్గానిక్ క్లస్టర్లను కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడి ♦ఎగుమతికి ఆస్కారం ఉన్న వరి సాగును ప్రోత్సహిస్తున్నామన్న అధికారులు. ♦2022 ఖరీఫ్లో 2.74 లక్షల హెక్టార్లలో ఎగుమతిచేయదగ్గ వరి రకాలను సాగుచేస్తున్నామన్న అధికారులు ♦దాదాపు 6.29 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యిందని వెల్లడి ♦2022–23 రబీలో 1.06 లక్షల హెక్టార్లలో ఎగుమతి వెరైటీలను సాగుచేశారని, 3.79 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉందని వెల్లడించిన అధికారులు ♦ఆర్బీకేల్లో కియోస్క్ల సేవలు పూర్తిస్థాయిలో రైతులకు అందాలని, దీనిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలన్న సీఎం ♦ఉద్యానవన పంటల మార్కెటింగ్ పై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం ♦కొత్త తరహా ఉత్పత్తులు వస్తున్నకొద్దీ.. మార్కెటింగ్ ఉదృతంగా ఉండాలన్న సీఎం ♦దీనివల్ల రైతులు తమ పంటలను విక్రయించుకోవడానికి ఇబ్బందులు ఉండవని, మంచి ఆదాయాలు కూడావస్తాయన్న సీఎం ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ ♦ఫ్యామిలీ డాక్టర్ తరహాలోనే ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం ♦భూ పరీక్షకోసం నమూనాల సేకరణ, వాటిపై పరీక్షలు, వాటి ఫలితాలను రైతులకు అందించడం, ఫలితాలు ఆధారంగా పాటించాల్సిన సాగు విధానాలపై అవగాహన తదితర ♦అంశాలపై ఒక సమర్థవంతమైన ఎస్ఓపీ రూపొందించుకోవాలన్న సీఎం ♦ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ పరీక్షలు చేసేదిశగా చర్యలు తీసుకోవాలన్న సీఎం ♦జూన్లో ఖరీఫ్ నాటికి పరీక్షల ఫలితాలు ఆధారంగా రైతుకు సాగులో పాటించాల్సిన పద్ధతులపై పూర్తి వివరాలు, అవగాహన కల్పించాలన్న సీఎం ♦పంటలకు అవసరమైన స్థాయిలోనే ఎరువులు, పురుగుమందులు ఉండాలన్న సీఎం ♦ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్... ఆర్బీకేల కార్యక్రమాలను ఒక దశకు తీసుకెళ్తాయన్న సీఎం చదవండి: నలుగురిని లాక్కున్నారు.. వచ్చే ఎన్నికల్లో నాలుగు సీట్లే: కొడాలి నాని ఈ సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ సలహాదారు తిరుపాల్ రెడ్డి, ఉద్యానవన శాఖ సలహాదారు శివప్రసాద్ రెడ్డి, ఏపీ ఆగ్రోస్ ఛైర్మన్ బి.నవీన్ నిశ్చల్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ సి.హరికిరణ్, ఉద్యానవనశాఖ కమిషనర్ ఎస్ఎస్. శ్రీధర్, మార్క్ఫెడ్ ఎండీ రాహుల్పాండే, ఎపీఎస్ఎస్డీసీఎస్ వీసీ అండ్ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్ బాబు, ఏపీ ఆగ్రోస్ వీసీ అండ్ ఎండీ ఎస్.కృష్ణమూర్తి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు -
ర్యాగింగ్ విషయంలో కఠినంగా ఉండండి: మంత్రి విడదల రజిని
సాక్షి, అమరావతి: ర్యాగింగ్ విషయంలో రాష్ట్రంలోని అన్ని మెడికల్ కళాశాలలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. తాజాగా హైదరాబాద్లో మెడికో ఆత్మహ్యత ఘటన నేపథ్యంలో మంత్రి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల ప్రిన్సిపల్స్ అందరితో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్ లో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఎఎస్, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ వీసీ బాబ్జి, రిజిస్ట్రార్ రాధికారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ర్యాగింగ్ భూతం విషయంలో అన్ని మెడికల్ కళాశాలలు కఠినంగా ఉండాలని స్పష్టంచేశారు. మెడికోలపై ఎక్కడా, ఎలాంటి వేధింపులు ఉండటానికి వీల్లేదని చెప్పారు. కళాశాలల్లోని యాంటీ ర్యాగింగ్ కమిటీలు పూర్తిస్థాయిలో చురుకుగా పనిచేయాలని చెప్పారు. ర్యాగింగ్, ఇతర వేధింపులకు సంబంధించి ఆయా కళాశాలలపై నేరుగా డీఎంఈ, హెల్త్ యూనివర్సిటీ వీసీ పర్యవేక్షణ ఉండాలన్నారు. ఆయా కళాశాలల నుంచి ఎప్పటికప్పుడు యాంటి ర్యాగింగ్ కమిటీల ద్వారా నివేదికలు తెప్పించుకుంటూ ఉండాలన్నారు. విద్యార్థులతో బోధనా సిబ్బంది సహృద్భావంతో ఉండాలని చెప్పారు. కొంతమంది సీనియర్ అధ్యాపకులు వారి సొంత క్లినిక్ల నేపథ్యంలో పీజీ విద్యార్థులపై పనిభారం మోపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయని, ఈ పద్ధతి మారాలని తెలిపారు. పటిష్టమైన చర్యల ద్వారానే ఫలితాలు చదువుల్లో నాణ్యతే కాదని, భద్రత కూడా ఉండాలని మంత్రి విడదల రజిని తెలిపారు. పటిష్టమైన చర్యల ద్వారా మనం సురక్షితంగా మెడికోలను సమాజంలోకి తీసుకురాగలమని చెప్పారు. అన్ని మెడికల్ కళాశాలల్లో విద్యార్థులకు కౌన్సెలింగ్ సెషన్లు ఉండేలా చూసుకోవాలన్నారు. ఒత్తిడి నుంచి బయటపడేలా విద్యార్థులకు యోగా, ధ్యానం లాంటి అంశాలపై అవగాహన పెంచాలన్నారు. కళాశాలల్లో ఫిర్యాదుల పెట్టెలు అందుబాటులో ఉంచాలన్నారు. ఏదైనా సమాచారాన్ని వెనువెంటనే చేరవేసేలా క్యాంపస్లో పలు చోట్ల మైక్లు ఏర్పాటుచేసుకోవాలన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉండేలా చూడాలన్నారు. ప్రతి విద్యార్థిని దిశ యాప్ ను వాడుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సీనియర్, జూనియర్ విద్యార్థులకు ప్రత్యేక వసతి ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. వారి భోజన సమయాలు కూడా ఒకేలా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మన రాష్ట్రంలోని ఏ ఒక్క మెడికల్ కళాశాలలో కూడా ఎక్కడా ఒక్క ర్యాగింగ్ కేసు కూడా నమోదు కావడానికి వీల్లేదని స్పష్టంచేశారు. డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాంతో ప్రజలకు మేలు ఎన్ ఎం సీ నిబంధనలకు అనుగుణంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి మెడికల్ కళాశాల డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ ను అమలు చేయాల్సి ఉందని మంత్రి విడదల రజిని తెలిపారు. ఈ డీఆర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి పీజీ విద్యార్థి మూడు నెలల పాటు కచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో పనిచేయాల్సి ఉందని చెప్పారు. ప్రతి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్కు వారి పరిధిలో మ్యాప్ చేసిన డీహెచ్, ఏహెచ్, సీహెచ్సీ, పీహెచ్సీల జాబితాను ఇప్పటికే పంపామని తెలిపారు. ఆ జాబితాలో ఉన్న ఆస్పత్రుల్లో పీజీ లు కచ్చితంగా మూడు నెలలు పనిచేసేలా షెడ్యూల్ తయారుచేసుకుని పంపాలని పేర్కొన్నారు. దీనివల్ల ప్రతి మూడు నెలలకు 250 మంది చొప్పున స్పెషలిస్టు వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. దీనివల్ల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు. పల్లెల్లో ఉండే పేద ప్రజలు మెరుగైన వైద్య సేవలు పొందే అవకాశం దక్కుతుందన్నారు. చదవండి: టీడీపీ నేత నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు -
గడప గడపకు మన ప్రభుత్వంపై సజ్జల సమీక్ష
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఆదివారం తాడేపల్లిలో పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. గృహసారధుల నియామకాలపై ప్రధానంగా చర్చించారాయన. వాస్తవానికి నిన్నటితో(శనివారం) గృహసారధుల నియామక సమయం ముగిసింది. అయితే.. అన్ని నియోజకవర్గాల్లో నియామకాలు పూర్తి కాలేదు. ఈ క్రమంలో.. ఈనెలాఖరు వరకు ఆ సమయం పెంచుతూ సజ్జల ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. ఫిబ్రవరి 1వ తేదీ నుండి గృహసారధులతో మండలాల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారాయన. -
జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్ష (భూముల సమగ్ర రీసర్వే)పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర భూ సర్వే కోసం ఉపయోగిస్తున్న డ్రోన్లు, సర్వే రాళ్లను సీఎం పరిశీలించారు. డ్రోన్ల పనితీరును అధికారులు సీఎం జగన్కు వివరించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షకు ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయడు, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి సాయి ప్రసాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధిక శాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్దార్థ జైన్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కోన శశిధర్, సీసీఎల్ఏ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, మైనింగ్ శాఖ డైరెక్టర్ వీ జీ వెంకటరెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: (వంగవీటి రంగా హత్య కేసులో ముద్దాయిలు ఆ ఇద్దరే: కొడాలి నాని) -
కరోనాపై మంత్రి హరీశ్ రావు సమీక్ష.. ఏమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: పలు దేశాల్లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ కట్టడికి సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో కరోనాపై వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రపంచంలో కరోనా వ్యాప్తి తీరును గమనిస్తున్నాము. వైద్య, ఆరోగ్య శాఖ అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. ప్రతీ ఒక్కరూ బూస్టర్ డోస్ వేసుకోవాలన్నారు. కరోనా పట్ల ఆందోళన చెందవద్దు. కానీ, అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా వ్యాప్తి మన వద్ద లేనప్పటికీ, ముందు జాగ్రత్తగా అన్ని చెక్ చేసుకోవాలని వైద్యాధికారులకు మంత్రి ఆదేశించారు. మందులు, ఆక్సిజన్, ఐసీయూ పడకలు అన్ని కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు పాజిటివ్ వచ్చిన శాంపిల్స్ని జీనోమ్ సీక్వెన్స్ కోసం గాంధీ ఆస్పత్రికి పంపాలని, ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ నిర్వహించాలని మంత్రి హరీశ్రావు ఆదేశించారు. -
కోవిడ్ పై మధ్యాహ్నం ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం
-
ఆర్థిక పరిస్థితులపై ఆర్బీఐ సమీక్ష
ముంబై: ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, భౌగోళికరాజకీయ పరిణామాలతో తలెత్తుతున్న సవాళ్లను రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డు శుక్రవారం సమీక్షించింది. అలాగే, నిర్దిష్ట సెంట్రల్ ఆఫీస్ డిపార్ట్మెంట్ల కార్యకలాపాలు, 2021–22లో భారత్లో బ్యాంకింగ్ పురోగతి నివేదికపై కూడా చర్చించింది. 599వ సెంట్రల్ బోర్డు సమావేశంలో సతీష్ కె మరాఠే, రేవతి అయ్యర్, సచిన్ చతుర్వేది, వేణు శ్రీనివాసన్ తదితర డైరెక్టర్లు పాల్గొన్నట్లు ఆర్బీఐ తెలిపింది. చదవండి: గ్రామీణ ప్రాంతాల్లో ఆ కారుకు ఉన్న క్రేజ్ వేరబ్బా.. మూడు నెలల్లో రికార్డు సేల్స్! -
చంద్రబాబు ముందస్తు ఆశలు నెరవేరే అవకాశం లేదు : సజ్జల
-
కొత్త ఒరవడితో.. సమస్యల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: ‘‘మూస ధోరణులు, సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా వినూత్నంగా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు మార్గాలు అన్వేషించాలి. రొటీన్గా కాకుండా మరింత గొప్పగా పనిచేయాలి. నిన్నటి కన్నా రేపు ఎంత మెరుగ్గా పనిచేయగలమని రోజూ ఆలోచించాలి. ఒక పనిని ఎంత శాస్త్రీయంగా ఆలోచించి చేస్తున్నామనేదే ముఖ్యం. అప్పుడే ఉన్నతంగా ఎదగగలం’’ అని అధికార యంత్రాంగానికి సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆదివారం సీఎం పురపాలక శాఖ అంశాలు, నిజామాబాద్ నగర అభివృద్ధిపై ప్రగతిభవన్లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ యంత్రాంగం సమష్టిగా, సమన్వయంతో పనిచేస్తే సామాజిక అభివృద్ధి వేగవంతం అవుతుందని.. అప్పుడే సమాజంలోని వ్యక్తులుగా సాధించిన ఫలితాల్లో భాగస్వామ్యం అందుకోగలమని చెప్పారు. ఒక్కో రంగాన్ని తీర్చిదిద్దుకుంటూ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ఫలితాలు రాబట్టడంలో ఉద్యోగుల సమష్టి కృషి కీలకమని స్పష్టం చేశారు. ఏ రోజుకారోజు సృజనాత్మకంగా ఆలోచించిననాడే గుణాత్మక ప్రగతిని ప్రజలకు చేరవేయగలుగుతామన్నారు. నాణ్యమైన సేవలు అందాలి పెరుగుతున్న ఆర్థిక వనరులు, సంపదకు అనుగుణంగా పెరుగుతున్న ప్రజావసరాలను తీర్చడానికి అందరం కలిసి పనిచేయాలని కేసీఆర్ సూచించారు. అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగాలన్నారు. ఉమ్మడి పాలనలో శిథిలమైన అన్ని రంగాలను తీర్చిదిద్ది గాడిలో పెట్టగలిగామని, అన్ని రంగాలు వాటంతట అవి పనిచేసుకుంటూ పోయే స్థితికి తెచ్చుకున్నామని చెప్పారు. ‘‘నాడు తెలంగాణలో కనీస వసతులు లేవు. నేడు అన్ని రంగాల్లో గుణాత్మక అభివృద్ధిని సాధించింది. వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్యుత్, రోడ్లు, విద్య, వైద్యం తదితర మౌలిక రంగాల్లో నాణ్యమైన వసతులు సమకూరాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రగతి సాధించింది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. తెలంగాణ సమాజంలో అన్నివర్గాలు ఆర్థికంగా బలపడుతున్నాయి. ప్రభుత్వాల నుంచి మరింత నాణ్యమైన సేవలను ప్రజలు ఆశిస్తున్నారు. ఉత్తమ సేవలను అందించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వంపై విశ్వాసం పెరిగింది సౌకర్యాల పెంపునకు డిమాండ్ పెరుగుతోందంటే ప్రభుత్వంపై ప్రజలకు పెరిగిన విశ్వాసమే అందుకు కారణమని కేసీఆర్ అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిరంతర శ్రమతో నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘ఒకనాడు ప్రజాదరణకు నోచుకోని ప్రభుత్వ దవాఖానాలు, ఇతర ప్రభుత్వ వ్యవస్థలు నేడు అత్యంత ప్రజాదరణతో రద్దీగా ఉంటున్నాయి. ఒకనాటి వలసలు నేడు రివర్స్ అయ్యాయి. 30లక్షల మంది పక్క రాష్ట్రాల నుంచి వలసవచ్చి బతుకుతున్నారు. స్వరాష్ట్రంలో రాబడులు, ఆర్థిక వనరులు పెరిగాయి. సంస్కరణలతో గడపగడపకూ పాలనను తీసుకుపోతున్నాం. పెరిగిన అభివృద్ధిని ప్రజా ఆకాంక్షలను అందిపుచ్చుకుంటూ ప్రభుత్వ యంత్రాంగం తమ కర్తవ్య నిర్వహణను తీర్చిదిద్దుకోవాలి. పెరిగిన అభివృద్ధికి సమానంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాల్సి ఉంటుంది. ప్రజల ప్రాథమిక, నిత్యావసరాలను ఎంత గొప్పగా తీర్చగలమనేదే ప్రభుత్వోద్యోగికి ప్రధాన కర్తవ్యం కావాలి’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. వర్షాలు లేని సమయంలోనే పూర్తి చేయాలి గతంలో వానాకాలం రెండు మూడు నెలలే వర్షాలు పడేవని, ఇప్పుడు వానలు పడే రోజులు పెరిగి నిర్మాణ పనులకు సమయం తగ్గిందని సీఎం కేసీఆర్ చెప్పారు. అందువల్ల వర్షాలు లేని ఆరేడు నెలల్లోనే పనులు వేగంగా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఇక నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు. రెండున్నర నెలల్లో ప్రణాళికాబద్ధంగా పనులను పూర్తిచేయాలని, నిధులకు కొరత లేదని.. రెండు నెలల్లో తాను స్వయంగా పర్యటించి పనులను పరిశీలిస్తానని చెప్పారు. ఖమ్మం నగరాన్ని ఆదర్శంగా తీసుకుని నిజామాబాద్ను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ సమీక్ష సందర్భంగా పురపాలక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను సీఎంకు మంత్రి కేటీఆర్ వివరించారు. సమీక్షలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కె.కవిత తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: కొలీజియం వ్యవస్థ పరిపూర్ణమా? -
ఇళ్ల నిర్మాణం అనుకున్న సమయానికల్లా పూర్తి కావాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గృహనిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్షా సమావేశం చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో జగనన్న కాలనీలు, టిడ్కో హౌసింగ్ పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇళ్లులేని వారందరికీ ఇళ్లు ఇవ్వడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ. 5,655 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణంపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. లే అవుట్లలో పర్యటన వల్ల ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్షించి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. లే అవుట్లను సందర్శించినట్టుగా ఫొటోలను కూడా అప్లోడ్ చేయాలని తెలిపారు. ప్రతి శనివారం హౌసింగ్డేగా నిర్వహిస్తున్నామని.. ఆ రోజు తప్పనిసరిగా అధికారులు లే అవుట్లను సందర్శిస్తున్నారని అధికారులు సీఎంకు వెల్లడించారు. సీఎం జగన్ ఇంకా మాట్లాడుతూ.. ► ఇళ్ల నిర్మాణం అనుకున్న సమయానికల్లా పూర్తి కావాలి. ► ఆప్షన్–3 ని ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలి. ► లే అవుట్ల వారీగా ప్రాధాన్యత పరంగా పనులను గుర్తించి.. అనుకున్న సమయానికి ఆ పని పూర్తయ్యేలా చూడాలి. ► దీనివల్ల ఇళ్ల నిర్మాణంలో చెప్పుకోదగ్గ ప్రగతి కనిపిస్తుంది. ► ఇళ్ల నిర్మాణం నాణ్యతలో ఎలాంటి రాజీ వద్దు. ► ప్రతి దశలోనూ నాణ్యతా నిర్ధారణ పరీక్షలు జరగాలి. ► ఇళ్ల నిర్మాణంలో క్వాలిటీని నిరంతరం పాటించడానికి ఎస్ఓపీలను అందుబాటులో ఉంచాలి. ► గ్రామ సచివాలయాల్లో ఉన్న ఇంజినీరింగ్ అసిస్టెంట్ సేవలను విస్తృతంగా వాడుకోవాలి. ► ఇళ్ల నిర్మాణంలో క్వాలిటీ ప్రమాణాలు పాటించే విషయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ భాగస్వామ్యం తీసుకోవాలి. ► ఇళ్లు పూర్తయ్యే సరికి మూడు రకాల మౌలిక సదుపాయాలు ఉండాలి. ► విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి. ► మిగిలిన మౌలిక సదుపాయాలనూ వృద్ధిచేసుకుంటూ ముందుకు సాగాలి. ► ఈ పనులకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్లు సిద్ధం అయ్యాయని అధికారులు తెలిపారు. ప్రాధాన్యతాక్రమంలో చేసుకుంటూ వెళ్తున్నామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మ, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ దవులూరి దొరబాబు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె విజయానంద్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి ఇంతియాజ్, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: (వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల జాబితా ఇదే..) -
అంగన్వాడీలలో నాడు - నేడు కార్యక్రమంపై సీఎం సమీక్ష..
-
స్పందనపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
టిడ్కో ఇళ్ల నిర్వహణ బాగుండాలి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో గృహనిర్మాణంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, బుధవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గృహనిర్మాణంలో పురోగతిని వివరించిన అధికారులు.. వర్షాలు తగ్గినందున వేగంగా పనులు ముందుకు సాగుతాయని ఆయనకు తెలియజేశారు. ఈ ఒక్క 2022–23 ఆర్థిక సంవత్సరంలో గృహనిర్మాణం కోసం రూ.5,005 కోట్లు ఖర్చు చేశామన్న అధికారులు.. విశాఖలో మంజూరుచేసిన ఇళ్ల నిర్మాణాలపైనా ప్రత్యేక దృష్టిపెడుతున్నట్లు వివరించారు. ఇక టిడ్కో ఇళ్లు నిర్వహణ బాగుండాలన్న సీఎం వైఎస్ జగన్.. వాటిని పట్టించుకోకపోతే మళ్లీ మురికి వాడలుగా మారే ప్రమాదం ఉంటుందని అధికారులకు హెచ్చరించారు. ఏ రకంగా ఆ ఇళ్లను నిర్వహించుకోవాలన్న దానిపై అసోసియేషన్లకు బాసటగా నిలవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇప్పటికే వేల ఇళ్లు అప్పగింత కాలనీల్లో మౌలిక సదుపాయాలు, విద్యుద్దీకరణ పనులు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయని సీఎం జగన్కు అధికారులు వివరించారు. టిడ్కో ఇళ్లలో.. ఇప్పటికే 40,576 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ కల్లా 1,10,672 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగిస్తామని, వచ్చే ఏడాది మార్చికల్లా మరో 1,10,968 ఇళ్లు అప్పగిస్తామని, ఫేజ్–1కు సంబంధించి దాదాపుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగిసిందని సీఎం జగన్ వద్ద అధికారులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్న అధికారులు.. వేయి ఇళ్లకు పైగా ఉన్న చోట్ల రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల నిర్వహణపై వారికి అవగాహన, మార్గదర్శకాలు సూచిస్తున్నామని, శుభ్రతతో పాటు శానిటేషన్, విద్యుత్ దీపాల నిర్వహణ, వీధి లైట్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్వహణ తదితర అంశాలపై అసోసియేషన్లకు అవగాహన కల్పిస్తున్నామని అధికారులు చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖమంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీఎస్హెచ్సీఎల్ ఛైర్మన్ దవులూరి దొరబాబు, ఏపీ టిడ్కో ఛైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి సాయి ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, సీసీఎల్ఏ సెక్రటరీ ఏ.ఎండీ. ఇంతియాజ్, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ డాక్టర్ లక్ష్మీషా, టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: మూడు రాజధానులకు మద్దతు ప్రకటించిన మాల మహానాడు -
జలవనరుల శాఖ, పోలవరం పనులపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి: ఏపీలో జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టులోని ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్)లో కోతకు గురైన ప్రాంతంలో చేపట్టే పనుల ప్రణాళికపై అధికారులతో సీఎం చర్చించారు. ప్రస్తుత పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు వివరించారు. ఇప్పటికీ గోదావరిలో వరద కొనసాగుతోందని, ప్రస్తుతం రెండున్నర లక్షల క్యూసెక్కుల వరదనీరు ఉందని అధికారులు తెలిపారు. ఈసీఆర్ఎఫ్ డ్యాంలో ఎలాంటి పనులు చేపట్టాలన్నా ముందు కోతకు గురైన ప్రాంతంలో పరీక్షలు చేయాలని.. ఆ పరీక్షల్లో వెల్లడైన అంశాలు, దాని తర్వాత డిజైన్ల ఖరారు పూర్తయితే కానీ చేయలేమని పేర్కొన్నారు. కోతకు గురైన ప్రాంతంలో పరిస్థితులు, డయాఫ్రం వాల్ పటిష్టతపై నిర్ధారణల కోసం పరీక్షలు నవంబర్ మధ్యంతరం నుంచి మొదలవుతాయని అధికారులు సీఎం జగన్కు వివరించారు. వీటి తుది నిర్ణయం రావడానికి డిసెంబరు నెలాఖరు వరకూ పట్టే అవకాశం ఉందని, ఆ తర్వాత సీడబ్ల్యూసీ డిజైన్లు, మెథడాలజీ ఖరారు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ పరీక్షలు నడుస్తున్న సమయంలోనే మరోవైపు దిగువ కాఫర్డ్యాం పూర్తిచేస్తామని పేర్కొన్నారు. దిగువ కాఫర్ డ్యాం పూర్తికాగానే ఆ ప్రాంతంలో డీ వాటరింగ్ పూర్తిచేసి, డిజైన్ల మేరకు ఈసీఆర్ఎఫ్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈలోగా ఆర్అండ్ఆర్ పనుల్లో ప్రాధాన్యతగా క్రమంలో నిర్దేశించుకున్న విధంగా 41.15 మీటర్ల వరకూ సహాయ పునరావాస పనులు పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలని అధికారునలు సీఎం జగన్ ఆదేశించారు. చదవండి: ‘ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు సిగ్గుందా..ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు’ గోదావరిలో నిరంతరం ప్రవాహం ►1990 తర్వాత అత్యధికంగా వరద ► జులై 18న అత్యధికంగా 25.92 లక్షల క్యూసెక్కుల వరద. ►ఆగస్టు 14న కూడా 15.04 లక్షల క్యూసెక్కుల వరద. ► ఆగస్టు 19న 15.92లక్షల క్యూసెక్కుల వరద. ►సెప్టెంబరు 16న 13.78 లక్షల క్యూసెక్కుల వరద. ► ఇప్పటికీ రెండున్నరల లక్షల క్యూసెక్కులకు పైగా వరద. ►1990లో 355 రోజుల ప్రవాహం. 7,092 టీఎంసీల నీరు సముద్రంలో కలయిక. ►1994లో 188 రోజుల వరద, 5,959 టీఎంసీల నీరు సముద్రంలో కలయిక. ► 2013లో 213రోజుల వరద, 5,921 టీఎంసీల నీరు సముద్రంలోకి. ► 2022లో 136 రోజుల వరద, 6,010 టీఎంసీల నీరు సముంద్రంలోకి. ►కృష్ణానదిలో కూడా 1164.10 టీఎంసీల నీరు సముద్రంలోకి. ►వంశధారలోకూడా వరద జలాలు, 119.2 టీఎంసీలు సముద్రంలోకి ► నాగావళి ద్వారా 34.8 టీఎంసీలు సముద్రంలోకి ►పెన్నా నుంచి 92.41 టీఎంసీలు సముద్రంలోకి. ► ఇంకా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్లగ్ కుషన్ పెట్టుకోగా రిజర్వాయర్లు అన్నింటిలో దాదాపు 90శాతం నీటి నిల్వ. ►గొట్టా బ్యారేజీ నుంచి హిరమండలం రిజర్వాయర్కు లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు టెండర్లు ప్రక్రియ ప్రారంభం. డిసెంబరులో శంకుస్థాపనకు ఏర్పాట్లు. ►విజయనగరం జిల్లా తారక రామ తీర్థసాగర్ పనులు నవంబర్లో ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. సీఎం ఆదేశాలమేరకు మహేంద్ర తనయ పనులు పునరుద్ధరణకు అన్నిరకాల చర్యలు తీసుకున్నామని తెలిపారు. రూ.852 కోట్లతో రివైజ్డ్ ఎస్టిమేట్స్ చేసి త్వరలో టెండర్ ప్రక్రియను ఖరారు చేస్తామని, అవుకు టన్నెల్ పనులు కూడా పూర్తికావొస్తున్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి వెలిగొండ టన్నెల్ –2లో మిగిలి ఉన్న 3.4 కిలోమీటర్ల సొరంగం పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ దిగువన బ్యారేజీ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. వీటన్నింటితోపాటు రిజర్వాయర్లు, నీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అవసరమైన సిబ్బందిని నియమించుకోవడంతోపాటు, నిర్వహణపై ఒక కార్యాచరణ రూపొందించాలని, క్రమం తప్పకుండా నిర్వహణ పనులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా జూన్ కల్లా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. లిఫ్ట్ స్కీంల నిర్వహణ కోసం ఎస్ఓపీ ఏళ్లకొద్దీ నిర్వహణ సరిగ్గా లేక చాలా ఎత్తిపోతల పథకాలు మూలన పడుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే వీటి నిర్వహణపై ఒక ఎస్ఓపీ రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత ఎత్తిపోతల పథకాల పరిధిలో రైతులను కమిటీలుగా ఏర్పాటుచేసి వారి పర్యవేక్షణలో ఈ ఎత్తిపోతల పథకాలు నడిచేలా తగిన ఆలోచనలు చేయాలని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మంచి విధానాలను గుర్తించి వాటిపై కసరత్తు చేయాలని, ప్రభుత్వం నుంచి ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటయ్యేలా చూడాలన్నారు. కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తున్నందున, నిర్వహణ రైతుల పర్యవేక్షణలో సమర్థవంతంగా నడిచేలా తగిన అవగాహన, వారికి శిక్షణ ఇప్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశానికి జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, నీటిపారుదలశాఖ ఈఎన్సీ సి నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
అంగన్వాడీలపై సమీక్ష.. అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి: మహిళా, శిశు సంక్షేమశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో అంగన్వాడీలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. బాలింతలు, గర్భవతుల్లో రక్తహీనత, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నిర్దేశించుకున్న ప్రమాణాలతో అంగన్వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక యాప్లు రూపకల్పన చేయాలని, తద్వారా సుస్థిర ప్రగతి లక్ష్యాలను సాధించవచ్చని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అంగన్వాడీల్లో పిల్లలకు ఇచ్చే ఆహారంలో క్వాలిటీ, కచ్చితమైన క్వాంటిటీ ఉండాలన్నారు. ప్రతిరోజూ నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం ఆహారం అందుతుందా? లేదా? అన్నదానిపై నిరంతర పర్యవేక్షణ చేయాలని తెలిపారు. దీనికోసమే దశాబ్దకాలంగా పెండింగ్లో ఉన్న సూపర్వైజర్ల నియామకాలను ప్రారంభించామని, దురదృష్టవశాత్తూ కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారని ప్రస్తావించారు. వీలైనంత త్వరగా ఈ పోస్టుల భర్తీని పూర్తిచేయాలని ఆదేశించారు. అక్టోబరులో నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం నూటికి నూరుపాళ్లు క్వాలిటీ, క్వాంటిటీ ఆహారం పిల్లలకు అందాలని పేర్కొన్నారు. చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్ నోటిఫికేషన్ విడుదల అంగన్వాడీల్లో టాయిలెట్ల పరిశుభ్రతపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. సొంత భవనాల్లోనే కాకుండా అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీల్లో కూడా కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈమేరకు కార్యాచరణ సిద్ధంచేసుకోవాలన్న సీఎం..అంగన్వాడీల్లో నాడు – నేడు ద్వారా సమగ్రాభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖతో కలిసి ఈమేరకు కార్యాచరణ చేసుకోవాలన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ►అంగన్వాడీల రూపురేఖలను సంపూర్ణంగా మార్చాలి ►అంగన్వాడీల్లో ప్రస్తుత పరిస్థితులు ఏంటి? ఎలాంటి సదుపాయాలు కల్పించుకోవాలి? ఏ రకంగా వాటిని తీర్చిదిద్దాలి? తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రణాళిక తయారు చేసుకోవాలి. ►విడతల వారీగా ఆ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. ►పిల్లలకు ఇచ్చే ఆహారం పాడవకుండా చూసేందుకు ఎలాంటి విధానాలు అనుసరించాలన్నదానిపై కూడా దృష్టిపెట్టాలి. ►పిల్లలు రోజూ తీసుకునే పాలు, గుడ్లులాంటివి పాడవకుండా నిల్వచేసే విధానాలపైనా కూడా దృష్టిపెట్టాలి. ►అంగన్వాడీల్లో ప్రతిచోటా ఫ్రిడ్జ్ ఏర్పాటు దిశగా ఆలోచన చేయాలి. ►స్కూళ్లకు, అంగన్వాడీలకు సరఫరాచేసే ఆహారంపై నాణ్యత, పర్యవేక్షణకు మరిన్ని చర్యలు. ►డిసెంబర్1 నుంచి పౌష్టికాహార పంపిణీ బాధ్యతలను చేపట్టనున్న మార్క్ఫెడ్.ప్రత్యేక యాప్ ద్వారా దీని పర్యవేక్షణ. ►నవంబరు నుంచి నుంచి గుడ్ల పంపిణీపై కూడా యాప్ ద్వారా పర్యవేక్షణ. ►ఈ ఆహార నాణ్యత బాగుందా? లేదా? అన్నదానిపై కేంద్ర ప్రభుత్వ సంస్థతో థర్డ్ పార్టీ పర్యవేక్షణ. ►ఈలోగా పంపిణీ అవుతున్న ఆహారం క్వాలిటీపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం. ►క్వాలిటీ, క్వాంటిటీపై యాప్ల ద్వారా సమగ్ర పర్యవేక్షణ ఉండాలి. ►అంగన్వాడీల పిల్లల ఆరోగ్య పరిస్థితులపై విలేజి క్లినిక్స్ ద్వారా, ఆశా వర్కర్ల ద్వారా వైద్యాధికారులు పర్యవేక్షణ చేయాలి: ►సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి: ►శారీరకంగా బలహీనంగా ఉన్న పిల్లలకు వైద్య సహాయమే కాకుండా, ఆ పిల్లలకు పౌష్టికాహారం మరింత పెంచేలా తగిన ఆలోచనలు చేయాలి. ►దీనివల్ల రక్తహీనత, శారీరక బలహీనతలను మొదటి దశలోనే నివారించే అవకాశం ఉంటుంది. ►అంగన్వాడీలపై సూపర్వైజర్ల పర్యవేక్షణ జియోట్యాగింగ్ చేయాలలి. ►అంగన్వాడీలకు, సూపర్వైజర్లకు మొత్తంగా దాదాపు 57వేలమందికి సెల్ఫోన్ల్ పంపిణీ కార్యక్రమాన్నిసీఎం ప్రారంభించారు. గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల లోపు పిల్లలకు అందించే పౌష్టిహారం, ఇతర సేవలను మరింత సమర్ధవంతంగా అమలు చేయడంతో పాటు, సమగ్రపర్యవేక్షణ కోసం అంగన్వాడీ సెంటర్లకు, వర్కింగ్ సూపర్ వైజర్లకు ఈ సెల్ఫోన్స్ ప్రభుత్వం అందిస్తుంది. సుస్థిర ప్రగతి లక్ష్యాల్లో దేశంలోనే నంబర్వన్గా నిలవాలి. ►గతంలో పిల్లల భోజనానికి నెలకు సుమారురూ.500 కోట్లు ఉండేది, ఈరోజు నెలకు సుమారుగా రూ.1900 కోట్లు ఖర్చుచేస్తున్నాం. ►విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమాలకోసం చాలా పెద్ద ఎఫర్ట్ పెడుతున్నాం. ►ఇంగ్లిషు మీడియంను చిన్ననాటినుంచే అలవాటు చేయడానికి ఫౌండేషన్ స్కూల్స్, శాటిలైట్ పౌండేషన్ స్కూల్స్ తీసుకువచ్చాం. ►నాడు – నేడు ద్వారా పూర్తిగా రూపురేఖలు మారుస్తున్నాం. ►ఇన్నివేల కోట్లు ఖర్చుచేసి అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాం. ►ఇన్ని కార్యక్రమాలు చేసినా..సరైన పర్యవేక్షణ లేకపోతే ప్రయోజనం ఉండదు. ►అందుకే కచ్చితమైన పర్యవేక్షణ అవసరం. ►అధికారులు కూడా సరైన సమయంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. ►దేశంలో నంబర్వన్ కావడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం ఈ సమీక్షా సమావేశంలో మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి కె వి ఉషశ్రీచరణ్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఏపీడీడీసీఎఫ్ ఎండీ ఎ బాబు, మార్క్ఫెడ్ ఎండీ పి ఎస్ ప్రద్యుమ్న, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ ఎ సిరి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ప్రతి స్కూల్లో ఇంటర్నెట్ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశం
-
అనంత వర్షాలపై సీఎం జగన్ సమీక్ష.. 2వేల తక్షణ సాయం
సాక్షి, తాడేపల్లి: అనంతపురంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాలు, వరదల కారణంగా నిర్వాసితులైన వారికి అండగా నిలవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు రూ.2వేల చొప్పున తక్షణ సహాయం అందించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. వర్షాలు, వరద తగ్గముఖం పట్టగానే ఆస్తి, పంట నష్టంపై అంచనా వేసి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
ఆదాయాలను సమకూరుస్తున్న శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష
-
స్వచ్ఛమైన పాల ఉత్పత్తిపై రైతులకు అవగాహన పెంచాలి : సీఎం జగన్
-
ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణపై సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, సంపూర్ణ పోషణ కార్యక్రమాలపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... ►నాడు – నేడు ఎంత ముఖ్యమో స్కూళ్ల నిర్వహణ కూడా అంతే ముఖ్యం ►ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులను వెంటనే భర్తీచేయాలి ►దీనివల్ల స్కూళ్లపై పర్యవేక్షణ పెరుగుతుందన్న సీఎం. ►మధ్యాహ్న భోజనం నాణ్యతపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష ►నాణ్యతా లోపం లేకుండా పిల్లలకు భోజనం అందించడంపై సమావేశంలో చర్చ ►క్రమం తప్పకుండా మధ్యాహ్నం భోజనంపై పర్యవేక్షణ చేయాలి ►దీనికోసం సరైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలి ►స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం పర్యవేక్షణలో హెచ్ఎం, గ్రామ సచివాలయ సిబ్బందిది కీలకపాత్ర అన్న సీఎం ►స్కూళ్లకు, అంగన్వాడీలకు బియ్యాన్ని సరఫరాచేసేముందు బియ్యం నాణ్యతను కచ్చితంగా పరిశీలించాలని సీఎం ఆదేశం ►సరఫరా చేసే బియ్యం బ్యాగులపై కచ్చితంగా మధ్యాహ్నం భోజనం లేదా ఐసీడీఎస్ బియ్యంగా లేబుల్స్ వేయాలి ►కచ్చితంగా ప్రతినెలా ఈ నాణ్యతా పరీక్షలు జరగాలి ►ఆహారాన్ని రుచిగా వండడంపై కుక్స్కు తగిన తర్ఫీదు ఇవ్వాలి ►క్రమం తప్పకుండా శిక్షణ కార్యక్రమాలు జరగాలి ►చిక్కీల నాణ్యతపై కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి ►తయారీ దారుల వద్దా, సరఫరా సమయంలోనూ, పిల్లలకు పంపిణీ చేసేటప్పుడు... ఈ మూడు దశల్లోనూ నాణ్యతపై ర్యాండమ్ పరీక్షలు చేయాలని సీఎం ఆదేశం ►అలాగే గుడ్లు పంపిణీలో సమయంలో వాటికి తప్పనిసరిగా స్టాంపింగ్ చేస్తున్నామన్న అధికారులు ►స్టాంపింగ్ లేకుండా పంపిణీచేస్తే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం ►నాడు – నేడు తొలిదశ కింద పనులు జరిగిన స్కూళ్లపై ఆడిట్ చేయించాలన్న సీఎం ►నిర్దేశించుకున్న అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయా? లేవా? ►సమకూర్చిన వాటిలో ఏమైనా సమస్యలు వచ్చాయా? ►తదితర అంశాలపై ఆడిట్ చేయించాలన్న సీఎం ►ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు వస్తే ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్ నిధులను వాడుకుని వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలి ►క్రమం తప్పకుండా ఇలా ఆడిట్ చేయాలి ►ప్రతి ఏటా నాలుగు సార్లు ఆడిట్ చేయాలి ►నాడు– నేడు పూర్తిచేసుకున్న స్కూళ్లలో సదుపాయాల భద్రతకోసం వాచ్మెన్ నియమించాలి ►నాడు – నేడు కింద కల్పించిన సదుపాయాలకు సంబంధించి వ్యారంటీ ఉన్నందున సమస్య రాగానే వెంటనే మరమ్మత్తులు చేయిస్తున్నామన్న అధికారులు ►గ్రామ సచివాలయాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ సేవలనూ వినియోగించుకోవాలి ►అంతిమంగా కలెక్టర్లు, జేసీలు.. స్కూళ్ల నిర్వహణపై బాధ్యత వహించాలి ►స్కూళ్ల నిర్వహణపై ఒక కాల్సెంటర్ను తప్పనిసరిగా నిర్వహించాలి ►స్కూళ్ల నిర్వహణపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి ►స్కూళ్లలో సౌకర్యాలు ఏర్పాటు చేసినా అవి పనిచేయడంలేదన్న మాట రాకూడదు ►వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణపోషణ ప్లస్ కార్యక్రమంపైనా కూడా గట్టి పర్యవేక్షణ ఉండాలన్న సీఎం ►దీనికి కూడా పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలి ►ఖాళీగా ఉన్న అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల పోస్టులను కూడా భర్తీచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి కేవి ఉషా శ్రీచరణ్, సీఎస్ సమీర్ శర్మ, విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ఏ సిరి, సెర్ఫ్ సీఈఓ ఏ.ఎండి ఇంతియాజ్, మెప్మా ఎండీ వి విజయలక్ష్మి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ అధ్యక్షతన ఎఫ్ఐపీబీ సమావేశం.. పలు ప్రతిపాదనలకు ఆమోదం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ బుధవారం సమావేశమైంది. ఈ భేటీలో ఎఫ్ఐపీబీ పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. 1. అదానీ గ్రీన్ ఎనర్జీ చేపట్టనున్న 3700 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు ఎస్ఐపీబీ ఆమోదం మొత్తంగా రూ.15,376 కోట్ల పెట్టుబడి.. నాలుగు దశల్లో ఈ ప్రాజెక్టు 2022–23లో రూ. 1349 కోట్లు, 2023–24లో రూ. 6,984 కోట్లు 2024–25లో రూ. 5,188 కోట్లు 2025–26లో రూ. రూ.1855 కోట్ల పెట్టుబడి ►మొత్తంగా సుమారు 4వేల మందికి ఉపాధి ►దావోస్ వేదికగా చేసుకున్న అవగాహన ఒప్పందాల్లో ఇదొక ప్రాజెక్టు ►వైఎస్సార్ జిల్లాలో 1000 మెగావాట్లు, పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుకుట్టి వద్ద 1200 మెగావాట్లు, కర్రివలస వద్ద 1000 మెగావాట్లు, సత్యసాయి జిల్లాలోని పెదకోట్ల చిత్రావతి వద్ద 500 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి. 2. వైఎస్సార్ జిల్లా పులివెందులలో పంక్చుయేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ (టెక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ లిమిటెండ్ అనుబంధ సంస్థ) రూ.50 కోట్లతో పెట్టనున్న గార్మెంట్స్ తయారీ పరిశ్రమకు ఎస్ఐపీబీ ఆమోదం. ►ఇదే కంపెనీ వైఎస్సార్ జిల్లాలోని కొప్పర్తిలో రూ.50 కోట్లతో పెట్టనున్న మరో యూనిట్కూ ఎస్ఐపీబీ ఆమోదం. ఈ రెండు యూనిట్ల ద్వారా మొత్తంగా 4,200 మందికి ఉద్యోగాలు. 3. కృష్ణాజిల్లా మల్లవెల్లి ఫుడ్పార్కులో రూ.150 కోట్లతో అవిసా ఫుడ్స్ ప్రయివేట్ లిమిటెడ్ పెట్టనున్న రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమకు ఎస్ఐపీబీ ఆమోదం. ఈ కంపెనీ ద్వారా 2,500 మందికి ఉద్యోగాలు. 4. తిరుపతిలో నొవాటెల్ బ్రాండ్ కింద హోటల్ ఏర్పాటు చేయనున్న వీవీపీఎల్. ►రూ.126.48 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 300 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 2700 మందికి ఉపాధి కల్పన. ఈ ప్రాజెక్టుకు ఎస్ఐపీబీ ఆమోదం. 5. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి చిరునామాగా మారిన కొప్పర్తిని టెక్స్టైల్ రీజియన్ అపారెల్ పార్క్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయం ఆమోదం తెలిపిన ఎస్ఐపీబీ ►దాదాపు 1200 ఎకరాల్లో మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ మరియు అపారెల్ పార్క్స్ ►నాణ్యమైన ఉత్పత్తులు, తక్కువ ఖర్చుతో తయారీ, మెరుగైన ఉపాధి ప్రధాన లక్ష్యం ►నాణ్యమైన విద్యుత్తు, నీరు తదితర మౌలిక సదుపాయాలను కల్పించనున్న ప్రభుత్వం ►ఈ ప్రాంతాన్ని రైల్వేలైన్లతో అనుసంధానించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశం ఎస్ఐపీబీలో ముఖ్యమంత్రి ఏమన్నారంటే.. ►రాష్ట్రంలో సుమారు 30వేల మెగావాట్లకు పైగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి అపార అవకాశాలు ఉన్నాయన్న ముఖ్యమంత్రి ►దీనికోసం సుమారు 90వేల ఎకరాలు అవసరం అవుతుంది ►గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల వల్ల రైతులకు, రాష్ట్రానికి పెద్ద మేలు జరగబోతోంది ►ప్రతి ఎకరాకు రైతుకు కనీసంగా రూ.30వేల లీజు వస్తుంది ►ప్రతి ఏటా రైతుకు ఆదాయం నేరుగా వస్తుంది ►వర్షాభావ ప్రాంతాల్లో స్థిరంగా రైతుకు ఆదాయం రావడంవల్ల ఆయా కుటుంబాలకు మేలు జరుగుతుంది ►రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకున్న మిగతా ప్రాజెక్టులు కూడా వీలైనంత త్వరగా సాకారమయ్యేలా చూడాలన్న సీఎం ►వీటితోపాటు సుబాబుల్, జామాయిల్ లాంటి సాగు చేస్తున్న రైతులు కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల నుంచి మేలు పొందవచ్చన్న సీఎం ►ఆ భూములను సోలార్ ప్రాజెక్టుల్లాంటి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు లీజుకు ఇవ్వడంద్వారా... ఏడాదికి కనీసంగా ఎకరాకు రూ.30వేల వరకూ స్థిరంగా ఆదాయం పొందేందుకు చక్కటి అవకాశం ఉందన్న సీఎం ►ఈ ప్రత్యామ్నాయంపైనా అధికారులు దృష్టిసారించి రైతులకు మేలు చేసే చర్యలను చేపట్టాలన్న సీఎం ►అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కంపెనీల తయారీ కేంద్రంగా రాష్ట్రం మారాలి ►గ్లోబల్ కంపెనీల పెట్టుబడులు తీసుకురావడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న ముఖ్యమంత్రి ►ఎలక్ట్రానిక్స్ మరియు పర్యాటక– ఆతిథ్య రంగాల్లో మంచి పెట్టుబడులకు రాష్ట్రంలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి ►కొప్పర్తిలో ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమలు విరివిగా వస్తున్నాయి ►మరిన్ని గ్లోబల్ కంపెనీలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి ►ఈ పరిశ్రమలకు అవసరమైన సామగ్రిని, అలాగే ఉత్పత్తులను సులభంగా తరలించేందుకు వీలుగా కొప్పర్తిలో రైల్వే లైన్ ఏర్పాటుచేయాలని, ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం. ►కొప్పర్తికి రైల్వే కనెక్షన్ తీసుకురావడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం ►దీనివల్ల కొప్పర్తి ప్రాంతంలో ఉన్న దాదాపు 6వేల ఎకరాల్లో శీఘ్రగతిన పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్న సీఎం ►దీంతోపాటు ఇండస్ట్రియల్ నోడ్స్ను రైల్వేలతో అనుసంధానం చేయడం అత్యంత కీలకమన్న సీఎం ►ప్రతినోడ్ను కూడా రైల్వేలైన్లతో అనుసంధానం చేయాలన్న సీఎం ►పరిశ్రమలకు మంచి జరుగుతుందని, రవాణా సులభతరం అవుతుందన్న సీఎం ►ఈ ప్రాజెక్టులన్నీకూడా యుద్ధ ప్రాతిపదికన జరిగేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం ఈ భేటీకి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పరిశ్రమలు, వాణిజ్యం, మౌలికసదుపాయాలు, పెట్టుబడులు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పర్యాటకశాఖ మంత్రి ఆర్ కే రోజా, సీఎస్ సమీర్ శర్మ, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ కె విజయానంద్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఐటీ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్, పరిశ్రమలశాఖ డైరెక్టర్ జి సృజన, ఏపీఐఐసీ ఎండీ జె సుబ్రమణ్యం, ఏపీ టూరిజం ఎండీ అండ్ సీఈఓ కన్నబాబు, ఏపీటీఎస్ ఎండీ నంద కిషోర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
పట్టణాభివృద్ధిశాఖపై సీఎం జగన్ సమీక్ష
-
సమగ్ర భూ సర్వే ప్రధాన లక్ష్యం అదే.. సీఎం జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం (సమగ్ర సర్వే)పై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. సమగ్ర సర్వే వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. ఇప్పటివరకూ జరిగిన సర్వే ప్రగతిని సీఎం సమీక్షించారు. సమగ్ర సర్వే కారణంగా అన్ని భూ వివాదాలు పరిష్కారం అవుతాయని సీఎం అన్నారు. దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. చదవండి: 3 దశల్లో భూముల రీసర్వే పూర్తికి ప్రణాళిక ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే..: ♦భూ వివాదాలను పరిష్కరించడం అన్నది సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యాల్లో ఒకటి ♦సమగ్ర సర్వేను నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తిచేయడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోండి ♦అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవాలని, సాంకేతిక పరికరాలను అవసరాలకు అనుగుణంగా తెప్పించుకోవాలని ఆదేశించిన సీఎం ♦డ్రోన్లు, ఓఆర్ఐ పరికరాలు, రోవర్లు, అలాగే సర్వే రాళ్లు సమకూర్చుకోవడం... ఇలా ప్రతి అంశంలోనూ వేగం ఉండాలన్న సీఎం ♦సర్వే కార్యక్రమాన్ని అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ♦100 ఏళ్ల తర్వాత సర్వే జరుగుతోందని, ఈ సర్వేను పూర్తిచేయడం ద్వారా ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న సీఎం సమీక్షా సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయడు, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లాం, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయి ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
విద్యాశాఖ పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
రాష్ట్రంలో గుంతలులేని రోడ్లు కనిపించాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ శాఖ పరిధిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించిన సీఎం.. అధికారులు ఇచ్చిన నివేదికలు, ఇతర సమాచారం మేరకు పలు కీలక సూచనలు చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఐజీ లేఅవుట్లు: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక ఎంఐజీ లే అవుట్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం వైఎస్ జగన్.. ఆ లే అవుట్స్ ఆదర్శనీయంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఇంకా.. ► లే అవుట్స్ నియమాలు, నిబంధనలు, ప్రమాణాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి. ► లే అవుట్స్ చూసి ఇతరులు స్ఫూర్తిని పొందాలి. ► న్యాయవివాదాలు, ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా క్లియర్ టైటిల్స్ వినియోగదారులకు ఉండాలి. ► జగనన్న స్మార్ట్ టౌన్షిప్ (ఎంఐజీ లేఅవుట్స్) కోసం ఇప్పటివరకూ 82 అర్బన్ నియోజకవర్గాల్లో సుమారు 6791 ఎకరాల గుర్తింపు. ► శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, శ్రీ సత్యసాయి, తిరుపతిలో.. 864.29 ఎకరాల్లో లే అవుట్ పనులు.. మే చివరినాటికి సిద్ధం చేస్తామని వెల్లడించిన అధికారులు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ : ► తడిచెత్త, పొడిచెత్త, ప్రమాదకర వ్యర్థాలు అంటే ఏంటి? అనే విషమయంపై ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. ► ఏ కలర్ డబ్బాలో ఏ చెత్త వేయాలి అనే విషయంపై కరపత్రాలను ప్రతి ఇంటికీ పంచాలి. ► ఇప్పటికే 1.12 కోట్ల చెత్త డబ్బాలను పంపిణీచేశామని అధికారులు వివరించారు. ► మరో 8 లక్షల చెత్త డబ్బాలను మే 22 నాటికల్లా పంపిణీ చేస్తామన్నారు. ► 2,426 ఆటోలు ఇప్పటికే క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయి. మిగిలినవి ఈనెలాఖరు నాటికి అందుబాటులోకి వస్తాయన్న అధికారులు. ► 1,123 ఈ–ఆటోలు కూడా జూన్ నాటికి అందుబాటులోకి వస్తాయి. ► గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు డిసెంబరు నాటికి పూర్తయ్యేలా కార్యాచరణ. ప్రతి ఇంటికీ ప్రతిరోజూ తాగునీరు: ► ప్రతిరోజూ ప్రతి ఇంటికీ తాగునీరు అందాలి. ► దీనిపై సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి. ► ఇది జరుగుతోందా? లేదా? అన్నదానిపై ఎప్పటికప్పుడు సమాచారం రావాలి. తద్వారా దీనివల్ల వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. టిడ్కో ఇళ్లపై సమీక్ష: ► గత ప్రభుత్వం రోడ్లు, తాగునీరు, మురుగునీటి శుద్ధిలాంటి లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేకుండా టిడ్కో ఇళ్లు ప్లాన్ చేశారు. కానీ, ఈ ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టింది. ► పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, తాగునీటికోసం వాటర్ ట్యాంకులు, మురుగునీటి శుద్ధి సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. ► మంచి జీవన ప్రమాణాలు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు. ► టిడ్కో ఇళ్ల మీద సుమారుగా.. రూ.5, 500 కోట్లు ఈ మూడేళ్లలో ఖర్చుచేసింది ప్రభుత్వం. రోడ్లపై దృష్టి: ► కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రోడ్లపై దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు. ► ఎక్కడ చూసినా గుంతలులేని రోడ్లు కనిపించాలి. ► నాడు – నేడు కింద బాగు చేసిన రోడ్లను హైలెట్ చేయాలి. ► జూన్నాటికి రోడ్ల పనులు పూర్తిచేస్తామని అధికారులు.. సీఎం జగన్కు వివరణ ఇచ్చారు. అమరావతి ప్రాంతంలో పనులపై సీఎం సమీక్ష: ► కరకట్ట రోడ్డు విస్తరణ పనులు వేగవంతం అయ్యాయని అధికారులు సమీక్షలో పేర్కొన్నారు. ► ఇప్పటికే విద్యుత్ స్తంభాలను తొలగించడంతో పనులు వేగవంతం అవుతాయని చెప్పారు. ► సీడ్ యాక్సెస్ రోడ్డు (ఇ–3)పైన కూడా దృష్టిపెట్టామని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుపైనా సీఎం సమీక్ష: ► విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు కోసం వనరుల సమీకరణపై చర్చ. ► సమారు 75 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రతిపాదనలు. ► మెట్రోరైల్ ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశం. ► ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులో భాగంగా కోచ్ల డిజైన్, దీంతోపాటు స్టేషన్లలో ఉండే సౌకర్యాలు తదితర వివరాలు సమగ్రంగా సమర్పించాలని సీఎం జగన్ ఆదేశం. ► పర్యావరణహిత విధానాలకు పెద్దపీట వేయాలని అధికారులకు సూచన. జగనన్న మహిళా మార్ట్లపై సీఎం సమీక్ష: ► మహిళా స్వయం సహాయక సంఘాలతో నడుస్తున్న మహిళా మార్ట్లు. ► ప్రస్తుతం నడుస్తున్న మహిళా మార్ట్లను వివరించిన అధికారులు. ► విజయవంతంగా నడుస్తున్నాయన్న అధికారులు.. వీలైనన్ని మహిళా మార్ట్లను నెలకొల్పాలని సూచించిన సీఎం జగన్. చదవండి: వెటర్నరీ ల్యాబ్ల ఏర్పాటు ఘనత సీఎం జగన్దే -
రోడ్లు, తాగునీటిపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో గ్రామీణ రోడ్లను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో జరిగిన సమీక్షలో సీఎం కీలకంగా రోడ్లు, తాగునీటి సరఫరాపై చర్చించారు. అవసరమైన రోడ్ల మరమ్మతులతో పాటు కొత్త రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ఆయన ఆదేశించారు. చేపట్టే పనులన్నింటిలో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సీఎం సూచించారు. ఇప్పటికే చాలా రోడ్లను నిర్మించామని, మిగిలిన వాటిని కూడా పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. చదవండి👉: టీడీపీ కుట్రలు: తమ్ముళ్ల నాటకం.. విస్తుబోయే నిజం ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన రోడ్లకు వెంటనే శాఖాపరమైన అనుమతులకు సీఎం ఆదేశించారు. టెండర్లు పూర్తి చేసి జూన్ నెలాఖరు లోపు పనులు పూర్తి చేయాలన్నారు. మరో వైపు వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి లేకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని సీఎం అధికారులను ప్రశ్నించారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలుపగా నిధులకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, తాగునీటి సరఫరా పనులకు కీలక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. వీటితో పాటు రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నాబార్డ్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాల సహకారం కూడా తీసుకోవాలని ఆయన సూచించారు. సీఎం జగన్ ఏమన్నారంటే... : ♦చెరువులను కాలువల ద్వారా అనుసంధానం చేసే దిశగా పనిచేయాలన్న సీఎం ♦తద్వారా రానున్న ఐదేళ్లలో ప్రతిచెరువును కెనాల్స్, ఫీడర్ ఛానెల్స్కి లింక్ చేయగలిగితే... నీటిఎద్దడిని నివారించగలుగుతామన్న సీఎం ♦కడప, అనంతపురము లాంటి ప్రాంతాల్లో కాలువలు ద్వారా ట్యాంకులను కనెక్ట్ చేయాలి ♦దీనికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ఆదేశించిన సీఎం త్వరితగతిన భవన నిర్మాణాల పూర్తి ♦ఆర్బీకేలు, డిజిటల్ లైబ్రరీలు, గ్రామ సచివాలయాలు, విలేజీ క్లినిక్స్కు సంబంధించిన భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం ♦వీటీపై ప్రత్యేక ధ్యాస పెట్టాలన్న ముఖ్యమంత్రి ♦ప్రతిచోటా నవరత్నాలు ఫోటో ఉండేలా చూడాలని ఆదేశం ♦గత ప్రభుత్వ హయాంలోని బిల్లులు మనం చెల్లించాల్సి రావడంతో ఇబ్బందులు వచ్చాయి ♦అయినా ఇబ్బందులు అధిగమించి ఆ బకాయిలు చెల్లించాం ♦భవనాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి ♦భవన నిర్మాణ పనులు ఆగకూడదు.. అలాగని పనులు చేస్తున్నవారు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ♦ఉపాధి హామీ పనులుకు సంబంధించి.. బిల్లులు అప్లోడ్ తో పాటు చెల్లింపుల్లో కూడా ఆలస్యం కాకూడదు. ♦ఈ మేరకు అవసరమైన ప్రణాళిక ముందుగానే చేసుకోవాలి ♦అవసరమైతే ఢిల్లీ స్ధాయిలో దీనికోసం ప్రత్యేక అధికారిని నియమించాలి. ♦గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల సహా మొత్తం నాలుగు రకాల భవనాల నిర్మాణాలు పూర్తి కావాలన్న సీఎం వైఎస్సార్ జలకళ.. ♦వైఎస్సార్ జలకళ కింద అర్హులైన రైతులకు బోరు, మోటారు, పైపులు అన్నీ ప్రభుత్వమే ఇస్తుంది ♦ఈ పథకం కింద నాణ్యమైన మోటార్లు ఎంపిక చేయాలి ♦175 నియోజవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో రిగ్గు ఉండాలి. దీని గురించి ప్రజలకు అవగాహన కలిగించాలన్న సీఎం ♦నియోజకవర్గానికి ఒక రిగ్గు అందుబాటులోకి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి ♦ఇప్పటివరకు 13,245 బోర్లు వేశామన్న అధికారులు ♦ఒక్కో బోరుకు కనీసం రూ.4.50 లక్షల ఖర్చు చేస్తున్నామన్న సీఎం ♦బోరు డ్రిల్లింగ్ డబ్బులు రైతు అకౌంట్కు నేరుగా (డీబీటీ విధానంలో) జమ చేసి.. అతని నుంచి పేమెంట్ అయ్యే విధంగా ఏర్పాటు చేయాలన్న సీఎం ♦దీనివల్ల లంచాలు లేని వ్యవస్ధను తీసుకురాగలుగుతామన్న సీఎం ♦దానికి తగిన విధంగా ఎస్ఓపీలు రూపొందించాలన్న సీఎం ♦ఫలితంగా మరింత పారదర్శకత పెరుగుతుందన్న సీఎం ♦ఐదు ఎకరాలలోపు అర్హత ఉన్న రైతులకుఅన్ని రకాల సౌకర్యాలతో ఉచిత బోరు ♦5-10 ఎకరాల మధ్యలో ఉన్న రైతులకు కేవలం డ్రిల్లింగ్ మాత్రమే ఉచితం గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు.. ♦గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్న సీఎం ♦రోడ్ల మరమ్మతులకు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ ఖర్చు పెట్టలేదు ♦ఆర్ అండ్ బీలో ఇప్పటికే పనులు వేగంగా జరుగుతున్నాయి ♦గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులకు తక్షణమే పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశం ♦వెంటనే టెండర్లకు వెళ్లాలన్న సీఎం ♦అనంతరం తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశం ♦ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్ రెండింటిలోనూ రోడ్లకు సంబంధించి నాడు-నేడు ఫోటోలు డిస్ప్లే చేయాలి ♦మే 15-20 తేదీల నాటికల్లా పనులు ప్రారంభం కావాలన్న సీఎం ♦పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతులు, నిర్మాణానికి సంబంధించిన పనులు అత్యధిక ప్రాధాన్యతతో పూర్తి చేయాలన్న సీఎం ♦పాట్ హోల్ ఫ్రీ బీటీ రోడ్ల విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం ♦గ్రామ, వార్డు సచివాలయంలో నాడు-నేడు పనులకు సంబంధించి విద్య, వైద్య ఆరోగ్యం, రహదారులుపై చేపట్టిన పనులకు సంబంధించి ఫోటోలను డిస్ప్లే చేయాలన్న సీఎం ♦రైతు భరోసా కేంద్రాలకు సంబంధించిన ఫోటోలను కూడా డిస్ప్లే చేయాలి ♦జలజీవన్ మిషన్ కింద జగనన్న కాలనీల్లో నీటిసరఫరా అత్యధిక ప్రాధాన్యతతో చేపట్టాలన్న సీఎం ♦జలజీవన్ మిషన్కు సంబంధించి నాబార్డు, కేంద్రం సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోవాలి అధికారులకు సీఎం ఆదేశం సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్... ♦గ్రామాల్లో మురుగునీటి కాలువలు నిర్వహణ, చెత్త సేకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం ♦గ్రామాలలో రోడ్లమీద మురుగునీరు, చెత్త లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశం ♦సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ నిర్వహణ కింద చేపడుతున్న పనులన్నీ అక్టోబరు నాటికి 100శాతం పూర్తి కావాలి ♦అక్టోబరు 2 నాటికి ఏ గ్రామం వెళ్లినా సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ పక్కాగా ఉండాలి, ఊర్లన్నీ క్లీన్గా కనిపించాలి ♦2 కోట్ల డస్ట్బిన్లను అక్టోబరు నాటికి సిద్ధంగా ఉంచుతామన్న అధికారులు. ♦తడి, పొడి చెత్తలపై విడివిడిగా అవగాహన కలిగించాలన్న సీఎం. ♦ప్రతి పంచాయతీకి చెత్త తరలింపునకు ట్రాక్టర్ ఉండేలా లక్ష్యంగా పెట్టుకోవాలన్న సీఎం ♦దశలవారీగా దాన్ని చేరుకోవాలన్న సీఎం ♦రోడ్డుమీద ఎక్కడా చెత్త, మురుగునీటి ప్రవాహం కనిపించకూడదని ఆదేశం. ♦హై ప్రెజర్ టాయ్లెట్ క్లీనర్స్ నెంబర్లు ప్రతిగ్రామంలోనూ డిస్ప్లే చేయాలన్న సీఎం. ♦సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్కు సంబంధించిన క్లాప్ మిత్ర జీతాలు చెల్లింపునకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం. లిక్విడ్ వేస్ట్ మేనేజిమెంట్... ♦మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయితీల్లో దశలవారీగా లిక్విడ్ వేస్ట్ మేనేజిమెంట్ చేపట్టాలన్న సీఎం ♦46 లిక్విడ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మాణం చేపట్టిన తర్వాత 632 డీస్లడ్జింగ్ మిషన్స్ అందుబాటులోకి తీసుకొస్తామన్న అధికారులు ♦దీనికి సంబంధించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తీసుకురావాలన్న సీఎం. ♦13వేల గ్రామ పంచాయతీల్లో కూడా మురుగునీటిపారుదల వ్యవస్ధ ఉండేలా... రోడ్లమీద చెత్త, కాలువల్లో మురుగునీరు ఓవర్ప్లో కాకుండా సక్రమంగా నిర్వహణ చేపట్టాలి ♦ఇందుకు అవసరమైన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడంతో పాటు... దాన్ని సాధ్యమైనంత వేగంగా అమలు చేయాలన్న సీఎం ♦గ్రామసచివాలయంలో ఈ మొత్తం మురుగునీటి వ్యవస్ధ నిర్వహణతో పాటు ఆ సచివాలయ పరిధిలో ఉన్న స్కూళ్లలో బాత్రూమ్ల పర్యవేక్షణ కూడా పంచాయతీ సెక్రటరీకి బాధ్యతలు అప్పగించాలన్న సీఎం ♦స్కూల్స్లో హెడ్మాష్టారుతో పాటు పంచాయతీ సెక్రటరీ కూడా ఈ బాధ్యతలు తీసుకోవాలి ♦పాఠశాల విద్యాశాఖతో కూడా సమన్వయం చేసుకోవాలన్న సీఎం వేసవిలో తాగునీటి సరఫరాపైనా సీఎం సమీక్ష ♦నీటి ఎద్దడి ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్న అధికారులు ♦జూలై వరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామన్న అధికారులు ♦తాగునీటి కోసం తీసుకున్న శాశ్వత చర్యల వల్ల గతంలో పోల్చుకుంటే వేసవి నీటి ఎద్దడిని గణనీయంగా తగ్గించగలిగామన్న అధికారులు ♦తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సెలైనిటీ ప్రభావం, ఉద్దానంలో ప్లోరైడ్ ప్రభావం, వైయస్సార్ జిల్లాలో యురేనియం ప్రభావిత ప్రాంతాలతోపాటు ప్రకాశం, పల్నాడు, చిత్తూరు పశ్చిమ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్న సీఎం ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కోన శశిధర్, స్పెషల్ కమిషనర్ శాంతి ప్రియా పాండే, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ పి సంపత్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అవినీతి నిర్మూలన కోసం సీఎం జగన్ కీలక నిర్ణయం
-
సమగ్ర భూసర్వేతో ఏపీ ఒక దిక్సూచి కావాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: లంచాలకు, అవినీతికి తావులేకుండా సమగ్ర భూ సర్వే జరగాలని, ఈ విషయంలో దేశానికే రాష్ట్రం దిక్సూచిగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు & భూ రక్ష పథకంపై గురువారం క్యాంప్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా.. సమగ్ర సర్వేకు సంబంధించిన వివరాలను సీఎం జగన్కు అధికారులు అందించారు. అంతేకాదు సమగ్ర భూసర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డ్రోన్లను సీఎం జగన్ పరిశీలించారు. ఏప్రిల్ 5వ తేదీకల్లా భూ సర్వేకోసం 41 అత్యాధునిక డ్రోన్లు సర్వే పనుల్లో నిమగ్నమవుతాయని, వేగవంతంగా పనులు చేయడానికి మరో 20 డ్రోన్లను కూడా కొనుగోలు చేస్తున్నామని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ఆపై సీఎం జగన్ అధికారులతో.. వెబ్ల్యాండ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, అవినీతి.. లంచాలకు తావులేకుండా అత్యంత పారదర్శక పద్ధతుల్లో ఇది జరగాలని సీఎం వైఎస్ జగన్.. అధికారులకు సూచించారు. అనుసరించాల్సిన విధానాలు, ఎస్ఓపీలను తయారు చేయాలని, రికార్డులను ఎవ్వరూ మార్చలేని విధంగా, ట్యాంపర్ చేయలేని విధంగా రూపొందించాలని ఆదేశించారు. కేవలం ఎలక్ట్రానిక్ పద్ధతుల్లోనే కాకుండా, ఫిజికల్ రికార్డులు కూడా తయారుచేయాలని, ఆ ఫిజికల్ డాక్యుమెంట్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అధికారులతో చెప్పారు. సబ్ డివిజన్కోసం దరఖాస్తు పెట్టిన వెంటనే సర్వే జరిగేలా చూడాలన్న సీఎం జగన్.. అంతిమంగా సచివాలయాల స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగాలని స్పష్టం చేశారు. ► ఎక్కడైనా లంచాలు తీసుకుంటే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ► భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేయాలి. తద్వారా స్థానికంగా ఉన్న సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారం అవుతాయి. ► భూ యజమానులకు క్లియర్ టైటిల్స్ ఇచ్చేనాటికి.. దాదాపుగా వివాదాలు లేకుండా చూడాలి. ► న్యాయశాఖను కూడా ఈ ప్రక్రియలో భాగస్వామిగా చేయాలి. ► సమగ్రంగా ఓ రోడ్మ్యాప్ను కూడా తయారు చేయాలి. ► భూ సర్వే, రికార్డులు తదితర అంశాల్లో దేశానికి ఒక దిక్సూచిగా ఏపీ నిలవాలని సీఎం జగన్ ఆకాంక్ష. ► అందుకే సీనియర్ అధికారులను, సీనియర్ మంత్రులను ఇందులో భాగస్వాములుగా చేసినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ఇక మొత్తంగా భూ సర్వే కోసం 154 డ్రోన్లను వినియోగిస్తామన్న అధికారులు.. ఇప్పటివరకూ 1,441 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేసినట్లు సీఎం జగన్కు వివరించారు. వర్షాకాలం వచ్చేలోగా వీలైనంత మేర డ్రోన్ సర్వే నిర్వహించడానికి ఏర్పాటు చేసుకున్నామన్న అధికారులు.. రెవెన్యూ విలేజ్ చొప్పున సర్వే చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ► సర్వే ఫలితాలు పూర్తిగా అందేలా అదేసమయంలో రికార్డుల స్వఛ్చీకరణ. ► వెబ్ ల్యాండ్ అప్డేషన్, గ్రామ ల్యాండ్ రిజిస్టర్ అప్డేషన్, గ్రామ ఖాతా రిజిస్టర్, దీంతోపాటు జగనన్న భూ హక్కు పత్రం అందజేత. ► గ్రామ సచివాలయాల వారీగా.. భూ వివరాలను అప్డేషన్ చేయనున్న అధికారులు. ► తద్వారా.. గతంలో వెబ్ల్యాండ్ సందర్భంగా తలెత్తిన సమస్యలకు పరిష్కారం. ► 5,200 గ్రామాల్లో 2023 జులై నెలాఖరుకు, 5,700 గ్రామాల్లో 2023 ఆగస్టు నెలాఖరు కల్లా, సెప్టెంబరు నెలాఖరు నాటికి 6,460 గ్రామాల్లో సర్వే పూర్తిచేసి క్లియర్ టైటిల్స్ ఇచ్చేలా కార్యాచరణ పూర్తి. ► ఓఆర్ఐ (ఆర్థోరెక్టిఫైడ్ రాడార్ ఇమేజెస్) చిత్రాల ప్రక్రియ మొదటి విడత గ్రామాల్లో ఈ ఏడాది నవంబర్ నెలాఖరు నాటికి, రెండో విడత గ్రామాల్లో డిసెంబర్ నెలాఖరు నాటికి, మూడోవిడత గ్రామాల్లో జనవరి నెలాఖరు నాటికి పూర్తవుతాయని చెప్పిన అధికారులు. ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి(రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, సీసీఎల్ఏ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, రెవెన్యూశాఖ కమిషనర్ సిద్దార్ధ జైన్.. ఇతర అధికారులు హాజరయ్యారు. -
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక చర్యలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: నాబార్డ్ వార్షిక రుణ ప్రణాళికపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష చేపట్టారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నాబార్డ్ చైర్మన్ జీఆర్ చింతల, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, కోవిడ్ లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వ్యవసాయ రంగం మద్దతుగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో చేస్తున్న పలు కార్యక్రమాలకు నాబార్డ్, బ్యాంకులు సహాయపడుతున్నాయన్నారు. కోవిడ్ సమయంలో చాలా మంచి సహాయాన్ని అందించాయన్నారు. రైతు భరోసా, సున్నావడ్డీ రుణాలు, రైతులకు ఉచిత పంటల బీమా ఇవన్నీ అమలు చేస్తున్నామని సీఎం అన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. ►ఆర్బీకేల ద్వారా ఇ– క్రాప్చేసి, పారదర్శకంగా చేస్తున్నాం ► సాగుచేస్తున్న రైతులు నష్టపోతే ఆదుకుంటున్నాం ► రైతుకు విత్తనం నుంచి పంట విక్రయం వరకూ కూడా ఆర్బీకేలు చేదోడుగా నిలుస్తున్నాయి ► గ్రామ స్థాయిలో ఇ– క్రాపింగ్ చేస్తున్నాం ► వ్యవసాయ రంగంలో ఇది విప్లవాత్మక చర్య: ►గ్రామీణనియోజకవర్గాల స్థాయిలో అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు చేశాం ► ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో గణనీయంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం ►గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలు.. ల్లాంటివి ఏర్పాటు చేస్తున్నాం ►పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం ► దీనికి నాబార్డు సహాయ సహకారాలు కావాలి ► రైతులు చేస్తున్న ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడానికే ఈ కార్యక్రమాలన్నీ ►సహకార బ్యాంకులను, సొసైటీలను బలోపేతం చేస్తున్నాం ►పారదర్శక విధానాలను తీసుకు వస్తున్నాం ►ఆర్బీకేల్లో ఉన్న బ్యాంకింగ్ కరస్పాండెంట్లు బ్యాంకులు, సొసైటీలకు అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తారు ►దీనిపై బ్యాంకులతో కలిసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేయమని అధికారులకు ఇప్పటికే ఆదేశించాను ►ఫుడ్ ప్రాససింగ్, కేంద్ర సహకార బ్యాంకులు, సొసైటీల బలోపేతంపై దృష్టిపెట్టాం ► ఆర్బీకేల స్థాయిలో డ్రోన్లు తీసుకు వస్తాం ►వీటిని నిర్వహించే నైపుణ్యాలను గ్రామస్థాయిలోనే అభివృద్ధిచేస్తాం ►వ్యవసాయరంగంలో భవిష్యత్తు టెక్నాలజీపై దృష్టిపెడతాం ►16 కొత్త మెడికల్కాలేజీలను నిర్మిస్తున్నాం ►ఇప్పటికే ఉన్న 11 మెడికల్కాలేజీలను నాడు – నేడు కింద అభివృద్ధి చేస్తున్నాం ►స్కూళ్లను మెరుగుపరుస్తున్నాం ►నాణ్యమైన కనీస మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం ►ఇంగ్లిషు మీడియాన్ని ప్రవేశపెట్టాం.. ► పిల్లలకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా.. తెలుగు, ఇంగ్లిషు భాషల్లో పాఠ్య పుస్తకాలను ముద్రించాం ►భవిష్యత్తులో ఈ పిల్లలు మంచి నైపుణ్యం ఉన్న మానవ నరులుగా అభివృద్ధి చెందుతారు ►గ్రామస్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని... దాన్ని గ్రామీణ అర్థిక వ్యవస్థకు జోడించడంలో ఈ పిల్లలే ప్రధాన పాత్ర పోషిస్తారు ►అందుకనే నాణ్యమైన విద్యను అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాం ►ఫ్లోరోసిస్ లాంటి నీటి సమస్యతో చాలా గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి ►వీరికి రక్షిత తాగునీటి అందించే ప్రయత్నాలు ముమ్మరం చేశాం ►మత్స్యకారులు జీవనోపాధి కోసం గుజరాత్ లాంటి రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ►ఇలాంటి పరిస్థితులు లేకుండా రాష్ట్రంలో హార్బర్లు, పోర్టులు, ఫిష్ల్యాండింగ్ సెంటర్లను నెలకొల్పే పనులు ప్రారంభం అయ్యాయి ►రాయలసీమ ప్రాంతంలో కరువు నివారణ కోసం ప్రభుత్వం దృష్టిపెట్టింది ►ఎంపిక చేసిన ఈప్రాజెక్టులకు సకాలంలో పూర్తి చేయడానికి అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం చదవండి: గోదావరి గట్టెక్కింది -
అభివృద్ధికి సీఎం జగన్ పెద్దపీట
-
కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ కీలక సూచనలు
సాక్షి, హైదరాబాద్: విస్తరిస్తున్న కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు సూచించారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, స్వీయ నియంత్రణా చర్యలను పాటించాలని పేర్కొన్నారు. అయితే ప్రజలెవరూ భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని సీఎం తెలిపారు. ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ విధిగా వేయించుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశాఖతో పాటు రోడ్లు భవనాలు, ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయా శాఖల్లో జరుగుతున్న పనుల పురోగతిపై కేసీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ...ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ విధిగా వేయించుకోవాలని తెలిపారు. ఇప్పటికే 15 నుంచి 18 సంవత్సరాల వారికి వాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోందని, తల్లిదండ్రులు అశ్రద్ద చేయకుండా తమ పిల్లలకు వాక్సిన్ వేయించాలన్నారు. సోమవారం నుంచి 60 సంవత్సరాలు పైబడిన వయో వృద్ధులకు, ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్లకు (మూడో డోసు) బూస్టర్ డోసును ప్రారంభించనున్నామని తెలిపారు. వ్యాధి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలోని ప్రభుత్వ దవాఖానాకు వెళ్లి చికిత్స చేయించుకోవాలన్నారు. చదవండి: కరోనా ప్రమాద ఘంటికలు.. ప్రధాని నరేంద్రమోదీ కీలక భేటీ రాబోయే సంక్రాంతి నేపథ్యంలో గుంపులుగా కాకుండా ఎవరిండ్లల్లో వారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ జరుపుకోవాలని ప్రజలకు సీఎం సూచించారు. ఎటువంటి పరిస్థితులు తలెత్తినా కరోనాను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉందని సీఎం పునరుద్ఘాటించారు. ఇందుకు సంబంధించి వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులను, రాష్ట్రంలోని వైద్యారోగ్య పరిస్థితులు సహా కరోనా పరిస్థితులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఆక్సీజన్, పడకలు, మందుల లభ్యత తదితర ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. చదవండి: రైల్వే ప్రయాణికులకు షాక్.. భారీగా బాదుడు! సెక్రటేరియట్ పనులన్నీ సమాంతరంగా వేగంగా సాగాలి నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్దమవుతున్న రాష్ట్ర సచివాలయ భవన సముదాయం నిర్మాణ పనుల పురోగతి పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమైన పనులతో పాటు, లాండ్ స్కేపింగ్, సచివాలయంలో ఏర్పాటు చేయాల్సిన రక్షణ వ్యవస్థ, తదితర అనుబంధ భవనాల నిర్మాణ పనుల వేగాన్ని కూడా సమాంతరంగా పెంచాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి సీఎం సూచించారు. సచివాలయానికి పటిష్టమైన భధ్రతా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పోలీసు వారికి కావాల్సిన వసతులు తదితర అంశాల గురించి డీజీపీ మహేందర్ రెడ్డితో సంప్రదించి చర్యలు చేపట్టాలన్నారు. 24 గంటల నిఘా కోసం అధునాతన సాంకేతికతతో పోలీసు కమాండ్ కంట్రోల్ భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని సిఎం అన్నారు. ఈ సమావేశంలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణా రావు, రజత్ కుమార్ , వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఎఎం రిజ్వీతో పాటు సీఎంవో అధికారులు స్మితాసబర్వాల్, రాజశేఖర్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ అధికారులు శ్రీనివాస రావు, రమేశ్ రెడ్డి, గంగాధర్, చంద్రశేఖర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ అధికారులు ఇఎన్సీ గణపతి రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ , ఇరిగేషన్ శాఖ అధికారులు ఈఎన్సీ మురళీధర్ రావు, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ లు మురళీధర్, హరి రామ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్పాండే, ఎస్ ఇ కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. -
కోవిడ్పై ఈసీ సమీక్ష
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలకు అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ప్రమాదకరంగా పరిణమించిన కోవిడ్ పరిస్థితిపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సమీక్ష నిర్వహించింది. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ స్థితిగతులను ఈసీకి కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వివరించారు. ఆ 5 రాష్ట్రాల్లో కోవిడ్ టీకాకు అర్హులైన వారందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేయాల్సి ఉందని వారు ఈసీకి తెలిపారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా, ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవలతో ఈసీ చర్చలు జరిపింది. దేశంలో ప్రస్తుతమున్న కోవిడ్ పరిస్థితుల్లో ఆ రాష్ట్రాల్లో ఎన్నికల ర్యాలీలు, రోడ్షోలు ఆమోదయోగ్యం కాదని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ ఈసీకి వివరించారు. ఇలాంటి ఎన్నికల కార్యక్రమాలకు అనుమతిని ఇవ్వకపోవడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల షెడ్యూళ్లను ఈసీ త్వరలో ప్రకటించనుంది. కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో యూపీలో పార్టీ ఎన్నికల ర్యాలీలను రద్దుచేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం ప్రకటించింది. డిజిటల్ వేదికగా వర్చువల్ ర్యాలీలు మాత్రమే నిర్వహిస్తామని తెలిపింది. -
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కోవిడ్ నివారణ, వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటి సీఎం ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు, వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కోవిడ్ వల్ల తలెత్తే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొవడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేటు ఆస్పత్రులను కూడా కరోనా చికిత్సకు సిద్ధంగా ఉంచాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఫీవర్ సర్వే చేసే సమయంలోనే వ్యాక్సినేషన్ చేయించుకోనివారు ఎవరైనా ఉంటే.. వారందరికీ టీకాలు వేయాలని సీఎం సూచించారు. ప్రస్తుతం, ఏపీలో 6 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని అధికారులు సీఎంకు తెలిపారు. వారందరిని ప్రత్యేకంగా ఐసోలేషన్లో ఉంచినట్లు పేర్కొన్నారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని.. రాష్ట్రంలో కేసులు తక్కువగా ఉన్నా.. ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు కొనసాగుతున్నందున పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. టెస్ట్ ఎర్లీ, ట్రేస్ఎర్లీ, ట్రీట్ ఎర్లీ పద్ధతులలో పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి అదే విధంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, పరిశీలన పటిష్టంగా కొనసాగాలన్నారు. సచివాలయం స్థాయి నుంచి అధికారులు డేటాను తెప్పించుకోవాలని తెలిపారు. దీనిపై వచ్చే వారం మరోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షిద్దామని అధికారులతో సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రస్తుతం 13 జిల్లాల్లో 98.96 శాతం మొదటి డోస్ టీకాలు, 71.76 శాతం రెండో డోస్ టీకా వేసినట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. నెల్లూరు, విజయనగరం, ప్రకాశం, అనంతపురం, ప.గో, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో నూటికి నూరుశాతం మొదటి డోస్ను పూర్తి చేశారు. కడపలో 98.93, విశాఖపట్నం 98.04, గుంటూరు 97.58, తూ.గో 97.43, కృష్ణా 97.12, శ్రీకాకుళంలో 96.70 శాతం మేర మొదటి డోస్ వేశారు. కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోస్ ప్రకటన నేపథ్యంలో అన్నిరకాలుగా సిద్ధం కావాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. బూస్టర్డోస్లపై ప్రత్యేక దృష్టి పెట్టండి ఫ్రంట్లైన్ వర్కర్స్తోపాటు దీర్ఘకాలిక వ్యాధులున్నవారిపైన, వృద్ధులపైన బూస్టర్డోస్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం సూచించారు. 15 నుంచి 18 ఏళ్లవారితో కలుపుకుని దాదాపు 75 లక్షల మందికి బూస్టర్ డోస్ అవసరమున్నట్లు ప్రాథమికంగా అంచనావేశామని అధికారులు తెలిపారు. ఆర్టీపీసీఆర్ పద్ధతిలోనే కోవిడ్ గుర్తించే పరీక్షలు చేయాలని, విదేశాల నుంచి వచ్చేవారికి పరీక్షలతో పాటు వారిని ట్రేస్ చేయాలని సీఎం అధికారులకు సూచించారు. పర్యాటకులను రెగ్యులర్గా పరీక్షలు జరపాలన్న సీఎం జగన్.. పాజిటివ్ అని తేలితే ప్రైమరీ కాంటాక్ట్స్ను కూడా వెంటనే ట్రెసింగ్ చేయాలన్నారు. అదే విధంగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు – నేడు పనుల ప్రగతిని సీఎం జగన్ సమీక్షించారు. రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాల పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇవి పూర్తికాగానే అత్యాధునిక వసతి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో.. మెడికల్ సీట్లు పెరగడమే కాదు.. మంచి వైద్యం కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం పనులను ముందుకు తీసుకెళ్లాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఒకవైపు నాడు–నేడు ద్వారా ఇప్పుడున్న ఆస్పత్రులను ఆధునీకరించడం, ఇప్పటికే ఉన్న 11 బోధనాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతోపాటు, ఈ కొత్త మెడికల్కాలేజీల నిర్మాణాలనూ ముందుకు తీసుకెళ్లాలని సీఎం అధికారులను సూచించారు. మెడికల్ హబ్స్ ఏర్పాటు ప్రగతిపైనా అధికారులతో చర్చించారు. వీలైనంత త్వరగా ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రైవేటు రంగంలో కూడా అత్యాధునిక వైద్య సదుపాయాలు రావాలన్నదే ఈ హబ్స్ ముఖ్య ఉద్దేశమని సీఎం జగన్ పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ఆస్పత్రిలో అవసరమైన సిబ్బందిని కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకోవాలని సీఎం జగన్ అధికారులను సూచించారు. -
దేశంలో కొవిడ్ పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష
-
ఆర్థిక శాఖ అధికారులతో ఇన్ఫోసిస్ చీఫ్ భేటీ
న్యూఢిల్లీ: కొత్త ఆదాయపు పన్ను పోర్టల్ పనితీరు ఎలా ఉందన్న అంశంపై రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ ఇతర సీనియర్ అధికారులు ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ పరేఖ్తో గురువారం ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పోర్టల్ ద్వారా 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 3.5 కోట్ల మందికిపైగా పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేసినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇన్ఫోసిస్ అభివృద్ధి చెందిన పోర్టల్’ www.incometax.gov.in పనితీరులో తొలినాళ్లలో తీవ్ర అవాంతరాలు నెలకొనడం తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. పోర్టల్ అభివృద్ధికి 2019లో ఇన్ఫోసిస్కు కేంద్ర రూ.4,242 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది. 2019 జనవరి నుంచి 2021 జూన్ మధ్య రూ.164.5 కోట్లు చెల్లించింది. కాగా, 2020– 21 ఐటీఆర్ ఫైలింగ్కు తుది గడువు డిసెంబర్ 31. -
వర్షాల కారణంగా మృతి చెందిన వారికి రూ.5 లక్షలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: భారీ వర్షాల కారణంగా ఏపీలోని పలు జిల్లాలు అతాలకుతలం అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్షాలపై ఐదు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులతో చర్చించారు. (చదవండి: ఎక్కడా రాజీపడొద్దు.. నిరంతరం అందుబాటులో ఉంటా: సీఎం జగన్) వరద సహాయక చర్యలను పర్యవేక్షించడానికి మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు సీఎం జగన్. నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. వీరు జిల్లాలో నెలకొన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం జగన్కు నివేదిస్తారు. (చదవండి: రేణిగుంట ఎయిర్పోర్ట్లో భారీగా వరద.. విమానాల ల్యాండింగ్ నిలిపివేత) వరద సహాయక చర్యలను పర్యవేక్షించడానికిగాను నెల్లూరు జిల్లాకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజేశేఖర్.. చిత్తూరు జిల్లాకు మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న.. వైఎస్ఆర్ జిల్లాకు సీనియర్ అధికారి శశిభూషణ్ కుమార్ను నియమించారు. వారు ఇప్పటికే చేరుకున్నారని అధికారులు సీఎం జగన్కు తెలిపారు. ‘‘ముంపు బాధితులను కూడా వెంటనే సహాయక కేంద్రాలకు తరలించాం. వరదలో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ల ద్వారా తరలించే చర్యలు కూడా చేపట్టాం. సహాయక కార్యక్రమాల్లో ఎక్కడా రాజీలేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ఆయా జిల్లాలకు అదనంగా నిధులు కూడా ఇచ్చాం’’ అని అధికారులు సీఎం జగన్కు తెలిపారు. తర్వాత జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు సీఎం జగన్. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్, స్పెషల్ ఆఫీసర్ ప్రద్యుమ్న జిల్లాలోని పరిస్థితులను వివరించారు. ఈ సదర్భంగా సీఎం జగన్.. తిరుపతిలో వరదనీరు నిల్వ ఉండిపోవడానికి కారణాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. చెరువుల పూడ్చివేత వల్ల ఇది జరిగిందని అధికారులు తెలపడంతో.. దీనిపై తగిన కార్యచరణసిద్ధం చేయాలని.. బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందని తెలిపారు. బాధితులకు నాణ్యమైన సేవలు అందించాలని.. మంచి భోజనం, తాగునీరు అందించాలని.. వర్షాల తర్వాత కూడా వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులకు సహాయంగా నిలవాలని సీఎం జగన్ తెలిపారు. రైళ్లు, విమానాలు రద్దైన నేపథ్యంలో వారికి అన్నిరకాలుగా తోడుగా ఉండాలన్నారు. ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో భక్తులు కిందకు రాకుండా పైనే ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. కనీసం ఒకటి, రెండు రోజులు వారికి తగిన వసతులు సమకూర్చాలని తెలిపారు. టీటీడీ అధికారులను సమన్వయం చేసుకుని యాత్రికులకు సహాయంగా నిలవాలన్నారు. తిరుపతినగరంలో మున్సిపాల్టీ సహా, ఇతర సిబ్బందిని కూడా వినియోగించి పారిశుధ్యం పనులు చేపట్టాలని.. అవసరమైతే ఇతర మున్సిపాల్టీలనుంచి సిబ్బందిని తీసుకు వచ్చి ఆపరేషన్ చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. వైఎస్సార్ జిల్లాలో.. వైఎస్సార్ జిల్లాలో పరిస్థితులను వివరించారు కలెక్టర్ విజయరామరాజు. ఈ క్రమంలో గండ్లుపడ్డ చెరువుల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు సీఎం జగన్. రోడ్లకు గండ్లు కారణంగా ఎక్కడ రవాణా స్తంభించినా... నీరు తగ్గగానే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ పునరుద్ధరణపైనా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. వరదనీరు తగ్గగానే పంట నష్టంపై అధికారులు ఎన్యుమరేషన్ ప్రారంభించాలని సీఎం జగన్ సూచించారు. నెల్లూరు జిల్లాలో.. నెల్లూరు జిల్లాలో పరిస్థితులను వివరించారు కలెక్టర్ చక్రధర్. సోమశిలకు భారీగా వరద నీరు వస్తోందని తెలిపారు. ఈ క్రమంలో సమగ్ర వ్యూహంతో ముందుకు వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారు. పైనుంచి వరదను, డ్యాంలో ప్రస్తుతం ఉన్ననీటిని అంచనా వేసుకుని ఆమేరకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులను సమన్వయం చేసుకుని వరదనీటి విడుదలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఎక్కడెక్కడ ముంపు ఉండే అవకాశాలు ఉన్నాయో.. ఆయా ప్రాంతాల్లో సహాయక కేంద్రాలను తెరవాలని సీఎం జగన్ ఆదేశించారు. అనంతపురంలో.. అనంతపురంలో భారీ వర్షాల పరిస్థితిని వివరించారు కలెక్టర్ నాగలక్ష్మి. అలానే బాధిత జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్లపై వివరాలను ప్రిన్సిపల్ సెక్రటరీలు కృష్ణబాబు, ద్వివేది అందించారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతాల్లో రోడ్ల పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే తాగునీటి వనరులు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎప్పటికప్పుడు పరీక్షలు చేసి... తాగునీటి నాణ్యతను తెలుసుకోవాలని, వ్యాధులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుధ్యంపైనకూడా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ‘‘ఎక్కడెక్కడ పంట నష్టపోయిందీ వివరాలు తయారు చేయాలి. వీలైనంత త్వరగా వారికి పరిహారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. నష్టాన్ని నమోదు చేసినప్పుడు కాస్త ఉదారతతో ఉండాలి. మళ్లీ పంటవేసుకునేందుకు రైతులకు విత్తనాలు సరఫరా చేయాలి. వర్షాల కారణంగా దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.5 లక్షల పరిహారం వీలైనంత త్వరగా అందించాలి. జిల్లాల్లో కాల్సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలి. వచ్చే వినతులపై తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎలాంటి సహాయం కావాలన్న యుద్ధప్రాతిపదికన సమకూరుస్తాం’’ అని సీఎం జగన్ తెలిపారు. నెల్లూరులో సహాయక చర్యల పర్యవేక్షణకు నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ను పంపిస్తున్నామని.. కడపజిల్లాల్లో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఇప్పటికే సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని సీఎం జగన్ తెలిపారు. చదవండి: తిరుపతి విల విల -
రోడ్ల మరమ్మత్తులు, పునరుద్ధరణపై సీఎం జగన్ సమీక్ష
-
హుజురాబాద్ ఓటమిపై ఏఐసీసీ సమీక్ష
-
వైద్యారోగ్య శాఖపై మంత్రి హరీష్ సమీక్ష.. కీలక నిర్ణయాలు
-
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి: సీఎం జగన్
-
ఒడిశా సీఎంతో చర్చించాల్సిన అంశాలపై సీఎం జగన్ సమీక్ష
అమరావతి: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో మంగళవారం చర్చల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం జగన్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కాగా రేపు (09-11-2021) సీఎం జగన్ భువనేశ్వర్ వెళ్లనున్నారు. ఉభయరాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై మంగళవారం సాయంత్రం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో చర్చలు జరపనున్నారు. ఈ సందర్భంగా మూడు అంశాలపై ఒడిశా సీఎంతో సీఎం జగన్ చర్చించనున్నారు. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు, కొఠియా గ్రామాల అంశాలపై చర్చించనున్నారు. చదవండి: AP: విద్యార్థులకు ‘పద సంపద’ వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణం ► నేరడి బ్యారేజీ కారణంగా ఉభయ రాష్ట్రాలకూ కలగనున్న ప్రయోజనాలను సీఎం జగన్ వివరించనున్నారు. ► బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా వైపునుంచి 103 ఎకరాలు అవసరమని ఇందులో 67 ఎకరాలు రివర్బెడ్ ప్రాంతమేనని అధికారులు తెలిపారు. ► బ్యారేజీ నిర్మాణం వల్ల ఒడిశావైపు కూడా సుమారు 5–6 వేల ఎకరాలకు తక్షణమే సాగునీరు అందుతుందని అధికారులు తెలిపారు. చదవండి: బీజేపీ నేతలు నీతులు చెప్పడం విడ్డూరం: పేర్ని నాని జంఝావతి ప్రాజెక్టు అంశం ► ప్రస్తుతం రబ్బర్ డ్యాం ఆధారంగా సాగునీరు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. ► 24,640 ఎకరాల్లో కేవలం 5 వేల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలుగుతున్నామని, ప్రాజెక్టు పూర్తిచేస్తే రైతులకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని పేర్కొన్నారు ► ప్రాజెక్టును పూర్తిచేస్తే ఒడిశాలో 4 గ్రామాలు పూర్తిగా, పాక్షికంగా 6 గ్రామాలు ముంపునకు గురవుతాయని అధికారులు పేర్కొన్నారు. ► ఒడిశాలో దాదాపు 1174 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని తెలిపిన అధికారులు.ఇందులో 875 ఎకరాలు ప్రభుత్వ భూమేనని పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్అండ్ఆర్కు సహకరించాలని ఏపీ ఒడిశాను కోరనుంది. ► కొఠియా గ్రామాల వివాదానికి సంబంధించిన మొత్తం వివరాలను అధికారులు సీఎం ముందు ఉంచారు. ► కొఠియా గ్రామాల్లో ఇటీవల పరిణామాలను వివరించారు. ► 21 గ్రామాల్లో 16 గ్రామాలు ఏపీతోనే ఉంటామంటూ తీర్మానాలు చేసి ఇచ్చారని విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి సీఎంకు వివరించారు. ► ఇటీవల ఆయా గ్రామాల్లో ఎన్నికలు కూడా నిర్వహించామని సమావేశంలో అధికారులు పేర్కొన్నారు. ►కొఠియా గ్రామాల్లో దాదాపు 87శాతానికి పైగా గిరిజనులు ఉన్నారని, వారికి సేవలు అందించే విషయంలో అవాంతరాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని సమావేశంలో అధికారులు ప్రస్తావించారు. ఈ సమావేశంలో సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, జలవనరులశాఖ ఈఎన్సి సి నారాయణరెడ్డి, విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ సూర్య కుమారి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అధికారులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలి: మంత్రి అవంతి
విశాఖ: పాడేరు ఐటీడీఏ పరిధిలో అభివృద్ధి పనులపై మంత్రి అవంతి శ్రీనివాస్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సచివాలయాలు, ఆర్బీకేల నిర్మాణాలకు త్వరలో బిల్లులు మంజురు చేస్తామని మంత్రి అవంతి పేర్కొన్నారు. ఏజెన్సీలో ప్రతి గ్రామానికి రోడ్డు,విద్యుత్,తాగునీటి సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. అధికారులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అదే విధంగా.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ రావు తెలిపారు. -
పోలీసు వ్యవస్థపై రాజకీయ విమర్శలు చేయడం తగదు: డీజీపీ గౌతమ్ సవాంగ్
-
విద్యపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
-
ప్రమాణాలు లేని కాలేజీలకు అనుమతులు ఇవ్వొద్దు: సీఎం జగన్
-
గంజాయి అక్రమసాగు వినియోగంపై ఉక్కుపాదం: సీఎం కేసీఆర్
-
కరెంట్ కోతల్లేకుండా చర్యలు: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గు కొరత నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం థర్మల్ విద్యుత్ కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలోని వివిధ థర్మల్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై ఆయన చర్చించారు. దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నా దానిని తెప్పించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, కావాల్సిన బొగ్గు కొనుగోలు చేయాలని, ఇందుకు ఎలాంటి నిధుల కొరతలేదని సీఎం స్పష్టంచేశారు. ఇప్పుడున్న థర్మల్ ప్లాంట్ల సామర్థ్యం మేరకు ఉత్పత్తిని పెంచాలని ఆదేశించారు. కృష్ణపట్నం, ఎన్టీటీపీఎస్ల్లోని కొత్త యూనిట్లలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించాలని, తద్వారా 1,600 మెగావాట్ల విద్యుత్ను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అలాగే.. సింగరేణి సంస్థతో కూడా సమన్వయం చేసుకుని అవసరాల మేరకు బొగ్గును తెప్పించుకోవాలని ఆయన సూచించారు. కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా ప్రమాదంలో 112 థర్మల్ కేంద్రాలు ఇక బొగ్గు కొరతతో దేశంలోని 135 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 112 కేంద్రాలు ప్రమాదంలో పడ్డాయి. ఇందులో 17 ప్లాంట్లు ఇప్పటికే ఉత్పత్తి నిలిపివేయగా, 27 ప్లాంట్లలో ఒకరోజు, 20 ప్లాంట్లలో రెండు రోజులు, 14 ప్లాంట్లలో మూడు, మరో 14 ప్లాంట్లలో నాలుగు, 12 ప్లాంట్లలో ఐదు, ఏడు ప్లాంట్లలో ఆరు, ఒక ప్లాంటులో ఏడు రోజులకు మాత్రమే సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. దీంతో థర్మల్ ప్లాంట్లను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరోవైపు.. బొగ్గు కొరత కారణంగా కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) విద్యుత్ సంస్థలకు మినహా మిగిలిన అందరికీ బొగ్గు సరఫరాను పూర్తిగా నిలిపేసింది. అయితే, ఇది తాత్కాలికమేనని, నిల్వలు మామూలు స్థాయికి వచ్చేవరకూ ప్రాధాన్యాన్ని బట్టి సరఫరా చేయాలన్నది కంపెనీ నిర్ణయమని అధికార వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. అలాగే.. విద్యుత్ ప్లాంట్లు మినహా మిగిలిన ఏ ఇతర సంస్థల్నీ బొగ్గు ఈ–ఆక్షన్లోకి కూడా అనుమతించవద్దని కోల్ ఇండియా తన అనుబంధ సంస్థలకు గురువారం ఆదేశాలిచ్చింది. మరోవైపు.. దసరా తర్వాత కార్మికులు సెలవుల నుండి తిరిగి రాగానే ఉత్పత్తిని పెంచాలని సీఐఎల్ భావిస్తోంది. ఏపీలో బొగ్గు నిల్వలు మెరుగు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ బుధవారం నాటి రోజువారీ బొగ్గు నిల్వల నివేదిక ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (కృష్ణపట్నం)లో 65,400 మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఇది ఐదు రోజుల వరకూ సరిపోతుంది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో 20,900 మెట్రిక్ టన్నులు ఉంది. ఇది ఒక రోజుకు వస్తుంది. రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్కి 75,700 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉండటంతో ఇది కూడా ఐదు రోజులు విద్యుత్ ఉత్పత్తికి సరిపోతుంది. సింహాద్రిలో ఉన్న 21,300 మెట్రిక్ టన్నుల బొగ్గు ఒక రోజుకు ఉపయోగపడుతుంది. అయితే, మంగళవారంతో పోలిస్తే బుధవారానికి రాష్ట్రంలో బొగ్గు నిల్వలు కొంతమేర పెరిగాయి. ఇక రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు పనిచేయాలంటే రోజుకి 42 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా.. బుధవారం 14 ర్యాకులలో 53,245 మెట్రిక్ టన్నుల బొగ్గు సరఫరా అయ్యిందని ఇంధన శాఖ అధికారులు వెల్లడించారు. పూర్తిస్థాయిలో జలవిద్యుత్ వినియోగం మరోవైపు.. జల విద్యుత్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టింది. దీంతో జెన్కోకు జల విద్యుత్ ప్రాజెక్టుల నుంచి రోజూ 25 మిలియన్ యూనిట్ల విద్యుత్ వస్తోంది. శ్రీశైలం కుడిగట్టు కాలువపై 770 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఏడు యూనిట్ల ద్వారా 15 మిలియన్ యూనిట్లు, సీలేరు నుంచి 8 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నారు. మిగతా కేంద్రాల నుంచి మరో రెండు మిలియన్ యూనిట్లు ఉత్పత్తి జరుగుతోంది. మొత్తం మీద రాష్ట్రంలో ప్రస్తుతం 185 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. కేవలం 3.34 మిలియన్ యూనిట్ల మేర మాత్రమే లోటు ఏర్పడింది. -
భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. గులాబ్ తుపాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురుస్తాయని, ఈ పరిస్థితుల్లో ఏవిధమైన, ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ సోమేష్ కుమార్కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్....! రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మరోసారి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో సీఎస్తో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాలో రెవెన్యూ, పోలీస్, పంచాయితీ రాజ్, నీటిపారుదల, ఫైర్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ప్రాణ ఆస్తి నష్టం కలుగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. అవసరమైతే, హైదరాబాద్, కొత్తగూడెం, వరంగల్లో ఉన్న ఎన్.డీ.ఆర్.ఎఫ్ బృందాలను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రతీ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాలైన లోతట్టు ప్రాంతాలు , చెరువులు, కుంటలు, బ్రిడ్జి ల వద్ద ప్రత్యేకంగా అధికారులను నియమించి పరిస్థితులను సమీక్షించాలని అన్నారు. డీజీపీ ఎమ్. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్లతో సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమీషనర్లు, ఎస్.పిలని ఆదేశించామని తెలిపారు. ఈ మేరకు పోలీస్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగిందని అన్నారు. చదవండి: Gulab Cyclone: తెలంగాణలో భారీ వర్షాలు -
హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలి: మంత్రి కేటీఆర్
-
అక్రమ మద్యం తయారీపై ఉక్కుపాదం: సీఎం జగన్
-
గట్టెక్కించండి.. మరో మార్గం లేదు..
రూ.3 వేల కోట్లు కోల్పోయాం.. గత ఏడాదిన్నరగా డీజిల్ ధర లీటర్పై రూ.22 మేర పెరిగింది. దీంతో రూ.550 కోట్ల అదనపు భారం పడింది. విడిభాగాల ధరలూ బాగా పెరిగాయి. దీంతో సాలీనా రూ.600 కోట్ల భారం పెరిగింది. కరోనా లాక్డౌన్లతో మొత్తంగా రూ. 3 వేల కోట్ల ఆదాయాన్ని సంస్థ కోల్పోయింది. –ఆర్టీసీ అధికారులు తీవ్ర నష్టాలు వచ్చాయి విద్యుత్ సంస్థలు కూడా కోవిడ్ ప్రభావానికి గురై తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. రాష్ట్రంలో ఆరేళ్లుగా కరెంటు చార్జీలు పెంచలేదు. విద్యుత్ శాఖను గట్టెక్కించేందుకు చార్జీలు పెంచాలి. – విద్యుత్ అధికారులు ఆదాయంపై దృష్టి పెట్టండి.. ఎంతసేపూ సిటీ బస్సుల నష్టాలు, పల్లె వెలుగు కష్టాల గురించి మాట్లాడకుండా.. ఆదాయాన్ని తెచ్చిపెట్టే దూరప్రాంత సర్వీసులపై దృష్టి సారించాలి. సంస్థను గాడిలో పెట్టాల్సిన బాధ్యత కొత్త ఎండీ సజ్జనార్పై ఉంది. ఆయనకు అధికారులు పూర్తి సహాయసహకారాలు అందించాలి. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: విద్యుత్, ఆర్టీసీ బస్సు చార్జీలను త్వరలో రాష్ట్ర ప్రభుత్వం పెంచనుంది. కోవిడ్తో ఈ రెండు విభాగాలు బాగా దెబ్బతిని తీవ్ర నష్టాలు వాటిల్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్లో ఆ సేవలు ప్రజలకు సాఫీగా అందాలంటే చార్జీలు తక్షణం పెంచాల్సిన అవసరం ఉందని విద్యుత్, ఆర్టీసీ అధికారులు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు దృష్టికి తెచ్చారు. కోవిడ్ తర్వాత పరిస్థితులు, వాటితో సంస్థలకు వాటిల్లిన నష్టాలను ఆయనకు వివరించారు. దీంతో చార్జీల పెంపు ఎంతవరకు ఉండొచ్చో.. రెండుమూడు ప్రతిపాదనలను వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి అందిస్తే, ఆ భేటీలో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. మంగళవారం ప్రగతి భవన్లో ఆర్టీసీ, విద్యుత్ విభాగాల అధికారులతో కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్షించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయేవరకు ఆయన చర్చించారు. సాలీనా రూ.600 కోట్ల భారం... తొలుత ఆర్టీసీపై సీఎం సమీక్షించారు. రాష్ట్రంలోని 97 డిపోలు నష్టాల్లో కూరుకుపోయాయని సమావేశంలో అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఇలాంటి తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో సంస్థ మనుగడ సాగాలంటే ఇప్పటికిప్పుడు బస్సు చార్జీలు పెంచుకోవాల్సిన పరిస్థితి తప్ప గత్యంతరం లేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. డీజిల్ ధర లీటర్కు రూ.65 ఉన్నప్పుడు 2019, డిసెంబర్లో చార్జీలు పెంచామని, ఆ తర్వాత పెంచలేదని, ప్రస్తుతం లీటరు డీజిల్ ధరల రూ.100కు చేరువైందని లెక్కలు ముందుంచి వివరించారు. గతేడాది మార్చిలోనే ఆర్టీసీ చార్జీలు పెంచనున్నట్లు ప్రభుత్వం అసెంబ్లీలోనే ప్రకటించిందని, అయితే కోవిడ్ కారణంగా ప్రజల సమస్యలను గుర్తించి వారిపై భారం మోపొద్దన్న ఉద్దేశంతో పెంచలేదని మంత్రి అజయ్కుమార్, అధికారులు వెల్లడించారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఉద్యోగుల సంక్షేమానికి ఇబ్బంది రాకుండా చూసుకుంటూనే ఆర్టీసీని పటిష్ట పరిచే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చార్జీలు పెంచుకునేందుకు అనుమతిస్తే కోవిడ్ నష్టం, డీజిల్ భారం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆర్టీసీని పరిరక్షించడం, దాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని కేసీఆర్ అన్నారు. చార్జీల పెంపు ప్రతిపాదనలను వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి అందించాలని సూచించారు. విద్యుత్తు చార్జీలు కూడా.. సమావేశం ముగిసే సమయంలో విద్యుత్ మంత్రి జగదీశ్రెడ్డి, జెన్కో, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్రావు.. విద్యుత్ అంశాన్ని సీఎం దృష్టికి తెచ్చారు. ఆర్టీసీ తరహాలో విద్యుత్ సంస్థలు కూడా కోవిడ్ ప్రభావానికి గురై తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరేళ్లుగా కరెంటు చార్జీలు పెంచలేదని, విద్యుత్ శాఖను గట్టెక్కించేందుకు చార్జీలు పెంచాలని వారు సీఎంను కోరారు. వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి విద్యుత్ బిల్లుల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు అందించాలని సీఎం వారికి సూచించారు. ఈ సమీక్షలో ఇందులో మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్కుమార్, జగదీశ్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, కార్యదర్శి రాజశేఖరరెడ్డి, రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, జెన్కో అండ్ ట్రాన్స్కో సీఎండీ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
వన్టైం సెటిల్మెంట్ పథకం అమలుకు సీఎం జగన్ ఆదేశం
-
వన్టైం సెటిల్మెంట్ పథకం అమలుకు సీఎం జగన్ ఆదేశం
సాక్షి, అమరావతి: గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వన్టైం సెటిల్మెంట్ స్కీంపై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకున్న వారికి వన్టైం సెటిల్మెంట్ పథకం వర్తిస్తుంది. జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంగా పేరు ఖరారు చేసిన అధికారులు.. పథకం అమలు కోసం రూపొందించిన విధి విధానాలపై సమావేశంలో చర్చించారు. ప్రతిపాదనలను సీఎంకు అధికారులు వివరించారు. (చదవండి: ఈ ఫలితాలు నా బాధ్యతను మరింత పెంచాయి: సీఎం జగన్) సెప్టెంబరు 25 నుంచి డేటాను ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అప్లోడ్ చేయనుంది. వివిధ సచివాలయాలకు ఈ డేటాను పంపనున్నారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే వన్టైం సెటిల్మెంట్ పథకం సొమ్మను చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒన్టైం సెటిల్మెంట్కు అర్హులైన వారి జాబితాలు ఖరారైన తర్వాత నిర్దేశిత రుసుము చెల్లింపుతో వారికి ఇంటిపైన, స్థలాలపైన పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. వన్టైం సెటిల్మెంట్ స్కీంకు మంచి స్పందన వస్తోందని సీఎంకు అధికారులు తెలిపారు. ఓటీఎస్ పథకం అమలుకు గ్రామ, వార్డు సచివాలయాలు పాయింట్గా ఉండాలని సీఎం వైఎస్ జగన్ అన్నారు. పేదలందరికీ ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సీఎం సమీక్ష ►ఇప్పటివరకూ గ్రౌండ్ అయిన ఇళ్లు 10.31 లక్షలు ►ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం ►ఈమేరకు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలన్న సీఎం ►లబ్ధిదారులు ఎంచుకున్న ఆప్షన్ 3 కింద ప్రభుత్వమే కట్టించనున్న ఇళ్ల నిర్మాణ పనులు అక్టోబరు 25 నుంచి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం ►ఈ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులు, మేస్త్రీలతో కలిపి 18వేలకుపైగా గ్రూపులను ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడి ►ఖర్చులు తగ్గించుకునే విధానాల్లో భాగంగా ఇళ్లనిర్మాణం జరుగుతున్న లే అవుట్ల వద్దే ఇటుక తయారీ యూనిట్లను ప్రోత్సహిస్తున్నామన్న అధికారులు ►దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తున్నాయన్న అధికారులు ►మిగిలిన నిర్మాణ సామగ్రి ధరలను, ఖర్చులను అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం జగనన్న కాలనీల్లో మౌలికసదుపాయాల కల్పనపైనా సీఎం సమీక్ష ►కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై డీపీఆర్లు సిద్ధంచేశామన్న అధికారులు ►కాలనీ ఒక యూనిట్గా పనులు అప్పగించాలన్న సీఎం ►టిడ్కో ఇళ్లపైనా సమీక్ష నిర్వహించిన సీఎం ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ఏపీఎస్హెచ్సీఎల్ ఛైర్మన్ దవులూరి దొరబాబు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, రెవెన్యూశాఖ (భూములు) ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సెక్రటరీ రాహుల్ పాండే, ఏపీఎస్హెచ్సీఎల్ ఎండీ ఎన్ భరత్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: పంచాయతీ, మునిసిపల్ను మించి జైత్రయాత్ర -
ఆన్లైన్ టికెట్ విధానంపై మంత్రి పేర్ని నాని సమీక్ష
-
ఆన్లైన్ టికెట్ విధానంపై మంత్రి పేర్ని నాని సమీక్ష
విజయవాడ: ఆన్లైన్ పద్దతిలో సినిమా టికెక్టు అమ్మాలనే ప్రక్రియ 2002 నుంచి ఉందని సమాచారశాఖ మంత్రి పేర్నినాని అన్నారు. ఇందులో భాగంగా సినీ పరిశ్రమకు చెందిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల్ని ప్రభుత్వం నేడు చర్చకు పిలిచిందన్నారు. ఆన్లైన్ టికెట్ విధానంపై విజయవాడలో మంత్రి పేర్ని నాని సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులతోపాటు దిల్ రాజు, డీఎన్వీ ప్రసాద్, ఆది శేషగిరి రావు, డీవీవీ దానయ్య హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఆన్లైన్ టికెట్ వ్యవస్థ, కరోనా వలన సిని పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఎగ్జిబిటర్ల సమస్యలు, నిర్మాతల సమస్యలు అన్నింటిని ప్రభుత్వం తరపున తాము నమోదు చేసుకున్నామని తెలిపారు. త్వరలోనే సినీ పరిశ్రమ సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించిన తర్వాత పరిష్కారం తీసుకుంటామన్నారు. ఆన్లైన్ టికెట్ వ్యవస్థ కు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రతినిధులు సానుకూలంగా ఉన్నారని, మళ్ళీ ఇంకోసారి సినిమా ప్రతినిధులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు సమావేశం అవుదామని తెలిపినట్లు పేర్కొన్నారు. సీఎం జగన్ ఎప్పుడు కూడా సాధారణ ప్రేక్షకులకు వినోదం అందుబాటులో ఉంచేలా చేస్తారని వెల్లడించారు. చదవండి: Youngest MPTC: చిన్న వయసులోనే.. ‘ఎంపీటీసీ’! -
భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనంపై నెలకొన్న గందరగోళం....
హైదరాబాద్: భాగ్యనగరంలోని హుస్సేన్ సాగర్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయడానికి హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నిమజ్జనంపై సమాలోచనలు చేస్తోంది. కాగా, గణేష్ నిమజ్జనంపై పోలీసుశాఖలో అయోమయం నెలకొంది. గణేష్ నిమజ్జనంపై నిన్న(సోమవారం) సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. నిమజ్జనంపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హైకోర్టు తీర్పుపై అధికారులతో చర్చించారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం నిమజ్జనానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రతి ఏడాది మాదిరిగానే.. ట్యాంక్బండ్లోనే గణేష్ నిమజ్జనం చేస్తామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఇది వరకే ప్రకటించారు. ఇప్పటికే ట్యాంక్ బండ్లో నిమజ్జనం ఏర్పాట్లను అధికారులు ప్రారంభించారు. పోలీసులు నిమజ్జనంకు వచ్చే విగ్రహాలను అడ్డుకుంటే రోడ్డు మీదనే నిరసన వ్యక్తం చేస్తామని ఉత్సవ సమితి హెచ్చరించింది. చదవండి: హుస్సేన్సాగర్లో ‘నిమజ్జనం’పై సుప్రీంకు.. చదవండి: TS High Court:హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేయాలని పురాణాల్లో చెప్పారా? -
ప్రగతిభవన్లో దళితబంధు పథకం అమలుపై కేసీఆర్ సమీక్ష
-
మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నింటినీ బాగుచేయాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రోడ్లు, పోర్టులు, ఎయిర్పోర్ట్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష చేపట్టారు. ఆర్అండ్బి, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖలపై సీఎం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘అక్టోబరు మాసానికల్లా వర్షాలు తగ్గుముఖం పడతాయి. తర్వాత పనుల కాలం మొదలవుతుంది. ముందుగా రోడ్లను బాగుచేయడంపై దృష్టిపెట్టండి. మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నింటినీ బాగుచేయాలి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాం. గత ప్రభుత్వంలో రోడ్లను పూర్తిగా విడిచిపెట్టారు’’ అని పేర్కొన్నారు. ‘‘మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాదీ వర్షాలు మంచిగా పడ్డాయి. దేవుడి దయవల్ల వర్షాలు బాగా పడ్డం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారు. వర్షాలు పడ్డం వల్ల మరోవైపు రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. రోడ్లను బాగుచేయడనికి ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. వనరుల సమీకరణలో అనేక చర్యలు తీసుకుంది. ఒక నిధిని కూడా ఏర్పాటు చేసింది’’ అని సీఎం జగన్ తెలిపారు. ‘‘దురదృష్టవశాత్తూ ఒక్క చంద్రబాబుతోనే కాదు పచ్చమీడియాతో మనం యుద్ధం చేస్తున్నాం. ముఖ్యమంత్రి పీఠంలో చంద్రబాబు లేకపోవడంతో వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే ప్రతి విషయంలో వక్రీకరణలు చేస్తున్నారు. ఇవన్నీ ఉన్నాకూడా, నెగెటివ్ ఉద్దేశంతో ప్రచారం చేసినా.. మనం చేయాల్సిన పనులు చేద్దాం. ఈ ప్రచారాన్ని పాజిటివ్గా తీసుకుని అడుగులు ముందుకేద్దాం. మనం బాగా పనిచేసి పనులన్నీ పూర్తిచేస్తే... నెగెటివ్ మీడియా ఎన్నిరాసినా ప్రజలు వాటిని గమనిస్తారు. మనం బాగుచేశాక ప్రజలు ప్రయాణించే రోడ్లే దీనికి సాక్ష్యాలుగా నిలబడతాయి’’ అన్నారు సీఎం జగన్. (చదవండి: సీఎం జగన్ను కలిసిన నటుడు మంచు మనోజ్) రోడ్లను బాగుచేయడానికి ఇప్పటికే చాలావరకూ టెండర్లు పిలిచారు. మిగిలిన చోట్ల కూడా ఎక్కడైనా టెండర్లు పిలవకపోతే వెంటనే టెండర్లు పిలవండి. అక్టోబరులో వర్షాలు ముగియగానే పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోండి. క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకోండి. మరొకసారి నిశితంగా వాటిని పరిశీలించండి. నివేదికలు ఆధారంగా ఫోకస్ పెట్టి వాటిని బాగుచేయండిసంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలిసి కూర్చుని కార్యాచరణచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. (చదవండి: Andhra Pradesh: చేతల్లో.. సామాజిక న్యాయం) ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్అండ్బీ శాఖ మంత్రి ఎం శంకరనారాయణ, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ కె వెంకటరెడ్డి, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, పరిశ్రమలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవెన్, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఎం ఎం నాయక్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: నకిలీ చలాన్ల వ్యవహారం: తిన్నది కక్కిస్తున్నారు! టీడీపీ విష ప్రచారం: కళ్లకు పచ్చ గంతలు -
రాబడులు, రక్షణ ఒకే పథకంలో..
రిస్క్, రాబడుల మధ్య సమతుల్యం కోసం పెట్టుబడులను వివిధ సాధనాల మధ్య (ఈక్విటీ, డెట్, ఇతర) వర్గీకరించుకోవాలన్నది ఆర్థిక సూత్రాల్లో భాగం. ఉదాహరణకు ఈక్విటీలు అధిక రాబడులకు మార్గం. కానీ, వీటిల్లో స్వల్ప కాలానికి అధిక రిస్క్ ఉంటుంది. డెట్ పథకాల్లో రిస్క్ తక్కువ. రాబడులు కూడా మోస్తరుగానే ఉంటాయి. హెచ్డీఎఫ్సీ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ అన్నది ఈక్విటీ, డెట్ రెండింటిలోనూ పెట్టుబడులు చేయాలని కోరుకునే వారికి అనుకూలమైనది. ఈ విభాగంలోని అగ్రగామి పథకాల్లో ఇది కూడా ఒకటి. రాబడులు గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 45 శాతం రాబడులను ఇచ్చింది. మూడేళ్లలో 13.47 శాతం, ఐదేళ్లలో 12.86 శాతం, ఏడేళ్లలో 12.72 శాతం, పదేళ్లలో 14.92 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం సగటు రాబడులతో పోల్చి చూస్తే ఒక శాతం వరకు ఈ పథకమే మెరుగైన రాబడులను అన్ని కాలాల్లోనూ ఇచ్చింది. 2000 సెప్టెంబర్ 11న ఈ పథకం మొదలు కాగా.. నాటి నుంచి చూసుకున్నా కానీ వార్షిక రాబడులు 16 శాతంగా ఉన్నాయి. పెట్టుబడుల విధానం ఈ పథకం ఈక్విటీల్లో కనిష్టంగా 65 శాతం, గరిష్టంగా 80 శాతం వరకు, డెట్లో 20–35 శాతం మధ్య ఇన్వెస్ట్ చేస్తుంది. కనుక ఈక్విటీ ర్యాలీల్లో మెరుగైన రాబడులు ఒడిసి పట్టుకునేందుకు.. అదే సమయంలో ఈక్విటీ మార్కెట్ల పతనాల్లో నష్టాలను పరిమితం చేసుకునేందుకు ఈ పథకంలో అవకాశం ఉంటుంది. రెండు దశాబ్దాల చరిత్ర కలిగి ఉండడంతో దీర్ఘకాల లక్ష్యాల కోసం ఈ పథకాన్ని పోర్ట్ఫోలియోలో చేర్చుకోవడాన్ని పరిశీలించొచ్చు. డెట్ కంటే ఎక్కువ రాబడులు సమకూర్చుకోవడం, ఈక్విటీలతో పోలిస్తే తక్కువ రిస్క్ ఉండేలా చూడడం ఈ పథకం పనితీరులో భాగం. ఈక్విటీ విషయానికొస్తే స్మాల్, మిడ్, లార్జ్క్యాప్ వ్యాప్తంగా ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛను కలిగి ఉంది. 65 శాతం పెట్టుబడులు ఈక్విటీల్లో ఉంటే ఆదాయపన్ను చట్టం కింద.. ఈక్విటీ పన్ను ప్రయోజనాలకు అర్హత లభిస్తుంది. 2020 మార్చి ఈక్విటీల పతనం నాటికి ఈ పథకంలో ఈక్విటీలకు కేటాయింపులు 64.9 శాతం ఉండగా.. ఆ తర్వాతి నుంచి 2020 డిసెంబ ర్ నాటికి 75 శాతానికి పెంచుకుంది. ప్రస్తుతం ఈక్విటీల్లో పెట్టుబడులు 72.4 శాతం మేర ఉంటే, డెట్లో 19 శాతం, మిగిలిన మేర నగదు నిల్వలు కలిగి ఉంది. ఇటీవలి కాలంలో ఈక్విటీలు గణనీయమైన ర్యాలీ చేయడం తెలిసిందే. కనుక కరెక్షన్ చో టుచేసుకుంటే ఈక్విటీలకు కేటాయింపులను పెం చేందుకు ఈ పథకం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.18,394 కోట్ల ఆస్తులున్నాయి. పోర్ట్ఫోలియోలో 38 స్టాక్స్ను కలిగి ఉంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 26 శాతం పెట్టుబడులను ఈ రంగాల స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఇంధన రంగ కంపెనీలకు 8.26 శాతం, టెక్నాలజీ కంపెనీలకు 7.28 శాతం, నిర్మాణ రంగ కంపెనీలకు 6.45 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. ఈక్విటీ టాప్ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం ఐసీఐసీఐ బ్యాంకు 7.46 ఇన్ఫోసిస్ 5.69 హెచ్డీఎఫ్సీ బ్యాంకు 5.43 రిలయన్స్ ఇండస్ట్రీస్ 4.20 ఎల్అండ్టీ 4.15 హెచ్డీఎఫ్సీ 4.11 ఎస్బీఐ 3.66 భారత్ ఎలక్ట్రానిక్స్ 3.32 ఐటీసీ 2.98 యాక్సిస్ బ్యాంకు 2.89 చదవండి : లాభాల స్వీకరణకు అవకాశం -
విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు అండగా నిలవాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఆర్గానిక్ ఫార్మింగ్ సమాచారం రైతులకు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్బీకేలలో తగినంత ఫర్టిలైజర్ అందుబాటులో ఉండాలని సూచించారు. వ్యవసాయ శాఖపై సీఎం వైఎస్ జగన్ బుధవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్బీకే ఛానల్లో స్పెషలిస్ట్ సైంటిస్ట్ను భాగస్వామ్యం చేయాలని, స్మార్ట్ ఫోన్లలో ఆర్బీకే ఛానల్ యాప్ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. చదవండి: సీఎం జగన్ రెండు రోజుల కడప జిల్లా పర్యటన చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. బోర్ల కింద, వర్షాధార భూములలో చిరు ధాన్యాలు సాగుచేసేలా ప్రోత్సహించాలన్నారు. వరికి బదులు చిరుధాన్యాలు సాగు చేసినా ఆదాయాలు బాగా వస్తాయన్న అంశంపై రైతుల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. అలా చేస్తున్న రైతులను ప్రోత్సహించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు సూచిందిచారు. చిరుధాన్యాల సాగుచేస్తున్న రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలా భరోసా కల్పించాలని, దాని వల్ల రైతులు మరింత ముందుకు వస్తారని తెలిపారు. వ్యవసాయ సలహామండలి సమావేశాలు వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు జరుగుతున్న తీరుపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. రైతులతో ఏర్పడ్డ వ్యవసాయ సలహామండళ్లలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, సమస్యలు నేరుగా కలెక్టర్ల దృష్టికి వెళ్లాలన్నారు. వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రైయిన్లు సహా ఇరత్రా పనులపై ఇప్పుడే వివరాలు తెప్పించుకుని దీనికి తగిన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. రైతులు చెప్తున్న సమస్యలను తీర్చే బాధ్యత కచ్చితంగా అధికారులు తీసుకోవాలని, దానిపై దృష్టి పెట్టాలలని సీఎం జగన్ అన్నారు. వ్యవసాయ సలహామండళ్ల కారణంగా సత్ఫలితాలు ఇస్తున్నాయని అధికారులు సీఎం జగన్కు వివరించారు. సుమారు లక్ష మందికిపైగా రైతులు వ్యవసాయ సలహామండళ్లలో ఉన్నారని అధికారులు తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు-సేవలు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు కోరిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను నిర్దేశిత సమయంలోగా అందాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. రైతు భరోసాకేంద్రాల పనితీరు, సామర్థ్యం ఆమేరకు మెరుగుపడాలన్నారు. నాణ్యత ఉన్నవాటిని రైతులకు అందించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఆర్బీకే కేంద్రాల ద్వారా కూడా రైతుల సమస్యలు నేరుగా ఉన్నతస్థాయికి తెలిసే వ్యవస్థను కూడా సిద్ధం చేయాలని తెలిపారు. అత్యాధునిక పరిజ్ఞానాన్ని (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) దానికి వినియోగించుకోవాలని పేర్కొన్నారు. నేచురల్ ఫార్మింగ్పైనా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. నేచురల్ ఫార్మింగ్ విధానాలను డిస్ప్లే చేయాలని సూచించారు. దానికి సంబంధించిన సామగ్రి కావాలంటే వెంటనే రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ఆర్బీకే కేంద్రాలకు అనుబంధ భవనాలను విస్తరించుకుంటూచిన్నపాటి గోడౌన్లను ఏర్పాటు చేసుకోవాలని అధికారులను అదేశించారు. అక్కడే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను నిల్వచేసుకోవచ్చన్నారు. భవనాలను విస్తరించి నిర్మించేంతవరకూ అద్దె ప్రాతిపదికన కొన్ని భవనాలు తీసుకోవాలని సూచించారు. ఆర్బీకేల పనితీరుమీద కూడా సర్టిఫికెషన్ ఉండాలన్నారు. ఆర్బీకేల పనితీరుపె నిరంతర పర్యవేక్షణ, సమీక్ష ఉండాలని పేర్కొన్నారు. ఆర్బీకేల పనితీరును మెరుగుపరిచే దిశగా ఐఎస్వో సర్టిఫికేషన్ పొందే విధంగా చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. దానివల్ల వాటి పనితీరు క్రమంగా మెరుగుపడుతుందని తెలిపారు. ఎప్పటికప్పుడు ఎస్ఓపీలను రూపొందించుకోవాలని తెలిపారు. వైఎస్సార్ పొలంబడి వైఎస్సార్ పొలంబడి కార్యక్రమంపైనా సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. పొలంబడి కార్యక్రమాల షెడ్యూలును రైతు భరోసాకేంద్రాల్లో ఉంచాలని అధికారులను ఆదేశించారు.15 రకాల పంటలపై పొలంబడి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అగ్రికల్చర్ కాలేజీలు, యూనివర్శిటీ విద్యార్థులు ఆర్బీకేల్లో విధిగా పనిచేసేలా చూడాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఆర్గానిక్ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ వచ్చేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఉత్పత్తులకు మంచి ధర వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మోతాదుకు మించి అధికంగా ఎరువులు, పురుగు మందులు వాడుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆర్బీకే యూనిట్లుగా మ్యాపింగ్ చేసి అక్కడ రైతులకు పొలం బడుల ద్వారా ప్రత్యేక శిక్షణ, అవగాహన కల్పించాలని సీఎం అధికారులకు తెలిపారు. పంటల సాగులో రైతులకు అవగాహన కల్పించేలా రూపొందించిన వీడియోలను యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇ-క్రాపింగ్పైనా సీఎం సమీక్ష ఇ-క్రాపింగ్ చేసిన రైతులకు భౌతిక రశీదులు, డిజిటల్ రశీదులు కూడా ఇవ్వాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇ-క్రాపింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, దానివల్ల పూర్తి పారదర్శకత వస్తుందని తెలిపారు.రుణాలు, సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీలు, పంటల కొనుగోలు, బీమా.. తదితర వాటన్నింటికీ ఇ-క్రాపింగ్ ఆధారం అవుతుందని సీఎం పేర్కొన్నారు. అన్ని ఆర్బీకేల్లో బ్యాకింగ్ కరస్పాండెంట్లు ఉండాలని, కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లలో భారీ పరికరాలను, సామగ్రిని అందుబాటులో ఉంచడమే కాకుండా ప్రతి ఆర్బీకే పరిధిలో కూడా రైతులకు అవసరమైన పనిముట్లను వ్యక్తిగతంగా అందించేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. వచ్చే రబీ సీజన్లో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ట్రాన్స్ఫార్మర్ల సమస్యలు-పరిష్కారం ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా వెంటనే కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన చోట లోడ్, ఇతరత్రా పరిస్థితులపై వెంటనే పరిశీలన చేయాలని సూచించారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడానికి కారణాలపైన కూడా అధ్యయనం చేయాలని, లేకపోతే కొత్తగా ట్రాన్స్ఫార్మర్ పెట్టినా ఉపయోగం ఉండదన్నారు. మీటర్లు అమర్చడం ద్వారా ఎంత కరెంటు కాలుతుంది, ఎంత లోడ్ పడుతుందనే విషయం తెలుస్తుందన్నారు. మీటర్ల వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవన్న విషయం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశామని తెలిపారు. మీటర్ల వల్ల ఓ వర్గ మీడియాకు తప్ప, రైతులెవ్వరికీ నష్టం లేదన్నారు. ఈ విషయాన్ని రైతులు కూడా గుర్తించి మీటర్లు పెట్టించుకునేందుకు ముందుకు వచ్చారని గర్తు చేశారు. ఎంత బిల్లు కట్టాలో అంత డబ్బునూ ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాల్లోకి వేస్తోందని, ఆ డబ్బు నేరుగా కరెంటు పంపిణీ సంస్థలకు చేరుతోందని సీఎం జగన్ తెలిపారు. ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయం) అంబటి కృష్ణారెడ్డి, ఏపీ స్టేట్ ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బుక్కపట్నం నవీన్ నిశ్చల్, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, జెడ్బీఎన్ఎఫ్ స్పెషల్ సీఎస్ టి.విజయ్కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ పి.ఎస్.ప్రద్యుమ్న, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, ఏపీఎస్ఎస్డీసీఎల్ వీసీ మరియు ఎండీ గెడ్డం శేఖర్బాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇవీ చదవండి: ఏపీ: ఈ–కేవైసీ గడువు 15 వరకు పొడిగింపు ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేయమన్నా వేయని లోకేశ్ -
అఫ్గాన్ తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష
-
ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్లతో సజ్జల సమీక్ష
-
ప్రభుత్వాస్పత్రుల్లో 90 రోజుల్లోగా రిక్రూట్మెంట్ పూర్తి చేయాలి: సీఎం జగన్
-
ఎకానమీపై ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సమీక్ష
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ శుక్రవారం దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితిపై సమీక్ష జరిపింది. గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్ల 590వ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్–19 ప్రభావాన్ని తగ్గించడానికి ఆర్బీఐ తీసుకున్న చర్యల ఫలితాల అంశం కూడా సమీక్షలో చోటుచేసుకుందని ప్రకటన వివరించింది. డిప్యూటీ గవర్నర్లు మహేష్ కుమార్ జైన్, మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎం రాజేశ్వర్ రావు మరియు టీ రబీ శంకర్లతోపాటు సెంట్రల్ బోర్డ్ ఇతర డైరెక్టర్లు సమావేశంలో పాల్గొన్నారు. సతీష్ కే మరాఠే, ఎస్ గురుమూర్తి, రేవతి అయ్యర్, సచిన్ చతుర్వేది సమవేశంలో పాల్గొన్న డైరెక్టర్లలో ఉన్నారు. ఆర్థిక సేవల కార్యదర్శి దేబాశిష్ పాండా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్సేథ్ కూడా ప్రభుత్వం తరఫున సమావేశానికి హాజరయ్యారు. -
జూన్ 2023 నాటికి సమగ్ర భూ సర్వే పూర్తి కావాలి: సీఎం జగన్
-
నవరత్నాలు-పేదలందరికి ఇళ్ల నిర్మాణంపై మంత్రి అవంతి సమీక్ష
-
వాసాలమర్రిలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు పర్యటన కొనసాగుతోంది. గ్రామంలోని దళితవాడల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. దళితవాడలో కాలినడకన ఇంటింటికి వెళ్లి ‘దళితబంధు’ పథకం గురించి ఏ మేరకు అవగాహన ఉందో దళితులను అడిగి తెలుసుకున్నారు. ‘దళిత బంధు’ పథకంతో వచ్చే పెద్ద మొత్తం డబ్బుతో ఎలాంటి ఉపాధి పొందుతారని దళితులను అడిగి తెలుసుకున్నారు. పెద్ద మొత్తంలో వచ్చే డబ్బును వృధా చేసుకోవద్దని స్పష్టమైన అవగాహనతో దళిత బందు ద్వారా లబ్ధి పొందాలని సీఎం సూచించారు. సుమారు గంటకుపైగా దళితవాడల్లో కాలినడకన కలియతిరిగారు. గ్రామమంతా కలియతిరిగి మొత్తం పరిశీలించారు. ఈ క్రమంలో కొందరు గ్రామస్తులతో కూడా మాట్లాడారు. అనంతరం గ్రామ అభివృద్ధిపై రైతు వేదికలో గ్రామస్తులతో సమావేశం కానున్నారు. వాసాలమర్రికి సీఎం కేసీఆర్ రావడం ఇది రెండోసారి. జూన్ 22వ తేదీన కేసీఆర్ పర్యటించిన విషయం తెలిసిందే. గ్రామ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యల పరిష్కారంపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. -
ఐటీశాఖ, డిజిటల్ లైబ్రరీపై సీఎం వైస్ జగన్ సమీక్ష
-
వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సినేషన్ను పూర్తిచేయాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం కరోనా వైరస్ నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. థర్డ్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘కాన్సన్ట్రేటర్లు, డీటైప్సిలెండర్లు, ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణపై శ్రద్ధవహించాలి. దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. పీహెచ్సీల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఉంచాలి. జిల్లాల వారీగా వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలి. ఏపీఎంఎస్ఐడీసీలో ప్రత్యేక సెల్ను ఏర్పాటుచేయాలి’’ అని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటుపై సమీక్షలో.. ‘‘100 బెడ్లు ఉన్న ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయించే దిశగా చర్యలు తీసుకోవాలి. తర్వాత మిగిలిన ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టిపెట్టాలి. ప్లాంట్ల ఏర్పాటుకు 30 శాతం సబ్సిడీ ఇస్తున్నాం. కొత్త మెడికల్ కాలేజీల కోసం పెండింగ్లో ఉన్న భూసేకరణ పూర్తిచేయాలి. వ్యాక్సినేషన్లో టీచర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సినేషన్ను పూర్తిచేయాలి’’ అని అధికారులను ఆదేశించారు. మే, జూన్, జులై నెలల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు 43.38 లక్షల డోసులు ఇస్తే.. కేవలం 5,24,347 డోసులు మాత్రమే వాడారని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ వ్యాక్సిన్లను ప్రభుత్వానికి ఇస్తే వ్యాక్సినేషన్ను వేగంగా ముందుకు సాగుతుందని, దీనిపై మరోసారి కేంద్రానికి లేఖ రాస్తానని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ‘‘ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉంచాలి. కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన కాన్సన్ట్రేటర్లు, డీ–టైప్ సిలెండర్లు, ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. జిల్లాల వారీగా నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించాలి. జిల్లా విస్తీర్ణం, ఆస్పత్రుల సంఖ్యను బట్టి తగిన సిబ్బందిని ఏర్పాటు చేయాలి. అవసరమైన శిక్షణనూ వీరికి అందించాలి. ఏపీఎంఎస్ఐడీసీలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. శిక్షణ అనంతరం వీరిని ఆస్పత్రి మేనేజ్మెంట్కు అప్పగించాలి’’ అని సీఎం జగన్ ఆదేశించారు. అదే విధంగా... ‘‘ఐటీఐ, డిప్లమోలో దీనికి సంబంధించిన కోర్సులను ప్రవేశపెట్టాలి. ఆస్పత్రుల నిర్వహణలో కీలకమైన ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ, ఎలక్ట్రికల్, ఏసీ రిపేర్, ప్లంబింగ్తో పాటు ఇతర అనుబంధ వైద్య విభాగాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి. నైపుణ్యం ఉన్న మానవ వనరుల సేవల కారణంగా... ఆస్పత్రుల నిర్వహణ మెరుగ్గా ఉంటుంది. అంతేగాక చాలామందికి ఉద్యోగాలు వస్తాయి’’ అని సీఎం జగన్ అన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ (పీఎస్ఏ) ప్లాంట్ల ఏర్పాటుపైనా సీఎం సమీక్ష ముందుగా 100 పడకల ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటు చేయించే దిశగా చర్యలు తీసుకోవాలన్న సీఎం తర్వాత మిగిలిన ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ఆదేశం ప్లాంట్ల ఏర్పాటు ద్వారా వారికి ప్రభుత్వం తరపున 30 శాతం సబ్సిడీ ఇస్తున్నామన్న సీఎం పవర్ ఛార్జీల్లో కూడా ఊరటనిస్తున్నాం వ్యాక్సినేషన్ ►వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం జగన్ వీలైనంత త్వరగా వారికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో మే, జూన్, జూలై నెలల్లో ప్రైవేటు ఆస్పత్రులకు 43,38,000 డోసులు ఇస్తే.. కేవలం 5,24,347 మాత్రమే వినియోగించారని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ క్రమంలో.. ఈ వ్యాక్సిన్లను ప్రభుత్వానికి ఇస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా ముందుకు సాగుతుందన్న సీఎం జగన్.. ఈ విషయంపై మరోసారి కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. వివిధ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్, వ్యాక్సినేషన్ అనంతరం అక్కడి కోవిడ్ తీరు తదితర అంశాలపై అధ్యయనం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇందుకోసం ఒక కమిటీని నియమించాలన్నారు. ‘‘ఈ అంశాలపై కమిటీ అధ్యయనం అనంతరం నివేదిక సమర్పించాలి. తద్వారా కోవిడ్ నివారణకు అవసరమైతే రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాల్లో మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుంది’’ అని పేర్కొన్నారు. కొత్త మెడికల్ కళాశాల పనులపైనా సమీక్ష నిర్వహించిన సీఎం నూతన మెడికల్ కళాశాలల కోసం పెండింగ్ ఉన్న చోట భూసేకరణను పూర్తి చేయాలని సీఎం ఆదేశం కొత్త మెడికల్ కాలేజీల్లో పనుల ప్రగతిపై వచ్చే సమావేశంలోగా తనకు నివేదిక ఇవ్వాలన్న సీఎం 16 కాలేజీల పనులపై పూర్తి వివరాలు అందించాలి. ఒకవేళ పనులు మొదలు కాకపోతే.... వెంటనే పనులు మొదలుపెట్టించి ఆ వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వండి. నాడు–నేడు వైద్యఆరోగ్యశాఖలో పనులపైనా ప్రజంటేషన్ ఇవ్వాలి కోవిడ్- 19 నివారణ, నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్పై సీఎంకు వివరాలందించిన అధికారులు రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన యాక్టివ్ కేసులు ప్రస్తుతం యాక్టివ్ కేసులు 20,965 డెయిలీ పాజిటివిటీ రేటు 2.51 శాతం రికవరీ రేటు 98.25 శాతం పాజిటివిటీ రేటు 3 కంటే తక్కువ ఉన్న జిల్లాలు 9 పాజిటివిటీ రేటు 5 కంటే తక్కువ ఉన్న జిల్లాలు 3 పాజిటివిటీ రేటు 5 కంటే ఎక్కువ ఉన్న జిల్లా 1 ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారు 4426 కోవిడ్ కేర్ సెంటర్లులో ఉన్న వారు 2349 నెట్ వర్క్ ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న బెడ్లు 94.33 శాతం ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న బెడ్లు 75.25 శాతం 104 కాల్ సెంటర్కి వచ్చిన కాల్స్ 933 వ్యాక్సినేషన్ గురించి రాష్ట్రంలో 2,04,17,764 డోసుల వ్యాక్సిన్లు పూర్తి సింగిల్ డోసు కింద 1,03,24,702 మందికి వ్యాక్సినేషన్ 50,46,531 మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ మొత్తం 1,53,71,233 మందికి వ్యాక్సినేషన్ ఈ సమీక్షా సమావేశంలో... ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), డీజీపీ గౌతం సవాంగ్, స్టేట్ కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ ఛైర్మన్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం టీ కృష్టబాబు, ఇంటెలిజెన్స్ చీఫ్ కే వి రాజేంద్రనాథ్ రెడ్డి, 104 కాల్ సెంటర్ ఇంఛార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మీరే మాకు కళ్లు, చెవులు.. మీరే మా బలం: సీఎం జగన్
-
అధికారుల తీరుపై సీఎం వైఎస్ జగన్ సీరియస్
-
అధికారుల తీరుపై సీఎం వైఎస్ జగన్ సీరియస్
సాక్షి, అమరావతి: నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొంతమంది అధికారుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫెర్మామెన్స్ బాగా లేనివారికి మెమో జారీచేయాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంపై సీఎం.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారానికి నాలుగు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలు సందర్శించాలని చెప్పాం, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకుంటే సమస్యలెలా తెలుస్తాయని సీఎం ప్రశ్నించారు. తప్పులు జరిగితే వాటిని సరిచేసే అవకాశం ఉంటుందని, కలెక్టర్లు, జేసీల స్థాయిలో పర్యవేక్షణ బాగుందన్నారు. మిగిలిన అధికారులు కూడా సమర్ధవంతంగా పనిచేయాలన్నారు. 100 శాతం గ్రామ, వార్డు సచివాలయాల్లో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పేదల గురించి ఆలోచించి మానవత్వం చూపించాలని సీఎం జగన్ అన్నారు. ‘‘డీబీటీ పథకాల్లో సోషల్ ఆడిట్ కోసం జాబితాను ప్రదర్శిస్తున్నారా? లేదా? చూడాలి. బియ్యం కార్డు, పెన్షన్ కార్డు, ఇళ్ల పట్టాలు, ఆరోగ్యశ్రీ పథకాలు అత్యంత ముఖ్యమైనవి. నిర్దేశించుకున్న గడువులోగా అర్హులకు అందేలా చూడాలి. వీటిని స్వయంగా పరిశీలించాలి, పర్యవేక్షణ, సమీక్ష చేయాలి. ఏమైనా లోపాలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. గ్రామ, వార్డు సచివాలయాలను అధికారులు తరచూ తనిఖీ చేయాలి. ఆగస్టు 10న నేతన్న నేస్తం, ఆగస్టు 16న విద్యాకానుక అందజేస్తాం. రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు ఆగస్టు 24న నగదు జమ చేస్తాం. ఎమ్ఎస్ఎమ్ఈలు, స్పిన్నింగ్మిల్స్కు ఆగస్టు 27న ఇన్సెంటివ్లు ఇస్తామని, ఈ మేరకు కలెక్టర్లు సన్నద్ధంగా సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. -
ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలోగా పూర్తికావాలి: సీఎం జగన్
-
విత్తన నాణ్యతకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి: కన్నబాబు
సాక్షి, అమరావతి: ఆర్బీకేల ద్వారా విత్తనోత్పత్తి చేయనున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. విత్తన నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని మంత్రి తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన వన శాఖల ఉన్నతాధికారులతో విత్తనోత్పత్తి, వర్షాల వల్ల నెలకొన్న వ్యవసాయ పరిస్థితులపై మంత్రి కన్నబాబు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. విత్తనాలు పండించే రైతులు, కంపెనీల వివరాలు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. విత్తనం పండించే ప్రతి ఎకరం రిజిస్ట్రేషన్ చేస్తామని, ప్రాచుర్యం పొందిన హైబ్రిడ్ విత్తనాల ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని విత్తన హబ్గా చేసేందుకు సీడ్స్ నూతన పాలసీ తోడ్పడుతోందన్నారు. ఇతర రాష్ట్రాలకు సీడ్స్ మార్కెటింగ్ చేసేలా ప్రణాళికలు చేయాలన్నారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, రైతులకు అండగా నిలవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారని కన్నబాబు తెలిపారు. ‘‘జులై 22 వరకు 200.3 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండాల్సి ఉంటే 256 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అనంతపురం, చిత్తూర్, కడప లో వర్షాలు పడ్డాయి. పశ్చిమ గోదావరి, కృష్ణ, కర్నూలులో అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 55 మండలాల్లో కొన్ని ప్రాంతాల్లో పొలాల్లో ముంపుకి గురయ్యాయి. వర్షం నిలిస్తే ఆ నీరు పోయే అవకాశం ఉంది. వర్షాలు తగ్గితే పూర్తిగా ఎన్యుమరేషన్ చేయాలి. వర్షాలు తగ్గిన వెంటనే పంట నష్టాలని పక్కాగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని’’ అధికారులను కన్నబాబు ఆదేశించారు. రైతులకు నష్టం జరిగితే తక్షణమే స్పందించాలన్నారు. ఈ వర్షాలు కూడా ఖరీఫ్ కు కలిసొచ్చే అంశమన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బందితో వర్షాల వల్ల నెలకొన్న పరిస్థితులను టెలీ కాన్ఫెరెన్స్ ద్వారా మంత్రి కన్నబాబు అడిగి తెలుసుకున్నారు. ఏ రైతు ఈ వర్షాల వల్ల నష్టపోకుండా చూడాలని ఆదేశించారు. అనంతపురం జిల్లాలో ఆగస్టు 5 వరకు సబ్సిడీ వేరుశెనగ విత్తనాలను సరఫరా చేయాలని నిర్ణయించామన్నారు. రైతులకు ఇచ్చే ప్రతి విత్తనం నాణ్యమైనదై ఉండాలని, ధ్రువీకరించినదై ఉండాలని మంత్రి కన్నబాబు ఆదేశించారు. -
ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునఃప్రారంభం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: విద్యాశాఖకు సంబంధించిన నాడు-నేడు కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునఃప్రారంభం చేయాలని.. అప్పుడే మొదటి విడత నాడు-నేడు పనులను ప్రజలకు అంకితం చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘నాడు-నేడు పనుల్లో అవినీతికి తావుండకూడదు. పిల్లల కోసం నాడు-నేడుతో మంచి కార్యక్రమం చేపట్టాం. పాఠశాలల అభివృద్ధిపై గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు. నాడు-నేడు పనులపై చిన్న వివాదం కూడా రాకూడదు’’ అని అధికారులను ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభించిననాడే రెండో విడత నాడు-నేడు పనులకు శ్రీకారం చుట్టడమే కాక.. నూతన విద్యా విధానం గురించి ప్రభుత్వం సమగ్రంగా వివరిస్తుందని సీఎం జగన్ తెలిపారు. సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు.. ►ఆగష్టు 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం ►మొదటి విడత నాడు–నేడు కింద రూపుదిద్దుకున్న స్కూళ్లను ప్రజలకు అంకితం చేయనున్న ముఖ్యమంత్రి ►రెండోవిడత నాడు –నేడుకు అదే రోజు శ్రీకారం ►అదే రోజు విద్యాకానుక ప్రారంభం ►నూతన విద్యా విధానం విధి, విధానాలపై ఆగష్టు 16నే ప్రకటన ►నూతన విద్యావిధానంపై గత సమావేశాల్లో ఆలోచనలు, వాటిని ఖరారు చేయడంపై చేసిన కసరత్తును సీఎంకు వివరించిన అధికారులు ►నూతన విద్యావిధానాన్ని అనుసరించి స్కూళ్ల వర్గీకరణ ఖరారు ►ఏమైనా మెరుగులు దిద్దాల్సి ఉంటే.. ఈ ప్రక్రియ పూర్తిచేసి ఆగస్టు 16న నూతన విద్యా విధానం విధివిధానాలను వెల్లడించాలన్న సీఎం ►కొత్త విద్యావిధానంలో పీపీ–1 నుంచి 12వ తరగతి వరకూ ఆరు రకాల స్కూల్స్ ►శాటిలైట్ పౌండేషన్ స్కూల్స్ ( పీపీ–1, పీపీ–2) ►పౌండేషన్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2, 1, 2 తరగతులు) ►పౌండేషన్ ప్లస్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2, 1, 2, 3, 4, 5 తరగతులు) ►ప్రీహైస్కూల్స్ (పీపీ–1, పీపీ–2, 1, 2, 3, 4, 5, 6, 7 తరగతులు) ►హైస్కూల్స్ (3 నుంచి 10వ తరగతి వరకూ) ►హైస్కూల్ ప్లస్ ( 3 నుంచి 12వ తరగతి వరకూ) రానున్నాయని తెలిపిన సీఎం. ►పౌండేషన్ స్కూళ్లలో భాగంగా అంగన్ వాడీల నుంచే ఇంగ్లిషు మీడియం ప్రారంభం అవుతుంది ►శాటిలైట్ పౌండేషన్ స్కూల్స్గా అంగన్వాడీలు రూపాంతరం చెందుతాయి ►శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్కు ఫౌండేషన్స్కూల్స్ మార్గనిర్దేశకత్వం వహిస్తాయి ►ఇక్కడ కూడా ఎస్జీటీ టీచర్లు పర్యవేక్షణచేస్తారు, ఉత్తమ బోధన అందేలా చూస్తారు ►శాటిలైట్ పౌండేషన్ స్కూల్ ప్రతి ఆవాసంలో ఉంటుంది. ►కిలోమీటరు లోపలే పౌండేషన్ స్కూల్ ఏర్పాటవుతుంది ►మూడు కిలోమీటర్ల పరిధిలో హైస్కూల్ ఉంటుంది ►మూడు కిలోమీటర్ల పరిధి దాటి ఒక్క స్కూలూ ఉండదు ►వీటన్నింటినీ పక్కాగా ఏర్పాటు చేస్తూ నూతన విద్యా విధానాన్ని అమలు చేయబోతున్నాం ►ఉపాధ్యాయులను అత్యంత సమర్ధవంతంగా ఉపయోగించుకోవడమే నూతన విధానం ప్రధాన లక్ష్యం ►పిల్లలకు ప్రతి సబ్జెక్టుపై నైపుణ్యం, ఆ సబ్జెక్టులో చక్కటి పరిజ్ఞానం ఉన్న టీచర్లతో బోధన ఉంటుంది ►ప్రస్తుతం 5 తరగతి వరకు ప్రతి టీచర్ 18 రకాల సబ్జెక్టులు బోధిస్తున్నారు ►ఇంటర్ తర్వాత డిప్లమో ఇన్ ఎడ్యుకేషన్ చేసి సెకండరీ గ్రేడ్ టీచర్లుగా పనిచేస్తున్నారు ►కొన్ని చోట్ల సుమారు 200 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు, మరికొన్ని చోట్ల నలుగురికి ఒకే టీచర్ బోధిస్తున్న పరిస్ధితి ఉంది ►నూతన విద్యా విధానంలో ఈ రకమైన పరిస్ధితుల్లో మార్పు తెస్తున్నాం ►5వ తరగతి వరకు 18 సబ్జెక్టులును బీఈడీ, పీజీ చేసిన ఉపాధ్యాయులతో సబ్జెక్టుల వారీగా పిల్లలకు బోధన అందించబోతున్నాం ►తద్వారా పిల్లలకు ఫోకస్డ్ ట్రైనింగ్ వస్తుంది ►విద్యార్ధులు, ఉపాధ్యాయుల నిష్పత్తి శాస్త్రీయంగా ఉండేలా రూపొందిస్తున్నాం ►ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ రాబోతున్నారు ►ఎందుకు ఈ విధానానికి పోతున్నామనే దానిపై మరింత జాగ్రత్తగా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని అధికారులకు సీఎం జగన్ నిర్దేశం ►పౌండేషన్ స్కూల్స్, నూతన విద్యా విధానంపై ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు జరిగాయా ? లేదా ? అని అధికారులను ప్రశ్నించిన సీఎం ►ఇప్పటికే వివిధ సంఘాల ప్రతినిధులతో విస్తృతంగా చర్చించామన్న అధికారులు ►ఇందులో ఎటువంటి సందేహాలకు తావుండరాదు ►తల్లిదండ్రులకు కూడా ఈ విషయం స్పష్టంగా అర్థం కావాలి ►నూతన విద్యా విధానం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా వారికి తెలియాలి ►ఆ మేరకు విస్తృతంగా అవగాహన కలిగించాలి : సీఎం ఆదేశం ►నాడు – నేడు, నూతన విద్యావిధానంకోసం మనం సుమారు రూ.16వేల కోట్లు ఖర్చుచేస్తున్నాం ►దీని ద్వారా సాధించబోయే లక్ష్యాలను స్పష్టంగా చెప్పాలి ►ఈ రకమైన మార్పులు తీసుకురావడం ద్వారా విద్యావ్యవస్ధ పునరుజ్జీవనానికి ఏం చేయబోతున్నామో చెప్పాలి ►మరోవైపు ఉపాధ్యాయులకు కూడా దీనిపై సమగ్ర అవగాహన కలిగించాలి ►నూతన విద్యా విధానంలో ఏరకంగా ఉద్యోగ తృప్తి ఉంటుందో వివరించాలి ►అంగన్వాడీలకు మరింత ప్రోత్సాహం కలిగించేందుకు వారికి ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేస్తున్నాం ►ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండేలా హేతుబద్దీకరణ ►జాతీయ ప్రమాణాలను అనుసరించి విద్యావ్యవస్ధ ►ఏ స్కూలునూ మూసేయం, ఎవ్వరినీ తొలగించం ►మొదటి విడత నాడు–నేడులో అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత సమర్ధవంతంగా ముందుకు సాగాలి ►అధికారులతో సీఎం వైఎస్ జగన్ స్పష్టీకరణ ►పిల్లల భవిష్యత్తుకోసం, సమాజ శ్రేయస్సు కోసం ఇంత ఖర్చు పెడుతున్నాం ►ఎక్కడా అవినీతికి, వివక్షతకు తావుండరాదు ►ఇలాంటి ఆలోచన గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదు ►పిల్లల చదువుల కోసం ఇంత ఖర్చు చేసిన ప్రభుత్వమూ గతంలో లేదు ►పారదర్శకతతో పనులు ముందుకు సాగాలి ►అవినీతి ఏ స్ధాయిలో ఉన్నా సహించేది లేదు ►అధికారులకు స్పష్టం చేసిన సీఎం ►నూతన విద్యా విధానం, నాడు నేడు తొలిదశ పనులు పై సీఎంకు వివరాలందించిన అధికారులు ►తొలిదశలో నాడు–నేడు చేపట్టిన స్కూల్స్లో పనులు దాదాపు పూర్తయ్యాయన్న అధికారులు ►అమ్మఒడి, నాడు–నేడు, విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, ఇంగ్లిషు మీడియం వంటి సంస్కరణలు విద్యా వ్యవస్ధలో మంచి ఫలితాలు అందించబోతున్నాయన్న అధికారులు ►స్కూల్స్ ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో పాఠ్యపుస్తకాలు, డిక్షనరీ, జగనన్న విద్యా కానుక పంపిణీపై సమగ్ర వివరాలు అందించిన అధికారులు ►ఆగష్టు 16 నాటికి అంతా సన్నద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించిన సీఎం ►వరుసగా రెండేళ్లు పరీక్షలు నిర్వహించకుండానే టెన్త్ విద్యార్థులను పాస్చేశామన్న అధికారులు ►కొన్ని రిక్రూట్మెంట్లలో మార్కులను పరిగణలోకి తీసుకుంటున్నారని, దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్న అంశాన్ని ప్రస్తావించిన అధికారులు ►దీన్ని పరిగణలోకి తీసుకుని 2020 టెన్త్ విద్యార్థులకూ కూడా మార్కులు ఇవ్వాలని నిర్ణయం ►అంతర్గత పరీక్షల ఆధారంగా మార్కులు ఇవ్వనున్నట్టు తెలిపిన అధికారులు ►అలాగే 2021 టెన్త్ విద్యార్థులకూ మార్కులు ఇవ్వనున్నట్టు తెలిపిన అధికారులు ►స్లిప్టెస్టుల్లో మార్కులు ఆధారంగా 70శాతం మార్కులు, ఫార్మెటివ్ అసెస్మెంట్ ఆధారంగా మిగిలిన 30శాతం మార్కులు ఇస్తామన్న అధికారులు ►మొత్తం మార్కులు ఆధారంగా గ్రేడ్లు ఇస్తామని వెల్లడి సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఆర్ధికశాఖ కార్యదర్శి సత్యనారాయణ, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కృతిక శుక్లా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, సర్వశిక్షాఅభయాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రి సెల్వి, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఎ మురళీ ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
ఏపీ: ఆగస్టు 15న డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్ఛ్సేంజ్ ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి తెలిపారు. ఇకపై రాష్ట్రంలో ప్రతి జిల్లాలో నెలకు రెండు సార్లు మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఆగస్టు 15న డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్ఛ్సేంజ్ ప్రారంభించనునట్లు తెలిపారు. గురువారం ఆయన ఐటీ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈఎంసీ, ఐటీ ప్రమోషన్, పాలసీ తదితర అంశాలపై చర్చించారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్కిల్ కాలేజీల పనుల పురోగతి, నిధుల సమీకరణలో వేగానికి చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకులతో సంప్రదించి నిధులు తెచ్చుకునే మార్గాలపై అన్వేషించాలని సూచించారు. స్కిలింగ్ కోర్సులు, ట్రైనింగ్, ప్రమోషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్తో ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ని అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ ప్రాధాన్యత పెంచే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. స్కిల్ కాలేజీలను ప్రభుత్వం నిర్దేశించిన రూ.20 కోట్ల బడ్జెట్లో అత్యాధునికంగా తీర్చిదిద్దే డిజైనింగ్లు కూడా పూర్తయ్యాయని మంత్రికి ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగారు రాజు వివరించారు. నెల్లూరు జిల్లాలోని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వెంకటగిరి, కర్నూలు జిల్లా డోన్ స్కిల్ కాలేజీల భూ సేకరణ పనుల పురోగతిపై మంత్రి గౌతమ్ రెడ్డి ఆరా తీశారు. అత్యాధునిక కోర్సుల ద్వారా శిక్షణ అందిస్తే ఉద్యోగాల కల్పన సులభమవుతుందని మంత్రి వెల్లడించారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న స్కిల్ కాలేజీ భూసేకరణ పనిని త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. -
రెండో విడత గొర్రెల పంపిణీకి రూ.6 వేల కోట్లు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు(కేసీఆర్) తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీపై సీఎం.. ప్రగతి భవన్లో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు.రెండో విడత పంపిణీకి రూ.6వేల కోట్లు కేటాయిస్తునట్లు సీఎం వెల్లడించారు. ఇప్పటికే మొదటి విడత ద్వారా రూ. 5 వేల కోట్లతో గొర్రెల పంపిణీ చేపట్టామని పేర్కొన్నారు. కుల వృత్తులను ఒక్కొక్కటిగా గాడిన పెడుతున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. -
చేపల వినియోగం పెంచడానికి హబ్లను ఏర్పాటు చేస్తున్నాం: సీఎం జగన్
సాక్షి,అమరావతి: ఆక్వా రైతులకు మంచి ధరలు అందాలని, ఈ లక్ష్యాలను చేరుకోవడానికి రాష్ట్రంలో వినియోగం పెంచే దిశగా ఆక్వా హబ్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. చేపల వినియోగం పెరగాలని, సరసమైన ధరలకు ప్రజలకు చేరాలని ఆయన అధికారులకు సూచించారు. పశుసంవర్ధకశాఖ, డెయిరీ, ఫిషరీస్ విభాగాలపై వైఎస్ జగన్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చేపల రవాణా, నిల్వ తదితర అంశాల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలన్నారు. ఆక్వా యూనివర్శిటీ ఏర్పాటుపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. ఆక్వా లాబ్స్ను వినియోగించుకోవడంపై ప్రచారం, అవగాహన కల్పించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఆక్వా రంగానికి సంబంధించి క్వాలిటీ చెకింగ్స్ ఎలా చేయించుకోవాలన్నదానిపై అవగాహన పెంచాలన్నారు. ఈ ల్యాబ్లను ఆర్బీకేలకు అనుసంధానం చేయాలని, ఆక్వా సీడ్, ఫీడ్ల విషయంలో ఎలాంటి కల్తీలు ఉండకూడదని తెలిపారు. కేజ్ ఫిష్ కల్చర్పై కార్యాచరణ ప్రణాళిక 5 ఫిషింగ్ హార్బర్లు, 1 ఫిస్ ల్యాండ్ సెంటర్లో పనులు ప్రారంభమయ్యాయని అధికారులు సీఎం జగన్కు తెలిపారు. మిగిలిన చోట్ల కూడా పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. కేజ్ ఫిష్ కల్చర్, మరీకల్చర్లపై దృష్టి పెట్టాలని, ఆదాయాలు బాగా పెరుగుతాయని తెలిపారు. కేజ్ ఫిష్ కల్చర్పై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, రైతులు, ఔత్సాహికులతో కలిసి ముందుకు సాగేలా ఒక ప్రణాళిక తీసుకురావాలని తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద మూడు చోట్ల కేజ్ ఫిష్ కల్చర్, మూడు చోట్ల మరీకల్చర్లను మొదలుపెట్టాలని తెలిపారు. వెటర్నరీ డిస్పెన్సరీల్లో హేతుబద్ధత ఉండాలని, ప్రతి గ్రామం, మండలంలో ఏం ఉండాలనేదాన్ని నిర్ధారించాలని అధికారులకు సీఎం సూచించారు. డిస్పెన్సరీలు ఆర్బీకేలతో అనుసంధానం హేతుబద్ధత ప్రకారం డిస్పెన్సరీలను పెట్టాలని, తర్వాత వాటిని మెరుగ్గా నిర్వహించాలని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. డిస్పెన్సరీలు ఆర్బీకేలతో అనుసంధానం చేయాలన్నారు. అయితే కొన్ని డిస్పెన్సరీలు లేని మండలాలు కూడా ఉన్నాయని అధికారులు ముందు మ్యాపింగ్ చేసి తర్వాత వాటిని ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పశువుల ఆస్పత్రుల్లో నాడు-నేడుపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాడు-నేడులో భాగంగా నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలను ముందు నిర్దారించుకోలన్నారు. తర్వాత పనులు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి సీదిరి అప్పలరాజు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ఏపీ: మాస్క్ లేకపోతే ఫోటో పంపినా చాలు..
సాక్షి, అమరావతి: కోవిడ్ నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం చేపట్టిన సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాస్క్ ధరించకపోతే రూ.100ల జరిమానా కచ్చితంగా అమలు చేసేవిధంగా నిర్ణయం తీసుకున్నారు. దుకాణాల్లో కూడా సిబ్బంది దగ్గర నుంచి వినియోగదారులకు వరకూ మాస్క్లు ధరించాల్సిందే. ఉల్లంఘనలకు పాల్పడితే దుకాణాలకు భారీ జరిమానాలతో పాటు అవసరమైతే 2–3 రోజులు దుకాణాలు మూసివేతకు ప్రభుత్వం ఆదేశించింది. ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఎవరైనా ఫొటో తీసి పంపినా జరిమానాలు విధించే విధంగా దీని కోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్ ఏర్పాటు, రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ కఠినంగా అమలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలెవ్వరూ గుమిగూడకుండా కఠిన ఆంక్షలతో పాటు మార్కెట్లు, తదితర చోట్ల కూడా మాస్క్లు ధరించాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. మార్కెట్ కమిటీలు మాస్క్లు ధరించేలా చూడాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. డిగ్రీ విద్యార్థులకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. డిగ్రీ విద్యార్థులకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలని, కోవిడేతర వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం తెలిపారు. డెంగ్యూ, ఇతర వ్యాధుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ పేర్కొన్నారు. -
ఆంధ్రప్రదేశ్: ఆగస్టు 15 నుంచి పాఠశాలల ప్రారంభం
సాక్షి, తాడేపల్లి: ఆగస్టులోపు విద్యాసంస్థల్లో నాడు-నేడు పెండింగ్ పనులు పూర్తి కావాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈనెల 15 నుంచి ఆగస్టు 15వరకు వర్క్బుక్స్పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. నాడు-నేడు కింద పనుల కోసం రూ.16 వేల కోట్లతో బడ్జెట్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. నాడు నేడు, జగనన్న విద్యా కానుకపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. నూతన విద్యా విధానం నూతన విద్యా విధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్షించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, విద్యావంతులైన నైపుణ్యం గల టీచర్లతో బోధన అందించాలని తెలపారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా టీచర్లు ఉండాలన్నారు. ఈ లక్ష్యాల కోసమే నూతన విద్యా విధానం అమలు చేస్తున్నామన్నారు. ఒక్క స్కూల్ కూడా మూసివేయకూడదని, ఒక్క టీచర్ను కూడా తొలగించకూడదని ఆదేశించారు. నూతన విద్యా విధానం ప్రతిపాదనలను ఈ వారంలో ఖరారు చేయాలన్నారు. నాడు-నేడు పనులను యథావిధిగా కొనసాగించాలని, షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తికావాలని అధికారులను ఆదేశించారు. టీచర్లకు వ్యాక్సినేషన్ ఆగష్టు 15 తర్వాత పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆగష్టు 15 లోపు టీచర్లకు వ్యాక్సినేషన్ వేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆగష్టులోనే విద్యా కానుక, నాడు-నేడు రెండో విడత పనులు ప్రారంభం కావాలన్నారు. తొలివిడత పనులు పూర్తైన పాఠశాలలను ప్రజలకు అంకితం చేయనున్నట్లు తెలిపారు. -
కోవిడ్ నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి: కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష చేపట్టారు. కోవిడ్ కేసుల నమోదు, లాక్డౌన్ తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్ఫోర్స్ అధికారులు హాజరయ్యారు. సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ వ్యాక్సినేషన్పై మరింత ధ్యాస పెట్టాలి. ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు ఇప్పటికే వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. ఐదేళ్లు దాటిన పిల్లలున్న తల్లులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. గర్భిణీలు, ఉపాధ్యాయులకూ వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలి. రెండు నెలల్లోగా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల పనులు పూర్తి చేయాలి’’ అని అధికారులను ఆదేశించారు. -
సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించాలి: కన్నబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయ పాలసీ తీసుకొచ్చేందుకు ఆర్గానిక్ ఫార్మింగ్ ఉన్నతాధికారుల కమిటీతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు గురువారం సమావేశమయ్యారు. రైతులకు రెట్టింపు ఆదాయం, నాణ్యమైన ఉత్పత్తులు, భూసారాభివృద్ది, ప్రజారోగ్యం ప్రధాన లక్ష్యాలుగా సేంద్రియ వ్యవసాయ పాలసీ వుండాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి కన్నబాబు అన్నారు. రైతాంగానికి మేలు చేసే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గ్రామాల్లో రైతులకు రసాయనాలు, పురుగు మందుల వినియోగం తగ్గించేలా అవగాహనా పెంచాలని ఆయన సూచించారు. బయో ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఇతర రసాయనాల వినియోగంపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. డిమాండ్ మేరకే ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని.. సేంద్రియ వ్యవసాయ పద్దతులపై విస్తృతంగా రైతుల్లో అవగాహనా పెంచాలన్నారు. కొత్త పంటల సాగు ప్రారంభం నుంచే వారిని సేంద్రియ వ్యవసాయ విధానంపై ప్రోత్సాహించాలన్నారు. కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల సూచనలు అభిప్రాయాలను సేకరించి ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే ఆర్గానిక్ పాలసీని తీసుకొస్తామని మంత్రి కన్నబాబు అన్నారు. సెరికల్చర్ ఉన్నతాధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష సెరికల్చర్ ఉన్నతాధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. పట్టుసాగుకు నూతన రైతులను ప్రోత్సహించాలని మంత్రి అన్నారు. ఇటీవల ప్రభుత్వం నియమించిన 400 మంది విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్లకు పూర్తి స్థాయిలో సాంకేతిక శిక్షణ ఇవ్వాలన్నారు. రైతుల ఆర్థిక ప్రయోజనాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. పట్టు ధరలు తగ్గకుండా ఎక్కువ మంది రీలర్లను ప్రోత్సహిస్తూ తగిన ముందుస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి కన్నబాబు సూచించారు. -
మావోయిస్టులు లొంగిపోవాలి: డీజీపీ మహేందర్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రం చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో మావోల కదలికలు లేకుండా నిర్మూలిస్తామని తెలిపారు. సోమవారం ఆయన కుమ్రంబీమ్ జిల్లా కేంద్రంలో పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోలను నిర్మూలించడానికి 31 టీమ్లను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ గడ్డపై అడుగు పెట్టకుండా మావోలపై చర్యలు చేడుతున్నామన్నారు. కరోనాతో బాధపడుతున్న మావోలు లొంగిపోవాలని పిలుపునిచ్చారు. లొంగిపోతే చికిత్స అందిస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. చదవండి: ఆన్లైన్లో అశ్లీలం.. ‘మేమే నగ్నంగా తయారవుతున్నాం’ తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఫ్యాకల్టీ పోస్టులు -
కోవిడ్ నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్ష చేపట్టారు. సమావేశంలో మంత్రి ఆళ్ల నాని, సీఎస్ ఆదిత్యనాథ్, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: శ్రీశైలంలో తెలంగాణ విద్యుదుత్పత్తిని ఆపండి ఏపీ: ఉత్తర, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు -
నాణ్యమైన విద్యే లక్ష్యం: సీఎం వైఎస్ జగన్
నూతన విద్యా విధానంపై ఎవరైనా సందేహాలు వ్యక్తం చేస్తే ఉన్నతాధికారులు చిరునవ్వు, ఓపికతో సమాధానం చెప్పాలి. కొత్త విధానం లక్ష్యాలను, ప్రయోజనాలను వివరించాలి. 8 ఏళ్లలోపు పిల్లల మానసిక వికాసం చాలా ముఖ్యం. ఈ పిల్లల్లో నూరు శాతం మెదడు అభివృద్ధి చెందుతుంది. ఆ వయస్సులో వారి నైపుణ్యాలను మెరుగుపర్చాలి. ఈ వయస్సులో ఉన్న పిల్లల సంఖ్యకు తగినట్టుగా ఉపాధ్యాయులు ఉండాలి. ఫాండేషన్ స్కూళ్ల లక్ష్యమిదే. ప్రస్తుతం విద్యా కానుకలో ఇస్తున్న దానికంటే వచ్చే ఏడాది అదనంగా స్పోర్ట్స్ డ్రస్, షూలు ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలించాలి. పాఠశాలల్లో ప్రయోగశాలలు, ఇంటర్నెట్తో లైబ్రరీలను బలోపేతం చేయాలి. సాక్షి, అమరావతి: నాణ్యమైన విద్య, బోధన, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా నూతన విద్యా విధానం అమలు కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులు, పిల్లలకు ఎనలేని మేలు చేకూరుతుందని.. ఇప్పటి వారికే కాకుండా తర్వాత తరాలకు కూడా విశేష ప్రయోజనం కలుగుతుందన్నారు. విద్యా శాఖ, అంగన్ వాడీల్లో నాడు–నేడు, నూతన విద్యా విధానంపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన విద్యా విధానంలో ఒక్క స్కూల్ మూత పడటం లేదని, ఒక్క ఉపాధ్యాయుడ్ని కూడా తీసేయడం లేదని, అంతిమంగా అదే సందేశం వెళ్లాలని స్పష్టం చేశారు. అంగన్వాడీల్లో కూడా ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదని, ఒక్క సెంటర్ను కూడా మూసి వేయడం లేదన్నారు. ‘ఇంగ్లిష్ మీడియంలో చదువు చెప్పాలని ఆరాట పడుతున్నాం. పిల్లలకు మంచి విద్య అందించాలని తపన పడుతున్నాం. చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చిస్తున్నాం. ముందు తరాలకు మేలు జరిగేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం. గొప్ప కార్యక్రమం చేపడుతున్నాం. సానుకూల దృక్పథంతో పని చేయండి. ఇదే విషయాన్ని అందరికీ చెప్పండి’ అని స్పష్టం చేశారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. రెండు రకాల స్కూళ్లు రెండు రకాల స్కూళ్లు ఉండాలన్నది మన లక్ష్యం. పీపీ (ప్రీ ప్రైమరీ)1, పీపీ2, ప్రిపరేటరీ క్లాస్, ఒకటి, రెండు తరగతులు ఒక రకం. వీరందరికీ కిలోమీటరు పరిధిలోపు స్కూలు ఉంటుంది. మిగిలిన తరగతులు అంటే.. 3 నుంచి 10వ తరగతి వరకు సమీపంలో ఉన్న హై స్కూల్ పరిధిలోకి తీసుకురావాలి. ఈ స్కూలు కూడా కేవలం 3 కి.మీ పరిధిలో ఉండాలి. మండలానికి ఒకటి లేదా రెండు జూనియర్ కాలేజీలు ఉండాలి. ఉపాధ్యాయుడు, విద్యార్థి నిష్పత్తి హేతుబద్ధంగా ఉండాలి ఉపాధ్యాయుడు, విద్యార్థి నిష్పత్తి హేతుబద్ధంగా ఉండడం అన్నది ఈ విధానంలో ప్రధాన ఉద్దేశం. నలుగురు విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు లేదా ఎక్కువ సంఖ్యలో ఉన్న పిల్లలకు ఒకరే ఉపాధ్యాయుడు ఉండడం సరికాదు. ఒకే ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్టులు బోధించే విధానం సరికాదు. పౌండేషన్ కోర్సులో ఇది చాలా అవసరం. ఎందుకంటే 8 సంవత్సరాలలోపు పిల్లల మానసిక వికాసం చాలా ముఖ్యం. ఈ వయసులోపు పిల్లల్లో నూరు శాతం మెదడు అభివృద్ధి చెందుతుంది. ఆ వయస్సులో వారిలో నైపుణ్యాలను మెరుగుపర్చాలి. ఈ వయస్సులో ఉన్న పిల్లల సంఖ్యకు తగినట్టుగా ఉపాధ్యాయులు ఉండాలి. 3 కిలోమీటర్ల లోపు హైస్కూల్ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమం ఎవరూ వేలెత్తి చూపేదిగా ఉండకూడదు. అలాగే ఒకే చోట ఎక్కువ క్లాస్ రూంలు పెట్టడం సరికాదు. అందరి సందేహాలు తీర్చాలి నూతన విద్యా విధానంపై అందరిలో అవగాహన, చైతన్యం కలిగించండి. ఎవరైనా సందేహాలు వ్యక్తం చేస్తే అధికారులు వారికి తగిన సమయం కేటాయించి వారి సందేహాలు తీర్చండి. ఉన్నతాధికారులు చిరునవ్వు, ఓపికతో వారికి కొత్త విద్యా విధానం లక్ష్యాలను, దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరించండి. భాగస్వాములైన టీచర్లను, ప్రజాప్రతినిధులను అందరినీ పరిగణనలోకి తీసుకుని వారికి వివరాలు తెలియజేసి వారిలో అవగాహన కలిగించండి. వచ్చే సమావేశానికల్లా ఈ నూతన విద్యా విధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలు, అయ్యే ఖర్చుపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి. రెండేళ్లలో ఈ కార్యక్రమాలన్నీ పూర్తి కావాలి. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యా రంగాల్లో సమూల మార్పు తీసుకొస్తున్నాం. ఐదేళ్లలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ మూడు రంగాల్లో మనం చేసిన ప్రగతి కనిపించాలి. ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ అవసరం అంగన్వాడీలు కూడా నాడు-నేడులో భాగం. దీనికి కూడా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించండి. 2 సంవత్సరాలలోపు అనుకున్న కాన్సెప్ట్ పూర్తి కావాలి. సాచ్యురేషన్ పద్ధతిలో అంగన్వాడీలుంటాయి. 55 వేల అంగన్వాడీల్లో మనం ఎక్కడా తగ్గించడం లేదు. ప్రతిభ కలిగిన అంగన్వాడీ టీచర్లకు భవిష్యత్లో పదోన్నతి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటాం. పౌండేషన్ స్కూల్ కాన్సెప్ట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందరూ ఇదే ఫాలో అవ్వాలి. 5వ తరగతి వరకు 18 సబ్జెక్టులు ఒక ఎస్జీటీ టీచర్ డీల్ చేయలేడు. ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ అవసరం. జూలై 1 నుంచి రెండో విడత నాడు–నేడు ప్రారంభమవుతుందని అధికారులు సీఎంకు వివరించారు. స్కూళ్లలో నాడు –నేడు గురించి తెలంగాణ అధికారులు సంప్రదించారని తెలిపారు. తెలుగు వారు ఎక్కడున్నా వారికి మంచి జరగాలని ఈ సందర్భంగా సీఎం జగన్ ఆకాంక్షించారు. విద్యా కానుకలో భాగంగా ఇవ్వనున్న డిక్షనరీని అధికారులు ముఖ్యమంత్రికి చూపించారు. ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎన్ఈపీ (నేషనల్ ఎడ్యుకేషన్ ప్లాన్) ప్రకారం నాణ్యమైన విద్య, నాణ్యమైన బోధన, నాణ్యతతో కూడిన మౌలిక సదుపాయాల కల్పన మన లక్ష్యం. ఆ మేరకు పిల్లలకు విద్య అందించేదిగా మన విద్యా విధానం ఉండాలి. మనం చేస్తున్న పనులన్నీ కూడా తలెత్తుకుని చేస్తున్నవి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. అటు ఉపాధ్యాయులుకు, ఇటు పిల్లలకు నూతన విద్యా విధానంతో మంచి జరుగుతుందని వివరించండి. ఆట స్థలం లేని స్కూళ్లకు నాడు- నేడు కింద భూమిని కొనుగోలు చేయాలి. ప్రస్తుత విద్యా కానుకలో ఇస్తున్న దానికంటే వచ్చే ఏడాది అదనంగా స్పోర్ట్స్ డ్రస్, షూలు ఇచ్చే అంశాన్ని పరిశీలించండి. ఇందుకోసం ప్రణాళిక వేసుకోవాలి. పాఠశాలల్లో ప్రయోగశాలలు, లైబ్రరీలను బలోపేతం చేసుకోవాలి. పాఠశాల లైబ్రరీల్లో ఇంటర్నెట్ సదుపాయం అందించాలి. -
పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు (కేసీఆర్) ఆదివారం సమీక్ష నిర్వహించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంపై సీఎం సమావేశమయ్యారు. జిల్లాల వారీగా పనుల పురోగతిని కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమాల తదుపరి లక్ష్యాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. చదవండి: హైదరాబాద్: ముగ్గురు మహిళల అదృశ్యం కలకలం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. వెబ్సైట్ నిలిపివేత! -
AP: పోలవరం ప్రగతిపై నేడు సమీక్ష
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై గురువారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశాన్ని వర్చువల్గా నిర్వహిస్తామని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్కు కేంద్ర జల్శక్తిశాఖ కార్యదర్శి పంకజ్కుమార్ లేఖ రాశారు. ఈ సమీక్షలో రాష్ట్ర జలవనరులశాఖ ఉన్నతాధికారులతోపాటు పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, సీడబ్ల్యూసీ చైర్మన్ హెచ్కే హల్దార్, డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్య తదితరులు పాల్గొననున్నారు. ప్రాజెక్టును 2022 నాటికి పూర్తిచేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనులను వేగవంతం చేసిన విషయం విదితమే. ఈ సీజన్లో చేయాల్సిన పనుల ప్రగతిపై సమావేశంలో సమగ్రంగా సమీక్షిస్తారు. ఎగువ కాఫర్ డ్యామ్ పనులు, వరదను దిగువకు మళ్లించే స్పిల్వే పనులు, 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పనపై చర్చిస్తారు. గోదావరి వరదను స్పిల్వే మీదుగా మళ్లించడంపై సమీక్షించి, వరద సమయంలో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పనులు చేపట్టి 2022 నాటికి ప్రాజెక్టును పూర్తిచేయడానికి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించనున్నారు. రెండోసారి సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు పెట్టుబడి అనుమతి ఇవ్వడం, ఆ మేరకు నిధులు విడుదల చేయడం, రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు పనులకు ముందుగా ఖర్చుచేసిన నిధులను రీయింబర్స్ చేయడంలో జాప్యం లేకుండా చూడటం, ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయడానికి అవసరమైన సహకారం అందించడంపై కూడా సమావేశం అజెండాలో చేర్చాలని విజ్ఞప్తి చేస్తూ బుధవారం కేంద్ర జల్శక్తిశాఖ కార్యదర్శి పంకజ్కుమార్కు రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు లేఖ రాశారు. పనుల పరిశీలన పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను బుధవారం ప్రత్యేక అధికారుల బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, సీఈ సీడీవో కె.శ్రీనివాస్, సీఈ హైడ్రాలజీ టీఎన్వీ కుమార్, ఆంధ్రా రీజియన్ క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజినీర్ రేవు సతీష్కుమార్, అడ్వయిజర్ గిరిధర్రెడ్డి, పోలవరం ప్రాజెక్టు సీఈ ఎం.సుధాకర్బాబు పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అప్రోచ్ చానల్, స్పిల్ చానల్, పైలెట్ చానల్, కాఫర్ డ్యామ్ పనులు పరిశీలించి ఎస్ఈ కె.నరసింహమూర్తిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈనెల 15వ తేదీలోపు స్పిల్వే మీదుగా గోదావరి నీటిని దిగువకు మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. స్పిల్వే మీదుగా నీరు దిగువకు విడుదల చేస్తే నీటి ప్రవాహం ఎలా ఉంటుంది, ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాలపై చర్చించారు. కాఫర్ డ్యామ్ నిర్మాణంతో ఇప్పటికే నీరు ఎగపోటు పెరుగుతోందనే అంశాన్ని పరిశీలించారు. స్పిల్వే, రివర్స్ స్లూయిజ్ గేట్ల నుంచి దిగువకు స్పిల్ చానల్ మీదుగా తిరిగి గోదావరి ప్రవాహం యథావిధిగా నదిలో కలిసేలా పనులు చేపట్టారు. అనంతరం పోలవరం గ్రామంలో వరద రక్షణగా నిర్మించిన నెక్లెస్బండ్ పనులను అధికారుల బృందం పరిశీలించింది. చదవండి: Jagananna Vidya Kanuka: నాణ్యమైన ‘కానుక’.. ఈ ఏడాది అవి అదనం -
ఇసుక, మైనింగ్పై సమీక్ష నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: ఇసుక, మినరల్ కన్సెషన్ అప్లికేషన్లు, మైనింగ్పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం రోజున సమీక్ష నిర్వహించారు. ఇకపై జిల్లాల వారీగా ఔట్సోర్సింగ్ ద్వారా సీనరేజీ కలెక్షన్లు ఉంటాయని మంత్రి తెలిపారు. వాల్యూమెట్రిక్ బదులు వెయిట్ బేసిస్లో సీనరేజీ వసూళ్లకు ప్రణాళికలను సిద్ధం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా జగనన్న కాలనీలకు ఉచిత ఇసుక కోసం ప్రత్యేక కూపన్లను ఇవ్వాలని అధికారులకు సూచించారు. మైనర్ మినరల్స్ లీజులను ఈ-ఆక్షన్ ద్వారా కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. శాస్త్రీయ విధానంలో మైనింగ్ లీజుల పెంపుదలకు ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తెలిపారు. చదవండి: సర్పంచులు, వార్డు సభ్యులందరికీ తక్షణమే వ్యాక్సిన్ ఇవ్వాలి -
పంటల ప్రణాళికకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి: కన్నబాబు
సాక్షి, విజయవాడ: పంటల ప్రణాళికలకు ఈ ఏడాది నుంచి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. బుధవారం ఆయన వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా ఖరీఫ్ సన్నద్ధత, వైఎస్సార్ పొలంబడి, విత్తనాలు, ఎరువుల సరఫరాపై మంత్రి సమీక్షించారు. ఆర్బీకేల మౌలిక సదుపాయాల కల్పనపై సూచనలిచ్చారు. క్రాప్ ప్లానింగ్, ప్రత్యామ్నాయ పంటలపై జేసీలు దృష్టి సారించాలన్నారు. జులై 8న వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నామని.. జులై 8న కస్టమ్ హైరింగ్ సెంటర్లు, హబ్లు ప్రారంభిస్తామని తెలిపారు. వరికి సంబంధించి సూక్ష్మ స్థాయిలో ప్రణాళికలు చాలా ముఖ్యమని, బోర్ల కింద పండించే వరి పంటలకి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని కన్నబాబు అన్నారు. చదవండి: వైఎస్ఆర్ బీమాపై సమీక్ష: సీఎం జగన్ కీలక నిర్ణయాలు సీఎం జగన్ను కలిసిన ‘డీఎస్సీ-2008’ అభ్యర్థులు -
కోవిడ్ నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. సమీక్షకు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్ఫోర్స్ అధికారులు హాజరయ్యారు. చదవండి: Andhra Pradesh: చెప్పినవే కాదు... చెప్పనివీ చేశాం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న సీఎం వైఎస్ జగన్ -
ఒలింపిక్స్ క్రీడల సన్నద్ధతపై మోదీ సమీక్ష
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ క్రీడల సన్నద్ధతపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనదేశ సంస్కృతికి క్రీడలు హృదయం లాంటివని.. మన దేశ యువత బలమైన, తేజోవంతమైన క్రీడా సంస్కృతిని సృష్టిస్తున్నారని అభినందించారు. ఒలింపిక్స్లో పాల్గొనే అథ్లెట్ల వెంట 135 కోట్ల దేశ ప్రజల శుభాకాంక్షలతో పాటు, దీవెనలు కూడా ఉంటాయని తెలిపారు. ఈ క్రమంలో, క్రీడా కారులందరికి వ్యాక్సినేషన్తో పాటు, సరైన శిక్షణ , ఇతర సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఒక్కో క్రీడాకారుడి ప్రతిభతో మరో వంద మంది స్ఫూర్తిని పొందుతారని అన్నారు. ఒలింపిక్స్లో పాల్గోనే క్రీడాకారుల బృందంతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించే క్రమంలో దేశమంతా వారివెంటే నిలుస్తుందని అన్నారు. టోక్యోలో జరగబోయే ఈ క్రీడల్లో మన దేశం నుంచి 11 క్రీడా విభాగాలలో మొత్తం 100 మంది అథ్లెట్లు అర్హత సాధించారని తెలిపారు. అయితే, జూన్ చివరి నాటికి మరో 25 మంది వివిధ క్రీడలకు అర్హత సాధించే అవకాశం ఉందని ప్రధాని మోదీ వివరించారు. టోక్యో ఒలింపిక్స్ క్రీడలకు మరో 50 రోజుల గడువు మిగిలి ఉందన్న సంగతి తెలిసిందే. -
అగ్రి ఇన్ఫ్రా ఫండ్ ప్రాజెక్టులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
మూడో దశ కరోనాపై సర్కార్ హైఅలర్ట్
భువనేశ్వర్: కరోనా మూడో దశ కొత్త తరహాలో పంజా విసురుతుంది. ఈ నేపథ్యంలో కోవిడ్ నిర్వహణ యంత్రాంగం అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్సులో సమీక్షించారు. మూ డో దశ కరోనా సంక్రమణ నేపథ్యంలో శిశు సంరక్షణ, చికిత్స పట్ల నిర్వహణ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ వహించి పరిస్థితులు చేయి దాటకుండా జాగ్రత్త వహించాలని కోరారు. వచ్చే వారంలోగా రాష్ట్రంలో కరోనా సంక్రమణ పరిస్థితి మరింత అదుపులోకి వస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్ వితంతువులకు పింఛన్ రాష్ట్రంలో కోవిడ్–19 సంక్రమణతో ప్రాణాలు కోల్పోయిన వారి భార్యలకు వితంతు పింఛన్ మంజూరుకు ముఖ్యమంత్రి ఆదేశించారు. కరోనా మహమ్మారితో తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలైన బాలలకు కూడా పింఛన్ మంజూరు చేస్తారు. మధుబాబు పింఛన్ పథకం కింద 15 రోజుల్లో ఈ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
అగ్రి ఫండ్ ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి: అగ్రి ఫండ్ ప్రాజెక్టులు, మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాల(ఎంపీఎఫ్సీ)పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసూధన్రెడ్డి, మార్కెటింగ్ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, ఏపీడీడీసీ డైరెక్టర్ అహ్మద్బాబు, వ్యవసాయ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్, మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు, ఉద్యానవన కమిషనర్ ఎఫ్ఎస్ శ్రీధర్తో పాటు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: ఆనందయ్య మందుల తయారీ ఇలా -
కోవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష
-
కేంద్రం నుంచి పోలవరం బిల్లుల చెల్లింపుపై సీఎం జగన సమీక్ష
-
జల వనరుల శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి: జల వనరుల శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. పోలవరం సహా ప్రాధాన్యత ప్రాజెక్టుల నిర్మాణ ప్రగతిపై సీఎం సమీక్షిస్తున్నారు. ఈ సమావేశంలో జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్,ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
Andhra Pradesh: బలంగా బడి పునాదులు
సాక్షి, అమరావతి: ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు గట్టి పునాదులు వేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పానికి అనుగుణంగా ప్రాథమిక విద్యలో విప్లవాత్మక మార్పులు తెస్తూ అధికారులు కీలక ప్రతిపాదనలు రూపొందించారు. అందులో భాగంగా ఫౌండేషన్ స్కూళ్లకు అంకురార్పణ జరగనుంది. జనాభా తక్కువగా ఉండే చిన్న చిన్న ఆవాసాల్లో (హ్యామ్లెట్స్) పీపీ –1, పీపీ–2 (ప్రీ ప్రైమరీ) స్కూళ్లు మాత్రమే ఉంటాయి. మిగతా అన్ని చోట్ల ప్రీ ప్రైమరీ, ప్రిపరేటరీ, 1, 2 తరగతులతో ఫౌండేషన్ స్కూళ్లు ఉంటాయి. వీటిపై గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కొన్ని సూచనలు చేయడంతో పాటు వ్యయం, విద్యారంగంపై చూపే ప్రభావాన్ని పూర్తిస్థాయిలో మదింపు జరిపి తదుపరి సమీక్షలో నివేదించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి జగన్ సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. నా తపన, ఆరాటం అందుకే.. చిన్నారుల్లో ఆరేళ్ల లోపే 80 శాతం మేధో వికాసం జరుగుతుంది. బాల్యంలో మెదడు బాగా చురుగ్గా ఉంటుంది. పిల్లలకు 8 ఏళ్ల వయసు వచ్చే నాటికి ఫౌండేషన్ కోర్సు పూర్తవుతుంది. ఆంగ్ల భాషలో చిన్నారులు ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు. అందుకే ఈ ఆలోచన చేశాం. నిరుపేద విద్యార్థులకు కూడా అత్యుత్తమ ప్రమాణాలతో విద్య అందించాలనేదే నా తపన, ఆరాటం. ఆ ఆలోచనల నుంచి ఆవిర్భవించినవే వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లు.. ఫౌండేషన్ స్కూళ్లు. అన్ని వసతులతో విద్యార్థులకు విద్యా బోధన నిర్వహించేలా ‘మన బడి నాడు – నేడు’ చేపట్టి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చేస్తున్నాం. పీపీ స్కూళ్లు – మ్యాపింగ్.. ఇక ఇప్పుడు ఏర్పాటు చేయదలచిన ఫౌండేషన్ స్కూళ్లు అన్నీ ఒక కిలోమీటర్ దూరం లోపే ఉండాలి. అన్ని హైస్కూళ్లు (3 తరగతి నుంచి 10 లేదా 12వ తరగతి) మూడు కిలోమీటర్ల దూరం లోపే ఉండాలి. వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లు పిల్లలకు చాలా దగ్గరగా అందుబాటులో ఉండాలి. ఆ విధంగా ఆ స్కూళ్ల మ్యాపింగ్ చేయాలి. టీచర్ల బోధనా సామర్థ్యాన్ని మరింత మెరుగ్గా వినియోగించుకునేలా విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) చేయాలి. తద్వారా పిల్లలకు అత్యుత్తమ విద్య అందించవచ్చు. కొత్త ప్రతిపాదనల ప్రభావంపై అధికారులు పూర్తిస్థాయిలో సమాలోచనలు జరిపి తదుపరి సమీక్షలో నివేదించాలి. ఒకవేళ వాటిని అమలు చేయాల్సిన పక్షంలో ముందుగా 3, 4, 5 తరగతులను హైస్కూళ్లకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఖరారు అయిన తర్వాత ఫౌండేషన్ స్కూళ్లలో చేపట్టాల్సిన నాడు – నేడు కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. డిజిటల్ టీచింగ్.. మెథడాలజీ స్థానిక ప్రాథమిక పాఠశాలల్లో పీపీ – 1, పీపీ – 2, ప్రిపరేటరీ, 1, 2 తరగతులతో ఫౌండేషన్ స్కూళ్ల ఏర్పాటు తర్వాత డిజిటల్ బోధన(డిజిటల్ టీచింగ్)పై దృష్టి పెట్టండి. ఆ మేరకు డిజిటిల్ బోధనా పద్ధతులు (టీచింగ్ మెథడాలజీ) రూపొందించండి. మనం బ్లాక్ బోర్డు నుంచి గ్రీన్ బోర్డ్స్కు మారాం. ఇక ముందు డిజిటల్కు వెళ్లే పరిస్థితి వస్తుంది. డిజిటల్ బోర్డుల డ్యూరబులిటీ (దీర్ఘకాలం మన్నిక) ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. మనం ఏర్పాటు చేసే పరికరం నాణ్యంగా, ధృఢంగా (రోబస్ట్) ఉండాలి. మరమ్మతులకు అవకాశం తక్కువగా ఉండే డివైజ్లను గుర్తించండి. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని పరిశీలన చేయండి. ఎన్ని స్కూళ్లలో, ఎన్ని క్లాస్రూమ్లలో ఏర్పాటు చేయగలం? ఎంత వ్యయం అవుతుంది? అన్నవాటిని సమీక్షించాలి. జూనియర్ కాలేజీలపై.. అధికారులు చేస్తున్న తాజా ప్రతిపాదనల వల్ల కాస్ట్ ఇంపాక్ట్, ఎడ్యుకేషన్ ఇంపాక్ట్పై పరిశీలన చేయండి. ప్రతి మండలానికీ ఒక జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలనుకున్నాం. అలా కాకుండా ప్రస్తుతం ఉన్న హైస్కూళ్లలోనే 11, 12 తరగతులను పెట్టడమా? లేక మండలానికి ఒక జూనియర్ కాలేజీని పెట్టాలా? అలాగే కొన్ని మండలాల్లో అవసరాల మేరకు రెండు జూనియర్ కాలేజీలు పెట్టాలా? అన్నదానిపై పూర్తి స్థాయి పరిశీలన చేయండి. దీనిపై తర్వాత తుది నిర్ణయం తీసుకుందాం. దీనివల్ల 11, 12 తరగతులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో మంచి విద్య అందించే అవకాశం ఉంటుంది. వైఎస్సార్ క్లినిక్స్కు సేవల బదలాయింపు.. అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలు వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, అర్బన్ క్లినిక్స్కు బదలాయింపు జరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు, పౌష్టికాహారంపై అవగాహన, వ్యాధి నిరోధకత కోసం ఇచ్చే వ్యాక్సిన్లు, రిఫరల్ సర్వీసులన్నీ వాటికి బదలాయింపు అవుతాయి. తద్వారా సుశిక్షితులైన సిబ్బంది ద్వారా మెరుగైన ఆరోగ్య సేవలు అందుతాయి. ఇవీ ప్రతిపాదనలు ప్రీ ప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులకు గట్టి పునాదులపై గత సమావేశంలో నిర్ణయించిన ప్రకారం పాఠశాల విద్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు పలు ప్రతిపాదనలు సమర్పించారు. టీచర్ల సేవలను సమర్థంగా వినియోగించుకోడం, ఉత్తమ విద్యాబోధన తదితర అంశాలే లక్ష్యాలుగా సరికొత్త ఆలోచనలు. ఇందులో భాగంగానే ఫౌండేషన్ స్కూళ్ల ఏర్పాటు. ఇప్పటి మాదిరిగానే యథావిధిగా ఆ స్కూళ్లలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ అమలు పీపీ –1, పీపీ –2, ప్రిపరేటరీ, 1వ తరగతి, 2వ తరగతికి ఫౌండేషన్ స్కూళ్లు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో దీనికి ఆనుకుని ఉన్న అంగన్వాడీ కేంద్రం విలీనం. తద్వారా ఫౌండేషన్ స్కూళ్లకు అంకురార్పణ. ఫౌండేషన్ స్కూళ్ల పరిధిలోకి వాటికి సమీపంలోని పీపీ –1, పీపీ –2లుగా మారుస్తున్న అంగన్వాడీ కేంద్రాలు. పాఠ్యాంశాలు, సమగ్ర బోధనా పద్ధతులతో పాటు వాటిలో నైపుణ్యాల స్థాయి పెంపు. మల్టీలెవల్ లెర్నింగ్పై ఫౌండేషన్ స్కూళ్ల ద్వారా దృష్టి. ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న 3, 4, 5 తరగతులు సమీపంలోని అప్పర్ ప్రైమరీ (యూపీ) స్కూళ్లు, హైస్కూళ్లకు బదలాయింపు. ఆ మేరకు యూపీ స్కూళ్లు, హైస్కూళ్లగా మార్పు. అవసరాలకు అనుగుణంగా తరగతి గదుల నిర్మాణం. ఫౌండేషన్ స్కూళ్ల ఏర్పాటు ద్వారా అధ్యాపక స్రవంతిలోకి అంగన్వాడీ టీచర్లను తీసుకురావాలని ప్రతిపాదన. వారు సరైన నైపుణ్యాలు సంతరించుకునేలా శిక్షణ కార్యక్రమాలు. ప్రమోషన్ల ద్వారా ప్రైమరీ స్కూళ్లలో ఎస్జీటీలు (టీచర్లు)గా అవకాశం. సమావేశంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ గిరిజాశంకర్, పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేపు చినవీరభద్రుడు, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతికా శుక్లాతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఇరిగేషన్పై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిథిలో, దేవరకొండ నుంచి కోదాడ వరకు ప్రభుత్వం ఇప్పటికే నిర్మించ తలపెట్టిన అన్ని లిప్టు పథకాల నిర్మాణ అంచనాలను (ఎస్టిమేట్స్) జూన్ 15 వరకు పూర్తి చేసి టెండర్లు వేయడానికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(కేసీఆర్) అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఇరిగేషన్పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇటీవల నెల్లికల్లులో శంకుస్థాపనతో మంజూరు చేసిన 15 లిఫ్టు ప్రాజెక్టులన్నింటికి, కాల్వల నిర్మాణం, పంపుల ఏర్పాటు తదితరాలన్నీ కలిపి అంచనాలను తయారు చేయాలని సీఎం సూచించారు. ఏలిప్టుకాలిప్టు ప్రకారం అంచనాలను వేరు వేరుగా తయారు చేసి అన్నింటికీ ఒకేసారి టెండర్లు పిలవాలని ఇరిగేషన్ శాఖాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ వరప్రదాయనిగా కాళేశ్వరం ప్రాజెక్టు మారిన నేపథ్యంలో వాన కాలం సీజన్ ప్రారంభం కాగానే నీటిని ఎత్తిపోసి పైనించి చివరి ఆయకట్టు తుంగతుర్తి దాకా వున్న అన్ని చెరువులను, రిజర్వాయర్లను, చెక్ డ్యాములను నింపుకోవాలని సీఎం సూచించారు. ఇప్పటికే కాళేశ్వరం నీటితో 90 శాతం చెరువులు, కుంటలు నిండివుండడంతో భుగర్భ జలాలు పెరిగాయని తద్వారా బోర్లల్లో నీరు పుష్కలంగా లభిస్తున్ననేపథ్యంలో రైతులు వరిపంట విస్తృతంగా పండిస్తున్నారని సీఎం చెప్పారు. రోహిణి కార్తె ప్రారంభమయిన నేపథ్యంలో, నారుమడి సిద్ధంచేసుకుంటే వరిపంట చీడపీడల నుంచి రక్షింపబడతుందనీ, అధిక దిగుబడి వస్తుందనే విశ్వాసంతో రైతులు వుంటారనీ, కాబట్టీ వారికి నీరు అందించడానికి ఇరిగేషన్ శాఖ సంసిద్ధం కావాలని సీఎం సూచించారు. కాళేశ్వరాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం తెలిపారు. కాళేశ్వరంతో వ్యవసాయ రంగ ముఖచిత్రం మారిపోయిందన్నారు. ‘‘కాళేశ్వరంతోనే 35 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండిస్తున్నాం. నదీ గర్భంలోనే 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే స్థాయికి చేరాం. జూన్ 30 వరకు మొదటి దశ చెక్డ్యాంలు పూర్తిచేయాలి. దేవాదుల ప్రాజెక్టును వరంగల్ జిల్లాకే అంకితం చేస్తాం. కాల్వల మరమ్మతుల కోసం రూ.700 కోట్లు కేటాయించాం. కాగజ్నగర్, బెల్లంపల్లిలో లిఫ్ట్కు ఆయకట్టు సర్వే చేయాలని’’ సీఎం కేసీఆర్ ఆదేశించారు. చదవండి: తెలంగాణ సర్కార్కి జూడాల షాక్ ఆ మాట వాస్తవమే: కేంద్రమంత్రి కిషన్రెడ్డి -
యాస్, కరోనాను సమర్ధంగా ఎదుర్కొంటాం: సీఎం
భువనేశ్వర్: నాలుగున్నర కోట్ల రాష్ట్ర జనాభా ప్రాణరక్షణ ప్రభుత్వం బాధ్యత. కరోనా, యాస్ తుపాను రాష్ట్రంలో తాండవిస్తున్నాయి. మొదటి నుంచి వేధిస్తున్న కరోనా నివారణ పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా యాస్ తుపాను విపత్తు నుంచి గట్టెక్కాలి. తుపాను ప్రాణహాని నివారణ కోసం లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలింపు కోసం ప్రజలంతా విధిగా రెండు మాస్క్లు ధరించాలి. కరోనా నిర్వహణలో తలమునకలై ఉన్న ప్రభుత్వ యంత్రాంగానికి యాస్ తుపాను నిర్వహణ మరింత భారం కానుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ముఖానికి రెండు మాసు్కలు ధరించి సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యకలాపాల్లో అధికారులకు సహకరించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం యాస్ తుపాను నిర్వహణకు రాష్ట్ర ప్రజల నుద్దేశించి వీడియో సందేశం జారీ చేశారు. సమర్థంగా గత తుపానుల ఎదుర్కొన్నాం తుపాను విపత్తు నిర్వహణలో భాగంగా ప్రజలకు మాసు్కల పంపిణీలో పౌర సమాజం, పంచాయతీ రాజ్ వ్యవస్థ, మిషన్ శక్తి విభాగం సహకరిస్తాయి. సమష్టి భాగస్వామ్యంతో లోగడ అంఫన్ వంటి భయానక తుపానులను సమర్ధంగా ఎదుర్కొన్న సందర్భాల్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తుపాను తర్వాత కూడా రాష్ట్ర ప్రజలు ముఖానికి రెండు మాసు్కలు ధరించడం అలవరుచుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనా తాండవంతో అల్లాడుతున్న విపత్కర పరిస్థితుల్లో మరో భారీ విపత్తు యాస్ తుపాను దూసుకు వస్తోంది. ఈ జంట విపత్తుల నుంచి సురక్షితంగా బయట పడేందుకు ప్రభుత్వ కార్యాచరణకు ప్రజలంతా పూర్తిగా సహకరించాలి. తుపాను సందర్భంగా నిర్వహించే తరలింపు కార్యకలాపాలకు ప్రజలు పూర్తిగా సహకరించాలి. తుపాను విపత్తు నిర్వహణ రాష్ట్రానికి కొత్తేమీ కాకున్నప్పటికీ నిర్లక్ష్యం వహిస్తే భారీ నష్టం సంభవించే ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా అంతా ఉమ్మడిగా అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. -
కరోనా చికిత్సలో అందరి చూపు ఏపీ వైపు
కర్నూలు: ఆదోని, నంద్యాల ఆస్పత్రిల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో కరోనా చికిత్సకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, అందుకే అందరూ ఏపీ వైపు చూస్తున్నారు అని పేర్కొన్నారు. కోవిడ్ కట్టడి కోసం సోమవారం కర్నూలులో జిల్లా అధికారులతో మంత్రి సమీక్షచేశారు. జిల్లాలో ఎమ్మెల్యేలు ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటుకు సహకరిస్తున్నారని చెప్పారు. కరోనాతో మరణించిన తల్లిదండ్రుల పిల్లలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు. కరోనా కట్టడికి ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమీక్ష సమావేశం అనంతరం మంత్రి మాట్లాడారు. ఇలా.. ‘కరోనా నివారణ కు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులతో వివరాలు సేకరించాం. గ్రామ స్థాయి నుంచి ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులపై అడిగి తెలుసుకుంటాం. ఆదోని, నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు కు చర్యలు తీసుకుంటున్నాం. అతి త్వరలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఫ్రంట్ లైన్ వారియర్స్కు టీకాను అందజేశాం. వారితో పాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి కూడా టీకా వేయిస్తాం. తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు భరోసా కల్పించేందుకు ఏపి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని వివరించారు. ‘రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆక్సిజన్, బెడ్స్ ఇంజెక్షన్లపై అధికారులు సమన్వయంతో తో పని చేస్తున్నారు. ప్రభుత్వ అందిస్తున్న సదుపాయాలకు ప్రజలు సహకరించాలి. కరోనాపై అప్రమత్తంగా ఉండాలి. లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రులను సంప్రదించి చికిత్స పొందాలి. లేదంటే ప్రమాదమే. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో కరోనా చికిత్సకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అందరూ ఏపీ వైపు చూస్తున్నారు. కొవిడ్ కేర్ సెంటర్లో ప్రతి ఒక్కరూ కి చికిత్సతోపాటు భోజనం, మౌలిక సదుపాయాలను ఏపీ ప్రభుత్వం అన్ని కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముందులు, ఆక్సిజన్ అన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు అందిస్తోంది. ఎక్కువగా రికవరిగా పొందిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీనే’ అని మంత్రి బుగ్గన తెలిపారు. -
Cyclone Yaas: యాస్ తుపానుపై ప్రధాని మోదీ సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: యాస్ తుపానుపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. వర్చువల్ ద్వారా వివిధ మంత్రిత్వశాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ, టెలికాం విద్యుత్, పౌరవిమానయాన అధికారులు పాల్గొన్నారు. యాస్ తుపాను సన్నద్ధత, ముందస్తు జాగ్రత్త చర్యలపై ప్రధాని సమీక్షించారు. నెల 26న ఒడిషా - బెంగాల్ మధ్య తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో 46 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేంద్రం సిద్ధం చేసింది. తీరం దాటే సమయంలో గంటకు 185 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో సహాయ చర్యల కోసం నేవీ.. షిప్లు, హెలికాప్టర్లు సిద్ధం చేసింది. అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారులతో రాజ్నాథ్సింగ్ సమీక్ష అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారులతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్, రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు పాల్గొన్నారు. 12వ తరగతి పరీక్షలు, వివిధ ఎంట్రన్స్ల నిర్వహణపై చర్చ జరిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరీక్షల నిర్వహణపై చేపట్టిన చర్యలను కేంద్రానికి ఆయన వివరించారు. ప్రస్తుత పరిస్థితులను రాజ్నాథ్కు మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు. -
ఆయుర్వేద మందు అధ్యయనానికి సీఎం జగన్ ఆదేశం
సాక్షి, అమరావతి: ఆనందయ్య ఆయుర్వేద మందుపై అధ్యయనానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. నెల్లూరు ఆయుర్వేదంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని అధికారులను ఆయన ఆదేశించారు. నెల్లూరుకు వైద్యులు, శాస్త్రవేత్తల బృందాన్ని పంపించాలన్నారు. కరోనా నియంత్రణ, వాక్సినేషన్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. బ్లాక్ ఫంగస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. ఆక్సిజన్ తీసుకునేటప్పుడు వినియోగించే నీటి విషయంలో జాగ్తత్తలు తీసుకోవాలనే సమాచారం వస్తోందని.. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని పటిష్టమైన ప్రోటోకాల్స్ రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆక్సిజన్ సరఫరా పైపులు, మాస్క్లు ఇవన్నీ కూడా నిర్ణీత ప్రమాణాలున్న వాటినే వినియోగించాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా బెడ్ కెపాసిటీకి అనుగుణంగా ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. జనరేటర్లను ఏర్పాటు చేసుకునే ఆస్పత్రులకు 30శాతం ఇన్సెంటివ్లు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ముందస్తుగానే వారికి ఇన్సెంటివ్లు ఇవ్వడం ద్వారా చురుగ్గా ఆక్సిజన్ జనరేటర్ల్లను ఏర్పాటు చేసుకునేలా వారిని ప్రోత్సహించవచ్చని సీఎం అన్నారు. కనీసం నాలుగు నెలల వ్యవధిలో అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేటర్లు ఏర్పాటయ్యేలా చూడాలని సీఎం సూచించారు. 50 పడకలు, అంతకన్నా ఎక్కువ ఉన్న ఆస్పత్రుల్లో కచ్చితంగా ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్లు పెట్టాలని సీఎం ఆదేశించారు. కొత్తగా 100 టన్నుల ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే కంపెనీలు పెడితే 20 శాతం ఇన్సెంటివ్ ఇస్తామని సీఎం తెలిపారు. గవర్నమెంట్ ఆస్పత్రుల్లో పిల్లల చికిత్స కోసం ఐసీయూ బెడ్స్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం పైనా దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్తులో ఎలాంటి మహమ్మారినైనా ఎదుర్కోనేందుకు ఈ ఏర్పాట్లు ఉండాలని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న డిమాండ్కు తగినట్టుగా ఆక్సిజన్ రాష్ట్రంలోనే ఉత్పత్తి అయ్యే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్సిజన్ తయారీలో వినియోగించే జియోలైట్ కొరతను ఎదుర్కొనేందుకు కడపలో తయారీ పరిశ్రమను త్వరలో తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. రోగులకు మంచి ఆహారం, ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం బాగుండాలని సీఎం అన్నారు. ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాం కాబట్టి, చిన్న చిన్న విషయాల్లో ఎలాంటి కొరత లాకుండా ఉండాలన్నారు. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతి ఆస్పత్రి నుంచి నివేదికలు తెప్పించుకుని చర్యలు తీసుకోవాలన్నారు. రోగులకు అసౌకర్యంగా, అపరిశుభ్ర వాతావరణం ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. రోగులకు నాణ్యమైన సేవలు అందాలని సీఎం స్పష్టం చేశారు. ఆక్సిజన్ సేకరణ, సరఫరా, నిల్వలపై సీఎం సమీక్షించారు. 2 ఆక్సిజన్ ట్రైన్లు నడుస్తున్నాయని సీఎంకు అధికారులు వివరించారు. ఈ వారంలో మరో ఆక్సిజన్ ట్రైన్ కూడా ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు. దీంతోపాటు భువనేశ్వర్కు ప్రతి రోజూ కూడా ట్యాంకర్లను ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నామని అధికారులు వివరించారు. దేశంలో ఎక్కడ ఆక్సిజన్ కేటాయించినా డ్రా చేయగలుగుతున్నామని అధికారులు తెలిపారు. ఐఎస్ఓ ట్యాంకర్లను వినియోగించుకుని సమర్థవంతంగా ఆక్సిజన్ సేకరించుకోగులుగుతున్నామని అధికారులు తెలిపారు. అలాగే ఆస్పత్రుల్లో ఆక్సిజన్ వినియోగంపై ఆడిట్ చేస్తున్నామని అధికారులు వివరించారు. ఎక్కడ వృథా అవుతున్నా అప్రమత్తం చేస్తున్నామని, వృథాను అరికట్టడంపై దృష్టిపెడుతున్నామన్న అధికారులు వివరించారు. ఆక్సిజన్ సేకరణ, సరఫరా, పంపిణీ, ఆస్పత్రుల్లో వినియోగం.. వీటన్నింటినీ కూడా పూర్తిగా కంప్యూటరైజ్ చేశామని అధికారులు తెలిపారు. 9 పీఎస్ఏ యూనిట్లను పునరుద్ధరించడం ద్వారా 52.75 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లభించిందని అధికారులు తెలిపారు. మరో 5 పీఎస్ఏ యూనిట్లను పునరుద్ధరించే పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. 12 నైట్రోజన్ యూనిట్లను కూడా మార్పు చేయడం ద్వారా మరో 11.41 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అదనంగా వస్తుందన్నారు. కొత్తగా నాలుగు కంపెనీలు ఆక్సిజన్ ఉత్పత్తికి ముందుకొస్తున్నాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకన్నా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులు, అలాగే రెమ్డెసివర్ లాంటి ఇంజక్షన్ల ఇషయంలో అక్రమాలకు పాల్పడ్డ ఆస్పత్రులపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇంటెలిజెన్స్ అధికారులు బుక్ చేసిన కేసులపై చర్యలుండాలని సీఎం అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎంటీ కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజ్మెంట్, వ్యాక్సినేషన్) ఎం.రవిచంద్ర, ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్,104 కాల్ సెంటర్ ఇంఛార్జ్ ఎ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ ఎ.మల్లికార్జున్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జువ్వాది సుబ్రమణ్యం, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: AP Budget 2021: జన సాధికార బడ్జెట్ ప్రాణం విలువ తెలిసిన వాడిని: సీఎం జగన్ -
ఆక్సిజన్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి: ఆళ్ల నాని
సాక్షి, అమరావతి: రానున్న రోజుల్లో ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా కొత్తగా ప్లాంట్లు ఏర్పాటు, మరో 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. మంగళవారం ఆయన కోవిడ్ టాస్క్ఫోర్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆక్సిజన్ జనరేషన్, స్టోరేజ్ల పెంపుపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీచింగ్ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పీఎస్ఏ యూనిట్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బ్లాక్ ఫంగస్ కేసులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కాటంనేని భాస్కర్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ విజయరామరాజు, స్టేట్ నోడల్ ఆఫీసర్ కృష్ణ బాబు పాల్గొన్నారు. చదవండి: అవాస్తవాలు నమ్మొద్దు: ఎ.కె.సింఘాల్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు: మొహం చాటేసిన చంద్రబాబు -
Tauktae Cyclone: పరిస్థితిపై ప్రధాని మోదీ సమీక్ష
గాంధీనగర్: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తౌక్టే తుపానుగా రూపాంతరం చెందింది. కేరళ, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్పై తుపాను ప్రభావం అదికంగా ఉండనుంది. ఈ నెల 18న తుపాను గుజరాత్ వద్ద తీరం దాటే అవకాశముందని వాతావరణ అధికారులు సూచించన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. గుజరాత్ తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్ ఆస్పత్రులు, వ్యాక్సిన్ కోల్డ్స్టోరేజ్ సెంటర్లకు.. విద్యుత్ సరఫరాలో ఆటంకం లేకుండా చూడాలని ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారు. -
వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: ఆళ్ల నాని
సాక్షి, విశాఖపట్నం: కరోనా కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్పై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. చికిత్స విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఆక్సిజన్ సరఫరాను వేగవంతం చేశామని ఆయన పేర్కొన్నారు. రేపటి నుంచి ఏపీకి అదనంగా 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుందని వెల్లడించారు. వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆళ్లనాని తెలిపారు. చదవండి: ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో ఏపీ పురోగతి ఏపీ: ఆలయాల్లో ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్లు -
104 వ్యవస్థ పటిష్టంగా ఉండాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: 104 వ్యవస్థ పటిష్టంగా పనిచేయాలని.. నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. 104 వ్యవస్థ బలోపేతంగా నడవాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయాన్ని అధికారులు సీరియస్గా తీసుకోవాలని సీఎం అన్నారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో కోవిడ్ స్పెషల్ ఆఫీసర్లు, టాస్క్ ఫోర్స్ బృందంతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ, అధికారులు ప్రతి రోజూ మాక్ కాల్స్ చేసి పని తీరును పర్యవేక్షించాలని సీఎం సూచించారు. రద్దీ ఉన్న జిల్లాల్లో బెడ్ల సంఖ్యను గణనీయంగా పెంచాలని ఆదేశించారు. ఆ మాట ఎక్కడా వినిపించకూడదు.. ‘‘ఆక్సిజన్ సహా కావాల్సిన మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా కల్పించండి. 104కు కాల్ చేసిన వెంటనే కచ్చితంగా స్పందన ఉండాలి. అవసరమైన వారికి వెంటనే బెడ్ కల్పించాలి. 104కు కాల్ చేస్తే ఫోన్ కలవలేదని, స్పందన లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదు. బెడ్ అవసరం లేదన్న వారిని కోవిడ్ కేర్ సెంటర్లకు పంపించాలి. 104కు కాల్ చేసిన తర్వాత కోవిడ్ బాధితులకు కచ్చితంగా సహాయం అందాలి. నిర్ణయించుకున్న ఆస్పత్రుల్లో జర్మన్ హేంగర్స్ను వెంటనే ఏర్పాటు చేయాలి. దీని వల్ల పేషెంట్లు బయట వేచి చూసే పరిస్థితులు తప్పుతాయి. అంతే కాక సత్వరమే వారికి వైద్యం అందుతుందని’’ సీఎం పేర్కొన్నారు. ఓ వర్గం మీడియా ప్రభుత్వంపై దుష్ప్రచారం.. ‘‘ప్రతి ఆస్పత్రిలో కూడా ఆరోగ్య మిత్ర ఉండాలి. ఎవరైనా, ఏదైనా సమస్య ఎదుర్కొంటే ఫిర్యాదు చేయడానికి ప్రతి ఆస్పత్రిలో కూడా నంబర్ డిస్ ప్లే చేయాలి. వ్యాక్సినేషన్కు సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కూడా ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. వ్యాక్సినేషన్ అనేది కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంది. రాష్ట్రం నేరుగా వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలనుకున్నా, ఎన్ని అమ్మాలో కేంద్రమే కంపెనీలకు నిర్దేశిస్తోంది. ఏ రాష్ట్రానికి ఎన్ని వ్యాక్సిన్లు అమ్మాలనే విషయాన్ని కేంద్రమే నిర్ణయిస్తోంది. కేంద్రం నిర్ణయించిన కోటా మేరకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అది కూడా డబ్బును ముందుస్తుగా చెల్లించాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ల ఉత్పత్తి, వాటి లభ్యత అనేవి రాష్ట్రం పరిధిలోని అంశాలు కావని, ఇవి కేంద్రం నియంత్రణలో ఉన్నాయన్న విషయం అందరికీ తెలుసు. అయినా, ఈ విషయాలన్నీ తెలిసి కూడా రాష్ట్రంలోని రాజకీయ వ్యవస్థలో ఉన్న కొందరు వ్యక్తులు, ఓ వర్గం మీడియా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోంది. దురుద్దేశ పూర్వకంగా ఈ ప్రచారాలు చేస్తున్నారు. కావాలనే ప్రజల్లో ఆందోళనను, భయాన్ని సృష్టిస్తున్నారని’’ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆలోచన చేయాలి.. నెలకు కోటి వ్యాక్సిన్లు రాష్ట్రానికి సరఫరా అయ్యే పరిస్థితి భవిష్యత్తులో ఉంటే, రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు కనీసం 6 నెలలు పడుతోందని సీఎం తెలిపారు. ప్రస్తుతం ప్రస్తుతం సగటున నెలకు 19 లక్షలకు పైగా డోసులు మాత్రమే వస్తున్నాయన్నారు. వ్యాక్సిన్ల కొనుగోలుపై గ్లోబల్ టెండర్లకు వెళ్లే ఆలోచన చేయాలని సీఎం సూచించారు. అధికారులు అంతా కూర్చుని దీనిపై పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ‘‘వ్యాక్సిన్ సెంటర్ల వద్ద, రద్దీ, తోపులాట పరిస్థితులు కనిపించకూడదు. వ్యాక్సిన్ ఎవరికి వేస్తారన్నదానిపై ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు స్పష్టంగా చెప్పాలి. దీనివల్ల వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద క్యూలు ఉండే పరిస్థితిని నివారించవచ్చు. వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద కుర్చీలు ఏర్పాటు చేసి, టీకా తీసుకునేవారికి సౌకర్యంగా ఉండేలా చూడాలి. అందిరికీ వ్యాక్సిన్ అందుతుందని, ప్రతి ఒక్కరికీ ఈ ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుందనే విషయాన్ని ప్రజలకు చెప్పాలి. 45 ఏళ్లకు పైబడి మొదటి డోస్ తీసుకుని, రెండో డోస్ కోసం వేచి చూస్తున్న వారికి వెంటనే వ్యాక్సిన్ అందించేలా చూడాలి. వీరికి వ్యాక్సిన్ పూరైన తర్వాత 45 ఏళ్ల పైబడ్డ వారికి వ్యాక్సిన్లు ఇవ్వడంపై దృష్టిపెట్టాలి. ముందు వారిపై దృష్టిపెట్టాలి.. 45 ఏళ్ల పైబడ్డ వారిపై కోవిడ్ ప్రభావం అధికంగా ఉన్నందున ముందు ఈ కేటగిరిలో ఉన్న వారిపై దృష్టిపెట్టాలి. జ్వరం వస్తే దాన్ని కోవిడ్ లక్షణంగా చూసి, వెంటనే మందులు ఇచ్చేలా చూడాలని, వైద్య నిపుణులు ఆ మేరకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని’’ సీఎం ఆదేశించారు. కమ్యూనిటీ ఆస్పత్రుల నుంచి బోధనాసుపత్రుల్లో పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. సత్వరమే వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టాలి.. రెమ్డెసివిర్ ఇంజక్షన్లు బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దీనిపై ఆడిట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వినియోగంపై ఆడిటింగ్ ఉండాలని సీఎం పేర్కొన్నారు. రోగులకు అందుబాటులో ఉంచాలని, ఇంజక్షన్ల పేరిట రోగులను దోచుకునే వ్యవహారాలకు అడ్డుకట్ట వేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో కర్ఫ్యూ అమలవుతున్న తీరుపై ప్రతి జిల్లా నుంచి ప్రతి రోజూ నివేదిక ఇవ్వాలని డీజీపీకి సూచించారు. నిర్దేశించిన సమయంలో కర్ఫ్యూ అమలు చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లాల్లో ప్రతి బుధవారం కోవిడ్ రివ్యూ కమిటీలు సమావేశం కావాలన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను ప్రజా ప్రతినిధులు అధికారులకు వివరించే అవకాశం కలుగుతుందని.. ఈ సమావేశంలో అందుతున్న ఫీడ్బ్యాక్ను పరిశీలించి సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. చదవండి: ‘ఎంత కృతజ్ఞత లేని వాడివి నీవు.. చంద్రం’ రాష్ట్రానికి పెద్ద వైరస్ చంద్రబాబే -
కోవిడ్ కట్టడిపై ఉన్నతాధికారులతో మంత్రుల సమీక్ష
సాక్షి, తిరుపతి: కోవిడ్ కట్టడిపై ఉన్నతాధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఎస్వీ వర్సిటీ సెనెట్ హాలులో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, బియ్యపు మధుసూదన్రెడ్డి, ఆదిమూలం, చింతల రామచంద్రారెడ్డి, కలెక్టర్ హరి నారాయణన్, ఎస్పీ పాల్గొన్నారు. కరోనా వ్యాక్సిన్ వేగవంతం, పరీక్షలు, ఆక్సిజన్ ఏర్పాటుపై చర్చించారు. చదవండి: కరోనా కట్టడి చర్యలపై దుష్ఫ్రచారం.. ఏపీ సర్కార్ సీరియస్ ముగ్గురాయి గనుల్లో పేలుడు: 9 మంది మృతి -
మార్కెటింగ్ శాఖ అధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష
సాక్షి, అమరావతి: మార్కెటింగ్ శాఖ అధికారులతో మంత్రి కన్నబాబు శుక్రవారం రోజున సమీక్ష నిర్వహించారు. కోవిడ్ దృష్ట్యా మామిడి, టమాట మార్కెట్లపై దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు పండ్ల ధరలపై దృష్టి పెట్టామని మంత్రి కన్నబాబు తెలిపారు. రైతులు మార్కెట్లలోకి రాత్రులు కూడా సరుకులు తీసుకురావచ్చునని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. అంతేకాకుండా మార్కెట్ల నుంచి తిరిగి వెళ్లే వాహనాలకు ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని మంత్రి అధికారులకు సూచించారు. మామిడి ధరలను రోజూ పర్యవేక్షించాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు తెలిపారు. టమాట ధరలు పడిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల టన్నుల టమాటలను ప్రాసెసింగ్ యూనిట్స్ కొలుగోలు చేసేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. రైతు బజార్లలో మాస్క్ లేకుండా వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో ‘నో మాస్క్ - నో ఎంట్రీ విధానం’ అమలులో ఉంటుందని మంత్రి కన్నబాబు తెలిపారు. చదవండి: ‘సీఎం జగన్ అత్యంత బాధ్యతగా వ్యవహరించారు’ -
ధాన్యం సేకరణలో మిల్లర్ల ప్రమేయం వద్దు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వ్యవసాయ సలహా కమిటీలను యాక్టివేట్ చేయాలని, అన్ని అంశాలపై వ్యవసాయ సలహా కమిటీలకు పూర్తి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. క్రాప్ ప్లానింగ్ మొదలు రైతులకు అండగా ఆ కమిటీలు ఉండాలన్నారు. ఈ ప్రక్రియలో మహిళా రైతులకు కూడా భాగస్వామ్యం కల్పించాలని చెప్పారు. ధాన్యం సేకరణలో ఎక్కడా మిల్లర్ల ప్రమేయం ఉండొద్దని స్పష్టం చేశారు. ధాన్యం ఏ మిల్లుకు పంపాలన్నది అధికారులే నిర్ణయించాలన్నారు. ఎక్కడా రైతులకు ఏ విధంగానూ నష్టం కలగకూడదని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా పక్కాగా ధాన్యం సేకరణ జరగాలని, రేషన్ బియ్యం డోర్ డెలివరీలో ఎక్కడా ఏ లోపం ఉండొద్దని అధికారులను హెచ్చరించారు. ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో ధాన్యం సేకరణ, రేషన్ బియ్యం డోర్ డెలివరీపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మిల్లర్ల ప్రమేయం వద్దు: ధాన్యం సేకరణలో ఎక్కడా మిల్లర్ల ప్రమేయం ఉండకూడదు. ఏ ఊరి పంట ఏ మిల్లర్ దగ్గరకు వెళ్తోంది అన్న విషయం అధికారులకు మాత్రమే తెలియాలి. అందుకు అవసరమైతే జిల్లాల కలెక్టర్లు సొంతంగా గోనె సంచులు సేకరించాలి. ధాన్యం కొనుగోలులో తేమ చూడడం కోసం, ఆర్బీకేల వద్ద ఆ మీటర్లు కూడా ఉన్నాయి. మిల్లుల వద్దకు ధాన్యం రవాణా చేయడంలో వ్యయ నియంత్రణ కోసం ఊరికి దగ్గరలోని మిల్లర్ వద్దకు పంపించవద్దు. అందుకోసం జిల్లా యూనిట్గా తీసుకుని, ధాన్యాన్ని మిల్లుల దగ్గరకు పంపించాలి. మనం కొనుగోలు చేస్తామని చెప్పిన టైంకు మనమే కొనుగోలు చేయాలి. మొత్తం ప్రక్రియ అంతా కూడా ప్రభుత్వమే చేపట్టాలి. రెండు శాఖలు ఓన్ చేసుకోవాలి: ఆర్బీకేకు సంబంధించి వ్యవసాయ శాఖకు ఎంత బాధ్యత ఉందో, పౌర సరఫరాల శాఖకు కూడా అంతే బాధ్యత ఉంది. కాబట్టి రైతు కోరిన విత్తనాలు పౌర సరఫరాల శాఖ ఇవ్వాలి. అందుకోసం పౌర సరఫరాల శాఖ కూడా ఆర్బీకేను ఓన్ చేసుకోవాలి. రైతులు బయట విత్తనాలు కొని మోసపోకుండా వ్యవసాయ శాఖ చూడాలి. వారికి అవసరమైన విత్తనాలు ఆర్బీకేల ద్వారా సరఫరా చేయాలి. ఈ క్రాపింగ్ నుంచి మార్కెటింగ్ వరకూ రెండూ కలిసి పనిచేయాలి వ్యవసాయ సలహా కమిటీలు: వ్యవసాయ సలహా కమిటీలను యాక్టివేట్ చేయాలి. ఆ మేరకు ఆ కమిటీలకు అన్ని అంశాలపై అవగాహన కల్పించాలి. క్రాప్ ప్లానింగ్ మొదలు ఆ కమిటీలు రైతులకు అండగా నిలవాలి. వ్యవసాయ సలహా కమిటీలు గ్రామాల్లో ఆర్బీకేలతో కలిసి పని చేయాలి. అన్నింటిలోనూ మహిళా రైతుల ప్రమేయం కూడా ఉండాలి. ఆ కమిటీల బాధ్యతలు. వాటి పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలి. రాష్ట్ర స్థాయిలో ఈ ప్రక్రియను పౌర సరఫరాల శాఖ మంత్రి పర్యవేక్షిస్తారు. ఎక్కడా రైతు ఇబ్బంది పడకూడదు. రైతులకు ప్రత్యామ్నాయం చూపాలి: ఏ విత్తనం వేస్తే బాగుంటుంది? ఏది సాగు చేస్తే పంట కొనుగోలు చేస్తారన్నది రైతులకు ఆ కమిటీలు ముందే చెప్పాలి. అలాగే రైతులకు ధాన్యంతో తగిన ఆదాయం రాకపోతే (ఉత్పత్తి పెరిగి ధరలు తగ్గడం వంటి కారణాల వల్ల), ఏ పంట వేస్తే తగిన ఆదాయం వస్తుందన్న విషయాన్ని రైతులకు చెప్పాలి. ఆ మేరకు వారికి ప్రత్యామ్నాయం చూపాలి. అంతే తప్ప రైతుల ఆదాయం మాత్రం తగ్గకూడదు. రేషన్ బియ్యం డోర్ డెలివరీ: రేషన్ బియ్యం డోర్ డెలివరీలో ఎక్కడా ఏ లోపం లేకుండా చూడాలి. బియ్యం తీసుకోవడంలో ఎవరూ మిస్ కాకుండా చూడాలి. ఆ మేరకు ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్)లు పని చేయాలి. ప్రతి నెలా నిర్ణీత వ్యవధిలోగా తప్పనిసరిగా బియ్యం పంపిణీ జరగాలి. కావాల్సినన్ని వేయింగ్ స్కేల్స్ (తూకం యంత్రాలు) కొనుగోలు చేయండి. బియ్యం క్వాలిటీలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వద్దు, ఎవరైనా ఇంటి వద్ద రేషన్ మిస్ అయితే గ్రామ, వార్డు సచివాలయంలో తీసుకునేలా చర్యలు తీసుకోవాలి. దీనికి అవసరమైన కార్యాచరణ సిద్దం చేయండి. చదవండి: ‘సీఎం జగన్ అత్యంత బాధ్యతగా వ్యవహరించారు’ ఏలూరు కార్పొరేషన్ ఎలక్షన్: కౌంటింగ్కు హైకోర్టు అనుమతి -
Lav Agarwal: బెంగళూరు, చెన్నైలలో పరిస్థితి దారుణం
ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోందని కేంద్ర వైద్యారోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభణపై లవ్ అగర్వాల్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..'' నిన్నటి కంటే ఈరోజు 2.4 శాతం కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా 12 రాష్ట్రాల్లో లక్ష కంటే ఎక్కువ పాటిజివ్ కేసులు నమోదవుతున్నాయి. అసోం, గోవా, మణిపూర్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్లో పరిస్థితి దారుణంగా ఉంది. బెంగళూరులో ప్రతి ఇద్దరిలో ఒకరికి కరోనా పాజిటివ్ వస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, ఛత్తీస్గడ్, పశ్చిమ బెంగాల్, బిహార్, హర్యానా రాష్ట్రాల్లో లక్ష చొప్పున యాక్టివ్ కేసులు ఉన్నాయి. 50 వేల నుంచి లక్ష మధ్య యాక్టివ్ కేసులు 7 రాష్ట్రాల్లో ఉన్నాయి. 50 వేల కంటే తక్కువ కేసులు నమోదు అవుతున్న రాష్ర్టాలు 17 ఉన్నాయి'' అంటూ తెలిపారు. ఒక్క బెంగళూరులోనే వారం రోజుల్లో లక్షన్నరకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. బెంగళూరులో పాజిటివిటీ రేటు 50 శాతం కంటే ఎక్కువగా ఉందన్నారు. తమిళనాడులో 38 వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. కోజికోడ్, ఎర్నాకులం, గురుగ్రామ్ జిల్లాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పారు. చదవండి: కరోనా థర్డ్ వేవ్ తప్పదు: సంచలన హెచ్చరికలు చైనా నిర్వాకం: ప్రపంచం నెత్తిన మరో ప్రమాదం... -
విద్యార్థుల మంచి కోసమే పరీక్షల నిర్వహణ: సీఎం జగన్
సాక్షి, అమరావతి: నాడు–నేడు (పాఠశాల విద్యాశాఖ)పై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. నాడు–నేడు మనబడి మొదటిదశలో 15,715 స్కూళ్లలో చేపట్టిన పనుల పురోగతిని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు. పనులు దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయన్న అధికారులు, ఆ వివరాలను ప్రజెంటేషన్లో చూపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘రూపురేఖలు మార్చుకుంటున్న స్కూళ్లు మరింత ఆకర్షణీయంగా కనిపించేలా పాఠశాలల గోడలకు వేసినట్లు, బిల్డింగ్పై కూడా పెయింటింగ్స్ వేయండి. నాడు–నేడు పనులు పూర్తయ్యాక, ప్రతి స్కూల్లో నాడు ఆ స్కూల్ ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉంది అన్న ఫోటోలు తప్పనిసరిగా ప్రదర్శించాలి. అప్పుడే ఇప్పుడు చేసిన పనులకు మరింత విలువ వస్తుంది. వాటి ప్రాధాన్యత తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఆ స్కూల్ను ఎలా నిర్వహించాలన్న దానిపైనా వారికి అవగాహన కలుగుతుంది’’ అన్నారు. ‘‘స్కూళ్లలో పెయింటింగ్ పనులు, స్మార్ట్ టీవీలు, వాల్ ఆర్ట్తో సహా అన్ని పనులు తప్పనిసరిగా మే చివరి నాటికి పూర్తి కావాలి .పనుల నాణ్యతలో ఎక్కడా లోపం ఉండకూడదు. అందుకే పేరెంట్స్ కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.నాడు–నేడులో ప్రభుత్వం నిర్దేశించుకున్న విధంగా పనులు జరగాలి. వాటిలో ఎక్కడా తేడా ఉండకూడదు.అలాగే మే, జూన్ నెలల్లో పూర్తిగా పనులు నాణ్యతను చూడాలి. ప్రతి స్కూల్ సందర్శించాలి. అన్నీ నోట్ చేయాలి. క్వాలిటీ ఆడిట్ పూర్తి కావాలి. టాయిలెట్ నిర్వహణ వ్యవస్థ కూడా స్కూళ్లు తెరిచే నాటికి పూర్తి కావాలి’’ అని తెలిపారు. ‘‘ఇంగ్లిష్ మీడియమ్లో బోధన సజావుగా జరిగేలా టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి.అప్పుడే వారు ఏ ఇబ్బంది లేకుండా ఇంగ్లిష్లో పాఠాలు చెప్పగలుగుతారు.పిల్లలు స్కూళ్లకు వచ్చే నాటికే విద్యా కానుక కూడా రెడీ కావాలి.ఈసారి కిట్లలో ఇంగ్లిష్ డిక్షనరీ కూడా తప్పనిసరిగా ఉండాలి. విద్యా కానుక కింద ఇస్తున్న కిట్లలో ప్రతి ఒక్కటీ పూర్తి నాణ్యత కలిగి ఉండాలి.జూలైలో స్కూళ్లు తెరవగానే, నాడు–నేడు మనబడి రెండో దశ పనులు మొదలు కావాలి’’ అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ: సీఎం కాగా, ఈ సమీక్షలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణను కూడా సీఎం జగన్ ప్రస్తావించారు. ఎందుకు అన్నది చెప్పాలి: ‘‘ఏ పరిస్థితిలో ఎందుకు పరీక్షలు పెడుతున్నామన్నది చెప్పాలి. నిన్న కేరళలో 10వ తరగతి పరీక్షలు పూర్తి చేశారు. పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కేంద్రం ఏ విధానాన్ని ప్రకటించలేదు. నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. దాంతో రాష్ట్రాలు స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తుండగా, మరి కొన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేశాయి’’ అన్నారు. పరీక్షలతో కలిగే ప్రయోజనం: ‘‘పరీక్ష పెట్టని రాష్ట్రాలు విద్యార్థులకు కేవలం పాస్ మార్కులు మాత్రమే ఇస్తున్నాయి. అదే పరీక్షలు జరిగితే విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. అలాంటప్పుడు మంచి కాలేజీల్లో వారికి సీట్లు ఎలా వస్తాయి.. పరీక్ష రాసిన వారికి 70 శాతం పైగా మార్కులు వస్తే, సీట్లు వారికే వస్తాయి కదా. కేవలం పాస్ మార్కులతో బయటపడిన విద్యార్థుల 50 ఏళ్ల భవిష్యత్తు ఏమిటి’ అని సీఎం జగన్ ప్రశ్నించారు. మంచి చేయాలనే: ‘‘విద్యార్థులకు మంచి చేయాలన్న తపనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. నిజానికి పరీక్షల రద్దు చేయడం చాలా సులభం. పరీక్షల నిర్వహణ ఇంకా బాధ్యతతో కూడుకున్నది. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించాలి. కేవలం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నాము’’ అన్నారు. టీచర్లు గుర్తించాలి: ‘‘విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసమే పరీక్షలపై నిర్ణయం తీసుకున్నామన్న విషయాన్ని ప్రతి టీచర్ గుర్తించాలి. ఇందులో అందరి సహాయ సహకారాలు కావాలని, తోడ్పాటు కావాలన్న విషయాన్ని వారందరికీ బలంగా చెప్పండి. అలాగే పరీక్షల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడా ఏ మాత్రం అలక్ష్యం చూపొద్దు. అన్ని కోవిడ్ జాగ్రత్తలతో ఈ పరీక్షలు నిర్వహించాలి’ అని సీఎం జగన్ సూచించారు. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, సర్వశిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. చదవండి: జాగ్రత్తలతోనే మనుగడ: సీఎం వైఎస్ జగన్ స్పష్టీకరణ -
జాగ్రత్తలతోనే మనుగడ: సీఎం వైఎస్ జగన్ స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: దేశంలో ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యం, జనాభా సంఖ్య, వ్యాక్సినేషన్ తీరుపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 45 ఏళ్లకు పైబడిన వారికి టీకాలు వేసే ప్రక్రియ సగంలో ఉందని, పూర్తి చేసేందుకు కనీసం నాలుగు నెలలు సమయం పడుతుందని ఈ సందర్భంగా చెప్పారు. తదనంతరం 18 – 45 మధ్య వయసు వారికి సెప్టెంబర్ నుంచి వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. కోవిడ్కు ఇప్పుడు వ్యాక్సినేషన్ మాత్రమే ఒక పరిష్కారంగా ఉందని, అయితే ఈ సమస్య ఎప్పుడు తీరుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారాయన. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. వారికి 37 కోట్ల డోస్లు కావాలి... కోవిడ్తో కలసి జీవించాలన్న వాస్తవంలోకి అందరూ రావాలి. కళ్లెదుటే కనిపిస్తున్న కఠోర సత్యాలు మనకు అదే చెబుతున్నాయి. దేశంలో ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యం నెలకు 7 కోట్లు కాగా అందులో కోటి వ్యాక్సిన్లు కోవాక్సిన్. మిగిలినవి కోవిషీల్డ్ ఉన్నాయి. దేశంలో 45 ఏళ్లకు పైబడినవారు దాదాపు 26 కోట్ల మంది ఉన్నారు. వారికి నాలుగు వారాల వ్యవధిలో రెండో రెండో డోస్ ఇవ్వాలి. ఆ మేరకు మొత్తం 52 కోట్ల వ్యాక్సిన్లు కావాలి. తొలి డోస్ ఇప్పటివరకు కేవలం 12 కోట్ల మందికి మాత్రమే ఇచ్చారు. 2.60 కోట్ల మందికి రెండో డోస్ వేశారు. మొత్తం కలిపి చూసినా ఇప్పటివరకు వేసిన కోవిడ్ వ్యాక్సిన్ డోస్లు దాదాపు 15 కోట్లు మాత్రమే. అంటే ఇంకా 37.40 కోట్ల వ్యాక్సిన్ డోస్లు కావాలి. అన్నీ కలిపితే.. భారత్ బయోటెక్ ప్రస్తుతం నెలకు కోటి వ్యాక్సిన్లు తయారు చేస్తుండగా సీరమ్ ఇన్స్టిట్యూట్ 6 కోట్ల వ్యాక్సిన్లను తయారు చేస్తోంది. వీటితోపాటు రెడ్డీ ల్యాబ్స్ మే నెలలో 3 కోట్ల స్పుత్నిక్–వి వ్యాక్సిన్లను దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. దాన్ని స్థానికంగా తయారు చేయటానికి ఇతర కంపెనీలతో చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కొలిక్కి వచ్చి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం కావాలంటే కనీసం 3 నెలలైనా పడుతుంది. ఇతర సంస్థల ఉత్పత్తులు రావడానికి మరిన్ని నెలల సమయం పడుతుంది. ఇక కోవిషీల్డ్, కోవాక్సిన్ ఉత్పత్తి పెరిగితే... అన్నీ కలిపి ఆగస్టు నాటికి దేశంలో నెలకు 20 కోట్ల వ్యాక్సిన్లు అందుబాటులోకి రావచ్చు. ఈ లెక్కన 37.40 కోట్ల వ్యాక్సిన్ డిమాండ్ ఆగస్టు లేదా సెప్టెంబరు నాటికి కానీ పూర్తి కాదు. ఇదీ పరిస్థితి... 18 – 45 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు దేశంలో 60 కోట్ల మంది ఉన్నారు. ఆ మేరకు వారికి 120 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోస్లు కావాలి. 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ పూర్తయ్యాక 18 – 45 వయసు వారికి సెప్టెంబరు నుంచి టీకాలు ఇచ్చే అవకాశం ఉంది. ఆ మేరకు వారికి వ్యాక్సినేషన్ పూర్తి కావడానికి మరో ఆరు నెలలు పడుతుంది. అంటే వచ్చే ఏడాది జనవరి– ఫిబ్రవరి నాటికి అందరికీ వ్యాక్సినేషన్ చేయగలుగుతాం. కాబట్టి దాదాపు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత విషయంలోను చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్కులు, భౌతికదూరం వంటివి తప్పనిసరి. ‘‘దేశంలో 45 ఏళ్లు దాటిన వారికే ఇంకా వ్యాక్సినేషన్ పూర్తికాలేదు. ఇపుడు ఉత్పత్తవుతున్న టీకాల సంఖ్యను బట్టి చూస్తే మరో నాలుగు నెలలు పట్టొచ్చు. సెప్టెంబర్ నాటికి వ్యాక్సిన్ల ఉత్పత్తి పెరిగి నెలకు 20 కోట్లకు చేరుకుంటుందని అనుకున్నా... 18 – 45 ఏళ్ల వయసున్న 60 కోట్ల మందికి 120 కోట్ల డోసులు వేయాలంటే కనీసం ఆరు నెలలు పడుతుంది. ఈ లెక్కన ఫిబ్రవరి వరకు టీకాల కార్యక్రమం కొనసాగే అవకాశముంది. వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు కోవిడ్ కేసులు కూడా వెలుగులోకి వస్తూనే ఉంటాయి. కాబట్టి ఫిబ్రవరి వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందనే విషయాన్ని గుర్తించి మనం వాస్తవంలోకి రావాలి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా నుంచి కాపాడుకుంటూ ముందుకెళ్లాలి. వైరస్ నుంచి రక్షించుకుంటూ మనుగడ సాగించాలి. మాస్కులు ధరించడం, శానిటైజేషన్, భౌతిక దూరాన్ని పాటించటం తప్పనిసరి. వ్యాక్సినేషన్ వేగం పెరిగే కొద్దీ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. టీకాల ప్రక్రియ పూర్తయితేనే ఈ ముప్పు నుంచి పూర్తిగా బయటపడతాం’’ – సీఎం వైఎస్ జగన్ -
ఏపీలో కరోనా పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
కోవిడ్ ఆస్పత్రుల్లో ఎంఎస్ఓల జీతాల పెంపు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోవిడ్ ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలోనూ కోవిడ్ కేర్ సెంటర్లలో 3 వేల బెడ్లు కేటాయించాలని.. అవసరమైన చోట అదనపు సిబ్బందిని తక్షణం నియమించాలని సూచించారు. కొత్తగా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘కోవిడ్ కేర్ సెంటర్లలో విధిగా 1000 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ జాబితాలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సకు రేట్లు పెంచండి. అవే రేట్లు కోవిడ్ చికిత్స అందిస్తున్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు కూడా వర్తింపచేయాలి’’ అని అధికారులను ఆదేశించారు. ‘‘ఏ ఆస్పత్రి కూడా కోవిడ్ చికిత్సకు నిరాకరించకుండా చూడాలి. కోవిడ్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఎఫ్ఎన్ఓ, ఎంఎన్వో జీతాల పెంచుతాం. కోవిడ్ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని తక్షణం నియమించాలి. 42 పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. టీచింగ్ ఆస్పత్రి వద్ద 10 కేఎల్, ఇతర ఆస్పత్రుల వద్ద 1 కేఎల్ సామర్థ్యంతో కూడిన ఆక్సిజన్ ట్యాంకర్లు ఏర్పాటు చేయాలి’’ అని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. చదవండి: సీఎం జగన్ నన్ను బతికిస్తున్నాడమ్మా.. -
మనసా వాచా కర్మణా ‘స్వచ్ఛ సంకల్పం’ చేయాలి: సీఎం జగన్
అమరావతి: ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై కార్యాచరణ (జగనన్న స్వచ్ఛ సంకల్పం)తో పాటు, వైఎస్సార్ జలకళ, గ్రామీణ తాగునీటి సరఫరా (జల్జీవన్ మిషన్-జేజేఎం), వీధుల్లో ఎల్ఈడీ లైటింగ్ (జగనన్న పల్లె వెలుగు), గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంపై సమీక్ష జరిపారు. సమీక్ష సమావేశంలో సీఎం జగన్ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో శానిటేషన్ చాలా ముఖ్యం. క్లాప్ (క్లీన్ ఆంధ్రప్రదేశ్).. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ జయంతి రోజు జూలై 8న ప్రారంభం అవుతుంది’ అని సీఎం జగన్ తెలిపారు. గ్రామాల్లో ఎక్కడా మురుగునీరు కనిపించకూడదని స్పష్టం చేశారు. సీవేజ్ పంపింగ్ ఎలా ఉంది? ఆ నీటిని ఎలా డిస్పోస్ చేయడం ఎలా అనేది చూడాలని అధికారులకు సూచించారు. మురుగునీటిని ట్రీట్మెంట్ ప్లాంట్లోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీ, పంచాయతీలలో పారిశుద్ధ్య కార్మికులకు వాక్సినేషన్ మొదలు, యూనిఫామ్, గ్లౌజ్లు, మాస్క్లు, కోట్స్ అన్నీ అదనంగా ఇవ్వాలని స్పష్టం చేశారు. ‘మన ఊరును మనమే పరిశుభ్రంగా చేసుకుందాం’ అనే నినాదంతో జగనన్న స్వచ్ఛ సంకల్పం అమలుచేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ-వాహనాల నిర్వహణ భారం కాకుండా చూసుకోవాలని, గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలపైనే ఎక్కువ వ్యయం చేయాలని తెలిపారు. ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’లో గ్రామాలు, పట్టణాల్లో పూర్తి పారిశుద్ధ్యం కోసం మున్సిపల్ విభాగం కూడా పంచాయతీరాజ్తో కలిసి పని చేయాలని సూచించారు. మనసా వాచా కర్మణా ఈ కార్యక్రమాన్ని సొంతం చేసుకోవాలని చెప్పారు. మే 1వ తేదీ నుంచి వంద రోజుల పాటు గ్రామాల్లో పారిశుద్ధ్యంపై కార్యాచరణ చేపడుతున్నట్లు సమావేశంలో అధికారులు వెల్లడించారు. వైఎస్సార్ జలకళ: ఈ పథకంలో రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల బోర్లు వేయాలని నిర్ణయం. చిన్న, మధ్య తరహా రైతులకు 1.5 లక్షల పంప్సెట్లు ఇవ్వాలని, దీంతో 3 లక్షల రైతులు ప్రయోజనం పొందుతారని అంచనా. 5 లక్షల ఎకరాలను సాగునీరు అందుతుందని లెక్క. బోర్ వేయాలని ఏ రైతు దరఖాస్తు చేసినా, ఎప్పుడు ఆ బోర్ వేస్తామన్నది స్పష్టంగా చెప్పాలి. దీనికి ఎస్ఓపీ ఖరారు చేయండి. ఇచ్చిన తేదీన కచ్చితంగా బోరు వేయాలి. ఆ తేదీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు. తేదీ ఇస్తున్నామంటే, కేవలం బోరు వేయడం మాత్రమే కాదు. నీరు పడిన తర్వాత కచ్చితంగా నెల రోజుల లోపు, విద్యుత్ కనెక్షన్ ఇచ్చి, పంప్సెట్ బిగించాలి. సొంతంగా బోర్లు వేసుకున్న రైతులు ఎవరైనా పంప్సెట్లు కోరితే వారికి కూడా ఇవ్వండి. ఆ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఇంధన శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలి. ప్రతి నియోజకవర్గంలో నెలకు కనీసం 20 బోర్లు వేయాలి. గ్రామీణ తాగునీటి సరఫరా (జల్జీవన్ మిషన్- జేజేఎం): జగనన్న కాలనీల్లో కూడా ఈ కార్యక్రమం అమలు చేయాలి. నీటి వనరు, సరఫరా రెండూ ముఖ్యమే. జగనన్న కాలనీల్లో జల్జీవన్ మిషన్కు ప్రాధాన్యం ఇవ్వాలి. వేసవిలో నీటి వినియోగంపై ముందే పక్కాగా ప్రణాళిక సిద్ధం చేయాలి. ప్రతి గ్రామంలో ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఆ మేరకు ఏటా ఎప్పుడెప్పుడు, ఏయే ట్యాంకుల్ క్లీన్ చేయాలన్న దానిపై ఒక ప్రొటోకాల్ రూపొందించుకోండి. ఏటా వేసనికి ముందే అన్నీ పక్కాగా ప్లాన్ చేయాలి. ఏలూరు వంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. వీధుల్లో ఎల్ఈడీ లైటింగ్ (జగనన్న పల్లె వెలుగు): వీధి దీపాలు ఎల్ఈడీ వాడకంతో యేటా దాదాపు రూ.160 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. దాదాపు 4 లక్షల దీపాలు కావాలి. ఆ మేరకు కార్యాచరణ సిద్దం చేయండి. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు: ఏపీ రూరల్ రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టు (ఏపీఆర్ఆర్పీ)- ఈఏపీ 30 ఏళ్లుగా 30 వేల కి.మీ. బీటీ రోడ్లు మాత్రమే ఉండగా, మనం అధికారంలోకి వచ్చాక 10 వేల కి.మీ రహదారుల నిర్మాణం జరుగుతోందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పర్యావరణ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ గిరిజాశంకర్, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్, మున్సిపల్ శాఖ స్పెషల్ శ్రీలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు. చదవండి: కరోనా మూడో దశకు సిద్ధంగా ఉండాలె చదవండి: ఇప్పటివరకు లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే.. -
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష
సాక్షి,అమరావతి: జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో క్యాంప్ కార్యాలయం నుంచి పలు అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. దాంతో పాటుగా స్పందన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. కోవిడ్–19, ఉపాధి హామీ పనులు, (లేబర్ బడ్జెట్. గ్రామ సచివాలయాల భవనాలు. ఆర్బీకే భవనాలు, డాక్టర్ వైయస్సార్ హెల్త్ క్లినిక్స్ (రూరల్), ఏఎంసీయూ, బీఎంసీయూలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం), డాక్టర్ వైయస్సార్ అర్బన్ క్లినిక్స్, 90 రోజుల్లో ఇంటి స్థలం పట్టా ఇళ్ల నిర్మాణం, స్పందన కార్యక్రమం సమస్యల పరిష్కారం అంశాలతో పాటు, ఏప్రిల్, మే నెలల్లో అమలు చేయనున్న పథకాలు, కార్యక్రమాలపైనా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. 1). కోవిడ్–19 ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘కోవిడ్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కలెక్టర్లు వచ్చే కొన్ని నెలలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. లాక్డౌన్ వల్ల ప్రభుత్వానికి ఒక్క రూపాయి నష్టం కలిగితే, సామాన్యుడికి 4 రూ. నష్టం కలుగుతుంది. గత ఏడాది లాక్డౌన్ వల్ల ప్రభుత్వానికి దాదాపు రూ.20 వేల కోట్ల నష్టం జరిగింది. అంటే ప్రజలకు దాదాపు రూ.80 వేల కోట్ల నష్టం జరిగింది’’ తెలిపారు. వాక్సినేషన్ ‘దేశంలో నెలకు 7 కోట్ల వాక్సిన్ ఉత్పత్తి జరుగుతుండగా, అందులో కోవాక్సిన్ కోటి డోస్లు తయారవుతున్నాయి. మిగతాది కోవిషీల్డ్. రాష్ట్రంలో 45ఏళ్ళకు పైబడిన వారిలో ఇప్పటివరకు 11.30 లక్షల మందికి రెండు డోసులు, దాదాపు 45.48 లక్షలమందికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 18–45 ఏళ్ల వారికి కూడా వాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కోవిడ్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి. తప్పనిసరిగా మాస్క్లు ధరించాలి. శానిటైజర్లు వాడాలి.’ అదొక్కటే మనకున్న పరిష్కార మార్గమని సీఎం జగన్ తెలిపారు 104 కాల్ సెంటర్ ‘104 కాల్ సెంటర్ పూర్తి స్థాయిలో సమర్థంగా పని చేసేలా కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలి. ఆ నెంబర్కు ఫోన్ చేసిన వారికి తక్షణమే పరిష్కారం చూపాలి.ఆస్పత్రికి వెళ్లడమా, క్వారంటైన్కు పంపడమా, హోం ఐసొలేషనా ఏం చేయాలన్నది స్పష్టంగా చెప్పాలి.కాబట్టి 104 నెంబర్ను మనసా, వాచా, కర్మణా ఓన్ చేసుకోవాలి.కోవిడ్కు సంబంధించిన అన్ని సమస్యలకు 104 నెంబర్ అన్నది వన్ స్టాప్ సొల్యూషన్ అన్నది ప్రజల్లోకి బలంగా వెళ్లాలి. ఆ స్థాయిలో కాల్ సెంటర్ పని చేయాలి.’ 104కు ఫోన్ చేసిన వెంటనే 3 గంటల్లో బెడ్ కేటాయించాలని మనం లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్నిసీఎం జగన్ గుర్తు చేశారు. కోవిడ్ ఆస్పత్రులు–బెడ్లు ‘కోవిడ్ చికిత్స కోసం అన్ని జిల్లాలలో మొత్తం 355 ఆస్పత్రులను కలెక్టర్లు గుర్తించగా, వాటిలో 28,377 బెడ్లు ఉన్నాయి. వాటిలో 17901 బెడ్లు ఆక్యుపైడ్. ఆ ఆస్పత్రులలో వైద్యం పూర్తిగా ఉచితం. మందులు కూడా ఫ్రీగా ఇవ్వాలి.104 కాల్ సెంటర్కు సంబంధించి తగిన సంఖ్యలో వైద్యులు అందుబాటులో ఉండాల’ని సీఎం జగన్ తెలిపారు. జేసీకి బాధ్యత ‘జేసీ (గ్రామ వార్డు సచివాలయాలు. అభివృద్ధి) ఇక నుంచి కోవిడ్పైనే దృష్టి పెట్టాలి. ఆ అధికారికి అదే పని ఉండాలి. అప్పుడే మనం అనుకున్న స్థాయిలో సేవలందించగలుగుతాం.మన అధీనంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు, కోవిడ్ చికిత్స చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు, కోవిడ్ చికిత్స చేస్తున్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను కూడా జేసీ చూడాలి. నాణ్యతతో కూడిన ఆహారం, శానిటేషన్, ఔషథాల లభ్యత, తగినంత మంది వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, హెల్ప్ డెస్క్లు వాటిలో ఆరోగ్యమిత్రలు, సీసీటీవీ కెమెరాలు పని చేస్తున్నాయా, లేదా అన్నది ప్రతి రోజూ చూడాలని సీఎం జగన్ పేర్కొన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లు (సీసీసీ) ‘జిల్లాలో తగినన్ని కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం అన్ని జిల్లాలలో 59 సీసీసీలు పని చేస్తుండగా, వాటిలో 33,327 బెడ్లు ఉన్నాయి. ఈ కోవిడ్ కేర్ సెంటర్లలో నాణ్యతతో కూడిన ఆహారం, శానిటేషన్, ఔషథాల లభ్యత, తగినంత మంది వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, హెల్ప్ డెస్క్లు వాటిలో ఆరోగ్యమిత్రలు, సీసీటీవీ కెమెరాలు, రోగులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నారా? లేదా? అన్నది ప్రతి కలెక్టర్ చూడాలి.అలాగే ఎక్కడా బెడ్ల కొరత లేకుండా కలెక్టర్లు శ్రద్ధ చూపాలి.’ అని సమీక్షలో సీఎం జగన్ తెలిపారు ఆక్సీజన్ సరఫరా ‘ ప్రస్తుతం రోజుకు 320 నుంచి 340 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సీజన్ సరఫరా అవుతోంది. ఇది ప్రస్తుతానికి సరిపోతున్నది. ఆక్సీజన్ అవసరమైన వారికి తప్పనిసరిగా వెంటనే ఇవ్వాలి. ఆక్సీజన్ లెవెల్ 94 కంటే తక్కువ ఉంటే వెంటనే ఆక్సీజస్ ఇవ్వాల’ని సీఎం జగన్ పేర్కొన్నారు. నిరంతరం తనిఖీలు ‘ జిల్లా స్థాయిలో కోవిడ్ ఆస్పత్రులను క్లస్టర్లుగా విభజించాలి. వాటికి ఇంఛార్జ్లను నియమించాలి. జిల్లా స్థాయి ఫ్లైయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలి. అందులో ఔషథ నియంత్రణ విభాగం అధికారులు కూడా ఉంటారు.వీటన్నింటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం రాష్ట్ర స్థాయిలో ఒక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయడం జరిగింద’ని సీఎం జగన్ తెలిపారు. సిబ్బంది నియామకం ‘అన్ని ఆస్పత్రులలో వైద్య సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండాలి. ఎక్కడ ఖాళీలున్నా వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించండి. 48 గంటల్లో నియామకాలు పూర్తి చేయండ’ని ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 50 మందికి మించి వద్దు ‘ ప్రజలు ఒకే చోట చేరకుండా చూడాలి. పెళ్ళిళ్ళకు కేవలం 50 మందికి మాత్రమే అనుమతి.అలాగే స్విమ్మింగ్ పూల్స్, జిమ్లు, పార్కుల్లో అందరూ ఒకేచోట చేరకుండా చూడాలి. ఎక్కడా ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోకూడదు. అదే సమయంలో కోవిడ్ నిబంధనలు తప్పనిసరి. ఏ కార్యక్రమంలో కూడా ఎక్కడా 50 మందికి మించి చేరకూడద’ని సీఎం జగన్ తెలిపారు. వారి పట్ల కఠినంగా వ్యవహరించండి ‘పుకార్లు సృష్టించడం, తప్పుడు సమాచారం ప్రసారం చేయడం, వాస్తవాలు మరుగున పెట్టి, అసత్యాలు ప్రచారం చేస్తే, కఠినంగా వ్యవహరించండి. అరెస్టు చేయండి. వాళ్లను జైలుకు పంపే అధికారం కూడా మీకు ఉందన్న విషయం మర్చిపోవద్దు. ఈ విషయంలో అవసరమైతే అందరు ఎస్పీలు కఠినంగా వ్యవహరించాలి. ప్రతి రోజూ అఫీషియల్ బులెటిన్ ఇస్తారు. దాన్నే అందరూ తీసుకోవాలి. కోవిడ్ వల్ల ఇప్పటికే అందరూ భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లేనిపోని పుకార్లు సృష్టించి, అసత్యాలు ప్రచారం చేస్తే, ప్రజల్లో ఆందోళన ఇంకా తీవ్రమవుతుంది.కాబట్టి అసత్య ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దు’ అని సీఎం జగన్ పేర్కొన్నారు 2). ఉపాధి హామీ పనులు సమీక్షలో ఉపాధి హామీ పనులపై సీఎం మాట్లాడుతూ..‘కోవిడ్ నేపథ్యంలో ఎన్ఆర్ఈజీఎస్ చాలా కీలకం. మనకు 20 కోట్ల పని దినాలకు మనకు అనుమతి ఉండగా, గత ఏడాది పెంచారు. ఏప్రిల్లో 2.50 కోట్ల పని దినాలు మనకు (పర్సన్ డేస్–పీడీస్) లక్ష్యం కాగా, ఈనెల 26 నాటికి కేవలం 1.89 కోట్లు మాత్రమే సాధించగలిగాము. కాబట్టి వచ్చే రెండు నెలల్లో ప్రతి జిల్లాలో కోటి పని దినాలు (పీడీస్) సాధించి తీరాలి. నెల్లూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాలో వేజ్ కాంపోనెంట్ ఇంకా పెరగాల్సి ఉందని’ సీఎం జగన్ తెలిపారు. గ్రామ సచివాలయాల నిర్మాణం ‘10,929 భవనాలకు అనుమతి వచ్చి, నిర్మాణాలు మొదలు కాగా, ఇప్పటి వరకు కేవలం 6057 భవనాలు మాత్రమే దాదాపు పూర్తయ్యాయి. మరో 1035 భవనాల నిర్మాణం తుది దశలో ఉండగా, 613 భవనాల శ్లాబ్ పనులు పూర్తయ్యాయి, నెల్లూరు, కృష్ణా, అనంతపురం జిల్లాలలో పనుల్లో చాలా జాప్యం జరుగుతోంది. కడప, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో కూడా పనులు ఆలస్యం అవుతున్నాయి. ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం అన్ని గ్రామ సచివాలయాల భవనాలు వచ్చే జూన్ చివరి నాటికి పూర్తి చేయాల’ని అధికారులకు సీఏం జగన్ తెలిపారు రైతు భరోసా కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలపై సీఎం మాట్లాడుతూ..‘10,408 భవనాల నిర్మాణానికి అనుమతి రాగా, వాటి పనులు మొదలైనా కేవలం 2649 మాత్రమే పూర్తయ్యాయి. 139 భవనాల పనులు తుది దశలో ఉండగా, 640 భవనాల శ్లాబ్ పనులు పూర్తయ్యాయి.కృష్ణా, విశాఖపట్నం, అనంతపురంతో పాటు, కడప, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలలో పనులు ఆలస్యం అవుతున్నాయి. ఈ భవనాల పనులన్నీ కూడా ఈ ఏడాది జూలై నాటికి పూర్తి కావాల్సి ఉంద’ని సీఎం జగన్ తెలిపారు. డాక్టర్ వైయస్సార్ హెల్త్ క్లినిక్స్ (రూరల్) ‘8585 భవనాలకు గానూ ఇప్పటి వరకు 1755 భవనాలు మాత్రమే పూర్తయ్యాయి. మరో 63 భవనాల పనులు తుది దశలో ఉండగా, 400 భవనాల శ్లాబ్ పనులు పూర్తయ్యాయి . ఇంకా 4118 భవనాల పనులు శ్లాబ్ వేసే వరకు జరిగాయి. అన్ని క్లినిక్ల నిర్మాణం ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి పూర్తి కావాల్సి ఉంది. అనంతపురం, విశాఖపట్నం, కర్నూలు, కడప, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాలలో పనులు ఆలస్యం అవుతున్నాయ’నీ అధికారులకు సీఎం జగన్ తెలిపారు ఏఎంసీయూ, బీఎంసీయూల నిర్మాణం ‘రాష్ట్రంలో మొత్తం 9,899 బీఎంసీయూల అవసరం ఉండగా, 9,538 భవనాల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేయడం జరిగింది. వాటిలో తొలి దశలో చేపట్టిన 2,633 భవనాలతో సహా, మొత్తం 4840 భవనాల పనులు మొదలయ్యాయి. తొలి దశలో చేపట్టిన 2,633 బీఎంసీయూలను నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా జూన్ 30 నాటికి పూర్తి చేయాలి. రాష్ట్రంలో అమూల్ ఇప్పటికే పాల సేకరణ మొదలు పెట్టింద’న్న విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. అంగన్వాడీ కేంద్రాలు సీఎం జగన్ అంగన్వాడీ కేంద్రాలపై మాట్లాడుతూ..‘ రాష్ట్రంలో మొత్తం 55,607 అంగన్వాడీ కేంద్రాలలో 27,438 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. నాడు–నేడు మొదటి దశలో కొత్తగా 4706 అంగన్వాడీ కేంద్రాలతో పాటు, ప్రస్తుతమున్న మరో 3341 అంగన్వాడీల స్థాయి పెంచే పనులు కొనసాగుతున్నాయి. వీటికి సంబంధించి 3928 భవనాల నిర్మాణం పనులు సాగుతున్నాయి. వాటిని లక్ష్యానికి అనుగుణంగా వచ్చే జూన్ 30 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. గుంటూరు, కడప, ప్రకాశం జిల్లాలలో పనుల్లో జాప్యం జరుగుతోంది. కాబట్టి ఆయా జిల్లాల కలెక్టర్లు వాటిపై దృష్టి పెట్టాల’ని తెలిపారు. 3). వైయస్సార్ అర్బన్ క్లినిక్లు సమీక్షలో భాగంగా వైఎస్సార్ అర్బన్ క్లినిక్లపై సీఎం జగన్ మాట్లాడుతూ..‘ రాష్ట్రంలో మొత్తం 560 వైయస్సార్ అర్బన్ క్లినిక్స్ అవసరం ఉండగా, వాటిలో ఇప్పటికే ఉన్న 205 అర్బన్ హెల్త్ సెంటర్లలో అవసరమైన మరమ్మతులు చేపట్టి, అభివృద్ది చేయాల్సి ఉందన్నారు. ఇంకా కొత్తగా 353 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించాల్సి ఉంది. వాటిలో 311 భవనాల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా, మిగిలిన వాటి టెండర్లు పూర్తి చేయాల్సి ఉంద’ని సీఎం జగన్ తెలిపారు. 4). ఇళ్ల స్థలాల పట్టాలు ‘రాష్ట్రంలో మొత్తం 30,28,346 ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాల్సి ఉండగా, వాటిలో ఇప్పటి వరకు 28,54,983 పట్టాల పంపిణీ జరిగింది. ఇది 94 శాతం కాగా, ఇంకా 1,73,363 ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాల్సి ఉంది. మొత్తం 17,053 జగనన్న కాలనీల్లో 16,450 కాలనీలలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ మొత్తం పూర్తవుతుంది. నెల్లూరు, గుంటూరు, విజయనగరం, వైయస్సార్ కడపతో పాటు ఉభయ గోదావరి జిల్లాలలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ పెండింగ్లో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే 15 రోజుల్లో వాటన్నింటినీ పూర్తి చేయాల’ని సీఎం జగన్ ఆదేశించారు. 90 రోజుల్లో ఇళ్ల స్థలాల కేటాయింపు ‘ఇళ్ల స్థలాల కోసం మొత్తం 5,48,690 దరఖాస్తులు రాగా, వాటిలో 51,859 అర్హులని గుర్తించారు. మరో 2,21,127 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీఆర్వోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమషనర్లు, సబ్ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల వద్ద ఆ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అర్హులుగా గుర్తించిన 51,859 దరఖాస్తులను వచ్చే 15 రోజుల్లో పరిష్కరించాలి. వారిలో 14,410 మందికి ఇప్పుడున్న లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయవచ్చు. మరో 6,004 మందికి ప్రభుత్వ భూముల్లో కొత్తగా వేస్తున్న లేఅవుట్లలో ఇవ్వనుండగా, 31,445 మంది కోసం కొత్తగా భూసేకరణ జరపాల్సి ఉంది. కాబట్టి 31,445 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి భూసేకరణ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన ప్రతి ఒక్కరికి మన లక్ష్యం మేరకు 90 రోజుల్లోగా ఇంటి స్థలం ఇవ్వాల’ని అధికారులకు సీఎం జగన్ తెలిపారు. ఇళ్ల నిర్మాణం ‘తొలి విడతగా మొత్తం 15.60 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, వాటిలో 15.10 లక్షలు అర్బన్ ప్రాంతాల్లో (యూఎల్బీ, యూడీఏ) ఉన్నాయి. 14.89 లక్షల మందికి ఇళ్లు మంజూరు పత్రాల పంపిణీ ప్రక్రియ పూర్తి అయింది. కాగా, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు పూర్తి కాకపోవడంతో 71 వేల మందికి ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయలేదు. వాటికి సంబంధించి ప్రత్యామ్నాయ డీపీఆర్లు సిద్దం చేసి పంపండి. ప్లాట్ల డీమార్కింగ్ లేకపోవడం, సరిహద్దుల రాళ్లు పాతకపోవడం వల్ల 742 లేఅవుట్లలో 1.46 లక్షల ప్లాట్ల జియో టాగింగ్ జరగలేదు. వాటన్నింటినీ వెంటనే పూర్తి చేయాలి. ఏపీ హౌజింగ్ వెబ్సైట్లో లబ్ధిదారుల నమోదు కేవలం 71 శాతం వరకు పూర్తవుతుంది. దాన్ని కూడా పూర్తి చేయాలి. నాన్ యూఎల్బీలలో ఉపాధి హామీ కింద జాబ్ కార్డుల మ్యాపింగ్ కూడా 75 శాతమే పూరై్తంది. దాన్ని కూడా పూర్తి చేయాలి. వీటన్నింటినీ మే 15 నాటికి తప్పనిసరిగా పూర్తి చేయాల’ని సీఎం జగన్ ఆదేశించారు లేఅవుట్లలో నీటి సరఫరా వ్యవస్థ. విద్యుద్దీకరణ ‘మొదటి దశలో ఇళ్ల నిర్మాణం చేపట్టిన 8905 లేఅవుట్లలో 8668 లేఅవుట్లలో నీటి సరఫరా చేయాల్సి ఉంది.కాగా వాటిలో 6280 లేఅవుట్లలో పనులు మొదలు కాగా, 1532 లేఅవుట్లలో పనులు పూర్తయ్యాయి. మిగిలిన లేఅవుట్లలో కూడా వెంటనే ఆ పనులు పూర్తయ్యేలా కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించాలి. పెండింగ్లో ఉన్న 1549 లేఅవుట్లలో టెండర్లు పూర్తి చేయాలి. టెండర్లు పూరై్తన 839 లేఅవుట్లలో పనులు మొదలు పెట్టాలి. ఒక ఉద్యమ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి, అన్ని ఇళ్ల నిర్మాణాల పనులు మే 15 నాటికి మొదలయ్యేలా కలెక్టర్లు శ్రద్ధ చూపాల‘ని సీఎం జగన్ తెలిపారు. అధికారుల నియామకం–మోడల్ హౌజ్లు ‘ఇందుకోసం ప్రతి మండలం, ప్రతి మున్సిపాలిటీకి జిల్లా లేదా డివిజన్ స్థాయిలో ఉన్న సీనియర్ అధికారిని నియమించాలి. ఆ అధికారులు వారానికి ఒకసారి అయినా క్షేత్రస్థాయిలో పర్యటించి, ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షించాలి. ప్రతి లేఅవుట్లో తప్పనిసరిగా మోడల్ హౌజ్ నిర్మించాలి. ఇప్పటికే 4374 లేఅవుట్లలో మోడల్ హౌజ్ల నిర్మాణం మొదలు కాగా, మిగిలిన 4500 లేఅవుట్లలో కూడా వెంటనే ఆ పనులు మొదలు కావాల’ని అధికారులకు సీఎం జగన్ తెలిపారు. ఇళ్ల నిర్మాణాలు ‘తొలి దశలో చేపట్టిన 14.89 లక్షల ఇళ్లకు గానూ ఇప్పటికే 90,105 ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయి. మిగిలిన ఇళ్ల నిర్మాణం కూడా మొదలు కావాలి. ఆ మేరకు కలెక్టరు వెంటనే అంచనాలు రూపొందించి, డీపీఆర్లు సిద్ధం చేయాలి. ఏదేమైనా మొదటి దశలో చేపట్టిన అన్ని ఇళ్ల నిర్మాణాలు మే 31 నాటికి కచ్చితంగా మొదలు కావాల’ని సీఎం జగన్ పేర్కొన్నారు 5). స్పందన సమస్యలు స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ మాట్లాడుతూ..‘స్పందన కార్యక్రమంలో ఇప్పటి వరకు 2,19,81,131 సర్వీస్ రిక్వెస్టులు రాగా, వాటిలో 2,14,78,165 పరిష్కరించారు. (97.71శాతం). నిర్దేశించిన గడువులోగా 1,83,68,988 దరఖాస్తులను పరిష్కరించగా, కాస్త ఆలస్యంగా 31,09,166 అర్జీలను పరిష్కరించడం జరిగింది. పెన్షన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ, ఇళ్ల స్థలాలకు సంబంధించిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి’ సీఎం జగన్తెలిపారు.చివరగా ‘శానిటేషన్ (గ్రామీణ, పట్టణ ప్రాంతాలు), వీధి దీపాలు, తాగు నీటి సరఫరా, వీటిని కలెక్టర్లు ఓన్ చేసుకోవాలి, ప్రతి వారం సమీక్షించుకోవాలి. వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి.ఇంకా చెప్పాలంటే క్వాలిటీ ఆఫ్ రిడ్రెస్సల్ చాలా ముఖ్యం అంటే మొక్కుబడిగా కాకుండా, నిర్దిష్టంగా దరఖాస్తులను పరిష్కరించాల’ని సీఎం జగన్ తెలిపారు. ఈనెల, వచ్చే నెల ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు రేపు (ఏప్రిల్ 28వ తేదీ) జగనన్న వసతి దీవెన మే 13న రైతు భరోసా మే 18న మత్స్య కార భరోసా మే 25న గత ఏడాది (2020) ఖరీఫ్కు సంబంధించి ఇన్సూరెన్సు డబ్బు చెల్లింపు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో పాటు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, బొత్స సత్యనారాయణ, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నీరబ్ కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయకుమార్తో పాటు, పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో ‘రెమిడెసివర్’ కొరత లేదు: ఆళ్ల నాని
సాక్షి, గుంటూరు: ఆక్సిజన్ వృథా కాకుండా మెడికల్ ఆఫీసర్లు దృష్టి పెట్టాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. సోమవారం ఆయన కరోనా నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వాస్పత్రుల్లో రెమిడెసివర్ ఇంజక్షన్ల కొరత లేదని స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రెమిడెసివర్ కొరత లేకుండా చూస్తామని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. 40 బెడ్స్ ఉన్న ఆస్పత్రులను కోవిడ్ సెంటర్లుగా అనుమతిస్తామని ఆయన వెల్లడించారు. ప్రైమరీ కాంటాక్ట్ అందరికీ పరీక్షలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. కోవిడ్ టెస్టుల ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. 104కు కాల్ చేసిన మూడు గంటల్లో బెడ్ కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. ఆక్సిజన్ ఆడిటింగ్ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం ఆస్పత్రుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్సిజన్ ఆడిటింగ్ ప్రారంభించింది. ఆస్పత్రుల వారీగా సరఫరా అయ్యే ఆక్సిజన్ లెక్కలు తీయాలని నిర్ణయించింది. రోజువారీ వినియోగం, ఆక్సిజన్ పడకలపై ప్రభుత్వం ఆరా తీసింది. ఆస్పత్రిలో ఎన్ని ట్యాంకుల ఆక్సిజన్ వాడారనే దానిపై ఆడిటింగ్కు ఆదేశాలు జారీ చేసింది. రోజువారీ అవసరాలకు 330 టన్నుల ఆక్సిజన్ కావాలని.. ప్రస్తుతం 290 టన్నుల ఆక్సిజనే అందుబాటులో ఉందని వైద్యశాఖ తెలిపింది. ఆక్సిజన్ సరఫరా మెరుగుపరిచేందుకు ప్రత్యేక అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆక్సిజన్ సిలిండర్లు, నెట్రోజన్ ట్యాంకర్లను ప్రభుత్వం మార్పులు చేస్తోంది. రాష్ట్రంలోని 42 ఆక్సిజన్ ఫిల్లింగ్ స్టేషన్ల నుంచి ఆస్పత్రులకు సరఫరా జరుగుతుంది. ఆక్సిజన్ సరఫరాకు ఇప్పటికే ప్రభుత్వం జిల్లాస్థాయిలో జేసీకి బాధ్యతలు అప్పగించింది. భువనేశ్వర్, బళ్లారి, విశాఖ నుంచి రాష్ట్రానికి ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది. సాంకేతిక లోపం వల్లే..: మంత్రి బొత్స విజయనగరం: మహారాజా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా పునరుద్ధరించామని.. సాంకేతిక లోపం వల్లే సరఫరాలో అంతరాయం ఏర్పడిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో రెండు ప్లాంట్లు నిర్వీర్యంగా ఉన్నాయని.. పునరుద్ధరించేందుకు సీఎం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఒడిశా, కర్ణాటక నుంచి ఆక్సిజన్ రప్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు. అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి బొత్స పేర్కొన్నారు. చదవండి: ఏపీ: అందుబాటులో 33 వేల బెడ్స్: కృష్ణబాబు ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదు: విజయనగరం కలెక్టర్ -
ఏపీలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ పరీక్షలు యథాతథం
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో కోవిడ్–19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్పై సమీక్ష నిర్వహించారు. సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి ఏమన్నారంటే.. ఔషదాలు బ్లాక్ మార్కెట్ కావొద్దు: ‘ఆక్సీజన్ ఉత్పత్తితో పాటు, సరఫరాను హేతుబద్ధీకరించండి. అలాగే కోవిడ్ చికిత్సలో ముఖ్యమైన రెమిడిస్విర్ ఇంజక్షన్లు కేటాయింపు, సరఫరా ఎలా ఉందన్నది సమీక్షించాలి. ఎక్కడా ఈ ఔషథం బ్లాక్ మార్కెట్ కాకుండా చూడాలి. ఏదైనా రాకెట్ ఉంటే దాన్ని పూర్తిగా అరికట్టాలి. దాని కోసం ఎస్ఓపీ రూపొందించండి. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న కోవిడ్ వాక్సిన్, రెమిడిస్వర్ ఇంజక్షన్లు ముందుగా ఇక్కడి అవసరాలు తీర్చాలి. లేకపోతే ఇక్కడ కేసులు పెరిగితే, ఆ సంస్థలను మూసివేసే పరిస్థితి వస్తుంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా వివరించాలి’. పరీక్షలు ఉధృతం చేయండి: ‘పరీక్షల సంఖ్య కూడా అవసరం మేరకు పెంచండి. కోవిడ్ బారిన పడిన ప్రెమరీ కాంటాక్ట్లతో పాటు, ఆ పరీక్ష కోరుకున్న వారందరికీ వెంటనే పరీక్ష చేయాలి. వీలైనంత వరకు ఎవరి ప్రాణం కూడా పోకుండా కాపాడాలి. అది మనకు చాలా ముఖ్యం’. ‘కోవిడ్ చికిత్స కోసం ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోండి. అవసరమైతే రైడ్స్ చేయండి. అందుకు అవసరమైతే ఒక సీనియర్ అధికారిని నియమించండి’. మరింత సమర్థంగా 104: 104 కాల్ సెంటర్ మరింత సమర్థంగా పని చేయాలి. కాబట్టి దాన్ని ప్రతి ఒక్క అధికారి ఓన్ చేసుకోవాలి. ప్రతి కాల్కు స్పందించాలి. మనం నిర్దేశించుకున్నట్లు ఫోన్ చేసిన 3 గంటల్లోనే బెడ్ కేటాయించాలి. ఆ నెంబర్కు ఫోన్ చేస్తే తమకు సాయం చేశారన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలి. 104 కాల్ సెంటర్ను జిల్లాలో ఒక జేసీకి కేటాయించండి. ఆ అధికారి అవసరం మేరకు ఆ కాల్ సెంటర్లో కూర్చుని మానిటర్ చేయాలి’. ‘అవసరమైనన్ని కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయండి. వాటిలో తగిన సదుపాయాలు ఉండేలా చూడండి’. ఫ్రీ వాక్సిన్: ‘రాష్ట్రంలో 18–45 ఏళ్ల వయస్సు మధ్య వారందరికీ ఉచితంగా కోవిడ్ వాక్సిన్లు ఇవ్వాలి. ఆ మేరకు అవసరమైనన్ని డోస్లకు ఆర్డర్ పెట్టండి. 18–45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారిలో 2,04,70,364 మందికి వాక్సిన్ వేయాల్సి ఉన్నందున ఆ మేరకు డోస్లు సేకరించాలి’. నైట్ కర్ఫ్యూ: కోవిడ్ నియంత్రణలో భాగంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను అమలు చేయాలి. ఆ మేరకు రెస్టారెంట్లతో సహా అన్నింటినీ మూసేయాలి. అలాగే రైతు బజార్లు, మార్కెట్లను వికేంద్రీకరించండి. గతంలో మాదిరిగా వార్డులలో ప్రత్యేక మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేయండి’. యథావిథిగా పరీక్షలు: ‘విద్యార్థులకు నష్టం కలిగించకుండా పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించాలి. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, ఆ పరీక్షలు నిర్వహించాలి. ఈ విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం చూపొద్దు’. కాగా, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని ప్రస్తావించిన అధికారులు, పలు అంశాలను వివరించారు. ఆక్సీజన్ రవాణా వాహనాలు: సరైన రవాణా సదుపాయం లేక ఆక్సీజన్ సరఫరా ఆలస్యం అవుతోందని సమావేశంలో అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఆక్సీజన్ రవాణా కోసం కేవలం 64 వాహనాలు మాత్రమే కేటాయించారని, కానీ ప్రస్తుత డిమాండ్ను తట్టుకోవడం కోసం కనీసం 100 నుంచి 120 వాహనాలు కావాలని తెలిపారు. అన్ని ఆస్పత్రులలోని ఆక్సీజన్ బెడ్లు ఆక్యుపై అయితే 515 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్ అవసరం ఉంటుందన్న అధికారులు, ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో రోజుకు సగటున 284 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్ వినియోగిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో విశాఖ ఆర్ఐఎన్ఎల్లో రోజుకు 100 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేసి, దాన్ని రాష్ట్రానికే ఇవ్వడంతో పాటు, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా ఆక్సీజన్ సరఫరా పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పుడు 208 కోవిడ్ ఆస్పత్రులలో మొత్తం 21,581 బెడ్లు ఉండగా, వాటిలో 11,789 బెడ్లు ఆక్యుపైడ్ కాగా, గడచిన 24 గంటల్లో 2,506 మంది ఆస్పత్రుల్లో చేరారని అధికారులు వివరించారు. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, కె.కన్నబాబు, మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, కోవిడ్ కమాండ్ కంట్రోల్ స్పెషల్ ఆఫీసర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్, ఉన్నత విద్యా శాఖ స్పెషల్ సీఎస్ సతీష్చంద్ర, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, కుటుంబ సంక్షేమ కమిషనర్ కాటమనేని భాస్కర్తో పాటు, పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. ఫార్మా కంపెనీలతో మాట్లాడిన సీఎం: కాగా, ఈ సమీక్షా సమావేశానికి ముందు సీఎం శ్రీ వైయస్ జగన్, భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎల్లాతో పాటు, హెటెరో డ్రగ్స్ ఎండీ బి.పార్థసారథిరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్ర అవసరాలు తీర్చే విధంగా మరిన్ని కోవిడ్ వాక్సిన్ డోస్లతో పాటు, రెమిడిసివిర్ ఇంజక్షన్లు సరఫరా చేయాలని వారిని కోరారు. -
సమగ్ర భూ సర్వేపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సమగ్ర భూసర్వే ‘వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం’పై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపారు. ఎస్ఓపీ ఖరారు రాష్ట్ర వ్యాప్తంగా 1.26 లక్షల కిలోమీటర్ల ఏరియా రాష్ట్రంలో 17,460 గ్రామాలు. 47,861 ఆవాసాల (హ్యాబిటేషన్స్)కు సంబంధించిన సమగ్ర సర్వేకు పక్కాగా ఎస్ఓపీ (ప్రామాణిక యాజమాన్య విధానం) రూపొందించినట్లు సమీక్షలో అధికారులు వెల్లడించారు. జూలై నాటికి 51 గ్రామాల్లో.. తొలి దశలో ప్రతి జిల్లాలో ఒక గ్రామం చొప్పున 13 గ్రామాలు, ఆ తర్వాత ప్రతి డివిజన్కు 1 గ్రామం చొప్పున 51 గ్రామాలు. ప్రతి మండలానికి ఒక గ్రామం చొప్పున 650 గ్రామాల్లో సర్వే ప్రక్రియ చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఇందులో ఇప్పటికే 51 గ్రామాలకు సంబంధించి సమగ్ర సమాచార సేకరణ పూరై్తందని, వచ్చే నెల నుంచి గ్రామ స్థాయిలో సర్వే మొదలు పెట్టి, జూలై నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. ఇంకా 650 గ్రామాలకు గానూ, ఇప్పటికే 545 గ్రామాల్లో డ్రోన్లతో సర్వే పూర్తి చేశామని, ఆ మేరకు ఛాయాచిత్రాలు సేకరించామని, వ్యవసాయ భూములు, హ్యాబిటేషన్ల (నివాస ప్రాంతాలు)కు సంబంధించి 2,693 ఛాయాచిత్రాలు తీశామని అధికారులు వివరించారు. ఏప్రిల్ 2023 నాటికి.. ఆ తర్వాత ఈ దశలోనే రెండో విడతగా మండలానికి ఒకటి చొప్పున 650 గ్రామాలలో సర్వే మొదలు పెట్టి వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి చేస్తామని, ఇక రెండో దశ సర్వేను వచ్చే ఏడాది 2022 ఫిబ్రవరిలో మొదలు పెట్టి 2022 అక్టోబరు నాటికి పూర్తి చేస్తామని సమావేశంలో అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత మూడో దశ వచ్చే ఏడాది నవంబరులో మొదలు పెట్టి ఏప్రిల్ 23 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్న అధికారులు, సర్వే సిబ్బందికి కూడా సంప్రదాయ సర్వే, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్లో శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘‘అవినీతిరహితంగా కార్యక్రమం నిర్వహించాలి. సర్వే ప్రక్రియలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా చూడాలి. ఎందుకంటే ఎక్కడ, ఎవ్వరు ఏ చిన్న అవినీతికి పాల్పడినా మొత్తం కార్యక్రమానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి. ప్రతి చోటా చెకింగ్ పక్కాగా ఉండాలి. ఎక్కడా రాజీ పడొద్దు’’ అని అధికారులకు సూచించారు. సంస్కరణలకు శ్రీకారం.. ‘‘మొత్తం భూరికార్డులు, డేటాను అప్డేట్ చేస్తున్నాం కాబట్టి, కేంద్రం నుంచి ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి ఆమోదం పొందేలా చూడాలి. ఆ విధంగా ఒక సంస్కరణల ప్రక్రియకు శ్రీకారం చుట్టిన వారమవుతాము. సర్వే ప్రక్రియకు ఎక్కడా నిధుల కొరత లేకుండా చూడాలి. సర్వే తర్వాత అన్నింటికి పక్కాగా సరిహద్దులు చూపాలి. మొత్తం సర్వే పూరై్తన తర్వాత చెత్తా చెదారం తొలగించి, పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే జంగిల్ క్లియరెన్స్ కింద వాటన్నింటినీ తొలగించి, చివరగా రైతుల సమక్షంలోనే సర్వే రాళ్లు పాతండి. ఆ విధంగా రైతుల ప్రమేయం కూడా ఉండాలి’’ అని సీఎం జగన్ తెలిపారు. హోర్డింగ్లు.. ‘సర్వే వేగంగా పూర్తవుతున్నందువల్ల రాళ్ల సరఫరా కూడా అంతే ముఖ్యం. కాబట్టి రాళ్ల సరఫరా ఆలస్యం కాకుండా చూడాలి. సరిహద్దు రాళ్లు ఏర్పాటులో రైతుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయొద్దు. ప్రతి గ్రామ సచివాలయంతో పాటు, వార్డులలో ఒక హోర్డింగ్ పెట్టాలి. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై పూర్తి వివరాలు ఉండాలి. ఇదే కాకుండా ముఖ్య కూడళ్లలో శాశ్వత హోర్డింగ్లు కూడా ఏర్పాటు చేయండి’ అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు.. ‘సమగ్ర సర్వే పూరై్తన 51 గ్రామాల్లో రికార్డుల ప్యూరిఫికేషన్, రికార్డుల అప్డేషన్, సర్వే రాళ్లు పాతడం వంటివి పూర్తయ్యే నాటికి ఆయా గ్రామాలలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కూడా ఏర్పాటు కావాలి. అంటే ఈ ఏడాది జూలై నాటికి 51 గ్రామ సచివాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ప్రారంభం కావాలి. అప్పుడే సమగ్ర భూసర్వే పూర్తైనట్లు. ఆ మేరకు గ్రామ సచివాలయంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కోసం తగిన ఏర్పాట్లు చూడండి’ అని ఆదేశించారు. ఎప్పటికప్పుడు సమీక్ష.. ‘‘సమగ్ర భూ సర్వే సజావుగా జరిగేలా స్టీరింగ్ కమిటీ ఏర్పాటు కావాలి. వారానికి ఒకసారి సమీక్ష నిర్వహించాలి. మొత్తం ఈ ప్రక్రియలో భూపరిపాలన చీఫ్ కమిషనర్ది కీలకపాత్ర’’.. అని సీఎం వైఎస్ జగన్ వివరించారు. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, భూపరిపాలన చీఫ్ కమిషనర్ నీరబ్కుమార్ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ, పంచాయితీరాజ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, సర్వే, సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్దార్ధ జైన్, ముఖ్యమంత్రి సలహాదారు అజేయ కల్లం, మైన్స్ డీఎంజీ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
పోయేటప్పుడు ఏం తీసుకుపోం కదా: సుచరిత
గుంటూరు : కరోనా నియంత్రణపై హోంమంత్రి మేకతోటి సుచరిత కలెక్టర్, డాక్టర్లు, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా పేరుతో ఎక్కువ డబ్బులు వసూలు చేసే ప్రైవేట్ హాస్పిటల్స్పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో కరోనా పేరుతో డబ్బులు ఎక్కువ వసూలు చేస్తే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు. ప్రభుత్వం సూచించిన రేట్లు మాత్రమే అమలు చేయాలి అని తెలిపారు. పేషెంట్ ఆస్పత్రిలో చేరగానే వెంటనే మూడు లక్షలు కట్టండి.. నాలుగు లక్షలు కట్టండి అని ఒత్తిడి చేస్తే ఎలా అంటూ సుచరిత అసహనం వ్యక్తం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు మానవత్వంతో వ్యవహరించాలి అని కోరారు. ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. డబ్బులు సంపాదించి ఏం చేసుకుంటాం.. పోయేటప్పుడు కూడా తీసుకు వెళ్ళం కదా అన్నారు సుచరిత. నిబంధనలు పాటించకపోతే కఠినంగా వ్యవహరించండి: వెల్లంపల్లి సాక్షి విజయవాడ: కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్ ఆసుపత్రులపై మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రత్యేక అధికారి సునీత, కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవిలత, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్ల కోసం 50 శాతం బెడ్స్ కేటాయించాలి అన్నారు. నిబంధనలు పాటించని హాస్పిటల్స్పై కఠినంగా వ్యవహరించండి అని మంత్రి వెల్లంపల్లి అధికారులకు సూచించారు. చదవండి: కడుపులో బిడ్డను మోస్తూ... కర్తవ్యాన్ని మరువకుండా..! -
కోవిడ్ నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి: కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి, లేకుంటే ఫైన్ విధించాలి అని తెలిపారు. 104 కాల్ సెంటర్ను ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘కోవిడ్ సమస్యలన్నింటికీ 104 నంబరు పరిష్కారంగా ఉండాలి. సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు.. హోటళ్లలో భౌతిక దూరం తప్పనిసరి. కన్వెన్షన్ సెంటర్లలో జరిగే ఫంక్షన్లలో.. రెండు కుర్చీల మధ్య 6 అడుగుల దూరం ఉండేలా చూడాలి. థియేటర్లలో ప్రతి 2 సీట్ల మధ్య తప్పనిసరిగా ఒక సీటు ఖాళీ ఉంచాలి’’ అని తెలిపారు. ‘‘ఆస్పత్రులలో వైద్య సదుపాయాలు, వైద్యులు అందుబాటులో ఉండాలి. కోవిడ్ నిర్ధారణ అయిన వారి ప్రైమరీ కాంటాక్ట్లు త్వరగా ట్రేస్ చేయాలి. కోరుకున్న వారందరికి కరోనా టెస్టులు చేయాలి. అన్ని ఆస్పత్రులలో తగినంత ఆక్సిజన్ సరఫరా ఉండాలి. విశాఖ ప్లాంట్ నుంచి రావాల్సిన ఆక్సిజన్ వాటా సరఫరా అయ్యేలా చూడాలి.. ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలి’’ అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. చదవండి: వ్యాక్సినే అస్త్రం.. ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి: సీఎం జగన్ -
‘ఆక్సిజన్ సిలెండర్ లభ్యతపై భయాందోళనలు వద్దు’
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెడికల్ ఆక్సిజన్ సిలెండర్ల అందుబాటుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, కరోనాను ఎదుర్కోవడంలో కేంద్రం.. రాష్టాలకు సహయం చేయడానికి సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ఆక్సిజన్ లభ్యతపై భయాందోళనలు అవసరంలేదని అన్నారు. మెడికల్ ఆక్సిజన్లు గతంలో కంటే ఎక్కువ ఉత్పత్తి అవుతోందని తెలిపారు. కోవిడ్ కేసుల తీవ్రత అధికంగా ఉన్న మహరాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ ఆయా రాష్ట్రలలో మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ అధికంగా ఉందని అన్నారు. ఆయా రాష్టాల మంత్రిత్వ శాఖల నుంచి, ఇంకా ఏమేరకు ఆక్సిజన్ అవసరమో సమాచారం సేకరిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే.. ఆక్సిజన్ను ఉత్పత్తిచేసే ఫ్లాంట్లను డిమాండ్కు తగ్గట్టుగా, ఉత్పత్తిని కూడా పెంచాలని ఆదేశించామని మోదీ తెలిపారు. పీఎం కేర్స్ నిధితో 100 ఆసుపత్రుల్లో సొంత ఆక్సిజన్ ఫ్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే మరో 50 వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ దిగుమతికి నిర్ణయంచామని అన్నారు. ఆక్సిజన్ ట్యాంకర్ల అంతరాష్ట్ర పర్మిట్ల నుంచి కేంద్రం మినహయింపు ఇచ్చిందని తెలిపారు. కేంద్రం, సిలెండర్ ఫిల్లింగ్ ఫ్లాంట్లకు అవరసరమైన భద్రతతో 24 గంటలు పనిచేయడానికి అనుమతి ఇచ్చిందని మోదీ పేర్కొన్నారు. -
104కు మరింత ప్రాచుర్యం: సీఎం వైఎస్ జగన్
ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స ఫీజులు, చార్జీలకు సంబంధించిన వివరాలను రోగులకు అర్థమయ్యేలా ప్రదర్శించాలి. బోర్డులపై ప్రదర్శించిన దాని కంటే ఎక్కువ వసూలు చేస్తే, ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా ప్రజలకు తెలిసేలా అన్ని వివరాలు ఉండాలి. ఔషధాలు, ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్ల రేట్లు కూడా స్పష్టంగా తెలియజేయాలి. ఎక్కడైనా అధిక ఫీజులు, చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. - సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 104 కాల్ సెంటర్కు విస్తృత ప్రచారం కల్పించాలని, ఎవరికైనా ఉచితంగా కోవిడ్ చికిత్స, బెడ్ కావాలంటే ఈ కాల్ సెంటర్ ద్వారా సేవలందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. 104 కాల్ సెంటర్కు రోగి ఫోన్ చేసిన 3 గంటల్లోగా ఆస్పత్రిలో బెడ్ సమకూర్చాల్సిందేనని స్పష్టం చేశారు. కోవిడ్–19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్పై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హోం ఐసొలేషన్, కోవిడ్ కేర్ సెంటర్ లేదా ఆస్పత్రిలో చేర్చడానికి వైద్యుల సూచనల మేరకు సేవలందించాలని చెప్పారు. అవసరమైతే అంబులెన్స్ సదుపాయం ఏర్పాటు చేయడంతో పాటు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల సహాయంతో రోగికి వేగంగా వైద్య సేవలందించాలన్నారు. హోం ఐసొలేషన్లో ఉన్న వారిని కూడా ఫాలో అప్ చేయాలని, ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కువ చార్జీలు వసూలు చేయకుండా దృష్టి సారించడంతోపాటు, కోవిడ్ చికిత్స ఫీజులను రోగులకు అర్థమయ్యేలా ప్రదర్శించాలని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ప్రతి ఒక్కరికీ అభినందనలు.. నిన్న (బుధవారం) అత్యధికంగా 6.28 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చాం. ఇది ఒక రికార్డు. ఇందుకు ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను. మీరంతా ఎంతో చొరవ చూపి పని చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, పీహెచ్సీల సిబ్బంది అందరూ సమష్టిగా పని చేయడం వల్లనే ఇది సాధ్యమైంది. రోజుకు 6 లక్షల వ్యాక్సిన్లు ఇవ్వాలన్నది మన లక్ష్యం. దాన్ని సాధించాము. ఇక ముందు కూడా అలాగే చేయాలి. ప్రస్తుతం వ్యాక్సిన్లు లేవు. కాబట్టి వాటి కోసం కేంద్రానికి లేఖ రాయండి. అవసరం అనుకుంటే నేను కూడా లేఖ రాస్తాను. గ్రీవెన్సుల కోసం 1902 నంబర్ గ్రీవెన్సుల కోసం 1902 నంబరు కేటాయించండి. ఇక 104 నంబరు కోవిడ్ సేవల కోసం పని చేస్తుంది. ఈ రెండింటినీ విస్తృతంగా ప్రచారం చేయండి. కోవిడ్కు సంబంధించిన ఏ సందేహం ఉన్నా 104కు ఫోన్ చేయాలని బాగా ప్రచారం చేయండి. దీన్ని కూడా ఇవాళ్టి నుంచి ప్రచారంలో చేర్చండి. అందుకు అవసరమైన ఫ్లెక్సీలు, హోర్డింగ్లను బస్టాండ్ వంటి పబ్లిక్ ప్లేసెస్లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయండి. కోవిడ్ పరీక్ష మొదలు.. వైద్యం, ఆస్పత్రులలో మెడిసిన్, శానిటేషన్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వరకు.. ఏ మాత్రం రాజీ పడొద్దు. ఎక్కడా కూడా రోగులు ఇబ్బంది పడకుండా చూడాలి. ఆ మూడింటిపై ప్రత్యేక శ్రద్ధ ఆస్పత్రిలో సేవలు, శానిటేషన్, నాణ్యమైన ఆహారం.. ఈ మూడు ప్రమాణాలు కోవిడ్ ఆస్పత్రులతో సహా, అన్ని ఆస్పత్రులలో ఉండేలా చూడాలి. క్వాలిటీ ఆఫ్ మెడికేషన్తో పాటు, సమయానికి మందులు అందించడం అన్నది చాలా ముఖ్యం. అన్ని ఆస్పత్రులలో ఇవన్నీ పర్ఫెక్ట్గా జరగాలి. అందుకోసం వాటిని పరిశీలించడానికి గతంలో మాదిరిగా కొందరు అధికారులకు బాధ్యతలు అప్పగించాలి. జిల్లాలలో కూడా ఆ ఏర్పాటు జరగాలి. టెస్టింగ్ ముఖ్యం టెస్టింగ్ చాలా ముఖ్యం. కోవిడ్ పేషెంట్ ప్రైమరీ కాంటాక్టులందరికీ పరీక్షలు చేయాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో కూడా పరీక్షలు చేయాలి. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. 104కు ఎవరైనా ఫోన్ చేసి, తాము పరీక్ష చేయించుకోవాలని అనుకుంటున్నామని చెబితే, వారు ఎక్కడికి పోవాలన్నది గైడ్ చేయాలి. అందువల్ల పీహెచ్సీ, సబ్ సెంటర్ లేదా విలేజ్ క్లినిక్.. ఎక్కడైనా సరే పరీక్ష చేయించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలి. వ్యాక్సినేషన్పై ఫోకస్ వ్యాక్సినేషన్పై మరింత దృష్టి సారించాలి. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ ముగించాలి. ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళికా బద్దంగా చేయాలి. రాష్ట్రంలో 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలి. హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లందరికీ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయాలి. ఒక్కరు కూడా మిగలకూడదు. మనం పెట్టుకున్న లక్ష్యానికి అనుగుణంగా, కచ్చితంగా ఇంకా కొన్ని రోజులు రోజుకు 6 లక్షల వాక్సిన్లు వేయాలి. హోం క్వారంటైన్ హోం క్వారంటైన్లో ఉన్న వాళ్లు కచ్చితంగా ఇళ్లలోనే ఉండేలా, రెగ్యులర్గా మానిటర్ చేయాలి. అందుకు తగిన ప్రొటోకాల్ రూపొందించుకోండి. తరుచూ సందర్శించడం వంటివి చేయాలి. అదే విధంగా వారికి ఏడు రకాల ట్యాబ్లెట్లు, క్యాప్సల్స్తో కూడిన కోవిడ్ కిట్ తప్పనిసరిగా అందించాలి. ఆక్సిజన్ సరఫరా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా పూర్తి స్థాయిలో ఉండాలి. విశాఖలో ప్రొడక్షన్ సెంటర్ నుంచి పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగేలా చూడాలి. కోవిడ్ చికిత్స అందిస్తున్న 108 ఆస్పత్రుల్లో తగినంత ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చూడండి. రెమ్డెసివిర్ ఇంజక్షన్లు అవసరమైన మేరకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఏ ఒక్క రోగి కూడా ఇబ్బంది పడకుండా చూడాలి. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 108 ఆస్పత్రుల్లో 15,669 బెడ్లు రాష్ట్రంలో పాజిటివిటీ రేటు ప్రస్తుతం 6.03 శాతం ఉందని సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీఎంకు తెలిపారు. కోవిడ్ చికిత్స కోసం రాష్ట్రంలో 108 ఆస్పత్రులు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉండగా వాటిలో 15,669 బెడ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇందులో ఇప్పుడు 4,889 బెడ్లను పేషంట్లకు కేటాయించామన్నారు.1,987 వెంటిలేటర్లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. బుధవారం నాటికి 22,637 మంది హోం ఐసొలేషన్లో ఉన్నారని వివరించారు. -
ప్రభుత్వ ధరలకే కోవిడ్ చికిత్స
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కోవిడ్ చికిత్సలు అందించాలని, నిబంధనలను ఉల్లంఘించి ప్రజలను అధిక ఫీజుల కోసం వేధిస్తే కఠిన చర్యలు తప్పవని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. ప్రస్తుతం రోగుల వద్దకు పీపీఈ కిట్లు లేకుండా కేవలం మాస్క్లతోనే డాక్టర్లు వెళ్లగలుగుతున్నందున, వాటికి అదనంగా చార్జీలు వసూలు చేయొద్దని సూచించారు. కోవిడ్ రోగులకు బెడ్ల కేటాయింపు అంశంపై శనివారం మంత్రి ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలతో వేర్వేరు గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కరోనా చికిత్స, ఆసుపత్రుల్లో బెడ్ల చార్జీలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజుల వసూళ్లకు సంబంధించి అంశాలు చర్చకు వచ్చాయి. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కాగా, తమకు సరిపడా వైద్య పరికరాలు, మందులు, ఆక్సిజన్ వంటివి ఉచితంగా సరఫరా చేయాలని ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులకు ప్రభుత్వమే కావాల్సిన మందులు సరఫరా చేస్తుందన్నారు. ప్రైవేట్ వైద్య కాలేజీల అనుబంధ ఆసుపత్రుల్లో 14 వేలకు పైగా బెడ్స్ ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలోనూ కావాల్సినన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 50 శాతం బెడ్స్, ఉచిత చికిత్స.. ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అవసరమైన మం దులు, ఆక్సిజన్, ఇతర పరికరాలను ప్రభుత్వం అందిస్తున్నందున కోవిడ్ రోగులకు 50 శాతం బెడ్స్ కేటాయింపుతో పాటు, అక్కడ కరోనా పేషెంట్లకు ఉచితంగా చికిత్స చేయాలని సూచించినట్టు మంత్రి ఈటల చెప్పారు. అలా అని అవసరం లేకపోయినా చికిత్సకోసం ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో చేరేందుకు రావొద్దని, డాక్టర్లు సిఫారసు చేస్తేనే వాటిలో చేరాలని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్హోంలు వ్యాపార ధోరణితో కాకుండా మానవీయ దృక్పథంతో ఎక్కువ ఫీజులు వసూలు చేయకుండా కరోనా రోగులకు వైద్యం అందించాలని కోరామన్నారు. వ్యాక్సిన్ల కొరతపై కేంద్రానికి లేఖ రాసినట్టు చెప్పారు. కరోనాపై అప్రమత్తంగా ఉండాలి.. కరోనా విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈటల రాజేందర్ సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్నందున ఫంక్షన్లు, బహిరంగ సభలకు, సమావేశాలకు వెళ్లకూడదని సూచించారు. రాష్ట్రంలో లాక్డౌన్, కర్ఫ్యూ విధింపు వంటివి ఉండవన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఏపీలలో కేసుల తీవ్రత కారణంగానే తెలంగాణలో కూడా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. కేసుల సంఖ్య పెరిగినా.. వైరస్ తీవ్రత తక్కువగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో టీకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం 50 శాతం బెడ్లు కోరింది.. కరోనా నేపథ్యంలో 50 శాతం బెడ్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టు ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధి డాక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. మందులు, ఆక్సిజన్ సరఫరా చేయాలని కోరినపుడు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. 24 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 750 చొప్పున బెడ్స్ ఉంటాయని తాము యాభై శాతం బెడ్స్ ఇస్తామని ప్రభుత్వానికి చెప్పినట్టు మల్లారెడ్డి కాలేజీ ప్రతినిధి భద్రారెడ్డి పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ను కూడా ప్రజలకు ఉచితంగా అందిస్తామని మహేశ్వర మెడికల్ కాలేజీ ప్రతినిధి డాక్టర్ కృష్ణారావు చెప్పారు. సెకండ్ వేవ్తో ప్రమాదం ఏమీ లేదు.. ప్రస్తుతం వంద మంది కోవిడ్ రోగులు వస్తే కేవలం ముగ్గురు మాత్రమే వెంటిలేటర్ వరకు వెళ్తున్నారని కిమ్స్ ప్రతినిధి భాస్కర్రావు తెలిపారు. సెకండ్వేవ్తో ప్రమాదం ఏమి లేదన్నారు. ఇంకో మూడు సంవత్సరాలు జాగ్రత్త పడితేనే బయటపడతామన్నారు. కాగా, ఫీజులు.. బిల్లుల విషయంలో ప్రైవేటు ఆసుపత్రులపై ఆరోపణలు రావడం సహజమేనన్నారు. అయితే లోన్లు కట్టలేదని బ్యాంకు అధికారులు వచ్చి ఆసుపత్రులను సీజ్ చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. చదవండి: ఈఎస్ఐ స్కాం: నాయిని అల్లుడి ఇంట్లో ఈడీ సోదాలు ముగ్గురు మాయ లేడీలు.. భలే దోపిడీలు! -
జూలై 1 నుంచి కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం
సాక్షి, అమరావతి: జూలై 1వ తేదీ నుంచి కొత్త మెడికల్ కాలేజీలకు సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. వచ్చే కేబినెట్ సమావేశం నాటికి మొత్తం మెడికల్ కాలేజీలకు సంబంధించి భూ సేకరణ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్ల నుంచి పీహెచ్సీ, సీహెచ్సీ, ఏరియా, జిల్లా, బోధనాసుపత్రుల వరకు జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎస్వోపీలు రూపొందించాలన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమంపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త మెడికల్ కాలేజీల్లో రిక్రూట్మెంట్ పకడ్బందీగా జరగాలని.. వైద్యులు, సిబ్బంది కొరత ఉందనే విమర్శలు రాకూడదని చెప్పారు. మెడికల్ డిపార్ట్మెంట్లు అన్నీ ఒకే గొడుగు కింద ఉంటే.. రిక్రూట్మెంట్ సులువుగా, ఒక పద్ధతిగా జరుగుతుందని అన్నారు. నాడు–నేడు కింద చేపట్టే పనులకు ఇచ్చే నిధుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 16 మెడికల్ కాలేజీలకు గాను 8 కాలేజీలకు భూసేకరణ పూర్తయ్యిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మిగిలిన ఎనిమిదింటికి కూడా భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 16 కొత్త మెడికల్ కాలేజీలకు సంబంధించిన స్టేటస్ను అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్కు నిధులు విడుదల చేయండి ►వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్కు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలి. ఈ క్లినిక్స్కు మంచి రంగులు వేయాలి. చూడగానే ఇది ఆసుపత్రి అనే భావన కలిగించేలా, ఆకట్టుకునేలా ఉండాలి. ►నాడు–నేడు స్కూల్స్ తరహాలో వైబ్రెంట్గా ఉండాలి. (అన్ని చోట్ల షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతున్నాయా.. లేదా? అని ఈ సందర్భంగా సీఎం ఆరా తీశారు.) ఆసుపత్రుల నిర్వహణకు మేనేజర్ల నియామకం ►ఆసుపత్రుల నిర్వహణను మెడికల్ సూపరింటెండెంట్లకే వదిలేయడం వల్ల మేనేజ్మెంట్ విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. నిర్వహణ శాస్త్రీయంగా ఉండటానికి హాస్పిటల్ మేనేజర్లను నియమించుకోవాలని సీఎం సూచించారు. ►క్లినికల్ నిర్ణయాలు మినహా మిగిలిన ఆసుపత్రి నిర్వహణను మేనేజర్లు పర్యవేక్షిస్తారని, పలు రాష్ట్రాల్లో ఈ విధానం ఇప్పటికే అమలవుతోందని, మంచి ఫలితాలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఆస్పత్రుల నిర్వహణ చాలా ముఖ్యం ►ఆసుపత్రుల నిర్వహణకు సంబంధించి హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ నిధుల విడుదల విషయంలో ఎక్కడా జాప్యం జరగకూడదు. దీనిపై ఒక విధానాన్ని రూపొందించి, ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయాలి. ►ప్రైవేట్ ఆసుపత్రుల్లో సదుపాయాలు ఎలా ఉంటాయో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అదే విధమైన సదుపాయాలు రోగులకు అందాలి. హాస్పిటల్ మేనేజ్మెంట్కు సంబంధించి మెడికల్ కాలేజీల్లో ప్రత్యేకంగా కోర్స్ ఏర్పాటు చేయాలి. ►హాస్పిటల్ మేనేజ్మెంట్పై ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రులను భాగస్వాములను చేసి, వారి సూచనలు, సలహాలు తీసుకోవాలి. ప్రైవేట్లో ఎలా చేస్తున్నారో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అలా జరగాలి. ఆసుపత్రుల నిర్మాణం జరిగేటప్పుడే అవసరమైన సదుపాయాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలి. ►ప్రతి ఆసుపత్రి నిర్వహణపై ఆడిట్, సూపర్ విజన్ జరగాలి. ఇవి ఉంటేనే మనం అనుకున్న విధంగా సదుపాయాలు ప్రజలకు అందుతాయి. హాస్పిటల్ మేనేజ్మెంట్ పోస్ట్ల పదోన్నతులు సిఫార్సుల ద్వారా కాకుండా పనితీరు ఆధారంగా వుండాలి. చదవండి: రోజుకు 6 లక్షల మందికి టీకా: సీఎం జగన్ తిరుపతి ఓటర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ