రికార్డులు నేల'మట్టం' | Dhavaleswaram Barriage Record Breaks in Floods West Godavari | Sakshi
Sakshi News home page

రికార్డులు నేల'మట్టం'

Published Wed, Aug 19 2020 8:18 AM | Last Updated on Wed, Aug 19 2020 8:18 AM

Dhavaleswaram Barriage Record Breaks in Floods West Godavari - Sakshi

కొవ్వూరు–రాజమండ్రి వంతెనల వద్ద గోదావరి నీటి మట్టం

కొవ్వూరు: 14ఏళ్ల తర్వాత గోదావరి వరద మరోసారి రికార్డు స్థాయిలో నమోదైంది. 2006లో ఆగస్టు ఏడో తేదీన గరిష్టంగా ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 22.80 అడుగుల నీటిమట్టం నమోదైంది. మళ్లీ ఆ స్థాయిలో వరద రాలేదు. ఆ తర్వాత 19 అడుగుల నీటిమట్టం నమోదు కావడం ఇది రెండోసారి. మొదట 2013లో గరిష్టంగా 19.0 అడుగుల నీటి మట్టం నమోదైంది. ఇప్పుడు ఆ రికార్డును దాటి 19.90 అడుగులకు నీటిమట్టం చేరింది. మంగళవారం సాయంత్రం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 19.90 అడుగులుగా నమోదైంది. ఆ తర్వాత కొద్దిగా నెమ్మదించి 19.80 అడుగులకు చేరింది.   2013 తర్వాత మూడోప్రమాద హెచ్చరిక స్థాయిలో వరద రాలేదు. ఏడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు మూడోప్రమాద హెచ్చరిక చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement