AP Cyclone Montha Live News Updates Telugu: ఆంధ్రప్రదేశ్ తీరం సైక్లోన్ మోంథా ధాటికి తల్లడిల్లిపోయింది. భారీ నష్టాన్ని కలగజేసి తీరం దాటిన తీవ్ర తుపాన్ కాస్త తుపానుగా మారిపోయి తన ప్రభావం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో దిశ మార్చుకుని తెలంగాణ వైపు దూసుకొస్తోంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది.
తుపాన్ నష్టంపై అధికారుల ప్రాథమిక నివేదిక
విజయవాడ:
- రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1,825 గ్రామాల్లో 87 వేలహెక్టార్లలో పంటకు నష్టం.
- 59 వేలకు పైగా హెక్టార్లలో నీట మునిగిన వరి పంట, పత్తి, మొక్కజొన్న, మినుము పంటలకు నష్టం.
- భారీ వర్షాలతో నష్టపోయిన 78,796 మంది రైతులు.
- రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన 42 పశువులు.
- రాష్ట్రంలో దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లు, 14 బ్రిడ్జిలు, కల్వర్టులు
- దెబ్బతిన్న 2,294 కి.మీ. పొడవున ఆర్ అండ్ బీ రహదారులు... రూ.1,424 కోట్ల నష్టం.
- రూరల్ వాటర్ సప్లయ్కు సంబంధించి రూ.36 కోట్లు వరకు, ఇరిగేషన్ పనుల్లో రూ.16.45 కోట్ల మేర నష్టం.
- సురక్షిత ప్రాంతాలకు 3,175 మంది గర్భిణీల తరలింపు... 2,130 మెడికల్ క్యాంపుల నిర్వహణ.
- 297 రహదారులపై వరద నీరు పొంగి ప్రవహిస్తుండగా, వాటిని దారి మళ్లించేలా చర్యలు.
- రాష్ట్రంలో మొత్తం 380 చెట్లు రహదారులపై విరిగిపడగా, అన్నింటినీ తొలిగించామని చెప్పిన యంత్రాంగం.
బాపట్ల:
- రేపల్లె నియోజకవర్గంలో ఇంకా పునరుద్ధరణ కానీ విద్యుత్ సరఫరా
- అంధకారంలో ఇంకా నియోజకవర్గంలోని చాలా గ్రామాలు
- 24 గంటల నుంచి కరెంట్ లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు
అల్లూరి జిల్లా :
- మోంథా తుఫాన్ ఎఫెక్ట్..
- రేపు కేకే లైన్ లో రైళ్ళ రాకపోకలు బంద్
- కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో రైల్వే అధికారుల నిర్ణయం..
- కిరండూల్ ప్యాసింజర్ రైలు రద్దు..
వరంగల్- ఖమ్మం ప్రధాన రహదారిపై భారీగా వరదనీరు
- రేపు (గురువారం) వరంగల్ జిల్లాలో పాఠశాలలకు సెలవు
- నీట మునిగిన వరంగల్ రైల్వే స్టేషన్
- ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు
- ప్రయాణికుల ఇక్కట్లు
శ్రీశైలం - హైదరాబాద్ రాకపోకలకు అంతరాయం
- నాగర్ కర్నూల్ జిల్లా, ఉప్పునుంతల మండలం, లత్తిపూర్ సమీపంలో వరదకు కోతకు గురైన బ్రిడ్జి.
- డిండి వాగుపై నిర్మించిన బ్రిడ్జిపై శ్రీశైలం-హైదరాబాద్ మధ్య నిలిచిన రాకపోకలు.

వరంగల్లో కుండపోత వర్షం
- పలు కాలనీల్లో ఇళ్లల్లోకి చేరిన వర్షపు నీరు
- హన్మకొండ బస్టాండ్ ఆవరణలోకి భారీగా వరద
- వరంగల్ అండర్ రైల్వే గేట్తో పాటు హన్మకొండ, భవానీ నగర్లో భారీగా వరద
- అంబేద్కర్ భవన్ రహదారి జలమయం
- అంబేద్కర్ భవన్లో చిక్కుకున్న పెళ్లి బృందం
- చెరువులను తలపిస్తున్న రైలు పట్టాలు
- మహబూబాబాద్ జిల్లాలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు
- డోర్నకల్ రైల్వే ట్రాక్పైకి భారీగా వరద, నిలిచిన రైళ్లు
- వరంగల్, హన్మకొండలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు
- కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు: 18004253424, 9154225936
- తెలంగాణలో ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్
మహబూబ్నగర్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ - 9 జిల్లాలకు ఆరెంజ్, మరో 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్
వరంగల్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం
- పర్వతగిరిలో 34 సెం.మీ వర్షపాతం
- నెక్కొండలో 24 సెం.మీ వర్షపాతం నమోదు
- సంగెం మండలంలో 25 సెం.మీ వర్షపాతం
- ఖిలావరంగల్లో 23, ాపాలకుర్తిలో 23 సెం.మీ వర్షపాతం
తూ.గో.జిల్లా:
- నల్లజర్ల లో ముందా తుఫాన్ వలన నేలకొరిగిన పంటలను పరిశీలించిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ , నియోజకవర్గ ఇంచార్జ్
- , మాజీ హోం మంత్రి తానేటి వనిత
- పంట పాలు పోసుకునే దశలో నేలకి ఒరిగి పోయాయి
- గడచిన ప్రభుత్వం రైతుల పక్షాన ఏ విధంగా చేసిందో ప్రజలు ఆలోచించాలి
- రైతుకు జరిగిన నష్టాన్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా పూడ్చాలో ఆలోచించాలి
- గత ప్రభుత్వం పంట వేసే ముందు పెట్టుబడి సహాయం ఇచ్చేది
- అన్నదాత సుఖీభవ పేరుమీద ప్రతి రైతుకు ఎకరానికి రూ. 20,000 రూపాయలు ఇస్తానన్నారు
- 18 నెలల కాలం గడిచిన కేవలం రూ.5000 రూపాయలు మాత్రమే ఇచ్చారు
- పంట పెట్టుబడి సహాయం లేదు కానీ ఒక పంటకు నష్టపోయిన రైతు అధిక వడ్డీలకు రుణాలు పొందుతున్నారు
- రైతులకు పంటలకు ఇన్సూరెన్స్ చెల్లించిన ఘనత జగన్ ప్రభుత్వానిదే
- పంట నష్టం వస్తే సబ్సిడీ కూడా చెల్లించిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం
ఖమ్మం:
- మధిర రైల్వే స్టేషన్ లో నిలిచిపోయిన సాయి నగర్ శిరిడి ఎక్స్ ప్రెస్..
- డోర్నకల్ రైల్వేస్టేషన్లో పట్టాలపై వరద నీరు చేరటంతో మధిర స్టేషన్ లో నిలిపివేసిన రైల్వే అధికారులు..
- మోంథా తుపాను నేపథ్యంలో ఖమ్మం రైల్వే స్టేషన్ లో నిలిచిపోయిన వందే భారత్ ట్రైన్...
- డోర్నకల్ జంక్షన్ వద్ద రైలు పట్టాలపై నీరు ప్రవహించడంతో వందే భారత రైలును ఖమ్మం రైల్వే స్టేషన్ లో నిలుపు వేశారు...
- భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -జిల్లా కలెక్టర్ అనుదీప్...
- అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో జనం ఏదైనా అత్యవసరం అవుతేనే ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలి - జిల్లా కలెక్టర్
ఖమ్మం:
- మోoథా తుపాను ఎఫెక్ట్ తో జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు...
- స్తంభించిన జన జీవనం
- జన్నారం వద్ద నిమ్మవాగు లో కొట్టుకుపోయిన డీసీఎం వ్యాన్.
- వరంగల్ నుంచి ఎన్కుర్ వస్తు ఉండగా జన్నారం వద్ద నిమ్మ వాగు ఉధృతిని అంచనా వేయలేక ముందుకు వెళ్లిన వ్యాన్ డ్రైవర్...
- అందరు చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయిన వ్యాన్...
- గల్లంతయిన డ్రైవర్ కోసం గాలిస్తున్న ఎన్డీఆర్ ఆప్ సిబ్బంది...
- మళ్లీ భారీ వర్షం కురుస్తుండడంతో రెస్క్ ఆపరేషన్ కు అంతరాయం...
- జూలూరుపాడు మండలం పెద్ద వాగు పొంగి కాజ్ వే పైకి ప్రవహిస్తున్న వరద నీరు...
- పడమటి నర్సాపురం, భేతాళుడు వైపు వెళ్లే 20 గ్రామాలకు నిలిచిన రాకపోకలు...
- చింతకాని మండలం నాగులవంచ -పాతర్లపాడు మధ్య రహదారిపై ప్రవహిస్తున్న బండి రేవు వాగు వరద..
జగ్గంపేట(కాకినాడ జిల్లా ):
- కిర్లంపూడి మండలం పాలెం గ్రామంలో మోంథా తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలకు కూలిన పెంకుటిల్లు
- బాధితులను పరామర్శించి రూ.5,000 రూపాయలు నగదు, బియ్యం బస్తా అందజేసిన జగ్గంపేట వైఎస్సార్సీపీ ఇంచార్జ్
తోట నరసింహం.
హైదరాబాద్ :
- 135 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు.
- మరో 31 రైలను దారి మళ్ళించాం: దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్
- మోంథా తుపాను ప్రభావం తగ్గిన తర్వాతనే రైళ్లను పునరుద్ధరిస్తాం.
- మోంథా ప్రభావంతో డోర్నకల్ రైల్వే స్టేషన్ దగ్గర ట్రాకులు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
ప్రకాశం:
- సంతనూతలపాడు నియోజకవర్గంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున
- మోంథా తుపాను కారణంగా నాగులుప్పలపాడు మండలం మట్టిగుంట, ఈదుముడి మద్దిరాల ముప్పాళ గ్రామాలలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ మేరుగు నాగార్జున ,
- ప్రభుత్వం వెంటనే స్పందించి తుపాను కారణంగా నీట మునిగిన పంట పొలాలను అధికారులు పరిశీలించి రైతులకు తగిన సహాయం అందించి వారికి కొంత ఉపశమనం కలిగించేల చర్యలు చేపట్టాలని కోరిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ మేరుగు నాగార్జున
ప్రకాశం జిల్లా:
- ఒంగోలులో ముంపు ప్రాంతాలను పరిశీలించిన వైఎస్సార్సీపీ ఇంఛార్జి చుండూరి రవిబాబు
- పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు సరిగా లేవు
- ముంపు బాధితులకు భోజనాలు సరిగా ఏర్పాటు చేయకపోవడం దారుణం
- కలెక్టర్ తక్షణమే స్పందించి ముంపు బాధితులకు భోజన వసతి చూడాలి..; చుండూరి రవిబాబు
కాకినాడ
- ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తీరుకు నిరసనగా కొత్తపట్నం మత్స్యకారుల ఆందోళన
- ఉప్పాడలో పర్యటించిన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్
- తమ సమస్యలు చెప్పుకునేందుకు కారు వద్దకు వచ్చిన మత్స్యకారులు
- కారు ఆపకుండా వెళ్ళిపోవడం పై గంగపుత్రుల ఆగ్రహం
- ఓట్లు అవసరం ఐనప్పుడు మాత్రమే మేము కావాలా అంటూ అసహనం
విజయనగరం జిల్లా.
- మోంథా ప్రభావంతో 50 గ్రామాల రాకపోకలు అంతరాయం.
- సంతకవిటి మండలం సిరిపురం వద్ద పొంగిపొర్లుతున్న రెల్లిగెడ్డ.
- సిరిపురం నుండి పొందూరు,
మండవకురిటి నుండి జి.సిగడాం రహదారులపై ఉప్పొంగుతున్న వరద నీరు. - రాకపోకలను నిలిపివేయాలని ఆదేశించిన ఆర్డీవో.
- పోలీసుల పర్యవేక్షణలో రహదారులకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు.
పశ్చిమగోదావరి జిల్లా.
- ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలో మోంథా తుపాను ప్రభావంతో 250 ఎకరాల వరిచేలు మునక.
- ఎకరాకు 25 వేల రూపాయలు పెట్టుబడి పెట్టామంటూ రైతుల ఆవేదన.
- అధికారులు కన్నెత్తి చూడలేదంటూ రైతుల అసహనం

తుపాను
పశ్చిమగోదావరి జిల్లా:
- మోంథా తుపాను ప్రభావంతో పాలకొల్లు, యలమంచిలి,పోడూరు మండలాల్లోని పలు గ్రామాలు దొడ్డిపట్ల, అబ్బురాజు పాలెం,లంక గ్రామాల్లో అరటి, తమలపాకు తోటలకు తీవ్ర పంట నష్టం
- రైతులు తీవ్ర ఆందోళన
- తుపాను తో నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం తక్షణమే ఆదుకునీ నష్టపరహం చెల్లించాలని కోరుతున్న రైతులు
ఏలూరు జిల్లా:
- మోంథా తుపాను ప్రభావంతో ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీమడోలు మండలాల్లో పలు చోట్ల నెలకొరిగిన వరి క్షేత్రాలు,
- స్వర్ణరకం వరి వంగడం వేసిన రైతులు పంట నెలకొరిగి తీవ్రనష్టం,
- ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్న రైతులు
తూర్పుగోదావరి జిల్లా:
- నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో మోంథా ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి చెల్లు బోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు
- పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్
నల్లగొండ జిల్లా:
- గుర్రంపోడు మండల కేంద్రంలో ఇళ్లలోకి చేరిన వరద నీరు
- వర్షపు నీరు వెళ్లడానికి సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో జనాల అవస్థలు
కృష్ణా జిల్లా
- కంకిపాడు మండలం ఉప్పులూరులో తుపాను ప్రభావంతో పల్లపు తిరుపతమ్మ ఇల్లు నేలమట్టం.
- విషయం తెలుసుకున్న YSRCP పెనమలూరు నియోజకవర్గం ఇంచార్జ్ దేవభక్తుని చక్రవర్తి.
- స్వయంగా వెళ్లి బాధిత కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం అందించిన దేవభక్తుని చక్రవర్తి.
కాకినాడ
- తాళ్ళరేపు మండలం పిల్లిలంకలో తుపాను భాధితులకు బిర్యాణీ ప్యాకెట్లు అందజేసిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి చింతలపాటి శ్రీనివాసరాజు
అనకాపల్లి :
- శారాధ నదికి పెరుగుతున్న వరద ఉదృతి..
- ప్రమాద స్థాయికి చేరుకున్న నీటిమట్టం..
- రహదారుల మీద నుంచి ప్రవహిస్తున్న వరద నీరు..
- పలు గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదం..
- అప్రమత్తమైన అధికారులు..
- యలమంచిలి - గాజువాక రహదారిలో రాకపోకలు నిలిపేసిన పోలీసులు..
తెలంగాణకు మోంథా ముప్పు!
తెలంగాణ వైపు కదులుతున్న మోంథా
ఇప్పటికే ఏపీలో తీరని నష్టం
ఇంకా కురుస్తున్న వానలు
మరో గంటలో ఖమ్మంను తాకనున్న మోంథా
హనుమకొండ, వరంగల్, మహబూబాద్ జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ
ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.. ఆరెంజ్ హెచ్చరికలు
సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.. ఆరెంజ్ హెచ్చరికలు
హైదరాబాద్ వర్షాలపై.. అధికారుల్ని అప్రమత్తం చేసిన జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం

రైళ్లపై మోంథా ప్రభావం
తెలంగాణపై మోంథా తుపాను ఎఫెక్ట్
మోంథా ప్రభావంతో దక్షిణ మద్య రైల్వే పరిధిలో రైళ్ల రాకపోకలకు అంతరాయం
మహబూబాబాద్లో ఆగిపోయిన కృష్ణా ఎక్స్ప్రెస్
నీట మునిగిన డోర్నకల్ రైల్వే స్టేషన్
డోర్నకల్లో ఆగిపోయిన గోల్కొండ ఎక్స్ప్రెస్
వరంగల్లోనే ఆగిపోయిన ఇంటర్ సిటీ
మధిర స్టేషన్లో ఆగిన షిరిడి ఎక్స్ప్రెస్
ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు
సంబంధిత కథనం: మోంథా ఎఫెక్ట్.. రద్దైన రైళ్ల వివరాలు ఇవిగో
ఖమ్మం జిల్లాలో మోంథా తుపాను బీభత్సం
కొణిజర్ల మండలం జన్నారం వద్ద నిమ్మవాగులో బ్రిడ్జి పైనుంచి పడిపోయిన డీసీఎం
నిమ్మవాగులో డ్రైవర్ గల్లంతు, గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు

మోంథా తుపాను.. తెలంగాణ సర్కార్ హైఅలెర్ట్
- మోంథా ప్రభావంతో తెలంగాణకు భారీ వర్షాలు
- ఆర్ అండ్ బీ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
- ఫీల్డ్ లెవెల్ లో హై అలెర్ట్ గా ఉండాలని సూచన
- అత్యవసరం ఐతే తప్పా.. ఎవరూ సెలవు పై వెళ్లొద్దని ఆదేశం
- మాన్సూన్ సీజన్ లో చేపట్టిన జాగ్రత్త చర్యలు.. అదే స్పూర్తితో కొనసాగించాలి: మంత్రి కోమటి రెడ్డి
- ప్రజలను అప్రమత్తం చేయడానికి పోలీసు,రెవెన్యూ,విద్యుత్,ఇరిగేషన్,పిఆర్ శాఖలతో సమన్వయం చేసుకోవాలి: మంత్రి కోమటి రెడ్డి
- లో కాజ్ వే లు,కల్వర్టులు వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలి: మంత్రి కోమటి రెడ్డి
- ఆర్ అండ్ బి ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ సెంటర్ అన్ని జిల్లాలతో అనుసంధానం చేయాలి: మంత్రి కోమటి రెడ్డి
- అత్యవసరమైతేనే ప్రజలు రోడ్ల పైకి రావాలి,అధికారులు సూచించే జాగ్రత్తలు పాటించాలి: మంత్రి కోమటి రెడ్డి

కరీంనగర్ జిల్లాలో..
- నిండుకుండలా లోయర్ మానేరు డ్యామ్
- మోంథా తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలు
- 2 గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన అధికారులు
- ఇన్ ఫ్లో: 1277 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో: 4 వేల క్యూసెక్కులు
- ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం: 24.034 టీఎంసీలు
- ప్రస్తుత నిల్వ 24.034 టీఎంసీలు
- దిగువ నది పరిసర ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచన
- పశువుల కాపర్లు,మత్స్య కారులు,రైతులు నది దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరికలు
తెలంగాణ భారీ వర్షాలపై మంత్రి పొంగులేటి అప్రమత్తం
- భారీ వర్షాల వల్ల ప్రజా జీవనానికి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు
- రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష
- రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై సమీక్ష నిర్వహించిన మంత్రి
- ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
- రాగల 24 గంటల్లో అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట, వరంగల్, యాదాద్రి, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు
- వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి
- లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు
- పోలీసులతో కలసి వాగులు, కాల్వలు, చెరువుల దగ్గర పర్యవేక్షణ చేయాలని ఆదేశాలు
- అత్యవసర సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి ఆదేశాలు
- విద్యుత్, పంచాయతీ రాజ్, ఆర్ & బి శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచనలు
- ప్రాణనష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి సూచనలు
- ప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రాధాన్యం – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

నాగర్ కర్నూలు జిల్లాలో..
- ఉప్పునుంతల మండలం మొల్గర గ్రామం వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న దుందుభి వాగు,
- ఉప్పునంతల వంగూరు మండలాలకు రాకపోకలు బంద్
- తాడూరు మండలంలో భారీ వర్షం
- పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
- ఐతోలు, గోవిందాయపల్లి మధ్య రోడ్డుపై పారుతున్న వాగు నిలిచిపోయిన రాకపోకలు

నల్లగొండ జిల్లాలో..
- తిరుమలగిరి (సాగర్)లో పొంగిపొర్లుతున్న బర్ల బంధం
- రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీరు
- బడాయిగడ్డ గ్రామ సమీపంలో కల్వర్టు పైనుంచి ప్రవహిస్తోన్న వరద నీరు
- తిరుమలగిరి- రాజవరం మధ్య రాకపోకలు నిలిపివేత
- మండల వ్యాప్తంగా నీట మునిగిన పత్తి, వరి పొలాలు
బలహీనపడి తెలంగాణ వైపు దూసుకొస్తున్న మోంథా
తీరం దాటాక దిశ మార్చుకున్న మోంథా
తెలంగాణ వైపు దూసుకొస్తున్న తుపాను
భద్రాచలానికి 50కి.మీ. ఖమ్మంకు 110కి.మీ. దూరంలో కేంద్రీకృతం
భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ
ఇప్పటికే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షాలు
హైదరాబాద్లోనూ దంచికొడుతున్న వర్షం
తెలంగాణలో 14 జిల్లాలకు ఫ్లాష్ఫ్లడ్ అలర్ట్ జారీ
వాయవ్య దిశగా ప్రయాణించి రాబోయే ఆరుగంటల్లో బలహీనపడే అవకాశం
ఒంగోలు జలమయం..
- మోంతా తుపాను దాడికి ఒంగోలులోని లోతట్టు కాలనీలు జలమయం
- ఒంగోలు నగరంలోని వెంకటేస్వరా కాలనీ, నేతాజీ కాలనీ,నెహ్రూ కాలనీ ,బిలాల్ నగర్,పాపకాలని ,బలరాం కాలనీ ,మథర్ తెరిశా కాలనీలు జలమయం
- సముద్రాన్ని తలపిస్తున్న రోడ్లు
- నేతాజీ కాలనీ,వెంకటేస్వరా కాలనీల ప్రజల జలదిగ్బంధం
కోనసీమ.. ఇళ్లలోకి పాములు!
- కోనసీమ అంబాజి పేటను ముంచెత్తిన వర్షపు నీరు
- ఇళ్లలోకి చేరుకున్న వర్షపు నీరు
- రోడ్ల పై మోకాలు లోతు నీరు చేరుకోవడంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు
- సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక పోవడంతో చిన్న చినుకు పడితే రోడ్లు అన్ని జలమయం అవుతాయి అంటున్న గ్రామస్థులు
- నాగబాత్తుల వారి పాలెం లో వర్షపు నీరు ఇంట్లోకి చేరుకోవడంతో ఇళ్లలోకి వస్తున్న పాములు.. ఆందోళనలో ప్రజలు
మోంథా ధాటికి భారీగా పంట నష్టం
మోంథా ప్రభావంతో శ్రీకాకుళం నుంచి తిరుపతి దాకా అన్నిచోట్లా దెబ్బ తిన్న పంటలు
తుపాను ప్రబావంతో చేతికందిన పంట నీటిపాలు
కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో వేల ఎకరాలల్లో భారీగా పంట నష్టం
కృష్ణా జిల్లాలో నేలకొరిగిన అరటి బొప్పాయి తోటలు
శ్రీకాకుళంలో 350 హెక్టార్లలో పంట నష్టం
గాలులకు అరటి, కంద, బొప్పాయి తోటలు నష్టం
విజయనగరంలో 7 వేల ఎకరాలు నేలవాలిన వరి
ప్రకాశం జిల్లాలో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం
గుంటూరు, బాపట్ల, పల్నాడులో తడిసి ముద్దైన పత్తి
కన్నీరు పెడుతున్న ఏపీ రైతాంగం
పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లో నీట మునిగిన వరి పంట
తెలంగాణ ఖమ్మంలో..
- మోంథా తుపాను కారణంగా ఉమ్మడి ఖమ్మంలో కురుస్తున్న భారీ వర్షాలు
- స్తంభించిన జనజీవనం
- బోనకల్ లో అత్యధికంగా 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
- తల్లాడ లో 9 సెం.మీ, వైరా లో 8 సెం. మీ, పెనుబల్లి లో 7 సెం. మీ, మధిర 7 సెం. మీ, కల్లూరు 7 సెం.మీ వర్షపాతం నమోదు....
- భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్ అనుదీప్...
- అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో జనం ఏదైనా అత్యవసరం అవుతేనే ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలని సూచన
అనకాపల్లి జిల్లాలో..
- విజయరామరాజు పేట దగ్గర ఉధృతంగా తాచేరు నది
- తాత్కాలిక కాజ్ వే మునిగిపోయే ప్రమాదం
- అల్లూరి - అనకాపల్లి జిల్లాల మధ్య వాహనాలు రాకపోకలకు విఘాతం
- ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు
నంద్యాల జిల్లాలో..
- ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రభావం చూపిన మోంథా తుపాను
- సిరివెళ్ల నుండి రుద్రవరం వెళ్లే రోడ్డు మార్గం జలమయం, నిలిపివేసిన ఏపీఎస్ఆర్టీసీ సేవలు.
- ఆళ్లగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాల వల్ల ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు...
- రోడ్డుపై ఆరబెట్టిన మొక్కజొన్న మొత్తం నీటిమయం ఆదుకోవాలని కోరుతున్న రైతులు
- ప్రమాద ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి న రెవెన్యూ అధికారులు పోలీసులు రెవెన్యూ అధికారులు పోలీసులు
- నంద్యాల టౌన్ను ముంచెత్తిన తుపాను
- లోతట్టు కాలనీలు జలమయం,ఇళ్లల్లోకి చేరిన వర్షపునీరు
- తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు
- తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
- ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీరు
- ఉదృతంగా ప్రవహిస్తున్న కుందు నది , వెక్కిలేరు , పాలేరు వాగులు
- వరద హెచ్చరికలు జారీ చేసిన రెవెన్యూ , మున్సిపల్ అధికారులు
- మహానంది - నంద్యాల మధ్య , మహానంది - గాజులపల్లి మధ్య వరద కారణంగా నిలిచిన రాకపోకలు

శ్రీశైలంలో..
- శ్రీశైలం మండలంలో అల్లకల్లోలం చేసిన మోంథా తుపాను
- శ్రీశైలంలో అర్ధరాత్రి నుంచి భీభత్సం సృష్టించిన కుండపోత వర్షం
- శ్రీశైలంలోని పలు కాలనీలోకి మోకాళ్ళ లోతుకు చేరిన వరద నీరు
- శ్రీశైలం డ్యాం వద్ద విరిగిపడిన భారీ కొండ చరియలు,
- కొండచరియలు రోడ్డుకు అడ్డంగా పడడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఆటంకం,
- లింగాలగట్టులో మత్స్యకారుల ఇళ్లల్లోకి చేరిన వరద నీరు,
- లింగాలగట్టులో వర్షం భీభత్సం ధాటికి కొట్టుకుపోయిన మత్స్యకారుల ఇల్లులు
- అర్థరాత్రి నుంచి నిద్ర లేకుండా బిక్కుబిక్కుమంటూ గడిపిన మత్స్యకారులు
అనకాపల్లి జిల్లాలో..
- ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఉడేరు నదికి పెరిగిన వరద నీరు
- వరద నీరు తాకిడి కారణంగా ఉడేరు నదికి పడిన గండి
- ఉడేరు నదికి గండి పడడంతో పంట పొలాల్లోకి వస్తున్న వరద నీరు
- ఆందోళన చెందుతున్న భోగాపురం చాకిపల్లి రైతులు
- వరద నీరు మరింతగా బయటకు వస్తే గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశం
పల్నాడు జిల్లాలో..
- చిలకలూరిపేట నియోజకవర్గం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం
- పసుమర్రు సబ్ స్టేషన్ లోకి భారీ స్థాయిలో వచ్చిన వర్షపునీరు

తెలంగాణలో దంచి కొడుతున్న వానలు
- మోంథా ప్రభావంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వానలు
- శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారి బ్రాహ్మణపల్లి వద్ద బ్రిడ్జిపైనుంచి పొంగిపొర్లుతున్న చంద్రవాగు
- రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం సుద్ధపల్లి గ్రామవాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో నిలిచిపోయిన రాకపోకలు
- నాగర్ కర్నూల్-- బల్మూరు మండలం మైలారం గ్రామంలో అలుగుపారుతున్న చెరువు నిలిచిపోయిన రాకపోకలు
- హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి,భీమదేవరపల్లి,కమలాపూర్ మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వాన
- హన్మకొండ జిల్లా పరకాల డివిజన్ వ్యాప్తంగా ఉరుములు. మెరుపు ల తో కురుస్తున్న మోస్తారు వర్షం
- సూర్యాపేట జిల్లాలో మోంథా ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలు
- కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. కంట్రోల్ రూమ్ నెంబర్: 6281492368
- హుజూర్నగర్ మండలం వేపల సింగారం వద్ద ఈదురుగాలుల ప్రభావంతో రోడ్డుపై కూలిన భారీ వృక్షం
- వనపర్తి జిల్లా మదనాపురం మండలం సరళ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరదరావడంతో ఆటో మేటిక్ గా తెరుచుకున్న రెండు సైపన్స్
బాపట్ల జిల్లాలో..
- కొల్లూరు మండలం లో రాత్రి నుంచి ఈదురుగాయలతో కురిసిన భారీ వర్షం
- ఈదురు గాలులు దెబ్బకు భారీగా పంట నష్టం
- నేలకొరిగిన తమలపాకు అరటి పంట పొలాలు
- కంద పొలాల్లోకి భారీగా వర్షపు నీరు రావడంతో రైతులకు తీవ్ర నష్టం
ప్రకాశం జిల్లాలో..
- చీమకుర్తి నుండి కొండేపి వెళ్లే రోడ్డు మార్గం నిలిపివేసిన సచివాలయ సిబ్బంది
- కేవీ పాలెం గ్రామంలో చెరువు నిండి రోడ్డుపైకి బారీగా నీరు రావడంతో చిల్లకంప వేసి రాకపోకలు ఆపివేసిన సచివాలయ సిబ్బంది
- ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిపివేత
గూడు ఏమైందో?
కాకినాడ పునరావాస కేంద్రాల వద్ద దయనీయమైన పరిస్థితులు
చలికి వణికిపోతున్న పిల్లలు, వృద్ధులు
బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న తుపాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు
ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో అని గుబులు పడుతున్న వైనం
మోంథా ప్రభావం..
- తీరం దాటినా గట్టి ప్రభావం చూపుతున్న మోంథా
- నేడు ఆరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
- మరో ఆరు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్
- ఈదురు గాలుల తీవ్రత నేడంతా ఉండే అవకాశం
- ఇప్పటికీ అంధకారంలోనే కోస్తాంధ్ర జిల్లాలు
- కరెంటు స్తంభాల పునరుద్ధరణ పనులు ఆలస్యం
- కొనసాగుతున్న విరిగి పడిన చెట్ల తొలగింపు
- క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
ఎన్టీఆర్ జిల్లా..
- చందాపురం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న నల్లవాగు
- చందర్లపాడు నందిగామ మండలాల మధ్య రాకపోకలకు బంద్
కృష్ణా జిల్లాలో..
- రైతులను నిండా ముంచేసిన తుపాను
- అవనిగడ్డ నియోజకవర్గంలో బీభత్సం సృష్టించిన ఈదురుగాలులు,వర్షం
- రైతుల పాలిట శాపంగా మారిన మోంథా తుపాను
- ఈదురు గాలుల ధాటికి నేలకొరిగిన వరి పైరు
- పూర్తిగా దెబ్బతిన వాణిజ్య పంటలు
- తీవ్రంగా నష్టపోయిన వరి, అరటి, కంద, కూరగాయ పంటలు
- ఆందోళనలో రైతులు
తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లాలో..
- ఉప్పునుంతల మండలంలో అచ్చంపేట వెళ్లే దారులు నాలుగు వైపులా జల దిగ్బంధం బృందం
- కొల్లాపూర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
- ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించిన అధికారులు
- అచ్చంపేట శ్రీశైలం ఉత్తర ద్వారం ఉమామహేశ్వర ఆలయం మూసివేత
- నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా భారీగా కురుస్తున్న వర్షం
- కొండలపై నుండి జలపాతం ఎక్కువ రావడంతో ముందుజాగ్రత్తగా ఆలయం మూసివేత

ప్రకాశం జిల్లాలో..
- పొదిలి మండలం బట్టువారి పల్లె దగ్గర ఒంగోలు శ్రీశైలం జాతీయ రహదారిపై ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు
- రాకపోకలు బంద్ ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
ఖాళీగా విజయవాడ బస్టాండ్
- ప్రజా రవాణా వ్యవస్థపై మోంథా ప్రభావం
- దూరప్రాంతాలకు వెళ్లాల్సిన 161 ఏసి,సూపర్ లగ్జరీ, అల్ట్రాడీలక్స్,ఎక్స్ ప్రెస్,నాన్ స్టాప్ బస్సులు రద్దు
- వెలవెలబోతున్న విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్
- శ్రీకాకుళం,విజయనగరం,విశాఖ,కాకినాడ,కోనసీమ,పశ్చిమగోదావరి,బాపట్ల,ప్రకాశం,నెల్లూరు జిల్లాలకు నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు
- తుపాను ప్రభావం తగ్గే వరకూ డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితం
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన మోంథా
ఏపీలో పంటలపై మోంథా తుపాను ప్రభావం
నేలకొరిగిన వరి, మినుము, వేరుశనగ, మొక్కజొన్న పంటలు
కృష్ణా జిల్లాల్లో అత్యధికంగా నీట మునిగిన పంట!
శ్రీశైలం పాతాళ గంగ వద్ద తప్పిన ప్రమాదం
శ్రీశైలంలో తప్పిన ఘోర ప్రమాదం
పాతాళ గంగ విరిగిపడ్డ కొండచరియలు
మూడు తాత్కాలిక దుకాణాలు ధ్వంసం
భక్తులెవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
మరో 24 గంటలు వర్షాలే!
మోంథాపై భారత వాతావరణ శాఖ(IMD) తాజా ప్రకటన
ఛత్తీస్గడ్ దిశగా పయనించి ఈ మధ్యాహ్నానికి బలహీనపడిపోతుంది
మోంథా ప్రభావంతో గంటకు 85-95 కిలోమీటర్ల వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణ తోపాటు దక్షిణ ఒడిషా తీర ప్రాంతాలకు మరో 24 గంటలు వర్షాలే
వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం
పూర్తిగా నిండిన ఆసియా లోనే రెండో పెద్దది అయిన కంభం చెరువు, కాసేపట్లో కంభం చెరువు నుండి భారీగా కిందకు పారనున్న అలుగు. చెరువు దగ్గరకి ఎవరు వెళ్లకూడదని పోలీసులు కాపలా.కంభం చెరువు కి రికార్డు స్థాయి లో 20 వేల క్యూసెక్కుల వరద https://t.co/tHpVDoQGfq pic.twitter.com/LeLKJWTW4x
— Telugu_Weatherman (@Weather_AP) October 29, 2025
క్రమంగా బలహీనపడుతున్న మోంథా
- క్రమంగా బలహీనపడుతున్న సైక్లోన్ మోంథా
- ఇప్పటికే ఈ తీవ్ర తుపాను.. తుపానుగా బలహీనపడింది
- రానున్న 4 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం
- ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
- ఇటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం
విమాన సర్వీసుల పునరుద్ధరణ
- మోంథా కారణంగా నిన్న నిలిచిపోయిన 56 సర్వీసులు
- ఇవాళ విశాఖ-విజయవాడ ఇండిగో సర్వీసు మాత్రమే రద్దు
- మిగతావి యధాతథం
ఇంకా భయం గుప్పిట యానాం
- యానాంలో తుపాను ప్రభావం
- 24 గంటలుగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
- ఉదృతంగా ప్రవహిస్తున్న గౌతమి గోదావరి
- భారీ ఈదురుగాలులు ప్రవాహంతో కుప్పకూలిన 20 వృక్షాలు
- సముద్రపు అలలు తలిపించేలా ప్రవహిస్తున్న గౌతమి గోదావరి
- నిన్న మధ్యాహ్నం నుంచే వ్యాపార సముదాయాలు మూసివేత
- ఈదురు గాలులు ప్రభావంతో బయటకి రాని యానాం ప్రజలు
అనకాపల్లి జిల్లాలో..
- మాడుగుల. పెద్దేరు రైవాడ జలాశయాలకు వరద ఉధృతి.
- ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు జలాశయాలకు చేరిక.
- పెద్దేరు జలాశయం నుంచి 750 న్యూ సెక్యుల నీరు విడుదల.
- తమతబ్బ వంతెనపై నుంచి కొనసాగుతున్న ప్రవాహం.
- తమతబ్బ చింతలపూడి పంచాయతీల్లో 12 గ్రామాల రాకపోకలకు అంతరాయం.
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశం.
తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లాల్లో..
- మోంథా తుపాను కారణంగా జిల్లాలో విస్తారంగా కురస్తున్న వర్షాలు
కాకినాడలో..
- మోంథా తుపాను ఎఫెక్ట్తో తొండంగి, ఉప్పాడ మండలాల పరిధిలో పలు గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరా
- నిన్న ఉదయం నుండి కరెంటు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- కొనసాగుతున్న పునరుద్దరణ పనులు
తెలంగాణ మహబూబాబాద్ జిల్లాలో..
- మహబూబాబాద్, ఇనుగుర్తి కేసముద్రం మండలాల్లో కురుస్తున్న భారీ వర్షం
- డోర్నకల్ నియోజక వర్గ వ్యాప్తంగా కురుస్తున్న మోస్తరు వర్షం
ప్రకాశం జిల్లాలో..
- ఒంగోలు నవోదయ స్కూల్ లోకి భారీగా చేరిన నీరు
- క్యాంటీన్ లోకి సైతం వర్షపు నీరు రావడంతో వంట కు ఇబ్బందిగా మారింది సిబ్బంది
- విద్యార్థులు కు ఆహారం ఇవ్వాలా వండడం కష్టం అంటున్న సిబ్బంది
ఎన్టీఆర్ జిల్లాలో..
- కొనసాగుతున్న మోంథా తుపాను ప్రభావం
- తిరువూరులో భారీ వర్షం
- భారీ వర్షం కారణంగా చెరువును తలపిస్తున్న ఆర్టీసీ బస్టాండ్, రోడ్లు
- ఇబ్రహీంపట్నంలో భారీగా వీస్తున్న ఈదురుగాలులు
- విజయవాడ సిటీలో ఈదురు గాలులతో కురుస్తున్న మోస్తరు వర్షం
- నందిగామలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
- నందిగామ పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయం
- రోడ్ల పై భారీగా నిలిచిన వర్షపు నీరు
పార్వతీపురం మన్యం జిల్లాలో..
- తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల పూరి ఇల్లు పాక్షికంగా ధ్వంసం.
- గడిచిన 24 గంటలుగా కురుస్తున్న వానలకు 118.70 హెక్టార్ల లో వ్యవసాయ పంటలకు నష్టం.
- జిల్లా కలెక్టర్ కార్యాలయం నివేదిక
నెల్లూరు జిల్లాలో..
- సంగం పెన్నా వారధి వద్ద తప్పిన పెను ప్రమాదం
- పెన్నా నది నుండి ఇసుక తరలించేందుకు నిల్వ ఉంచిన మూడు పడవలు
- భారీగా నీరు రావడంతో తాళ్ళు తెంచుకొని పెన్నా నది గట్టున నిలిచిన బోట్లు
- పెన్నా వారధి గేట్లకు కు తగలకపోవడంతో ఊపిరిపించుకున్న అధికారులు
కృష్ణా జిల్లాలో..
- మోంథా తుపాను ప్రభావంతో గన్నవరం నియోజకవర్గం వ్యాప్తంగా కురుస్తున్న వర్షం
- భారీ ఈదురు గాలులకు బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో నేలకొరిగిన వరి పంట
నల్లగొండ జిల్లాలో..
- వర్షం నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించిన అధికారులు
విశాఖపట్నంలో..
- తుపాను తీరం దాటిన విశాఖలో కొనసాగుతున్న ఈదురు గాలులు.
- ఇంకా అల్లకల్లోలంగా సముద్రం.
- మత్స్యకారులు మరో మూడు రోజులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు.
- ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వ ప్రైవేటు స్కూలుకు సెలవు.
- భారీ గాలులకు అనకాపల్లి నేషనల్ హైవే పై కూలిని చెట్టు.
- ఈదురు గాలులకు శంకరమఠం రోడ్ లో ఇంటిపై పడ్డ చెట్టు.
- అనకాపల్లి జిల్లాలో పంట మునిగిన పొలాలు..
- ఈరోజు భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన.
- ఈరోజు బీచ్, పర్యాటక ప్రాంతాలకు అనుమతి నిరాకరణ
నెల్లూరు జిల్లాలో..
- ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయంకు వరద ప్రవాహం.
- జలాశయం ఇన్ ఫ్లో 40,784 క్యూసిక్కులు..
- జలాశయం అవుట్ ఫ్లో 33,460 క్యూసిక్కులు..
- జలాశయం ప్రస్తుతం నీటి సామర్థ్యం 67.647 టీఎంసీలు..
- జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 78 టీఎంసీలు
అనకాపల్లిలో..
- గాలులకు అనకాపల్లి హైవే కూలిన భారీ వృక్షం
- తొలగించిన ఫైర్ సిబ్బంది
తిరుపతిలో తెరుచుకోనున్న విద్యాసంస్థలు!
- తిరుపతి జిల్లాలో ఇవాళ తెరుచుకోనున్న విద్యాసంస్థలు
- అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఈరోజు నుండి యథావిధిగా పనిచేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాలు
- మోంథా ప్రభావంతో తిరుపతిలో వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ
ప్రకాశం జిల్లాలో..
- మోంతా తుపాను ప్రభావంతో జిల్లా అతలాకుతలం
- భారీ వర్షాల ఈదురు గాలులతో చిగురుటాకుల వణికిన ఉమ్మడి ప్రకాశం జిల్లా
- పొంగిపొల్లిన వాగు లు, వంకలు
- నిండు కుండాలా తయారైన పలు చెరువులు
- పలుచోట్ల రాకపోకలకు అంతరాయం
- రహదారులపై వాగులు పొంగిన చోట పోలీస్ పికెటింగ్
- కందుకూరులో ఎర్రవాగు ఉగ్రరూపం.
- రాళ్లపాడు ప్రాజెక్టుకు పోటెత్తిన వరద నీరు
- సింగరాయకొండ పోలీస్ స్టేషన్ నీటిమనక
- కూచిపూడి చెరువుకు గండి భారీగా గ్రామం మీద పడ్డ వరదనీరు
- కొండేపి వద్ద పొంగిపొర్లను అట్లేరు
- కొండేపి ఒంగోలు మధ్య రాకపోకలకు అంతరాయం
- ఒంగోలు ఎర్రజర్ల మధ్య పొంగిపొర్లిన నల్లవాగు
- ఒంగోలు ఎర్రజర్ల మధ్య నిలిచిన రాకపోకలు
- అదే ప్రాంతంలో నిన్న కొట్టుకుపోయిన
- ఒక కారు కనిగిరిలో సరిగా వర్షం
- పోటెత్తిన భైరవకోన జలపాతం
Bhairavakona Watefalls after heavy rain from cyclone 🌀 #Montha.
This is in Seetharamapuram region of Prakasam district, Coastal AP close Kadapa, Nellore and Prakasam districts border. Prakasam, Nellore and Adjoining Badvel Taluk in Kadapa district received heavy to very heavy… pic.twitter.com/XqyQ22ZvV1— Naveen Reddy (@navin_ankampali) October 28, 2025
- ఒంగోలు పొదిలి మధ్య వర్షం దాటికి దెబ్బతిన్న రహదారి
- తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
- ఒంగోలులో పల్చోట్ల కాలనీలు జలమయం
- ఒంగోలు నగరంలోని కర్నూల్ రోడ్డు, ట్రంక్ రోడ్లో సైతం భారీగా నిలిచిన వర్షపు నీరు
- శివారు కాలనీలో ఇళ్లలోకి చేరిన నీరు
- తీర ప్రాంత మండలాల్లో భారీ వర్షం ఈదురు గాలులు
- పునరావాస కేంద్రాలకు పలువురు తరలింపు
- మార్కాపురం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గుండ్లకమ్మ నది
- మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం- కొండేపల్లి మార్కాపురం -నాగులవరం గ్రామాల మధ్య రాకపోకలకు బంద్
- జిల్లాలో భారీగా నష్టపోయిన మిర్చి మొక్కజొన్న కంది మినుము సజ పంట రైతులు
- పుల్లలచెరువు మండలం చౌటపచర్ల చెరువుకు గండి వంద ఎకరాలలో ఉరి మొక్కజొన్న పంట నష్టం
- దర్శి మండలం వెంకటాచలపల్లి వద్ద పొంగిపొర్లుతున్న పులి వాగు
- కొట్టుకుపోయిన రోడ్లు
- గ్రామ శివారులో ఉన్న గుడిలో రోడ్డు కొట్టుకుపోవడంతో అక్కడ ఇరుక్కుపోయిన 30 మంది స్వాములు
- చీరాలలో భారీ వర్షాలతో రోడ్లు జలమయం
- అర్ధవీడు మండలం నల్లమల అటవీ ప్రాంతంలో భారీ వర్షాలు
- ఉప్పొంగిన జంపలేరు వాగు
- బొల్లు పల్లె అచ్చంపేటకు రాకపోకలు బంద్
- భారీ వర్షాల కారణంగా నిన్నటి నుంచి దోర్నాల శ్రీశైలం మధ్య నిలిచిన రాకపోకలు
- గుండ్లకమ్మ రిజర్వాయర్కు భారీగా వరద నీరు
ఏపీని నిండా ముంచిన మోంథా
మోంథా తుపానుతో ఏపీకి తీవ్ర నష్టం
ఓవైపు భీకరగాలులు.. మరోవైపు భారీ వర్షాలు
విరిగిన స్థంభాలు, నేలకొరిగిన వృక్షాలు
పొంగిపొర్లుతున్న వాగులు
రోడ్లు, రైల్వే ట్రాక్లు దెబ్బతినడంతో రవాణా వ్యవస్థకూ అంతరాయం
లోతట్టు ప్రాంతాల జలమయంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
20 గంటలుగా అంధకారంలోనే పలు ప్రాంతాలు
సెల్ టవర్లు దెబ్బ తినడంతో పని చేయని సెల్ఫోన్ సేవలు
తీవ్రంగా దెబ్బ తిన్న పంటలు
ఐదు రోజులుగా వేటకు దూరమైన మత్య్సకారులు
మోంథా ప్రభావంతో ఈ నెల 31 దాకా విద్యాసంస్థలకు సెలవులు పొడిగించిన పలు జిల్లా కలెక్టర్లు
A new waterfall has formed in Poolikuntla village, Velgandla Mandal, Kanigiri Taluk of Prakasam district, following the impact of #CycloneMontha.
Nellore and Prakasam districts, along with Nandyal, are among the worst affected areas so far. Now it’s Telangana time, by morning… pic.twitter.com/LlEfh2A1sD— Naveen Reddy (@navin_ankampali) October 28, 2025
క్రమంగా బలహీనపడుతున్న మోంథా
- తీవ్ర తుపాను ప్రస్తుతం తుపానుగా బలహీనపడ్డ మోంథా
- రానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీన పడే అవకాశం
- దీని ప్రభావంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
- కోస్తాంధ్రలో ఈదురుగాలులు
- ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం
- ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు
- కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం
- నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం
తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్
- మెంథా ఎఫెక్ట్తో తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్
- ఆరు జిల్లాలకు ఆరెంజ్, 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- భద్రాద్రి, ఖమ్మం, నాగర్కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- హైదరాబాద్, జనగాం, గద్వాల, మేడ్చల్, మహబూబ్నగర్, మంచిర్యాల, నారాయణపేట, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి.. ఆరెంజ్ అలర్ట్
కృష్ణా జిల్లా..
- దివి సీమలో మోంథా తుపాను ప్రభావంతో కొనసాగుతున్న ఈదురు గాలులు
- నిన్న మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు
- అవనిగడ్డ నియోజకవర్గం వ్యాప్తంగా ఈదురుగాలుల కారణంగా విద్యుత్ పునఃరుద్ధరణకు అంతరాయం
- గాలుల తీవ్రత తగ్గిన తర్వాత విద్యుత్ను పునఃరుద్ధరించే అవకాశం

తెలంగాణ ఖమ్మం జిల్లాలో..
- తెలంగాణపై మోంథా ప్రభావం
- పలు జిల్లాలకు వర్ష సూచన
- మొoథా తూఫాను దృష్ట్యా (బుధవారం) జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రకటన
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన కలెక్టర్
తెలంగాణ వికారాబాద్ జిల్లాలో..
- మోంథా ఎఫెక్ట్ జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం
- పూడూరు లో 6.1 cm
- మోమిన్ పేట లో 6 cm
- ధారూర్ లో 4.6cm
- పరిగిలో 4.5cm
కిరండోల్ రైల్వే లైన్ ధ్వంసం
- మోంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు
- వాల్తేరు రైల్వే డివిజన్లో కొత్తవలస-కిరండోల్ సింగిల్ రైల్వే లైన్ ధ్వంసం
- అరకు రైల్వే టన్నెల్ నెంబర్ 32, చిమిడిపల్లి, బొర్రా గుహల మధ్య రైల్వే ట్రాక్ పూర్తిగా ధ్వంసం
- ట్రాక్పై చేరిన మట్టి, బండరాళ్లు
- వరద నీరు నిలవకుండా ఏర్పాట్లు చేసిన సిబ్బంది
ఎన్టీఆర్ జిల్లాలో..
- తిరువూరు నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షం
- నీట మునిగిన ఆర్టీసీ బస్టాండ్, ప్రధాన రహదారి
- పలు లోతట్టు ప్రాంతాలు జలమయం
కృష్ణా జిల్లాలో..
- ఉయ్యూరు మండలం గండిగుంట పంచాయతీ కాకాని నగర్ లో మూడు రేకుల షెడ్లు ఇళ్ల పై పడిన చెట్లు.
- పూర్తిగా ధ్వంసం అయిన ఒక ఇల్లు,
- పాక్షికంగా మరో రెండు ఇల్లు ధ్వంసం.
- సహాయ చర్యలు చేపట్టిన అధికారులు
నంద్యాల జిల్లాలో..
- మోంథా తుపాను కారణంగా ఆత్మకూరు రెవిన్యూ డివిజన్ లోని పాములపాడు, కొత్తపల్లి, వెలుగోడు మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
- నల్లమలలో కురుస్తున్న భారీ వర్షానికి ఎగువ నుంచి భవనాసివాగు కు చేరుతున్న వరద నీరు.ఉప్పొంగిన వక్కిలేరు, భవనాసి వాగులు..
- ఆత్మకూరు పట్టణ శివారులోని భవనాసి వాగుపొంగి పొర్లుతుండడంతో సుమారు 22గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
- జలదిగ్బంధంలో ఆత్మకూరు పట్టణం.
- కర్నూలు -గుంటూరు జాతీయ రహదారిపై మోకాలికి పైగా పారుతున్న వర్షపు నీరు..
- వెలుగోడు మండలంలోని మాధవరం వద్ద పొంగిపొర్లుతున్న గాలేరు వాగు, సుమారు 8 గ్రామాలకు నిలిచిపోయిన ప్రజా రవాణా సంబంధాలు
- లోతట్టు కాలనీలు జలమయం, నిద్రాహారాలు మాని అవస్థలు పడుతున్న ప్రజలు..
విశాఖపట్నంలో..
- విశాఖ నగరం పై కొనసాగుతున్న తుపాను ప్రభావం. .
- నిన్న రాత్రి విశాఖలో భారీగా ఈదురు గాలులు
- గాలులకు శంకరమఠం రోడ్ లో ఇంటిపై కూలిన భారీ వృక్షం.
- తూటిలో తప్పిన ప్రమాదం
- పాక్షికంగా ఇల్లు ద్వసం.
- చెట్టును తొలగిస్తున్న ఫైర్ సిబ్బంది.
- జోన్ 3 లో ఇప్పటివరకు పడిన 72 నుండి చెట్లును తొలగించిన అధికారులు

విజయవాడలో..
- మోంథా తుపాను ఎఫెక్ట్తో విజయవాడలో అర్ధరాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షం
గుంటూరులో..
- గుంటూరు జిల్లాలో భారీ వర్షం
- ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
- గుంటూరులో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం
- నగరంలోని అన్ని ప్రధాన రహదారులు జలమయం
- పొంగిపొర్లుతున్న ట్రైన్లు
- బ్రాడీపేట ,అరండల్ పేట, మహిళా కాలేజ్, గుజ్జునుకుంట్ల, ఏటి అగ్రహారంతో పాటు ప్రధాన రోడ్లన్నీ జలమయం
- RUB తోపాటు 3 వంతెన కిందకు భారీ స్థాయిలో వర్షపునీరు
భారీ వర్షాలు ఎక్కడంటే..
- శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం
- కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం

కోనసీమ జిల్లా..
- అంతర్వేది పాలెం వద్ద తీరం దాటిన మోంథా తుపాను
- తీరం దాటే సమయంలో 70 నుంచి 80 కిలోమీటర్ల మేర ఈదురు గాలులు
- కోనసీమలో భారీగా కూలిన చెట్లు
- పలుచోట్ల ధ్వంసమైన విద్యుత్ లైన్లు
- రోడ్డుకు అడ్డంగా భారీ వృక్షాలు కోవడంతో నిలిచిపోతున్న రాకపోకలు
- పలు ప్రాంతాల్లో కురుస్తున్న చిరుజల్లులు
- జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో దెబ్బతిన్న వరి పంట
- పెద్ద సంఖ్యలో కూలిన కొబ్బరి చెట్లు
- తీర ప్రాంతంలో కొనసాగుతున్న ఈదురు గాలులు
- అంతర్వేది, ఉప్పలగుప్తం ఓడలరేవు ప్రాంతాల్లో అలకల్లోలంగా ఉన్న సముద్రం
- ఎగసిపడుతున్న అలలు

విజయవాడ..
- ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి దంచికొడుతోన్న భారీ వర్షం
- పలుచోట్ల అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేత
- విజయవాడలో భారీ వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయం
- ఆర్టీసీ బస్టాండ్ వద్ద సబ్ వేలోకి చేరిన వర్షపు నీరు
- సబ్ వే వైపు వాహనాలు వెళ్లకుండా బారికేడ్లు పెట్టిన పోలీసులు
- కనకదుర్గ ఫ్లై ఓవర్ వైపు వాహనాల రాకపోకలు నిలిపివేత
విజయవాడ..
- ప్రకాశం బ్యారేజ్ కు పెరుగుతున్న వరద
- ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో 82,675 క్యూసెక్కులు
- వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల
- కాలువలకు పూర్తిగా నీటి విడుదలను నిలిపివేసిన అధికారులు
మోంథా ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కావలిలో అత్యధికంగా 22 సెం.మీ. వర్షం కురిసింది.
With 207 mm of rain recorded today, Ongole city has witnessed one of its heaviest single-day downpours in recent years.
The situation across Prakasam district is equally severe.
🎥Rekha pic.twitter.com/jqKkqQosKA— Naveen Reddy (@navin_ankampali) October 29, 2025
మోంథా తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. పలు చోట్ల విద్యుత్ స్థంబాలు, చెట్లు నేలకొరిగాయి. జాతీయ రహదారిపై రాత్రంతా వాహనాలను ఎక్కడిక్కడే నిలిపేశారు.
మచిలీపట్నంలో.. తుపాను ధాటికి మచిలీపట్నంలో విద్యుత్ వ్యవస్థ ధ్వంసమైంది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
నెల్లూరు, బోగూరులో తుపాను ధాటికి గుడిసెలు కుప్పకూఇపోయి ప్రజలు గజగజ వణికిపోయారు
ప్రకాశంలో.. 10 అడుగుల మేర అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది
పలు జిల్లాలోనూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగి రాత్రంతా ప్రజలు అంధకారంలోనే ఉండిపోయారు. పలు జిల్లాల్లో రోడ్లు జలమయమయ్యాయి.
తీవ్ర తుపాన్గా తీరం దాటే కోనసీమలో సముద్రం ఉప్పొంగింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో సముద్రం ముందుకొచ్చింది. మామిడికుదురు మండలం కరవాక, గొగన్నమఠం దగ్గరా ముందుకు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో మత్స్యకార కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
తుపాన్ ప్రభావంతో.. ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, విశాఖ.. ఇలా 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాల ఉంటాయంది.


